వార్తలు
Hyd Traffic Police Issues Advisory: ఆ మూడు రోజులు గచ్చిబౌలి నుండి లింగంపల్లి వెళ్లే ప్రయాణిలకు అలర్ట్, ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేసిన హైదరాబాద్ పోలీసులు
Hazarath Reddyసెప్టెంబర్ 3,6, 9 తేదీల్లో గచ్చిబౌలిలోని జీఎంసీబీ స్టేడియంలో ఇంటర్కాంటినెంటల్ కప్ 2024 ఫుట్బాల్ టోర్నమెంట్ జరగనున్న నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆయా రోజుల్లో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రద్దీ ఉండే అవకాశం ఉందని ట్రాఫిక్ అడ్వైజర్ జారీ చేశారు.
Vijayawada Floods: వీడియో ఇదిగో, మూడు రోజుల నుంచి అన్నం, నీళ్లు లేవు, దయచేసి మమ్మల్ని కాపాడాలంటూ వీడియో ద్వారా వేడుకున్న కుటుంబం
Hazarath Reddyవిజయవాడ వరద ప్రభావిత ప్రాంతంలో ఉన్న అపార్టుమెంట్ వాసుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ముంపునకు గురైన బాధితులు ఆపన్న హస్తం కోసం హాహాకారాలు చేస్తున్నారు.తాజాగా విజయవాడలో వచ్చిన వరదల్లో వైఎస్సార్ జంక్షన్ సమీపంలోని రైతు బజార్ దగ్గర ఉన్న ఓ ఇంట్లో ఒక ఫ్యామిలీ చిక్కుకుపోయింది.
Vijayawada Floods: వీడియో ఇదిగో, బుడమేరు వరద దెబ్బకి నీళ్లలో మునిగిపోయిన వందలాది కొత్త కార్లు, విజయవాడ శివారులోని కార్ల గోడౌన్లను ముంచెత్తిన వరదలు
Hazarath Reddyకృష్ణాజిల్లా గన్నవరం బుడమేరు వరద దెబ్బకి కొత్త కార్లు నీళ్లపాలయ్యాయి. విజయవాడ శివారు ప్రాంతాల్లో ఉన్న కార్ల గోడౌన్ల ను వరద నీరు ముంచెత్తడంతో కార్లు నీటిలో తేలుతున్నాయి.కొత్త కార్లు అన్నీ వరద నీటిలో 3 రోజులుగా నానుతున్న పరిస్థితి అక్కడ నెలకొని ఉంది.
Viral Video: వీడియో ఇదిగో, పోతే నా ఒక్క ప్రాణమే..సాహసం చేస్తే 9 మంది ప్రాణాలు, భారీ వరదల్లో ఖమ్మం జేసీబీ డ్రైవర్ చేసిన సాహసంపై ప్రశంసల వర్షం
Hazarath Reddyతెలంగాణలో వచ్చిన వరదలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా అతలాకుతలం అయింది. మున్నేరుకు పోటెత్తిన వరదతో ఖమ్మం, ఖమ్మం రూరల్ మండలాల్లోని పరీవాహక ప్రాంత కాలనీల్లోకి నీరు చేరింది. అన్నీ ప్రాంతాల్లో మోకాళ్లలోతు నీళ్లు నిలిచి జనజీవనం స్తంభించిపోయింది.
Health Tips: అతిగా కాఫీ తాగుతున్నారా..అయితే మీకు ఈ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.
sajayaచాలామంది కాఫీ తోటే వారి రోజును ప్రారంభిస్తారు. చాలామందికి టీ తో పోలిస్తే కాఫీ అంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది. ప్రతిరోజు ఉదయాన్నే కాఫీ తాగడం ఒక అలవాటుగా ఉంటుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి, యాక్టివ్ గా ఉండాలి అనుకున్నా అంటే ఈ కాఫీ ఒక మంచి ఆప్షన్.
Health Tips: నల్ల ఎండు ద్రాక్ష తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
sajayaఎండుద్రాక్ష రెండు రకాలుగా ఉంటుంది. తెలుపు ఎండు ద్రాక్ష, నలుపు ఎండు ద్రాక్ష. తెల్లటి ఎండు ద్రాక్షతో పోలిస్తే నలుపు రంగు ఎండు ద్రాక్షలో అనేక రకాలైన పోషకాలు ఉన్నాయి.
Anti-Rape Bill: అత్యాచారం చేయాలంటే భయపడేలా యాంటి రేప్ బిల్, ఏకగ్రీవ ఆమోదం తెలిపిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ, బిల్లు చరిత్రాత్మకమని వ్యాఖ్యానించిన దీదీ
Hazarath Reddyకోల్కతా ట్రైనీ వైద్యురాలి హత్యాచార ఘటన తీవ్ర విమర్శల నేపథ్యంలో మమత సర్కారు యాంటీ రేప్ బిల్లును తీసుకువచ్చింది. న్యాయశాఖ మంత్రి మోలే ఘాటక్ అసెంబ్లీలో మంగళవారం బెంగాల్ ప్రభుత్వం హత్యాచార నిరోధక బిల్లును ప్రవేశపెట్టారు.
China School Bus Accident: చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం, విద్యార్థులు, తల్లిదండ్రులపైకి దూసుకెళ్లిన బస్సు, 10 మంది అక్కడికక్కడే మృతి
Hazarath Reddyచైనా (China)లో షాన్డాంగ్ ప్రావిన్స్ (Shandong province)లోని తైవాన్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పాఠశాల బస్సు (School Bus) అదుపుతప్పి (Bus Crash) విద్యార్థులు, తల్లిదండ్రులపైకి దూసుకెళ్లింది
Health Tips: కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి లేకపోతే చాలా ప్రమాదం.
sajayaఈమధ్య కాలంలో చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్య మూత్రపిండాలలో రాళ్లు. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి ముఖ్యంగా మన కిడ్నీలో ఆసిడ్స్ మినరల్స్ గట్టిగా ఫామ్ అయి చిన్న చిన్న రాళ్ల రూపంలో ఏర్పడతాయి.
Health Tips: ప్రతిరోజు నాన్ వెజ్ తింటున్నారా..అయితే మీకు ఈ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
sajayaనాన్ వెజ్ ఇష్టపడని వారు ఎవరుంటారు. చాలామందికి చికెన్, మటన్ వంటివి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు, ప్రతిరోజు నాన్ వెజ్ తీసుకుంటారు, అయితే ఇది ప్రోటీన్ ని, ఐరన్ ను విటమిన్స్ ను అందిస్తుంది.
Underwear Gang: చెడ్డీ గ్యాంగ్ మళ్లీ వచ్చేసింది, నాసిక్లో రూ.5 లక్షల విలువైన బంగారం, అరటి పళ్లను దోచుకెళ్లిన అండర్ వేర్ గ్యాంగ్
Hazarath Reddyమహారాష్ట్రలోని నాసిక్ (Nashik)లో చెడ్డీ గ్యాంగ్ (Underwear Gang) హల్చల్ చేసింది. మలేగావ్ (Malegaon) ప్రాంతంలో ఓ ఇంటిని దోచుకుంది. రూ.5 లక్షల విలువైన బంగారం (Gold), అరటిపళ్లను (Bananas) చోరీ చేసింది. ఈ ముఠా ఓ ఇంట్లోకి చొరబడుతున్న దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో రికార్డయ్యాయి.
Telugu States Floods: భారీ వరదలు, తెలుగు రాష్ట్రాలకు రూ. 50 లక్షలు విరాళం ప్రకటించిన దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీ
Hazarath Reddyభారీ వర్షాల వల్ల నష్టపోయిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీ సాయం ప్రకటించారు. తమ సొంత నిర్మాణ సంస్థలైన హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ పేర్లతో రూ. 50 లక్షలు ప్రకటించారు.
Telugu States Floods: భారీ వరదలు, తెలుగు రాష్ట్రాలకు హీరో సిద్దు జొన్నలగడ్డ రూ. 30 లక్షలు సాయం, వరదలు ముంచెత్తడం బాధాకరమని ట్వీట్
Hazarath Reddyయంగ్ టాలెంటెడ్ హీరో సిద్దు జొన్నలగడ్డ రెండు తెలు రాష్ట్రాల ప్రజల కోసం తన వంతు సాయాన్ని ప్రకటించారు. వరద బాధితులకు తన వంతు సహకారంగా రూ.30 లక్షల ఆర్థిక సాయాన్ని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి వరద సహాయ నిధికి ప్రకటిస్తున్నాని తెలిపారు.
Vijayawada Floods: ఎమోషనల్ వీడియో ఇదిగో, వరదల్లో చిక్కుకుని రెండు రోజుల తర్వాత కలుసుకున్న వెంటనే ఏడ్చేసిన తండ్రీకొడుకులు
Hazarath Reddyఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజికి రికార్డు స్థాయిలో వరద నీరు కొట్టుకొస్తున్నది.భారీ వర్షాలు, వరదలతో విజయవాడ నగరం చెరువును తలపిస్తోంది. చాలా ప్రాంతాలు నీట మునిగిపోయాయి. వరదల్లో చాలామంది చిక్కుకుని పోయారు.
Chhattisgarh Encounter: ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 9 మంది మవోయిస్టులు హతం, కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
Hazarath Reddyఛత్తీస్గఢ్ (Chhattisgarh)లో మంగళవారం భారీ ఎన్కౌంటర్ (Encounter) చోటు చేసుకుంది. బీజాపూర్ – దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో ( Dantewada Bijapur border) చోటు చేసుకున్న ఈ ఎదురుకాల్పుల్లో 9 మంది మావోయిస్టులు (Naxalites) హతమయ్యారు.
IMD Weather Alert: ఇంకా ముప్పు పోలే.. ఆంధ్రప్రదేశ్కు పొంచి ఉన్న మరో తుఫాను గండం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా సైక్లోన్గా మారే అవకాశం ఉందని తెలిపిన ఐఎండీ
Hazarath Reddyబంగాళాఖాతంలో ఏర్పడిన తాజా అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ సెప్టెంబర్ 5 నుంచి మరో మరో ముప్పును చూసే అవకాశం ఉందని IMD తెలిపింది.సెప్టెంబర్ 5 నాటికి బంగాళాఖాతంలో తాజా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది" అని IMD నుండి సోమవారం (సెప్టెంబర్ 2, 2024) అధికారిక ప్రకటన వెలువడింది.
Andhra Pradesh Rains: ప్రభుత్వ తప్పిదం వల్లే ఈ వరదలు, ప్రజలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని వైఎస్ జగన్ డిమాండ్, వరద ప్రభావిత ప్రాంతాల్లో మాజీ సీఎం పర్యటన
Hazarath Reddyవరద ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం వైఎస్ జగన్ పర్యటించారు. విజయవాడలోని సింగ్ నగర్ సహా పలు ప్రాంతాల్లో బాధితులను వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ సందర్బంగా నడుము లోతు ఉన్న వరద నీటిలో బాధితులను కలుస్తూ.. వారికి భరోసా ఇచ్చారు.
Andhra Pradesh Politics: పుంగనూరులో టీడీపీకి షాక్, మళ్లీ వైసీపి గూటికి చేరిన మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, పలువురు కౌన్సిలర్లు
Hazarath Reddyఇటీవల టీడీపీ చేరిన చిత్తూరు జిల్లా పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, పలువురు కౌన్సిలర్లు తిరిగి సోమవారం రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిపోయారు.
Telangana Rains: వీడియో ఇదిగో, భారీ వరదలకు నీట మునిగిన వట్టెం పంప్ హౌస్, టన్నెల్ మీదుగా పంపుహౌస్లోకి వెళ్లిన చెరువుల వరద నీరు
Hazarath Reddyనాగర్కర్నూలు జిల్లాలోని కుమ్మెర వద్ద నిర్మించిన వట్టెం పంప్హౌస్ (Vattem Pump House) నీటమునిగింది. ప్యాకేజీ-7లోని ఆడిట్ నుంచి పంప్హౌస్ సొరంగమార్గంలోకి నాగనూలు, నాగర్కర్నూలు చెరువల నుంచి భారీగా వరద వచ్చిచేరింది
Girl Dies After Eating Noodles: నూడుల్స్ గొంతులో ఇరుక్కుని ఊపిరాడక బాలిక మృతి, తమిళనాడులో విషాదకర ఘటన
Hazarath Reddyతమిళనాడులోని తిరుచ్చిలో గల అరియమంగళంలో శనివారం రాత్రి నూడుల్స్ వండుకుని తిన్న 15 ఏళ్ల బాలిక ఆదివారం మృతి చెందినట్లు డైలీ తంతి కథనం పేర్కొంది. ఆమె నూడుల్స్ తినడానికి ఇష్టపడిందని, శనివారం రాత్రి ఆన్లైన్లో నూడుల్స్ ప్యాక్ ఆర్డర్ చేసి వండుకుని తిన్నట్లు సమాచారం.