Kiren Rijiju Accident: కేంద్రమంత్రి కిరణ్ రిజుజు కారుకు తృటిలో తప్పిన ముప్పు, జమ్మూకశ్మీర్ పర్యటనలో రిజుజు కారును ఢీకొట్టిన   ట్రక్కు
Kiren Rijiju Car Accident (PIC @ PTI News & Facebook)

Srinagar, April 08:  కేంద్ర మంత్రి కిరణ్ రిజుజుకు (Kiren Rijiju) తృటిలో భారీ ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును ఒక ట్రక్కు ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఆయనకు ఎలాంటి హాని జరగలేదు. జమ్మూ కశ్మీర్ పర్యటనలో ఉన్న ఆయన కారును శనివారం రాంబన్ జిల్లాలో శ్రీనగర్- జమ్మూ జాతీయ రహదారిపై (Jammu to Srinagar) వెళ్తుండగా ఒక ట్రక్కు ఢీకొట్టింది. ఆయనే కాకుండా కారులో ఉన్నవారంతా క్షేమంగానే ఉన్నట్లు తెలిసింది. జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

దీనికి ముందు కిరణ్ రిజిజు తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ న్యాయ సేవల శిబిరానికి హాజరయ్యేందుకు ఉద్దాంపూర్ వెళ్తున్నట్లు ట్వీట్ చేశారు. దారిలో కారులో రోడ్డు ప్రయాణాన్ని వీడియో తీసి, దాన్ని ట్విట్టర్‭లో షేర్ చేశారు. ‘‘జమ్మూ కశ్మీర్ లోని ఉద్దాంపూర్లో  నిర్వహించే న్యాయ సేవల శిబిరానికి హాజరయ్యేందుకు వెళ్తున్నాను. ప్రయాణం అంతా అందమైన రహదారిని ఆనందించవచ్చు’’ అని రాసుకొచ్చారు.