వార్తలు

Women's Asia Cup T20 2024: ఆసియా క‌ప్‌ 8వ టైటిల్‌కు అడుగు దూరంలో భారత్, సెమీఫైన‌ల్లో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించిన టీమ్ ఉమెన్ ఇండియా

Hazarath Reddy

మ‌హిళ‌ల ఆసియా క‌ప్‌లో దంబుల్లా స్టేడియంలో శుక్రవారం జ‌రిగిన‌ సెమీఫైన‌ల్లో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించి భార‌త జ‌ట్టు ఫైన‌ల్‌కు దూసుకెళ్లింది. తొలుత పేస‌ర్ రేణుకా సింగ్‌(3/10), రాధా యాద‌వ్‌(3/14)లు ప్ర‌త్య‌ర్థిని స్వ‌ల్ప స్కోర్‌కే క‌ట్ట‌డి చేయ‌గా.. అనంత‌రం ఓపెన‌ర్లు స్మృతి మంధానా(55 నాటౌట్), ష‌ఫాలీ వ‌ర్మ‌( 26 నాటౌట్‌)లు చిత‌క్కొట్టారు

Pending Cases in Courts: దేశంలోని అన్ని న్యాయస్థానాల్లో 5 కోట్లకు పైగా పెండింగ్‌ కేసులు, యూపీలోనే 1.18 కోట్ల కేసులు, లోక్ సభ వేదికగా వెల్లడించిన కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌

Hazarath Reddy

దేశంలోని అన్ని న్యాయస్థానాల్లో కలిపి దాదాపు 5 కోట్లకు పైనే కేసులు పెండింగులో ఉన్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ లోక్ సభ వేదికగా వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు పేర్కొన్నారు. వీటిల్లో గరిష్ఠంగా 1.18 కోట్ల కేసులు ఉత్తర్‌ ప్రదేశ్‌లోని సబార్డినేట్‌ కోర్టుల్లోనే ఉన్నాయి

Shamirpet Road Accident: వీడియో ఇదిగో, ముగ్గురు ప్రాణాలను బలిగొన్న అతివేగం, రోడ్డుపై ఉన్న ప్రైవేట్ బస్సును బలంగా ఢీకొట్టిన ఇన్నోవా కారు

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా షామీర్ పేట్‌లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు వేగంగా వ‌చ్చి అదుపుతప్పి డివైడర్ అవతల పడిపోయింది. ఈ యాక్సిడెంట్‌లో ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా.. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.

Telangana: దొంగతనానికి వెళ్లిన దొంగ. ఇంట్లో డబ్బులు దొరకలేదని రూ. 20 వారికే దానం చేసి వచ్చాడు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఓ దొంగ ముఖం కప్పుకుని ఇంట్లోకి చొరబడ్డాడు. అయితే ఇంట్లో వెతికినా డబ్బులు దొరకలేదు. నిరాశతో అతను రూ. 20 టేబుల్‌పై పెట్టి వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైంది.

Advertisement

Telangana Shocker: ఖమ్మంలో దారుణం, టీచర్స్ వేధింపులు తట్టుకోలేక 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

Hazarath Reddy

ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ముస్తఫానగర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని.. టీచర్స్ వేధింపుల తట్టుకోలేక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Kargil Vijay Diwas: కార్గిల్ యుద్ధం నుంచి పాకిస్తాన్ ఇంకా పాఠాలు నేర్చుకోలేదు, శత్రుదేశానికి ధీటైన బదులిస్తామని కార్గిల్‌ నుంచి ప్రధాని మోదీ హెచ్చరిక

Hazarath Reddy

కార్గిల్‌ 25వ విజయ దివస్‌ (Kargil Vijay Diwas)ను పురస్కరించుకుని 1999 కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఘనంగా నివాళులు అర్పించారు. దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన సైనికుల త్యాగాలకు యావత్‌ భారతావని ఎప్పటికీ రుణపడి ఉంటుందని అన్నారు

Chhattisgarh: దారుణం, బిస్కెట్లు దొంగిలించాడని యువకుడిని చితకబాదిన స్టాల్ ఓనర్, రైల్వే ప్లాట్‌ఫారమ్ ఈడ్చుకుంటూ వెళ్లిన వీడియో వైరల్

Hazarath Reddy

షాకింగ్ సంఘటనలో, ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ఒక స్టాల్‌లో బిస్కెట్లు దొంగిలించినందుకు యువకుడు తీవ్ర పరిణామాలను ఎదుర్కొన్నాడు. తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ప్లాట్‌ఫారమ్‌ స్టాల్‌లో దొంగతనానికి ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు పట్టుబడ్డారు. ముగ్గురు తప్పించుకోగా, ఒకరిని స్టాల్ ఉద్యోగులు పట్టుకున్నారు.

Kargil Vijay Diwas 2024: ఆర్మీ అంటే 140 కోట్ల భార‌తీయుల న‌మ్మ‌కం, అగ్నిపథ్ స్కీంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు, ప్ర‌తిప‌క్షాలు త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నాయని మండిపడిన భారత ప్రధాని

Hazarath Reddy

అగ్నిపథ్ పథకంపై ప్రతిపక్షాల చేస్తున్న విమర్శలను ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. ఈ పథకంపై యువతను తప్పు దోవ పట్టించే విధంగా ఆ యా పార్టీలు వ్యవహరిస్తున్నాయంటూ ప్రధాని మండిపడ్డారు.

Advertisement

Andhra Pradesh: ఏపీ మంత్రి నారా లోకేష్ మంచి మనసు,సౌదిలో చిక్కుకున్న మరో వ్యక్తిని స్వగ్రామానికి తీసుకొచ్చిన లోకేష్‌, గ్రామస్తుల హర్షం

Arun Charagonda

ఏపీ మంత్రి నారా లోకేష్ మంచి మనసు చాటుకున్నాడు. ఏజెంట్ల చేతిలో మోసపోయి సౌదీ అరేబియాలో చిక్కుకున్న మరో వ్యక్తిని తిరిగి స్వగ్రామానికి తీసుకు వచ్చారు లోకేష్‌. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇసుకపూడి గ్రామానికి చెందిన వీరేంద్ర అనే వ్యక్తి తనను రక్షించాలంటూ మంత్రి లోకేశ్‌కు ట్విటర్ ద్వారా వేడుకున్నాడు

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టు డ్రోన్ విజువల్స్, ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నది,నిండుకుండను తలపిస్తున్న మేడిగడ్డ,వీడియో

Arun Charagonda

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాళేశ్వరం పర్యటన సందర్భంగా డ్రోన్ విజువల్స్‌ని రిలీజ్ చేశారు. మేడిగడ్డ కుంగిపోయింది.. కాళేశ్వరం కొట్టుకుపోయింది అని దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విజువల్స్ చూడాలని బీఆర్ఎస్ పార్టీ తన అఫిషియల్ ఫేస్ బుక్ ఖాతా ద్వారా షేర్ చేసింది.

Narayanapet Police: డైరెక్టర్ కావాలనుకున్నాడు, కానీ దొంగగా మారి పోలీసులకే సవాల్, ఇంట్లో మనషులు ఉండగానే దొంగతనం అదే మనోడి స్పెషల్, కానీ చివరకు!

Arun Charagonda

సినిమా రంగుల ప్రపంచం. సినిమాల్లో ఒక్క ఛాన్స్ అంటూ తెలుగు రాష్ట్రాల్లోని మారుమూల పల్లెల నుండి పట్నంకు వచ్చిన యువత ఎందరో. ఇందులో కొంతమందికి అవకాశాలు దక్కి ఇండస్ట్రీలో రాణిస్తుండగా మరికొంతమంది అవకాశాలు దక్కక, తిరిగి సొంత ఊరికి వెళ్లలేక పక్క దారి పడుతున్నారు.

Jagan: వైసీపీ అధినేత జగన్ సంచలన కామెంట్స్, చంద్రబాబును కొట్టిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , అందుకే హత్య రాజకీయాలు!

Arun Charagonda

మాజీ సీఎం,వైసీపీ అధినేత జగన్ సంచలన కామెంట్స్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు వైసీపీ నేత, ఎమ్మెల్యే చంద్రబాబుని కొట్టాడని తెలిపారు. పెద్దిరెడ్డి కాలేజీలో చదువుకునే రోజుల్లో చంద్రబాబును కొట్టాడని అందుకే రామచంద్రారెడ్డి అంటే జీర్ణించుకోలేక వాళ్ల కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Telangana Panchayat Elections: బ్రేకింగ్, ఆగస్టులోనే తెలంగాణ పంచాయతీ ఎన్నికలు?,ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు యదాతథం,త్వరలో నోటిఫికేషన్?

Arun Charagonda

తెలంగాణలో మళ్లీ ఎన్నికల సమరానికి రంగం సిద్ధమైంది. పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే పాలనపై దృష్టి సారించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీల గడువు ముగియడంతో ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. వాస్తవానికి జూన్‌లోనే ఎన్నికలు నిర్వహిస్తారని ప్రచారం జరిగిన ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదు.

Ethiopia Landslides: కొండచరియలు విరిగిపడి 200 మందికిపైగా సమాధి, మృతదేహాల కోసం బురద గొయ్యిని తవ్వుతున్న స్థానికులు, విషాద సంఘటన

Arun Charagonda

ఇథియోపియాలో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. భారీ వర్షాలతో కొండ చరియలు విరిగిపడి 200 మందికిపైగా సమాధి అయ్యార. ఇందులో గర్భిణులు, ఇచన్నారులు సైతం ఉన్నారు. దీంతో మృతదేహాల కోసం స్థానికులు పెద్ద ఎత్తున బురద గొయ్యి చుట్టూ గుమిగూడి కన్నీటి పర్యంతం అయ్యారు.

CM Chandrababu on Andhra Pradesh Debt: ఆంధ్రప్రదేశ్ అప్పు నేటికి రూ.9.74 లక్షల కోట్లు, ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు, కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Hazarath Reddy

ఏపీ సీఎం చంద్రబాబు నేడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల (White paper on State Debt) చేశారు. ఈ సందర్భంగా శ్వేతపత్రంలోని అంశాలను ఆయన సభకు వివరించారు. నాడు విభజన సమయంలో ఏపీకి పన్నుల రూపేణా అందిన ఆదాయం 46 శాతం అని వెల్లడించారు

YS Jagan on Andhra Pradesh Debt: ఏపీ అప్పులపై క్లారిటీ ఇచ్చిన వైఎస్ జగన్, చంద్రబాబు రూ .14 లక్షల కోట్ల శ్వేతపత్రంపై సెటైర్లు, ఇంతకీ ఆంధ్రప్రదేశ్ అప్పు ఎంతంటే..

Hazarath Reddy

2019-24 మధ్య రాష్ట్రంలో భారీగా ఆర్థిక నిర్వహణ లోపాలు జరిగాయంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు సభలో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఇప్పటి వరకూ 9 లక్షల 74 వేల కోట్లు అప్పు అయ్యిందని, ఇది నేటికి ఉన్న రాష్ట్ర అప్పు అని చంద్రబాబు శ్వేతపత్రం విడుదల సందర్భంగా తెలిపారు.

Advertisement

Medigadda Row: సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ డెడ్ లైన్‌, రాజకీయాల కోసం రైతులను ఆగం చేయవద్దు, 50 వేల మంది రైతులతో పంపులు ఆన్‌ చేస్తామని హెచ్చరిక

Arun Charagonda

బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన రెండో రోజు కొనసాగుతోంది. రెండో రోజు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కన్నెపల్లి లక్ష్మీ పంప్‌ హౌస్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పరిశీలించారు. అనంతరం మాట్లాడిన కేటీఆర్.

Viral Video: వైరల్ వీడియో ఇదిగో, లోకో పైలట్ క్యాబిన్ లో వర్షపు నీరు లీక్, ఓ చేత్తో గొడుగు పట్టుకుని మరో చేత్తో రైలు నడుపుతున్న లోకో పైలట్

Hazarath Reddy

సోషల్ మీడియాలో భారత రైల్వేకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రైలు లోకో పైలట్ క్యాబిన్ లో వర్షపు నీరు లీకేజి నుండి తడవకుండా ఉండేందుకు గొడుగు పట్టుకుని ఉన్నాడు. రైలు లోకో పైలట్ క్యాబిన్ లో వర్షపు నీరు లీక్ అవుతున్నట్లుగా వీడియోలో తెలుస్తోంది.

Telangana: పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడుని కాటేసిన మృత్యువు, భారీ వర్షాలకు ఓ చెట్టు కూలి మీద పడడంతో అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

ప్రమాదంలో జహంగీర్‌ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. యువకుడిని వచ్చే నెలలో పెళ్లి చేద్దామనుకున్నామని అంతలోపే ఇలా విధి చెట్టు రూపంలో కాటేసి కానరాని లోకాలకు తీసుకెళ్లిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యరు.

Telangana Shocker: సూర్యాపేటలో అమానుషం, ఆస్తి కోసం కూతుళ్ల ఫైట్, తల్లికి అంత్యక్రియలు చేయకుండా?, షాకింగ్ ఘటన

Arun Charagonda

మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. ఆస్తి కోసం రక్త సంబంధాన్ని లెక్కచేయడం లేదు. అది అన్న దమ్ములైన, అక్కా చెల్లెలైన, అన్నా చెల్లెలైన డబ్బు కోసం బంధాలను శాశ్వతంగా దూరం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఇప్పటివరకు మనం ఇలాంటి సంఘటనలను కోకొల్లలు చూశాం. కానీ సూర్యాపేటలో జరిగిన ఈ సంఘటన మాత్రం అందరిచేత కంటతడి పెట్టిస్తోంది.

Advertisement
Advertisement