Information
Mega Projects in AP: ఏపీలో భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు, త్వరలో మూడు మెగా ప్రాజెక్టులు, రూ.16,314 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఎస్‌ఐపీబీ ఆమోదం, విశాఖలో ఐటీ యూనివర్సిటీ ఏర్పాటు
Hazarath Reddyఏపీలో ఇకపై భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు రానున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలో మూడు మెగా ప్రాజెక్టులకు (Mega Projects in AP) సంబంధించిన రూ.16,314 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(SIPB) సమావేశం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఇంటెలిజెంట్‌ సెజ్‌ లిమిటెడ్, ఏటీసీ ఏపీ ప్రైవేట్‌ లిమిటెడ్, అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ లిమిటెడ్‌లు తమ యూనిట్ల ఏర్పాటుకు ముందుకొచ్చాయని, వీటి ద్వారా భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు తెలిపారు.
Indane Gas Online Booking Number: ఇకపై గ్యాస్ బుకింగ్ చేయాలంటే 7718955555 నంబర్‌‌కి కాల్ చేయండి, దేశమంతా ఒకటే నంబర్‌ను ప్రవేశపెట్టిన ఇండేన్ గ్యాస్
Hazarath Reddyఇండేన్ గ్యాస్ వినియోగదారులకు అలర్ట్ న్యూస్.. నవంబర్‌ 1 నుంచి ఇండేన్‌ గ్యాస్‌ వినియోగదారులు దేశంలో ఎక్కడ నుంచి అయినా 7718955555 నంబర్‌ (Indane Gas Online Booking Number) ద్వారానే బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుందని ఇండియన్‌ ఆయిల్‌ డీజీఎం (LPG) ఎల్‌పీ ఫులిజిలే తెలిపారు. ఆయన విజయవాడలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. డీలర్ల వద్ద నమోదు చేసుకున్న ఫోన్‌ నంబర్ల నుంచి ఎస్‌ఎంఎస్‌ లేదా ఐవీఆర్‌ విధానంలో సిలిండర్‌ బుక్‌ చేసుకోవచ్చని చెప్పారు.ఇది వినియోగదారులకు 24x7 అందుబాటులో ఉంది.
BECA Agreement: చైనా, పాకిస్తాన్‌కు చెక్ పెట్టేలా బెకా అగ్రిమెంట్, ఇంతకీ బెకా అంటే ఏమిటీ ? దీని ద్వారా ఇండియాకు కలిగే ప్రయోజనం ఏమిటీ? బీఈసీఏ ఒప్పందంపై పూర్తి సమాచారం
Hazarath Reddyభార‌త్‌‌, అమెరికా దేశాలు బేసిక్ ఎక్స్‌చేంజ్ అండ్ కోఆప‌రేష‌న్ అగ్రిమెంట్‌(BECA) ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా సైనిక సాంకేతిక అంశంపై రెండు దేశాలు స‌హ‌కారం అందించుకోనున్నాయి. భారత్‌-అమెరికాల మధ్య ప్రారంభమైన 2+2 మంత్రిత్వ స్థాయి చర్చల్లో సమాచార మార్పిడి, సహకార ఒప్పందం (బెకా)పై ఇరు దేశాల నేతలు సంతకాలు (BECA Signed During India-US) చేశారు.
Diwali Gift for Loan Customers: లోన్ తీసుకున్న వారికి శుభవార్త, నవంబర్‌ 5లోగా రుణగ్రహీతల ఖాతాల్లోకి వడ్డీ మొత్తం, మార్చి 1వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ మధ్య గల వాయిదాలకు వర్తింపు
Hazarath Reddyలోన్ తీసుకున్న కస్టమర్లకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు (Diwali Gift for Loan Customers) అందించింది. మారటోరియం అమలైన ఆరు నెలల కాలంలో (moratorium period) ఈఎంఐలను చెల్లించిన వారికి చక్రవడ్డీ, సాధారణ వడ్డీల మధ్య వ్యత్యాసాన్ని నవంబర్‌ 5లోగా రుణగ్రహీతల ఖాతాల్లో జమచేయనున్నామని కేంద్రం తెలిపింది.
Covid in India: కరోనా నుంచి కోలుకుంటున్న ఇండియా, పెరుగుతున్న డిశ్చార్జ్ కేసులు, తాజాగా 50,129 కోవిడ్ కేసులు, 62,077 మంది డిశ్చార్జ్, యాక్టివ్‌ కేసుల సంఖ్య 6,68,154, మరణాల సంఖ్య 1,18,534
Hazarath Reddyభారత్‌లో గడిచిన 24 గంటల్లో 50,129 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 78,64,811కి చేరింది. నిన్న ఒక్క రోజే 578 మంది మరణించగా ఇప్పటివరకు మొత్తం 1,18,534 మంది కరోనాతో (Covid Deaths) మృత్యువాతపడ్డారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం కరోనాపై ( 2020 Coronavirus Pandemic in India) హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో 62,077 మంది కోలుకుని ఆసుపత్రులనుంచి డిశ్చార్జ్‌ అవ్వగా ఇప్పటి వరకు మొత్తం 70,78,123 మంది కోలుకున్నారు.
Onion Price Rise Row: హైదరాబాద్‌లో రూ. 35కే కిలో ఉల్లి, ఏపీలో రూ. 40కే.., దేశ వ్యాప్తంగా సెంచరీ కొట్టిన ఉల్లి ధరలు, పూణేలో ఉల్లిపాయల దొంగతనం, ధరల నియంత్రణకు రంగంలోకి దిగిన కేంద్రం
Hazarath Reddyహైదరాబాద్‌లో రూ. 35కే కిలో ఉల్లిగడ్డలు విక్రయిస్తున్నట్లు వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. నేటి నుంచి రైతుబజార్లలో ఉల్లి విక్రయం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. జంట నగరాల్లోని 11 రైతుబజార్లలో ఉల్లిని అందుబాటులోకి తెచ్చామన్నారు.
Guidelines for Schools & Colleges: తల్లిదండ్రులు అనుమతిస్తేనే స్కూళ్లకు పిల్లలు, నవంబర్ 2 నుంచి స్కూళ్లు, కాలేజీలు ఓపెన్, నేటి నుంచి ప్రారంభమైన ఎంసెట్ వెబ్ కౌన్సిలింగ్
Hazarath Reddyకరోనావైరస్ రాష్ట్రంలో తగ్గుముఖం పడుతోందని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ( Anil Kumar Singhal) చెప్పారు. సచివాలయంలో మీడియాతో మాట్లాడిన అనిల్ సింఘాల్.. ఇప్పటికే విద్యా సంవత్సరాన్ని చాలా నష్టపోయిన నేపథ్యంలో స్కూళ్లు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు (Guidelines For Schools & Colleges) తీసుకుంటున్నామని తెలిపారు.
COVID-19 Vaccine: ఒక్క వ్యాక్సిన్ కోసమే రూ. 51 వేల కోట్లు పక్కన పెట్టిన కేంద్ర ప్రభుత్వం, ఒక్కో వ్యక్తికీ సగటున రూ.450-550 వరకు ఖర్చవుతుందని అంచనా
Hazarath Reddyభారత్‌లో మొత్తం జనాభాకు కరోనా టీకాలు (COVID-19 Vaccine) ఉచితంగా వేయటానికి కేంద్రప్రభుత్వం భారీ మొత్తంలో నిధులను ఇప్పటికే సిద్ధం చేసిందని కేంద్ర ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి. అందరికీ టీకాలు వేయటానికి రూ.51,592 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని లెక్కగట్టి, ఆ మేరకు నిధులను సమీకరించారని వెల్లడించాయి.
Coronavirus Outbreak: కరోనాపై షాక్ ఇస్తున్న కొత్త నిజాలు, కోవిడ్‌తో బ్రెయిన్ డ్యామేజ్‌, గుండెపోటు సమస్యలు, ఫిబ్రవరి నాటికి సగం మందికి కరోనా, దేశంలో తాజాగా 46,791కేసులు నమోదు
Hazarath Reddyవచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి 130 కోట్ల దేశ జనాభాలో సగం మందికి కరోనా (Coronavirus Outbreak) సోకే అవకాశమున్నదని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తెలిపింది.
Heavy Rain Alert: మరో రెండు రోజులు..భారీ వర్షాల హెచ్చరిక, తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ,అధికారులు అప్రమత్తం
Hazarath Reddyతెలుగు రాష్ట్రాలను వర్షాలు కుదిపేస్తున్నాయి. తీవ్ర స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తోంది. ఈ వర్షాలు ఇప్పట్లో పోయేలా లేవు. తాజాగా రాష్ట్రానికి భారీ వర్షసూచన (Heavy Rain Alert) ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. రానున్న రెండ్రోజులపాటు రాష్ట్రంలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు (heavy rains) కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. మధ్య బంగాళా ఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో 5.8 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఆ ప్రభావంతో మధ్య బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
Paytm Credit Cards: పేటీఎం నుంచి 2 మిలియన్ క్రెడిట్ కార్డులు, క్రెడిట్ కార్డు మార్కెట్లో పాగా వేసేందుకు పేటీఎం సరికొత్త వ్యూహం
Hazarath Reddyభారతదేశంలోని ప్రముఖ డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ పేటీఎం 'నెక్స్ట్ జనరేషన్ క్రెడిట్ కార్డులు'(next-generation credit cards) ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 'న్యూ టు క్రెడిట్' వినియోగదారులను డిజిటల్ ఎకానమీలో చేరడానికి వీలు కల్పించడం ద్వారా క్రెడిట్ మార్కెట్‌ను సొంతం చేసుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
Rain Alert for Telugu States: మరో హెచ్చరిక, తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న మరో ముప్పు, వాయుగుండంగా మారనున్న అల్పపీడనం, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఆదేశాలు
Hazarath Reddyతెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ (Rain Alert for Telugu States) చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం (Heavy Rains thundershowers)ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఇక దక్షిణ కోస్తాంధ్రకు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అదేవిధంగా దక్షిణ కోస్తాకు దగ్గర్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి తూర్పు మధ్య అరేబియా సముద్రం వరకూ అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి బలహీనపడ్డాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Weather Alert in Telugu States: మళ్లీ దూసుకొస్తున్న ముప్పు, 19న బంగాళఖాతంలో అల్ప పీడనం, రానున్న రెండు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం, హెచ్చరించిన వాతావరణ శాఖ
Hazarath Reddyతెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసిన వర్షాలు ఇప్పట్లో ఆగే సూచనలు కనపడటం లేదు. ఇప్పటికే భారీ వర్షాలతో తీవ్ర నష్టాలను చవి తెలుగు రాష్ట్రాలపై ( Heavy Rains in Telugu States) మరో ముంపు కాచుకూర్చుని ఉంది. మధ్య బంగాళాఖాతంలో (Bay of Bengal) ఈ నెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ (meteorological department) పేర్కొంది. ఇది ఏర్పడిన 24 గంటల తర్వాత తీవ్ర అల్పపీడనంగా (Low pressure) మారే అవకాశముందని తెలిపింది. దీంతో రాష్ట్రంలో నేడు, రేపు పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
Dasara Special Trains: ప్రయాణీకులకు శుభవార్త, దసరా, దీపావళి సందర్భంగా మరిన్ని ప్రత్యేక రైళ్లు, లిస్టును విడుదల చేసిన దక్షిణ మధ్య రైల్వే, తెలుగు రాష్ట్రాల మధ్య రైళ్లను ఓ సారి చెక్ చేసుకోండి
Hazarath Reddyదసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని మరిన్ని ప్రత్యేక రైళ్ల వేళలను దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రకటించింది. అక్టోబర్ 20 నుంచి నవంబర్ 30 మధ్య 392 ఫెస్టివల్ స్పెషల్ రైళ్లను (Dasara Special Trains) నడుపుతున్నట్లు భారత రైల్వే శాఖ (Indian Railway) మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
Heavy Rains in Telugu States: తెలుగు రాష్ట్రాలను ముంచెత్తిన భారీ వర్షాలు, వాయుగుండం నేడు తీరం దాటే అవకాశం, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరికలు
Hazarath Reddyబంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు (Heavy Rains in Telugu States) కురుస్తున్నాయి. తెలంగాణతో పాటు రాజధాని హైదరాబాద్‌లో (Hyderabad) పలు చోట్ల అర్ధరాత్రి నుంచి వర్షం పడుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో (West Central Bay of Bengal) ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా పయనించి నేడు తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. విశాఖ-నరసాపురం మధ్య కాకినాడ సమీపంలో తీరందాటే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
Heavy Rain Alert for Telangana: రూపుమార్చుకున్న అల్పపీడనం, తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు, ఏపీలో నర్సాపూర్‌, విశాఖపట్నం మధ్య రాత్రికి తీరం దాటే అవకాశం, హెచ్చరించిన హైదరాబాద్ వాతావరణ శాఖ
Hazarath Reddyతెలంగాణలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు (Heavy Rains in TS) కురవనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ (Hyderabad Meteorological Department) హైచ్చరించింది. తూర్పు మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఆదివారం ఉదయం వాయుగుండంగా మారింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి సోమవారానికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు.
CM YS Jagan Writes to CJI: ఏపీ సీఎం వైయస్ జగన్ లేఖలో ఏముంది? న్యాయవ్యవస్థపై చర్చ మరోసారి తెరపైకి, ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్న పలువురు ప్రముఖులు, సీజేఐ ఎస్‌ఎ బాబ్డే ఏం నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ పనితీరుపై, దానిని ప్రభావితం చేస్తున్న సుప్రీంకోర్డు జడ్జి జస్టిస్‌ ఎన్వీ రమణపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఎ బాబ్డేకు లేఖ (CM YS Jagan Writes to CJI) రాసిన సంగతి రాసారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి అండదండలతో ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీకి (Telugu Desam Party (TDP) అనుకూలంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పుల ప్రభావం ( files complaint against top SC judge and some judges) ఉందని ఈ లేఖలో సీఎం జగన్ ( CM YS Jagan Mohan Reddy) ఆరోపించారు.
Heavy Rains Likely To Hit TS: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం, 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం
Hazarath Reddyతెలంగాణలో రానున్న మూడు రోజుల్లో వర్షాలు (Heavy Rains in Telangana) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణకేంద్రం శనివారం తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం (severe hypothermia) ఏర్పడిందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని పేర్కొంది. దక్షిణ కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తం కొనసాగుతుందని వాతావరణ కేంద్రం చెప్పింది.
Crimes Against Women: మహిళలపై దాడి జరిగితే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి, తాజాగా రాష్ట్ర‌, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు అదేశాలు జారీ చేసిన కేంద్ర ప్ర‌భుత్వం
Hazarath Reddyయూపీలోని హ‌త్రాస్ అత్యాచార ఘ‌ట‌న నేప‌థ్యంలో.. రాష్ట్ర‌, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు నేడు కేంద్ర ప్ర‌భుత్వం కొన్ని కీలక సూచ‌న‌లు చేసింది. మహిళలపై నేరాలకు (Crimes Against Women) సంబంధించి పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రహోంమంత్రిత్వశాఖ ( MHA) దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మ‌హిళ‌ల‌పై నేరాలు జ‌రిగిన కేసుల్లో పోలీసులు త‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేంద్ర హోంశాఖ‌ త‌న అడ్వైజ‌రీ ఆదేశాల్లో (MHA Advisory) పేర్కొన్న‌ది.
RTGS Payment Update: బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్, ఆర్టీజీఎస్‌ సేవలు 24 గంటల పాటు అందుబాటులో.., డిసెంబర్ నుంచి అమల్లోకి, వివరాలను వెల్లడించిన ఆర్‌బీఐ
Hazarath Reddyబ్యాంకు ఖాతాదారులకు ఆర్ బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. నగదు బదిలీ సౌకర్యం రియల్‌టైం గ్రాస్‌ సెటిల్మెంట్‌ (RTGS) (RTGS payment system) వారంలో ప్రతి రోజూ 24 గంటల పాటు అందుబాటులో ఉంటుందని ఆర్‌బీఐ (RBI) శుక్రవారం ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి ఈ వెసులుబాటు అమల్లోకి వస్తుందని కేంద్ర బ్యాంక్‌ వెల్లడించింది.