India
Hindu Temple Defaced in US: అమెరికాలో మరో ఆలయంపై దాడి, హిందువులు దేశం వదిలి వెళ్లిపోవాలని గోడపై మెసేజ్లు, బాప్స్ శ్రీ స్వామి నారాయణ మందిరం ధ్వంసం
Hazarath ReddyUSలో ద్వేషపూరిత నేరాల సంఘటనలో, కాలిఫోర్నియాలోని BAPS శ్రీ స్వామినారాయణ్ మందిర్ను బుధవారం (సెప్టెంబర్ 25) హిందూ వ్యతిరేక గ్రాఫిటీ ధ్వంసం చేసింది, ఇది USలో 10 రోజులలో రెండవ సంఘటనగా గుర్తించబడింది.
KTR: ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే ఇదేనా..సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ ప్రశ్నల వర్షం, అర్హతలు లేని బావమరిది కంపెనీకి వేల కోట్లు కట్టబెట్టడమేనా ఇన్నోవేటివ్!
Arun Charagondaసీఎం రేవంత్ రెడ్డిని ఎక్స్ వేదికగా కడిగిపారేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే ఏమిటి ? అని రేవంత్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్నికలకు ముందు ప్రజలకు అడ్డగోలు హామీలు ఇచ్చి తర్వాత మాట తప్పడం. దేవుళ్ళ మీద ఒట్టేసి వారికి కూడా శఠగోపం పెట్టడం.. నూరు రోజులు, ఆరు గారంటీలు అని ఊదరగొట్టి తర్వాత వాటిని మర్చిపోవడం, ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రతిరోజూ ఒక కొత్త డ్రామా సృష్టించి, హెడ్ లైన్ మానేజ్మెంటు చెయ్యడం ఇన్నోవేటివ్ థింకింగా అని ప్రశ్నించారు.
Devara Ticket Mafia: బ్లాక్ మార్కెట్లో దేవర సినిమా టికెట్లు, ఎన్టీఆర్ జిల్లాలో అధికారుల తనిఖీలు, వాస్తవమేనని నిర్దారణ
Arun Charagondaఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని స్వర్ణ థియేటర్లో తహసీల్దార్, రెవెన్యూ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బ్లాక్ మార్కెట్ లో " దేవర" సినిమా టిక్కెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. అదనపు షోలు, టికెట్ ధరల పెంపుపై థియేటర్ అనుమతులు పరిశీలించిన తహశీల్దార్.
Kangana Ranaut Apologises: రైతులను క్షమాపణ కోరిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, వివాదాస్పద రైతు చట్టాలపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడి
Hazarath Reddyరైతుల మీద తన దురుసు వ్యాఖ్యలతో నోరు పారేసుకున్న బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ రైతులకు క్షమాపణ చెప్పారు. 2021లో కేంద్రం రద్దు చేసిన మూడు రైతు చట్టాలను తిరిగి తేవాలంటూ ఆమె ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు
Defamation Case: పరువు నష్టం కేసులో శివసేన UBT ఎంపీ సంజయ్ రౌత్కు 15 రోజులు జైలు శిక్ష, రూ. 25 వేలు జరిమానా విధించిన ముంబై మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్
Hazarath Reddyముంబైలోని మజ్గావ్లోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ గురువారం శివసేన (UBT) నాయకుడు సంజయ్ రౌత్ను పరువు నష్టం కేసులో దోషిగా నిర్ధారించి , అతనికి 15 రోజుల సాధారణ జైలు శిక్ష విధించారు. బిజెపి నాయకుడు కిరీట్ సోమయ్య భార్య మేధా కిరీట్ సోమయ్య దాఖలు చేసిన కేసులో కోర్టు అతనికి రూ. 25,000 రూపాయల జరిమానా విధించింది .
Vijayasai Reddy Slams Atchannaidu: దేహం పెరిగినట్టుగా బుద్ధి పెరగలేదు నీకు, నీ కుల పార్టీలోకి నేను రావడమా అంటూ అచ్చెన్నాయుడిపై సెటైర్ వేసిన విజయసాయిరెడ్డి
Hazarath Reddyటీడీపీ నేత, మంత్రి అచ్చెన్నాయుడిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నించారంటూ అచ్చెన్న చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ... "అచ్చెన్నాయుడూ! దేముడు నిన్ను పుట్టించేటప్పుడు మెదడు, బుద్ధి, జ్ఞానం 0.1% మాత్రమే ఇచ్చాడాయె!
IIFA 2024: ఐఫా ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా షారుఖ్ ఖాన్, బాలీవుడ్ నటుడి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు, ఇంప్రెసివ్గా షారుఖ్ ఫోటోలు
Arun Charagondaప్రతిష్టాత్మక ఐఫా(ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్) ఉత్సవం 2024 అబుదాబిలోని యాస్ ఐలాండ్ లో వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. రేపటి నుండి ఈ ఉత్సవం ప్రారంభంకానుండగా ఇప్పటికే దక్షిణాదితో పాటు బాలీవుడ్ నటులు దుబాయ్కి చేరుకున్నారు.
Prakash Raj vs Pawan Kalyan: గెలిచేముందు ఒక అవతారం... గెలిచిన తర్వాత ఇంకో అవతారం, పవన్ కల్యాణ్పై మరో కౌంటర్ వదిలిన ప్రకాష్ రాజ్
Hazarath Reddyతిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం అపవిత్రం కావడంపై పవన్ కల్యాణ్, ప్రకాష్ రాజ్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా స్పందిస్తున్నారు. తాజాగా, ఎక్స్ వేదికగా మరో పోస్ట్ పెట్టారు. "గెలిచేముందు ఒక అవతారం... గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఎందుకు మనకీ అయోమయం… ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్?" అని ఎక్స్ వేదికగా తెలుగులో పోస్ట్ చేశారు.
Andhra Pradesh: వీడియోలు ఇవిగో, పవన్కి పాలాభిషేకం చేసిన వృద్ధురాలు, ఫిర్యాదు చేసిన వారం రోజుల్లోనే సమస్యను పరిష్కరించారని ఆనందం వ్యక్తం చేసిన మహిళ
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఓ వృద్దురాలు పాలాభిషేకం చేసింది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో వృద్ధురాలు పవన్ ఫోటోకి పాలాభిషేకం చేసింది.ఫిర్యాదు చేసిన వారం రోజుల్లోనే సమస్యను పరిష్కరించినందుకు ఆమె హర్షాతిరేకం వ్యక్తం చేసింది.
Save Steel Plant Slogans On Devara: దేవర సినిమాకు విశాఖ స్టీల్ ప్లాంట్ సెగ, దేవర పోస్టర్లపై సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ పోస్టర్లను అంటించిన కార్మికులు
Arun Charagondaయంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ తరుణంలోనే ఈ మూవీకి విశాఖ స్టీల్ ప్లాంట్ నిరసన సెగ తగిలింది. ఈ సినిమా పోస్టర్లపై సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నినాదాలతో ఉన్న పోస్టర్ను కార్మికులు అతికించారు. సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్.. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదాల పోస్టర్లను అంటించారు.
Nizamabad Shocker: కూతురు మరణంతో మనస్తాపం..వియ్యంకుడి హత్య, నిజామాబాద్ జిల్లా కంజర్ గ్రామంలో విషాద సంఘటన
Arun Charagondaనిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కంజర్ గ్రామంలో విషాదం నెలకొంది. కూతురు మరణానికి కారణం వియ్యంకుడు నరహరిని హత్య చేశారు సత్యనారాయణ. ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది సత్యనారాయణ కుమార్తె. దీంతో కోపం పెంచుకున్న సత్యనారాయణ...వియ్యంకుడిని హతమార్చాడు.
Child Sitting On Lion: పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడిన తండ్రి, కొడుకులను సింహంపై కూర్చోబెట్టిన తండ్రి..ఓపిక నశించి సింహం ఏం చేసిందో చూడండి
Arun Charagondaపిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడాడు ఓ తండ్రి. సోషల్మీడియాలో వైరల్ అవ్వాలని చిన్నారులతో సాహసం చేశాడు. తన ఇద్దరు కుమారులను సింహంపై కూర్చోబెట్టి...కొద్దిసేపు వారిని అలానే ఉంచడంతో ఓపిక నశించి తల విసిరింది సింహం. భయంతో హడలిపోయిన చిన్నారులు కిందపడగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Tirupati Laddu Row: వీడియో ఇదిగో, వందేభారత్ రైలులో భజనలు చేస్తూ తిరుపతికి మాధవీలత, నడక మార్గంలో తిరుమలకు చేరుకుని స్వామివారిని దర్శించుకోనున్న బీజేపీ మహిళా నేత
Hazarath Reddyవందేభారత్ రైలులో బీజేపీ మహిళా నేత హైదరాబాద్ నుంచి తిరుమలకు పయనమయ్యారు. వేంకటేశ్వరస్వామికి జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా నడక మార్గంలో తిరుమలకు చేరుకుని స్వామివారిని బీజేపీ నేత దర్శించుకోనున్నారు.
Vangaveeti Radhakrishna Health Update: వంగవీటి రాధా కృష్ణ స్వల్వ గుండెపోటు, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో టీడీపీ నేత
Hazarath Reddyటీడీపీ నేత వంగవీటి రాధా కృష్ణ స్వల్వ గుండెపోటుకు గురయ్యారు. గురువారం తెల్లవారుజామున ఆయనకు ఛాతిలో నొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను చికిత్స కోసం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డాక్టర్లు అబ్జర్వేషన్లో వంగవీటి రాధా ఉన్నారు.
Tirupati Laddu Row: రేపు తిరుమలలో ప్రత్యేక పూజల్లో పాల్గొననున్న వైఎస్ జగన్, డిక్లరేషన్ ఇవ్వాలని బీజేపీ డిమాండ్, అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలకు వైసీపీ పిలుపు
Hazarath Reddyతిరుమల పవిత్రతను, ప్రసాదం విశిష్టతను చంద్రబాబు అపవిత్రం చేసినందుకుగానూ.. ఆ పాప ప్రక్షాళన కోసం ప్రత్యేక పూజలు నిర్వహించాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు ఇచ్చారు.
Drun And Drive: డ్రంక్ అండ్ డ్రైవ్లో మందుబాబు హల్చల్, ఏకంగా పోలీసులపైకే ఆటోను తీసుకెళ్లిన డ్రైవర్, ఆటోను సీజ్ చేసిన పోలీసులు..వీడియో ఇదిగో
Arun Charagondaహైదరాబాద్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో మందు బాబు హల్చల్ చేశాడు. చంపాపేటలోని ప్రధాన రహదారిలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు మీర్ చౌర్ ట్రాఫిక్ పోలీసులు. ఆటోను ఆపేందుకు ప్రయత్నించగా.. ఏకంగా పోలీసులపైకే ఆటోను తీసుకెళ్లాడు డ్రైవర్. ఫుల్గా తాగి ఉన్నట్లు నిర్దారణ కాగా ఆటోను సీజ్ చేసి కేసు నమోదు చేశారు పోలీసులు.
MLA Raja Singh Slams Jagan: నమ్మకం లేనప్పుడు హిందూ ఆలయాలకు ఎందుకు వెళ్తున్నారు, జగన్పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్
Arun Charagondaతిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి స్పందించారు. ప్రసాదం అపవిత్రం కావడంపై హిందువులంతా బాధపడుతున్నారన్నారు.
Karnataka: హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ వికటించి యువకుడు మృతి, నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు చనిపోయాడని పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు
Hazarath Reddyహెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుని అందంగా కనిపించాలనే ఆరాటంలో ఓ యువకుడు తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన కర్ణాటకలోని మంగళూరులో చోటుచేసుకుంది.
Hydra Demolition: సంగారెడ్డిలో చెరువులో కట్టిన మూడంతస్తుల భవనం, బాంబులతో పేల్చేసిన అధికారులు..వీడియో ఇదిగో
Arun Charagondaసంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో ఓ వ్యక్తి పెద్ద చెరువులో మూడంతస్తుల భవనాన్ని నిర్మించాడు. చెరువులో కట్టిన ఈ భవనాన్ని బాంబులతో కూల్చేశారు అధికారులు. శిథిలాలు తగిలి ఇద్దరికి గాయాలు కాగా వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Bhatti Vikramarka America Tour: అమెరికా పర్యటనలో బిజీగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,హువర్ డ్యామ్ను సందర్శించిన భట్టి, మైనింగ్ ఎగ్జిబిషన్లో ఆధునిక యంత్రాల పరిశీలన
Arun Charagondaఅమెరికా పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బిజీ బిజీగా ఉన్నారు. నెవాడా, ఆరిజోనా పర్యటనలో భాగంగా హూవర్ డ్యామ్ ను సందర్శించారు భట్టి. అలాగే లాస్ వెగాస్ లో మైనింగ్ ఎగ్జిబిషన్ లోని ఆధునిక యంత్ర పరికరాలను పరిశీలించారు. సంబంధిత కంపెనీ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం చర్చలు జరిపారు.