News

Tungabhadra Dam Crest Gate Fixed:ఎట్ట‌కేల‌కు తుంగ‌భ‌ద్ర గేటును విజ‌య‌వంతంగా మార్చిన అధికారులు, వంద‌ల క్యూసెక్కుల నీరు వృథాగా వెళ్ల‌కుండా చ‌ర్య‌లు

VNS

తుంగభద్ర డ్యామ్(Tungabhadra Dam)​లో గల్లంతైన 19వ గేటు స్థానంలో స్టాప్ లాగ్ (Stop log ) ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. పనులు చేపట్టిన 24 గంటలలోపే 5 బ్లాక్‌ల్లో స్టాప్‌ లాగ్‌ ఎలిమెంట్లను అధికారులు విజయవంతంగా అమర్చారు. 4 అడుగుల ఎత్తు, 60 అడుగుల వెడల్పుతో స్టాప్‌ లాగ్‌ ఎలిమెంట్లను అమర్చి వృథాగా పోతున్న నీటిని పూర్తిగా అడ్డుకున్నారు.

Jagtial: ర‌న్నింగ్ లో ఉండ‌గానే ఊడిపోయిన ఆర్టీసీ బ‌స్సు టైర్, ప్ర‌మాద స‌మ‌యంలో 150 మంది ప్ర‌యాణికులు, డ్రైవ‌ర్ అప్ర‌మ‌త్త‌త‌తో త‌ప్పిన ముప్పు

VNS

జగిత్యాల నుంచి నిర్మల్‌కు పల్లె బస్సు వెళ్తున్నది. ఈ క్రమంలో బస్సు జగిత్యాల శివారు మొరపల్లి గ్రామం వద్దకు చేరుకోగానే వెనుకాల రెండు చక్రాలు ఊడిపోయి పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకెళ్లాయి. డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించి బస్సుని నిలుపడంతో భారీ ప్రమాదం తప్పింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం కాకుండా బయటపడ్డారు. వరుసగా సెలవులు రావడంతో ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో కళకళలాడుతున్నా

Telangana Police: హైదరాబాద్‌లో భారీగా హాష్ ఆయిల్ పట్టివేత, నలుగురు అరెస్ట్, పరారీలో మరో నలుగురు

Arun Charagonda

హైదరాబాద్‌లో భారీగా హాష్ ఆయిల్‌ను పట్టుకున్నారు పోలీసులు. తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ డ్రగ్స్ బ్యూరో, బాలానగర్ పోలీసులు హాష్ ఆయిల్ విక్రేతని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.10.30 లక్షల విలువ చేసే 1.292 ఎంఎల్ హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. ఇందులో నలుగురు యువకులను అరెస్టు చేయగా మరో నలుగురు పరారీలో ఉన్నారు.

KCR Is Back: రంగంలోకి దిగనున్న కేసీఆర్, పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి, త్వరలో కీలక నేతలతో పలు రాష్ట్రాల టూర్!

Arun Charagonda

తెలంగాణ రాజకీయాలు బీఆర్ఎస్ - కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగుతున్నాయి. ముఖ్యంగా రుణమాఫీ విషయంతో పాటు ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ చేసిన కామెంట్స్ టార్గెట్‌గా కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. దీనికి అంతే ధీటుగా బీఆర్ఎస్ సైతం స్పందిస్తోంది. ఏకంగా హరీశ్ రావు కార్యాలయంపై దాడుల వరకు రాజకీయాలు వెళ్లగా మాజీ సీఎం, గులాబీ బాస్ కేసీఆర్ మాత్రం ఇప్పటివరకు స్పందించడం లేదు.

Advertisement

Hyderabad: బోర్డు తిప్పేసిన కన్సల్టెన్సీ, జాబ్ ఇప్పిస్తామంటూ 600 మందికి టోకరా, ఒక్కొక్కరి దగ్గరి నుండి లక్ష వసూలు, పోలీసులకు ఫిర్యాదు

Arun Charagonda

హైదరాబాద్ మాదాపూర్‌లో మరో మోసం వెలుగులోకి వచ్చింది. ఫ్రైడే అప్ కన్సల్టెన్సీ పేరుతో నిరుద్యోగులకు వల వేసిన కేటుగాళ్లు కోట్ల రూపాయలు వసూలు చేసి చేతులు దులుపుకున్నారు. దాదాపు 600 మందికి పైగా నిరుద్యోగుల నుంచి 1లక్ష ,50,000 వేల రూపాయల చొప్పున వసూలు చేశారు. మాదాపూర్ పోలీసులను ఆశ్రయించారు బాధితులు. బెంగళూరు, విజయవాడలో సైతం ఈ కన్సల్టెన్సీ ఆఫీస్‌లు ఉన్నట్లు తెలుస్తోంది

Bihar Bridge Collapse: బీహార్‌లో మరోసారి కూలిన వంతెన, నదిలో కొట్టుకుపోయిన సీఎం నితీశ్ కుమార్‌ కలల ప్రాజెక్టు...వీడియో

Arun Charagonda

బీహార్‌ లో మరో వంతెన కూలిపోయింది. సీఎం నితీశ్‌ కుమార్‌ కలల ప్రాజెక్టుగా చెప్పుకునే గంగా నదిపై నిర్మిస్తున్న తీగల బ్రిడ్జిలోని ఒకవైపు భాగం కూలి నదిలో కొట్టుకుపోయింది. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. తొమ్మిదేళ్లుగా నిర్మాణంలోనే ఉండగాఇది కూలడం మూడోసారి.

Guidelines For Transfer Of Employees: ఏపీలో 15 శాఖల్లో బదిలీలు, గైడ్ లైన్స్ జారీ చేసిన ప్రభుత్వం, 31లోగా బదిలీల ప్రక్రియ పూర్తి

Arun Charagonda

ఏపీ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన గైడ్‌లైన్స్ ను విడుదల చేసింది ప్రభుత్వం. మొత్తం 15 శాఖల్లో బదిలీలు చేపట్టాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. 5 ఏళ్లు ఒకేచోట పని చేసినవారికి బదిలీ తప్పనిసరి చేసింది. ఈ నెల 31లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలిచ్చింది ప్రభుత్వం.

Astrpology: ఆగస్టు 19 రాఖీ పౌర్ణమి రాఖీ పౌర్ణమి..రాఖీ ఏ టైం లో కట్టాలి ,ఏ దిశలో ఉండి కట్టాలి.

sajaya

అన్నా చెల్లెల మధ్య ప్రేమకు ప్రతిరూపంగా ఈ రాఖీ పండుగ ప్రాముఖ్యత ఉంది. శ్రావణమాసంలో వచ్చే శుక్లపక్ష పౌర్ణమి రోజున రాఖీ పండుగను జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం రాఖీ పండుగ ఆగస్టు 19వ తేదీన వస్తుంది. ఈ రోజున సోదరీ సోదరీమణులు రాఖీని కట్టుకుంటారు.

Advertisement

Astrology: ఆగస్టు 25న శుక్రుడు కన్యారాశిలోకి ప్రవేశం..30 రోజుల పాటు ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహం కీర్తి సంపదలను ఆనందాన్ని ఇచ్చే గ్రహం. ఈ గ్రహం రాశి మార్పు కారణంగా అనేక శుభ ఫలితాలను కలిగి ఉంది. ముఖ్యంగా ఆ మూడు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Harish Rao On Rythu Runa Mafi: రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలి, పాలకుడిగా సీఎం రేవంత్‌ రెడ్డి పాపాలు చేస్తున్నారని హరీశ్ రావు ఫైర్, రేవంత్ రాజీనామా చేయాలని డిమాండ్

Arun Charagonda

రైతు రుణమాఫీ అంశం తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది. రుణమాఫీ చేసి దేశంలో ఏ సీఎం చేయని విధంగా సాహసం చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుంటూ కేవలం 54 శాతం రైతులకు రుణమాఫీ చేసిన పాపపు ప్రభుత్వం కాంగ్రెస్‌ది అని మండిపడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. మరోవైపు హరీశ్‌ రావు రాజీనామా చేయాలని కాంగ్రెస్ రచ్చ చేస్తుంటే పాలకుడిగా రేవంత్ పాపాలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Astrology: ఈ తేదీల్లో జన్మించిన వారికి భవిష్యత్తు గురించి తెలుసుకోండి. వీరికి అదృష్టం కలిసి వస్తుంది.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి భవిష్యత్తును ఎలా తెలుసుకుంటారో అదే విధంగా సంఖ్య శాస్త్రాన్ని కూడా ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తి పుట్టిన తేదీ ప్రకారం వారి గ్రహాలు వారి రాశుల కారణంగా వారి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి.

Tirumala: తిరుమల కొండపై మందుబాబుల బీభత్సం, గాజు బాటిళ్లతో దాడి, ఇద్దరికి తీవ్ర గాయాలు, వీడియో వైరల్

Arun Charagonda

తిరుమల కొండపై మందుబాబులు హల్ చల్ చేశారు. మద్యం మత్తులో కొట్టుకున్నారు. నందకం అతిథిగా గృహం వద్ద గాజు బాటిళ్ళతో దాడి చేసుకోగా ఇద్దరి తీవ్ర గాయాలయ్యాయి. నందకం అతిథిగా గృహం వద్ద ఈ ఘటన జరుగగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Astrology: ఆగస్టు 20 బుధాదిత్య యోగం. ఈ మూడు రాశుల వారికిసంపద పెరుగుతుంది

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈనెల 20వ తారీఖు బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఇది అన్ని రాశుల వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం బుధుడు ,సూర్యుడు కలయిక వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఇది చాలా పవిత్రమైన యోగం, దీన్ని రాజయోగం కూడా అని అంటారు.

Duvvada Srinivas: దువ్వాడ వాణికి టెక్కలి పోలీసుల నోటీస్, పోలీసులతో వాణి వాగ్వాదం, నోటీసులు తీసుకునేందుకు నిరాకరణ

Arun Charagonda

తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ఎపిసోడ్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దువ్వాడ శ్రీనివాస్ - వాణి మధ్యలో మాధురి విషయం రచ్చచెక్కగా దువ్వాడ శ్రీనివాస్ ఇంటి బయట నిరసన చేస్తూనే ఉన్నారు వాణి.

Telangana Tulsi Reddy: 'మౌంట్ ఎల్బ్రస్‌'పై తెలంగాణ వాసి, 5642 మీటర్ల పర్వతాన్ని అధిరోహించిన తులసిరెడ్డి

Arun Charagonda

మౌంట్ ఎల్బ్రస్‌ పర్వతాన్ని అధిరోహించారు తెలంగాణ వాసి. ఈనెల 15న యూరప్ ఖండంలోని 5,642 మీటర్ల ఎత్తైన మౌంట్ ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించారు తులసిరెడ్డి. ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ 4 రోజుల్లో పర్వతాన్ని అధిరోహించారు తులసిరెడ్డి. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం బౌరంపేట్ తులసిరెడ్డి స్వస్థలం.

Health Tips: ఖాళీ కడుపుతో కలబంద తీసుకుంటే బీపీ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.

sajaya

కలబంద ఆరోగ్యాల గని. దీని ప్రతిరోజూ ఖాళీ కడుపుతో తీసుకుంటే మన శరీరానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి. దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కలబంద కేవలం అందానికే కాకుండా ఆరోగ్యానికి కూడా ఇది ఒక సంజీవని అని చెప్పవచ్చు

Advertisement

Medak Rains: మెదక్‌లో దంచికొట్టిన వాన, వర్షంలో కొట్టుకు పోయిన బైకులు, బైకుల కోసం పరుగెత్తిన వాహనదారులు..వీడియో వైరల్

Arun Charagonda

ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షం దంచికొట్టింది. మెదక్ పట్టణంలో గంటన్నర పాటు ఏకధాటిగా కురిసింది వర్షం. దీంతో మెదక్ పట్టణంలో ప్రధాన రహదారిపై భారీగా నిలిచింది వర్షపు నీరు. వర్షంలో బైకులు కొట్టుకుపోగా బైకుల కోసం పరిగెత్తారు వాహనదారులు. మెదక్ లో అత్యధికంగా 12.6 సెం. మీ, పాతురులో 8.6 సెం. మీ వర్షపాతం నమోదు అయింది. సిద్దిపేట జిల్లాలో 9 సెం. మీ, సంగారెడ్డి జిల్లాలో 6 సెం. మీ వర్షపాతం నమోదు అయింది.

Health Tips: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే గుండె జబ్బులు కావచ్చు జాగ్రత్త.

sajaya

ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా యువత కూడా ఈ గుండెపోటుకు గురవుతున్నారు. వీటి లక్షణాలు మనం సరైన సమయంలో గుర్తించడం ద్వారా మనము గుండె జబ్బుల నుంచి బయటపడవచ్చు.

Telangana: వివాహేతర సంబంధం, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని ఇద్దరికి దేహశుద్ది చేసిన బంధువులు, వీడియో వైరల్

Arun Charagonda

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం ముచ్చర్ల గ్రామంలో వివాహేతర సంబంధం బయటపడింది. గడ్డమీది శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి ముచ్చర్ల గ్రామానికి చెందిన వివాహితతో గత కొంత కాలంగా ప్రేమాయణం నడుపుతున్నారు. ఇది గ్రహించిన బంధువులు గంభీరావుపేటలో వివాహిత, శ్రీకాంత్ రెడ్డి పై దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

CM Siddaramaiah In MUDA land Scam Case: కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు షాక్..ముడా కుంభకోణంలో ఆరోపణలు, విచారణకు గవర్నర్ అమోదం

Arun Charagonda

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు షాక్ తగిలిందిమైసూరు నగరాభివృద్ధి ప్రాదికార (ముడా) కుంభకోణంలో ఆ రాష్ట్రాన్ని కుదిపేస్తుండగా ఇప్పుడు అది ఏకంగా కర్ణాటక సీఎంకే తాకింది. ఈ నేపథ్యంలో ఆరాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Advertisement
Advertisement