News

SEBI Bans Anil Ambani From Market: నిధుల మళ్లింపు ఆరోపణలు, అనిల్‌ అంబానీపై సెబీ ఐదేళ్ల నిషేధం, రూ.25 కోట్ల జరిమానా

Vikas M

ప్రముఖ వ్యాపార‌వేత్త అనిల్ అంబానీ(Anil Ambani)పై మార్కెట్ రెగ్యులేట‌ర్ సెబీ అయిదేళ్ల పాటు నిషేధం విధించింది. రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌’ (RHFL)లో కీలకంగా వ్యవహరించిన మాజీ అధికారులు, మరో 24 సంస్థలకూ నిషేధాన్ని వర్తింపజేస్తున్నట్లు శుక్రవారం వెల్లడించింది. నిధుల మళ్లింపు ఆరోపణల నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.

Jio Issues Cyber Fraud Warning: కస్టమర్లకు జియో సైబర్ వార్నింగ్, ఆ సందేశాలు నమ్మవద్దంటూ అలర్ట్

Vikas M

రిలయన్స్‌ జియో పేరిట సందేశాలు పంపుతూ కస్టమర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే ప్రయత్నాలు హ్యాకర్లు మొదలుపెట్టారు. దీనిపై రిలయన్స్ తమ కస్టమర్లను వెంటనే అలర్ట్‌ చేసింది. సున్నితమైన సమాచారం అందించాలంటూ జియో పేరుతో వచ్చే సందేశాలను నమ్మొద్దంటూ వినియోగదారులకు తెలిపింది. ఈ మేరకు కొన్ని సూచనలు జారీ చేసింది.

Viral News: ఆ టీచర్ వక్షోజాలు చూసి నా కొడుకు చెడిపోతున్నాడు, స్కూలు యాజమాన్యానికి ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు, వింత ఘటన వెలుగులోకి..

Vikas M

ఆన్‌లైన్‌లో మరో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. టీచర్ పెద్ద వక్షోజాలు" గురించి ఒక పేరెంట్ తన స్కూల్ అడ్మినిస్ట్రేటర్‌కి ఫిర్యాదు చేశాడని పేర్కొంటూ, ఒక మిడిల్ స్కూల్ టీచర్ రెడ్డిట్‌కి వెళ్లింది. రెడ్డిట్‌లో xtinalaperra అనే పేరుతో ఉన్న ఉపాధ్యాయురాలు, తన దుస్తుల కోడ్‌పై తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఆమె పాఠశాల అడ్మిన్ తనను సంప్రదించినట్లు సుదీర్ఘ పోస్ట్‌లో పేర్కొంది.

Ghaziabad Metro Fight Video: వీడియో ఇదిగో, ఘజియాబాద్ మెట్రోలో సీటు కోసం తన్నుకున్న ఇద్దరు ప్రయాణికులు

Vikas M

ఘజియాబాద్‌లోని మెట్రో రైలులో ఇద్దరు వ్యక్తులు సీటు కోసం దూకుడుగా పోరాడుతున్న హింసాత్మక వాగ్వాదానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. న్యూ బస్టాండ్ షాహీద్ స్థల్ మెట్రో స్టేషన్‌లో జరిగిన ఈ సంఘటనలో పురుషులు భారీ కిక్‌లు, పంచ్‌లు ఇచ్చుకుంటున్నట్లు చిత్రీకరించబడింది.

Advertisement

Meerut Shocker: యూపీలో దారుణం, స్కూలుకు వచ్చిన బాలికలను అసభ్యంగా తాకుతూ హెడ్ మాస్టర్ పైశాచికానందం, చితకబాదిన తల్లిదండ్రులు, వీడియో ఇదిగో

Hazarath Reddy

మీరట్‌లోని ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించాడన్న ఆరోపణలతో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేసి అరెస్ట్ చేసినట్లు అధికారి ఒకరు శుక్రవారం తెలిపారు. విద్యార్థిని ఫిర్యాదు తర్వాత ప్రధానోపాధ్యాయుడు జమాల్ కమిల్‌ను కూడా బాలిక తల్లిదండ్రులు కొట్టారు

Macherla Municipality: టీడీపీ ఖాతాలో మాచర్ల మున్సిపాలిటీ, సైకిల్ ఎక్కిన 16 మంది వైసీపీ కౌన్సిలర్లు, చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేసిన పోలూరు నరసింహారావు

Hazarath Reddy

Andhra Pradesh: నాడు - నేడు ఇకపై మన బడి - మన భవిష్యత్, ఏపీలో మరో ఆరు పథకాలకు పేర్లు మార్చిన చంద్రబాబు సర్కారు

Hazarath Reddy

ఏపీలో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు ప్రభుత్వ పథకాల పేర్లను మారుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలోని పథకాల పేర్లను తొలగించి కొత్త పేర్లను పెడుతోంది. తాజాగా మరో ఆరు పథకాల పేర్లను మార్చింది.

Andhra Pradesh: వీడియో ఇదిగో, ఒంటి నిండా 25 కిలోల బంగారం, తిరుమల వేంకటేశ్వర ఆలయాన్ని సందర్శించిన పూణే నుండి వచ్చిన భక్తుల బృందం

Hazarath Reddy

విశేషమైన భక్తి ప్రదర్శనలో, పూణే నుండి వచ్చిన భక్తుల బృందం ఈరోజు తెల్లవారుజామున 25 కిలోల బంగారం ధరించి ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమలలోని వేంకటేశ్వర ఆలయాన్ని సందర్శించింది. పవిత్ర మందిరానికి చేరుకున్న ఈ బృందం తోటి యాత్రికులు మరియు ఆలయ సిబ్బంది దృష్టిని ఆకర్షించింది.

Advertisement

Pune Shocker: వీడియో ఇదిగో, విద్యార్థినికి ఐ లైక్ యు అంటూ స్కూల్ వ్యాన్ డ్రైవర్‌ మెసేజ్, పట్టుకుని చితకబాదిన ఎంఎన్ఎస్ సభ్యులు

Hazarath Reddy

ఎడ్యుకేషన్‌కు హబ్‌గా పేరుగాంచిన పూణెలో ఓ పాఠశాల విద్యార్థినిపై జరిగిన వేధింపుల ఘటన ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. స్కూల్ వ్యాన్ డ్రైవర్‌.. విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపి, ‘ఐ లైక్ యు’ అంటూ ఆమెను వ్యక్తిగతంగా, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వేధిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

Andhra Pradesh: వైసీపీ భూతాన్ని పూర్తిగా భూ స్థాపితం చేస్తేనే రాష్ట్రాభివృద్ధి, వానపల్లి సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, కేంద్రం సాయంతో గ్రామాలను అభివృద్ధి చేస్తామని వెల్లడి

Hazarath Reddy

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్త పేట మండలం వానపల్లిలో శుక్రవారం సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా స్వర్ణ వానపల్లి గ్రామసభకు హాజరై ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. పేద ప్రజలకు న్యాయం జరిగే పాలనకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు

Andhra Pradesh Factory Explosion:రెడ్‌ బుక్‌ మీద పెట్టిన శ్రద్ధ వీటిపై పెట్టి ఉంటే ప్రమాదం జరిగేది కాదు, అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని జగన్ మండిపాటు

Hazarath Reddy

అచ్యుతాపురం ప్రమాద ఘటనలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరు చాలా బాధాకరమని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం అనకాపల్లిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు.

Paradise Hotel Fire: వీడియో ఇదిగో, సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్‎లో అగ్ని ప్రమాదం, తినే ప్లేట్లు వదిలి బయటకు పరుగులు పెట్టిన కస్టమర్లు

Hazarath Reddy

సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్‎లో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో హోటల్ సిబ్బందితో పాటు కస్టమర్లు తీవ్ర భయాందోళనకు గురై తినే ప్లేట్లను వదిలి బయటకు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన హోటల్ స్టాఫ్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు

Advertisement

Indian Army Drone Crosses LoC: ఎల్‌వోసీని దాటి పాకిస్థాన్‌లో ల్యాండ్‌ అయిన భారత ఆర్మీ వ్యూహాత్మక డ్రోన్,స్వాధీనం చేసుకున్న పాక్ ఆర్మీ

Hazarath Reddy

ఇండియన్ ఆర్మీకి చెందిన వ్యూహాత్మక డ్రోన్ అనుకోకుండా నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ)ను దాటి పాకిస్థాన్‌లో ల్యాండ్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో ఇండియన్‌ ఆర్మీ డ్రోన్‌ను పాకిస్థాన్‌ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ సెక్టార్‌లో ఈ సంఘటన జరిగింది.

Noida: శవం పక్కనే సెక్స్ చేస్తూ కెమెరాకు చిక్కిన ఉద్యోగులు, ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

నోయిడాలోని సెక్టార్ 94లోని ఆసుపత్రిలోని మార్చురీ ఫ్రీజర్ గది లోపల మృతదేహం దగ్గర శృంగారంలో పాల్గొన్న జంట పట్టుబడింది. ఈ సంఘటన దాదాపు నెల రోజుల క్రితం జరిగినట్లు నివేదించబడినప్పటికీ, దాని వీడియో ఆగస్ట్ 23న వైరల్ అయింది.

Health Tips: కలబందతో అద్భుత ప్రయోజనాలు, మీకు తెలిస్తే అస్సలు వదలరు, చర్మ సమస్యలే కాదు ఇంకా ఎన్నో వ్యాధులకు దివ్యాఔషధం కలబంద!

Arun Charagonda

సహజ సిద్దంగా ప్రకృతిలో దొరికే దివ్యమైన ఔషధ గుణాలు కలిగిఉన్న వాటిలో ఒకటి కలబంద. సాధారణంగా దీనిని చర్మ సంబంధింత మెడిసిన్స్ తయారిలో ఎక్కువగా వాడుతుంటారు. ఇందులో ఉండే గ్లిసరిన్, సోడియం ఫామాల్ చర్మ సమస్యలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అంతేగాదు కలబందలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ప్రిరాడికల్స్ చర్మాన్ని సంరక్షిస్తాయి.

Telangana Police: తస్మాత్ జాగ్రత్త!, సోషల్ మీడియా రీల్స్‌ పేరుతో అతి చేస్తే ఇకపై అంతే, కఠినమైన కేసులు తప్పవని పోలీసుల హెచ్చరిక

Arun Charagonda

యువత సమాజానికి ప్రమాదకరంగా మారి జైళ్ల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. బైక్ లపై స్టంట్స్, రోడ్డుపై డబ్బులు వెదజల్లడాలు, రీల్స్, వీడియోల కోసం పిచ్చి దుశ్చర్యలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని తేల్చిచెప్పారు. కఠినచట్టాలు ప్రయోగించి జైలు ఊచలు లెక్కబెట్టిస్తామని తెలిపారు

Advertisement

Bail For Pinnelli Ramakrishna Reddy: పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రిలీఫ్, బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం, దేశం విడిచి వెళ్లొద్దని కండీషన్

Arun Charagonda

ఈవీఎంల ధ్వంసం సహా మూడు కేసుల్లో మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రిలీఫ్ లభించింది. షరతులతో కూడిన బెయిల్ ను ఏపీ హైకోర్టు మంజూరు చేసింది. ఎ రెండు నెలలుగా నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న పిన్నెల్లికి కండీషన్స్‌తో కూడిన బెయిల్ రాగా పాస్ పోర్టును కోర్టుకు సరెండర్ చేయాలని సూచించింది న్యాయస్థానం. అలాగే ప్రతీ వారం మేజిస్ట్రేట్, ఎస్‌హెచ్‌వో ముందు హాజరు కావాలని.. అనుమతులు లేకుండా దేశం విడిచి వెళ్లొద్దు అని తెలిపింది.

KTR Vs Ponguleti: ఎఫ్‌టీఎల్‌లోనే పొంగులేటి ఫాంహౌజ్‌, ముందు కాంగ్రెస్ నేతల అక్రమ కట్టడాలు కూలగొట్టాకే ప్రజల దగ్గరికి వెళ్లాలని కేటీఆర్ డిమాండ్

Arun Charagonda

తెలంగాణలో అక్రమకట్టడాల కూల్చివేత రగడ కొనసాగుతూనే ఉంది. నా ఇల్లు బఫర్ జోన్లో ఉన్నా, FTLలో ఉన్నా వెంటనే కూలగొట్టండని హైడ్రాకి ఆదేశాలు జారీ చేశారు మంత్రి పొంగులేటి. దీనిపై స్పందించిన కేటీఆర్..పొంగులేటికి అంత శ్రమ అవసరం లేదని.. అన్ని శాటిలైట్ ఇమేజ్‌లు ఉన్నాయన్నారు.

Woman Gives Birth in Chair: నల్గొండ ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో దారుణం, వైద్యుల నిర్లక్ష్యంతో కుర్చీలోనే శిశువును ప్రసవించిన మహిళ

Hazarath Reddy

నల్లగొండ జిల్లాలోని ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో దారుణ ఘ‌ట‌న‌ చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో ఓ మహిళ కుర్చీలోనే శిశువును ప్రసవించింది. నేరడుగొమ్మ మండలానికి చెందిన నల్లవెల్లి అశ్విని అనే గర్భిణి గురువారం రాత్రి పురిటినొప్పులతో జిల్లాలోని దేవరకొండ ప్రభుత్వ ఆసుప‌త్రికి వెళ్లారు

KTR About Revanth Reddy Delhi Tour:రైతులకు మాయమాటలు..ఢిల్లీ పెద్దలకు మాత్రం మూటలా?..కేటీఆర్ ఫైర్, చల్లో ఢిల్లీ కాదు చలో పల్లె చేపట్టాలని సవాల్

Arun Charagonda

రైతులకేమో మాయమాటలు..ఢిల్లీ పెద్దలకు మాత్రం మూటలా?? అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం రేవంత్ కు దమ్ముంటే... “చలో ఢిల్లీ” కాదు.. “చలో పల్లె” చేపట్టాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.అధిష్టానం మెప్పు కోసం పగలూ రాత్రి తపన తప్ప…అన్నం పెట్టే రైతుల తిప్పల గురించి ఆలోచించే తీరిక లేదా.. అని ప్రశ్నించారు

Advertisement
Advertisement