Ticket Booking For Pets: పెంపుడు జంతువులకు ఆన్లైన్లో రైలు టిక్కెట్లు.. రైల్వే శాఖ పరిశీలనలో ప్రతిపాదన
జంతు ప్రేమికులు (పెట్ లవర్స్), పెంపుడు జంతువులు గల వాళ్లకు రైల్వేశాఖ నుంచి శుభవార్త. రైళ్లలో పెంపుడు జంతువులను తీసుకెళ్లేందుకు ఆన్లైన్లోనే టిక్కెట్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించే ప్రతిపాదనను రైల్వే శాఖ పరిశీలిస్తోంది.
Newdelhi, May 6: జంతు ప్రేమికులు (పెట్ లవర్స్) (Pet Lovers), పెంపుడు జంతువులు గల వాళ్లకు రైల్వేశాఖ (Railways) నుంచి శుభవార్త (Good News). రైళ్లలో పెంపుడు జంతువులను తీసుకెళ్లేందుకు ఆన్లైన్లోనే (Online) టిక్కెట్లు (Tickets) బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించే ప్రతిపాదనను రైల్వే శాఖ పరిశీలిస్తోంది. టీటీఈలకూ ఈ టిక్కెట్లను జారీ చేసే అధికారాన్ని ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే పెంపుడు జంతువులతో రైలు ప్రయాణాలు మరింత సులభతరం కానున్నాయి.
The ministry has proposed an online booking facility for pets in AC-1 class of trains. The proposal also includes giving the TTEs the power to book pets on board. https://t.co/cqiNgWWf9M
— Business Today (@business_today) May 5, 2023
ప్రస్తుత నిబంధనలు ఏమిటి?
ప్రస్తుత నిబంధనల ప్రకారం, ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీల్లో ప్రయాణించే వారికి తమ వెంట పెంపుడు జంతువులను తీసుకెళ్లేందుకు అనుమతి ఉంది. ఇందు కోసం ముందుగా ప్రయాణికులు స్టేషన్లోని పార్సిల్ కౌంటర్లో ఓ టిక్కెట్ కొనుగోలు చేయాలి. ఇక సెకండ్ క్లాస్ లగేజ్ లేదా బ్రేక్ వ్యాన్లో ఒక బాక్స్ లో కూడా పెంపుడు జంతువులను తరలించవచ్చు.
(The above story first appeared on LatestLY on May 06, 2023 09:31 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

