Uttar Pradesh Shocker: కుటుంబ సభ్యులు మొబైల్ తీసుకున్నారని ఇద్దరు బాలికలు ఉరివేసుకుని ఆత్మహత్య, ఉత్తరప్రదేశ్లో విషాదకర ఘటన
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ జిల్లాలో 16, 14 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు బాలికలు తమ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు, వారి కుటుంబాలు తమ మొబైల్ ఫోన్లను ఎత్తుకెళ్లారని మనస్తాపంతో వారు ప్రాణాలు తీసుకున్నారు.
Two Cousins Die by Suicide in Aligarh : ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ జిల్లాలో 16, 14 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు బాలికలు తమ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు, వారి కుటుంబాలు తమ మొబైల్ ఫోన్లను ఎత్తుకెళ్లారని మనస్తాపంతో వారు ప్రాణాలు తీసుకున్నారు.ఈ సంఘటన బార్లా పోలీస్ సర్కిల్ పరిధిలోని ఫజల్పూర్ గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.
ఇద్దరు బాలికలు రైతుల కుటుంబాలకు చెందిన వారు. పాఠశాల మానేసినట్లు అధికారులు తెలిపారు. ఫోన్లో టచ్లో ఉన్న గుర్తుతెలియని వ్యక్తి వారిని ఆత్మహత్యకు ప్రేరేపించాడని కుటుంబీకులు పేర్కొన్నారు. తాళం వేసి ఉన్న గదిలో వారి మృతదేహాలు కనిపించడంతో కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు.
(The above story first appeared on LatestLY on Jul 17, 2023 05:58 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

