తాజా వార్తలు

Sheetal Devi's Bullseye Shot: ఆర్చర్ శీతల్ దేవి అదిరిపోయే షాట్‌ వీడియో ఇదిగో, నీకు కారు గిఫ్ట్‌గా ఇవ్వడానికి ఎదురు చూస్తున్నాను అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్

Vikas M

Tata Curvv ICE Model: టాటా నుంచి విపణిలోకి కర్వ్‌ ఐసీఈ మోడల్‌, ప్రారంభ ధర రూ.9.99 లక్షలు, టాప్‌ మోడల్‌ ధర రూ.17.69 లక్షల వరకు..

Vikas M

దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ కర్వ్‌ ఐసీఈ మోడల్‌ను విపణిలోకి తీసుకువచ్చింది. కాంపాక్ట్‌ ఎస్‌యూవీ విభాగంలో కర్వ్‌ మోడల్ కార్‌ను రూ.9.99 లక్షల ప్రారంభ ధరకు మార్కెట్లో విడుదల చేసింది. ఈ శ్రేణిలో టాప్‌ మోడల్‌ ధర రూ.17.69లక్షల వరకు ఉంటుంది. అక్టోబర్‌ 31 వరకు బుకింగ్‌ సదుపాయం ఉంది.

Paralympic Games 2024: పారిస్ పారాలింపిక్స్ 2024, భారత్ ఖాతాలో మరో పతకం, SU5 మహిళల సింగిల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించిన మనీషా రాందాస్

Vikas M

SU5 మహిళల సింగిల్స్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న మనీషా రాందాస్ పారిస్ పారాలింపిక్స్ 2024లో భారత్ పతకాల పట్టికలో మరో పతకాన్ని జోడించింది. ఆమె తన కాంస్య పతక మ్యాచ్‌లో 21-12, 21-8తో ఆధిపత్యం చెలాయించడం ద్వారా 2024 పారిస్ పారాలింపిక్స్‌లో భారత్‌కు 10వ పతకాన్ని ఖాయం చేసింది.

Paralympic Games 2024: పారిస్ పారాలింపిక్స్ 2024, భారత్ ఖాతాలో మరో పతకం, బ్యాడ్మింటన్ ఈవెంట్‌లో రజత పతకం గెలుచుకున్న తులసిమతి మురుగేషన్

Vikas M

పారిస్ పారాలింపిక్స్ 2024లో సోమవారం, సెప్టెంబర్ 2న జరిగిన మహిళల సింగిల్స్ SU5 పారా-బ్యాడ్మింటన్ ఈవెంట్‌లో తులసిమతి మురుగేషన్ ఫైనల్‌లో చైనాకు చెందిన యాంగ్ క్యూ జియా చేతిలో ఓడిపోయి రజత పతకాన్ని గెలుచుకుంది.

Advertisement

Emergency Movie Postponed: ఎమర్జెన్సీ సినిమా మరోసారి వాయిదా, ఓ వర్గం మతస్థుల మనోభావాలు దెబ్బతీసేలా సినిమా ఉందని ఆరోపణ, కంగనా రనౌత్‌కు మధ్యప్రదేశ్‌ హైకోర్టు నోటీసులు

Vikas M

కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఎమర్జెన్సీ సినిమా మరోసారి వాయిదా పడింది. వాయిదాకు కారణం ఏంటంటే.. సినిమాలో సెన్సిటివ్ కంటెంట్ ఉందని CBFC తెలిపింది. ఎమర్జెన్సీ సినిమా రిలీజ్‌ నిలిపివేయడానికి కారణాలు తెలియజేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) వివరించింది. సినిమాలు మతపరమైన మనోభావాలను దెబ్బతీయకూడదని బోర్డు సూచించింది.

Amitabh Bachchan: నేను ఇంతవరకు మొబైల్‌ ఫోన్‌లో సినిమాలు చూడలేదు, షోలే రీ రిలీజ్‌ సినిమా చూసిన తర్వాత అమితాబ్ బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Vikas M

ప్రస్తుతం బాలీవుడ్‌లో కూడా రీ రిలీజ్‌ ట్రెండ్ నడుస్తోంది. తాజాగా అమితాబ్‌, ధర్మేంద్ర, హేమమాలిని..తదితరులు నటించిన ‘షోలే’ను ఇటీవల రీ రిలీజ్‌ చేశారు. ఈ సినిమా ప్రదర్శనకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అమితాబ్‌ బచ్చన్ సైతం ‘షోలే’ సినిమాని వీక్షించారు.ఈవిషయాన్ని తెలియజేస్తూ ఆయన తాజాగా తన బ్లాగ్‌లో పోస్ట్‌ పెట్టారు.

Intel Layoffs: ఆగని లేఆప్స్, 700 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న ఇంటెల్, దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలే కారణం

Vikas M

ఇంటెల్ ఉద్యోగాల కోతలను ప్రారంభించనుందని నివేదించబడింది, ఇది ఐర్లాండ్‌లోని దాని ఉద్యోగులపై ప్రభావం చూపుతుంది, ఇది తప్పనిసరి తొలగింపులను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఐర్లాండ్‌లోని ఇంటెల్‌లోని కొంతమంది ఉద్యోగులు కంపెనీ విభజన కార్యక్రమం కారణంగా తమ ఉద్యోగాలను వదిలివేయవలసి ఉంటుంది.

Fact Check: LIC తన ఇన్సూరెన్స్ ప్లాన్‌లన్నింటినీ ఉపసంహరించుకుంటుదంటూ న్యూస్ వైరల్, క్లారిటీ ఇచ్చిన I&B మంత్రిత్వ శాఖ

Hazarath Reddy

Advertisement

Delhi Horror: ఢిల్లీలో దారుణం, కూతురు పుట్టిందని పాలు ఇస్తూ పసికందు గొంతు నొక్కి చంపేసిన కసాయి తల్లి, అనంతరం పాప కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు

Hazarath Reddy

దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కసాయి తల్లి ఆరో రోజుల కిందట పుట్టిన నవజాత శిశువుకు పాలు ఇస్తున్న సందర్భంగా గొంతు నొక్కి (Woman Strangles Newborn To Death While Feeding) చంపింది.అనంతరం తన బిడ్డ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

IMD Weather Update: తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న మరో ముప్పు, బంగాళాఖాతంలో ఈ నెల 5న అల్పపీడనం, రానున్న మూడు రోజులు పాటు భారీ వర్షాలు

Hazarath Reddy

రామగుండం పట్టణానికి ఉత్తర ఈశాన్య దిశగా 135 కిలోమీటర్లు, వాగ్ధాకు అగ్నేయంగా 170 కిలోమీటర్లు దూరంలో ఈ వాయు గుండం కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. వాయువ్య దిశగా కదులుతూ రాగల 12 గంటలలో బలహీన పడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.

Telangana Floods: తెలంగాణలో వరదలకు 16 మంది మృతి, బాధితులకు రూ.10 వేలు చొప్పున తక్షణ సాయం ప్రకటించిన ప్రభుత్వం, మంత్రులతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన

Hazarath Reddy

వరద బాధితుల కుటుంబాలకు అందుబాటులో ఉండి కష్టాలను గట్టెక్కించే బాధ్యత తమదేనన్నారు. రాజీవ్‌ గృహకల్పలో ఇళ్లు నీట మునగడంతో తీవ్రంగా నష్టపోయిన వరద బాధితులకు రూ.10వేలు చొప్పున తక్షణ సాయం అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు.

Andhra Pradesh Rains: వీడియో ఇదిగో, మోకాలి లోతు నీటిలో నడుచుకుంటూ వెళ్లిన చంద్రబాబు, వరద ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన సీఎం పర్యటన

Hazarath Reddy

విజయవాడ నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన ముగిసింది. సోమవారం ఉదయం నుంచి ముంపు ప్రాంతాల్లో సుమారు నాలుగు గంటల పాటు నిర్విరామంగా సీఎం పర్యటించారు.

Advertisement

Vijayawada Floods: విజయవాడలో వరద బాధితులకు హెలికాప్టర్ల ద్వారా ఆహారం పంపిణీ, బాధితులకు ఆహారం అందించేందుకు ముందుకు వచ్చిన దివీస్, అక్షయపాత్ర సంస్థలు

Hazarath Reddy

విజయవాడలో వరద బాధితులకు ఆపన్న హస్తం అందించేందుకు ఏపీ ప్రభుత్వం హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వరద బాధితులకు నేడు హెలికాప్టర్ల ద్వారా ఆహారం అందించారు. బుడమేరు ముంపునకు గురైన ప్రాంతాల్లో రెండు హెలికాప్టర్ల సాయంతో ఆహార ప్యాకెట్లను, మంచినీటి బాటిళ్లను జారవిడిచారు.

Telugu States Floods:  తెలుగు రాష్ట్రాల్లో జల ప్రళయం, రూ.  5 లక్షలు విరాళం ప్రకటించిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

Hazarath Reddy

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను భారీ వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలతో రెండు రాష్ట్రాలు విలవిల్లాడుతున్నాయి. ఈ వరదలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. తనకు వచ్చే పెన్షన్ నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి రూ. 5 లక్షల చొప్పున సహాయాన్ని ప్రకటించారు.

Andhra Pradesh Road Accident: కావలిలో ఘోర రోడ్డు ప్రమాదం, కంటైనర్ కిందకు బైక్ దూసుకువెళ్లడంతో మంటలు, ఇద్దరికీ తీవ్ర గాయాలు

Hazarath Reddy

కావలి రూరల్ పరిధిలోని రుద్రకోట సమీపంలో హైవే పై లారీ, బైక్ ఢీ..ఇద్దరికీ గాయాలు. రోడ్డు ప్రమాదం లో కంటైనర్ కిందకు వెళ్లిన ద్విచక్ర వాహనం నుండి మంటలు, బైక్ పూర్తిగా దగ్ధం, కంటైనర్ కు కూడా అంటుకున్న మంటలు.మంటలార్పిన అగ్నిమాపక శాఖ...క్షతగాత్రులను కావలి ఆసుపత్రికి తరలింపు.

Vijayawada Rains: వీడియో ఇదిగో, కరకట్ట మీద నీట మునిగిన మంతెన సత్యనారాయణ ఆశ్రమం, భవానిపురానికి పొంచి ఉన్న వరద ముప్పు

Hazarath Reddy

కృష్ణా నది మహోగ్రరూపంతో కరకట్ట వాసులు భయం భయంగా గడుపుతున్నారు. మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమంలోకి కూడా నీట మునిగింది.గత రాత్రి అమరావతి రైతులు, అధికారులు ఎంత ప్రయత్నించినా పరిస్థితి అదుపులోకి రాలేదు. ఆశ్రమంలోకి నీళ్లు చేరాయి. దీంతో అందులో చికిత్స పొందుతున్న వారిని ఆశ్రమం నిర్వాహకులు బయటకు పంపేస్తున్నారు.

Advertisement

Paralympic Games 2024: పారిస్ పారాలింపిక్స్‌లో భారత్‌కు రెండో బంగారు పతకం, పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ SL3 విభాగంలో పసిడి సాధించిన నితీష్ కుమార్

Hazarath Reddy

పారిస్ పారాలింపిక్స్ 2024(paris paralympics 2024)లో భారత్‌కు రెండో బంగారు పతకం లభించింది. పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ SL3 విభాగంలో పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు నితీష్ కుమార్(Nitish Kumar) స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు.

Astrology: గణపతికి ఇష్టమైన మూడు రాశులు ఇవే..గణపతి అనుగ్రహం వల్ల ఈ మూడు రాశుల వారికి అదృష్టం పెరుగుతుంది.

sajaya

జ్యోతిష శాస్త్రం ప్రకారం వినాయకుని ప్రత్యేకంగా ఆరాధిస్తాము. దేవతలందరిలో మొదటిగా వినాయకుని పూజిస్తాము. విజ్ఞాలను తొలగించేది వినాయకుడిగా మనము మొదటి స్థానంలో ఉంచి పూజిస్తాము.

Astrology: శని దేవుడి అనుగ్రహం వల్ల రానున్న 30 రోజుల్లో ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అవుతారు.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దేవుడు అనుగ్రహం వల్ల కొన్ని సార్లు కొన్ని రాశుల వారికి అద్భుత ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి శని దేవుని అనుగ్రహం వల్ల అదృష్టం కలిసి వస్తుంది.

Astrology: సెప్టెంబర్ 6 నుండి కుజ గ్రహంలో మార్పు కారణంగా మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజ గ్రహం అత్యంత శక్తివంతమైనది. సెప్టెంబర్ 6న కుజ గ్రహం ఆర్ద్ర నక్షత్రం లోనికి ప్రవేశం. ఈ కారణంగా 12 రాశుల వారి జీవితాల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి.

Advertisement
Advertisement