తాజా వార్తలు

Devara Ticket Mafia: బ్లాక్ మార్కెట్‌లో దేవర సినిమా టికెట్లు, ఎన్టీఆర్ జిల్లాలో అధికారుల తనిఖీలు, వాస్తవమేనని నిర్దారణ

Arun Charagonda

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని స్వర్ణ థియేటర్లో తహసీల్దార్, రెవెన్యూ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బ్లాక్ మార్కెట్ లో " దేవర" సినిమా టిక్కెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. అదనపు షోలు, టికెట్ ధరల పెంపుపై థియేటర్ అనుమతులు పరిశీలించిన తహశీల్దార్.

Kangana Ranaut Apologises: రైతులను క్షమాపణ కోరిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌, వివాదాస్పద రైతు చట్టాలపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడి

Hazarath Reddy

రైతుల మీద తన దురుసు వ్యాఖ్యలతో నోరు పారేసుకున్న బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ రైతులకు క్షమాపణ చెప్పారు. 2021లో కేంద్రం రద్దు చేసిన మూడు రైతు చట్టాలను తిరిగి తేవాలంటూ ఆమె ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు

Defamation Case: పరువు నష్టం కేసులో శివసేన UBT ఎంపీ సంజయ్ రౌత్‌‌కు 15 రోజులు జైలు శిక్ష, రూ. 25 వేలు జరిమానా విధించిన ముంబై మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్

Hazarath Reddy

ముంబైలోని మజ్‌గావ్‌లోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ గురువారం శివసేన (UBT) నాయకుడు సంజయ్ రౌత్‌ను పరువు నష్టం కేసులో దోషిగా నిర్ధారించి , అతనికి 15 రోజుల సాధారణ జైలు శిక్ష విధించారు. బిజెపి నాయకుడు కిరీట్ సోమయ్య భార్య మేధా కిరీట్ సోమయ్య దాఖలు చేసిన కేసులో కోర్టు అతనికి రూ. 25,000 రూపాయల జరిమానా విధించింది .

Vijayasai Reddy Slams Atchannaidu: దేహం పెరిగినట్టుగా బుద్ధి పెరగలేదు నీకు, నీ కుల పార్టీలోకి నేను రావడమా అంటూ అచ్చెన్నాయుడిపై సెటైర్ వేసిన విజయసాయిరెడ్డి

Hazarath Reddy

టీడీపీ నేత, మంత్రి అచ్చెన్నాయుడిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నించారంటూ అచ్చెన్న చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ... "అచ్చెన్నాయుడూ! దేముడు నిన్ను పుట్టించేటప్పుడు మెదడు, బుద్ధి, జ్ఞానం 0.1% మాత్రమే ఇచ్చాడాయె!

Advertisement

IIFA 2024: ఐఫా ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా షారుఖ్ ఖాన్, బాలీవుడ్ నటుడి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు, ఇంప్రెసివ్‌గా షారుఖ్ ఫోటోలు

Arun Charagonda

ప్రతిష్టాత్మక ఐఫా(ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్) ఉత్సవం 2024 అబుదాబిలోని యాస్ ఐలాండ్ లో వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. రేపటి నుండి ఈ ఉత్సవం ప్రారంభంకానుండగా ఇప్పటికే దక్షిణాదితో పాటు బాలీవుడ్‌ నటులు దుబాయ్‌కి చేరుకున్నారు.

Prakash Raj vs Pawan Kalyan: గెలిచేముందు ఒక అవతారం... గెలిచిన తర్వాత ఇంకో అవతారం, పవన్ కల్యాణ్‌పై మరో కౌంటర్ వదిలిన ప్రకాష్ రాజ్

Hazarath Reddy

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం అపవిత్రం కావడంపై పవన్ కల్యాణ్, ప్రకాష్ రాజ్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలకు ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా స్పందిస్తున్నారు. తాజాగా, ఎక్స్ వేదికగా మరో పోస్ట్ పెట్టారు. "గెలిచేముందు ఒక అవతారం... గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఎందుకు మనకీ అయోమయం… ఏది నిజం? జస్ట్‌ ఆస్కింగ్‌?" అని ఎక్స్ వేదికగా తెలుగులో పోస్ట్ చేశారు.

Andhra Pradesh: వీడియోలు ఇవిగో, పవన్‌కి పాలాభిషేకం చేసిన వృద్ధురాలు, ఫిర్యాదు చేసిన వారం రోజుల్లోనే సమస్యను పరిష్కరించారని ఆనందం వ్యక్తం చేసిన మహిళ

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఓ వృద్దురాలు పాలాభిషేకం చేసింది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో వృద్ధురాలు పవన్ ఫోటోకి పాలాభిషేకం చేసింది.ఫిర్యాదు చేసిన వారం రోజుల్లోనే సమస్యను పరిష్కరించినందుకు ఆమె హర్షాతిరేకం వ్యక్తం చేసింది.

Save Steel Plant Slogans On Devara: దేవర సినిమాకు విశాఖ స్టీల్ ప్లాంట్ సెగ, దేవర పోస్టర్లపై సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ పోస్టర్లను అంటించిన కార్మికులు

Arun Charagonda

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ తరుణంలోనే ఈ మూవీకి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నిరసన సెగ తగిలింది. ఈ సినిమా పోస్టర్లపై సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నినాదాలతో ఉన్న పోస్టర్‌‌ను కార్మికులు అతికించారు. సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్.. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదాల పోస్టర్లను అంటించారు.

Advertisement

Nizamabad Shocker: కూతురు మరణంతో మనస్తాపం..వియ్యంకుడి హత్య, నిజామాబాద్ జిల్లా కంజర్ గ్రామంలో విషాద సంఘటన

Arun Charagonda

నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కంజర్ గ్రామంలో విషాదం నెలకొంది. కూతురు మరణానికి కారణం వియ్యంకుడు నరహరిని హత్య చేశారు సత్యనారాయణ. ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది సత్యనారాయణ కుమార్తె. దీంతో కోపం పెంచుకున్న సత్యనారాయణ...వియ్యంకుడిని హతమార్చాడు.

Child Sitting On Lion: పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడిన తండ్రి, కొడుకులను సింహంపై కూర్చోబెట్టిన తండ్రి..ఓపిక నశించి సింహం ఏం చేసిందో చూడండి

Arun Charagonda

పిల్లల ప్రాణాల‌తో చెల‌గాటం ఆడాడు ఓ తండ్రి. సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవ్వాల‌ని చిన్నారుల‌తో సాహ‌సం చేశాడు. త‌న ఇద్ద‌రు కుమారుల‌ను సింహంపై కూర్చోబెట్టి...కొద్దిసేపు వారిని అలానే ఉంచ‌డంతో ఓపిక న‌శించి త‌ల విసిరింది సింహం. భయంతో హడలిపోయిన చిన్నారులు కిందపడగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Tirupati Laddu Row: వీడియో ఇదిగో, వందేభారత్ రైలులో భజనలు చేస్తూ తిరుపతికి మాధవీలత, నడక మార్గంలో తిరుమలకు చేరుకుని స్వామివారిని దర్శించుకోనున్న బీజేపీ మహిళా నేత

Hazarath Reddy

వందేభారత్ రైలులో బీజేపీ మహిళా నేత హైదరాబాద్ నుంచి తిరుమలకు పయనమయ్యారు. వేంకటేశ్వరస్వామికి జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా నడక మార్గంలో తిరుమలకు చేరుకుని స్వామివారిని బీజేపీ నేత దర్శించుకోనున్నారు.

Vangaveeti Radhakrishna Health Update: వంగవీటి రాధా కృష్ణ స్వల్వ గుండెపోటు, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో టీడీపీ నేత

Hazarath Reddy

టీడీపీ నేత వంగవీటి రాధా కృష్ణ స్వల్వ గుండెపోటుకు గురయ్యారు. గురువారం తెల్లవారుజామున ఆయనకు ఛాతిలో నొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను చికిత్స కోసం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డాక్టర్లు అబ్జర్వేషన్‌లో వంగవీటి రాధా ఉన్నారు.

Advertisement

Tirupati Laddu Row: రేపు తిరుమలలో ప్రత్యేక పూజల్లో పాల్గొననున్న వైఎస్‌ జగన్‌, డిక్లరేషన్ ఇవ్వాలని బీజేపీ డిమాండ్, అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలకు వైసీపీ పిలుపు

Hazarath Reddy

తిరుమల పవిత్రతను, ప్రసాదం విశిష్టతను చంద్రబాబు అపవిత్రం చేసినందుకుగానూ.. ఆ పాప ప్రక్షాళన కోసం ప్రత్యేక పూజలు నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు ఇచ్చారు.

Drun And Drive: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మందుబాబు హల్‌చల్, ఏకంగా పోలీసులపైకే ఆటోను తీసుకెళ్లిన డ్రైవర్, ఆటోను సీజ్ చేసిన పోలీసులు..వీడియో ఇదిగో

Arun Charagonda

హైదరాబాద్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో మందు బాబు హల్చల్ చేశాడు. చంపాపేటలోని ప్రధాన రహదారిలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు మీర్ చౌర్ ట్రాఫిక్ పోలీసులు. ఆటోను ఆపేందుకు ప్రయత్నించగా.. ఏకంగా పోలీసులపైకే ఆటోను తీసుకెళ్లాడు డ్రైవర్. ఫుల్‌గా తాగి ఉన్నట్లు నిర్దారణ కాగా ఆటోను సీజ్ చేసి కేసు నమోదు చేశారు పోలీసులు.

MLA Raja Singh Slams Jagan: నమ్మకం లేనప్పుడు హిందూ ఆలయాలకు ఎందుకు వెళ్తున్నారు, జగన్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్

Arun Charagonda

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ ఘటనపై గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మరోసారి స్పందించారు. ప్రసాదం అపవిత్రం కావడంపై హిందువులంతా బాధపడుతున్నారన్నారు.

Karnataka: హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ ఆపరేషన్ వికటించి యువకుడు మృతి, నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు చనిపోయాడని పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు

Hazarath Reddy

హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ చేయించుకుని అందంగా కనిపించాలనే ఆరాటంలో ఓ యువకుడు తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన కర్ణాటకలోని మంగళూరులో చోటుచేసుకుంది.

Advertisement

Hydra Demolition: సంగారెడ్డిలో చెరువులో కట్టిన మూడంతస్తుల భవనం, బాంబులతో పేల్చేసిన అధికారులు..వీడియో ఇదిగో

Arun Charagonda

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో ఓ వ్యక్తి పెద్ద చెరువులో మూడంతస్తుల భవనాన్ని నిర్మించాడు. చెరువులో కట్టిన ఈ భవనాన్ని బాంబులతో కూల్చేశారు అధికారులు. శిథిలాలు తగిలి ఇద్దరికి గాయాలు కాగా వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Bhatti Vikramarka America Tour: అమెరికా పర్యటనలో బిజీగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,హువర్ డ్యామ్‌ను సందర్శించిన భట్టి, మైనింగ్ ఎగ్జిబిషన్‌లో ఆధునిక యంత్రాల పరిశీలన

Arun Charagonda

అమెరికా పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బిజీ బిజీగా ఉన్నారు. నెవాడా, ఆరిజోనా పర్యటనలో భాగంగా హూవర్ డ్యామ్ ను సందర్శించారు భట్టి. అలాగే లాస్ వెగాస్ లో మైనింగ్ ఎగ్జిబిషన్ లోని ఆధునిక యంత్ర పరికరాలను పరిశీలించారు. సంబంధిత కంపెనీ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం చర్చలు జరిపారు.

Food Poison At Hostel: ఏపీలో ఎస్సీ బాలికల హాస్టల్లో విద్యార్థులకు అస్వస్థత, చికెన్ తిని అస్వస్థతకు గురైన విద్యార్థినులు..వీడియో

Arun Charagonda

ఏపీలో ఎస్సీ బాలికల హాస్టల్లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం మధ్యాహ్నం హాస్టల్లో చికెన్ తిని 16 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను శృంగవరపుకోట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Protests Against Musi Riverfront: మూసీ నది పరివాహక ప్రాంతంలో సర్వే, అధికారులను అడ్డుకున్న స్థానికులు...వీడియో ఇదిగో

Arun Charagonda

మూసీ నది పరివాహక ప్రాంతంలో సర్వే చేపట్టడానికి వచ్చిన అధికారులకు చుక్కెదురైంది. సర్వే కోసం వెళ్లిన అధికారులను అడ్డుకున్నారు స్థానికులు. తాము ఎట్టి పరిస్థితుల్లో ఇళ్లు ఖాళీ చేయబోమని కొత్తపేట, మారుతీనగర్, సత్యా నగర్ వాసులు తేల్చి చెప్పారు. దీంతో చేసేదేమి లేక అధికారులు వెనుదిరిగారు.

Advertisement
Advertisement