రాజకీయాలు

Prashant Kishor: ప్ర‌ధాని మోదీ వ్యాఖ్య‌ల‌కు జ‌నం ఆక‌ర్షితులు కావొద్దు, ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు, ఈ ఎన్నికలు 2024ను డిసైడ్ చేయలేవని తెలిపిన ఎన్నిక‌ల వ్యూహాక‌ర్త

Hazarath Reddy

ఇవాళ త‌న ట్విట్ట‌ర్‌లో స్పందించిన ప్ర‌శాంత్ కిషోర్‌.. 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల పోరు ఆ ఏడాదిలోనే డిసైడ్ అవుతుంద‌ని, కానీ రాష్ట్రాల‌ ఎన్నిక‌ల ఫ‌లితాల ఆధారంగా 2024ను నిర్ణ‌యించ‌లేర‌న్నారు. ఈ విష‌యం సాహెబ్‌కు తెలుసు అని, కానీ రాష్ట్రాల‌ ఎన్నిక‌ల ఫ‌లితాల ఆధారంగా త‌మ పార్టీ వైపు అంద‌ర్నీ మ‌ళ్లించేందుకు ప్ర‌ధాని ఓ తెలివైన ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని, ప్రతిప‌క్షాల‌పై నిర్ణ‌యాత్మ‌క సైకాల‌జిక‌ల్ అడ్వాంటేజ్ తీసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు ఆరోపించారు.

Assembly Election Results 2022: నాలుగు రాష్ట్రాలు బీజేపీ ఖాతాలోకి, పంజాబ్ ఆప్ ఖాతాలోకి, ఏయే రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయో పూర్తి వివరాలు ఇవే..

Hazarath Reddy

ప్రధాని మోదీ సారథ్యంలోని కమలం మళ్లీ విరబూసింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో జయకేతనం ఎగురవేసింది. ఉత్తరప్రదేశ్​, ఉత్తరాఖండ్​, మణిపూర్​, గోవాలో విజయఢంకా మోగించింది. 2024 లోక్​సభ ఎన్నికలకు సెమీఫైనల్స్​గా భావిస్తున్న ఈ ఎలక్షన్స్​లో (Assembly Election Results 2022) బీజేపీ సత్తా చాటింది.

UP Election Results 2022: లఖింపూర్‌ ఖేరీలో బీజేపీ క్లీన్ స్వీప్, రైతుల నిరసనలు ఏమయ్యాయని ప్రతిపక్షాలు షాక్, పార్టీ గెలిచినా అక్కడ యూపీ డిప్యూటీ సీఎంతో సహా 11మంది రాష్ట్ర మంత్రులు ఘోర పరాజయం

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో (UP Election Results 2022) బీజేపీ 273 సీట్లను కైవసం చేసుకొని విజయదుందుభి మోగించింది. అయితే యూపీతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన లఖింపూర్‌ ఖేరీ ఘటన (BJP wins all 8 seats in Lakhimpur Kheri district), ఆ రాష్ట్రంలోని అధికార బీజేపీపై ఎలాంటి ప్రభావం చూపలేదు.

Labh Singh Ugoke And Jivanjot Kaur : పంజాబ్ సీఎంను ఓడించిన వ్యక్తి ఎవరో తెలుసా? మొబైల్ షాప్ లో పనిచేసే వ్యక్తి, సిద్దూను మట్టికరిపించిన మహిళ ప్రత్యేకత ఇదే! ఉద్దండులను ఓడించిన ఆప్ సామాన్యులు వీళ్లే

Naresh. VNS

దేశమంతా పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Admi Party) విజయం గురించే మాట్లాడుకుంటోంది. కానీ పంజాబ్ మాత్రం ఆ ఇద్దరి వైపు చూస్తోంది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేసిన హేమాహేమీలు మట్టికరిచారు. రెండు స్థానాల నంచి బరిలోకి దిగిన సీఎం చరణ్ జిత్ సింగ్ (Charnjit singh Channi) చన్నీ...రెండు చోట్లా ఓటమిపాలయ్యారు. అయితే ఆయన్ను ఓడించిన లాభ్ సింగ్ ఇప్పుడు పంజాబ్ లో హాట్ టాపిక్ గా మారారు.

Advertisement

Uttar Pradesh Election Results 2022: యూపీలో బీజేపీ దండయాత్ర, పూర్తయిన కౌంటింగ్, 273 స్థానాల్లో బీజేపీ కూటమి ఘన విజయం, హోలీ ముందే వచ్చిందన్న మోడీ

Naresh. VNS

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పూర్తి ఫలితాలు(UP Election Final Result) వచ్చేశాయి. ఈ సారి యూపీలో బీజేపీ (BJP) దండయాత్ర చేసింది. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గాను 273 స్థానాల్లో కమలం వికసించింది.మొత్తం 403 అసెంబ్లీ సీట్లు క‌లిగిన యూపీ అసెంబ్లీ (UP Assembly)ఎన్నిక‌ల కౌంటింగ్ గురువారం ఉద‌యం నుంచి రాత్రి దాకా కొన‌సాగింది.

Assembly Election Results 2022: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం, ఐదు రాష్ట్రాల్లో విజయోత్సవాలపై నిషేధం ఎత్తివేత

Hazarath Reddy

దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఎంత కీలకంగా మారాయో తెలిసిందే. అయితే ఇంత ముఖ్యమైన ఎన్నికల ఫలితాల సమయంలో వేడుకలు చేసుకోవడానికి వీల్లేదని ఎన్నికల సంఘం (EC) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఫలితాలు (Assembly Election Results 2022) వెలువడుతున్న గురువారం నాడు పార్టీలకు ఈసీ గుడ్ న్యూస్ చెప్పింది.

UP Election Results 2022: యోగీ దెబ్బకు పాత రికార్డులన్నీ బద్దలు, వరుసగా రెండో సారి ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించనున్న యోగీ ఆదిత్యనాథ్

Hazarath Reddy

ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీలో మరింత ఉత్సాహాన్ని నింపాయి. అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవడం బీజేపీకి కలిసొచ్చే అంశం. పంజాబ్‌ మినహా మిగతా రాష్ట్రాల్లోనూ తమ పార్టీకి సానుకూల ఫలితాలు (UP Election Results 2022) రావడంతో కమలనాథులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.

Punjab Election Results 2022: ఆమ్ ఆద్మీ చేతిలో చిత్తయిన కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్‌, అజిత్ పాల్ సింగ్ కొహ్లీ చేతిలో ఓట‌మి పాలైన పంజాబ్‌ మాజీ సీఎం

Hazarath Reddy

పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్‌కు గ‌ట్టి షాక్ త‌గిలింది. ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓట‌మి పాల‌య్యారు. పాటియాలా నుంచి బ‌రిలోకి దిగిన ఆయ‌న… ఆప్ అభ్య‌ర్థి చేతిలో ఓట‌మి పాల‌య్యారు. అజిత్ పాల్ సింగ్ కొహ్లీ చేతిలో ఓట‌మి పాల‌య్యారు. కాంగ్రెస్‌లో చాలా కాలం పాటు కొన‌సాగారు.

Advertisement

Election Results 2022: ఈవీఎం ట్యాంపరింగ్‌ అనే సమస్యే లేదు, ఎన్నికల సంఘం ఏ రాజకీయ పార్టీ తొత్తు కాదు. ప్రతి రాజకీయ పార్టీ సమానమే, ఈవీఎం ట్యాంపరింగ్‌ ఆరోపణలపై స్పందించిన సీఈసీ సుశీల్ చంద్ర

Hazarath Reddy

ఈవీఎం ట్యాంపరింగ్‌ ఆరోపణలపైనా సీఈసీ స్పందించారు. ఈవీఎం ట్యాంపరింగ్‌ అనే సమస్యే లేదు. 2004 నుండి EVMలు నిరంతరం ఉపయోగించబడుతున్నాయి. 2019 నుండి మేము ప్రతి పోలింగ్ బూత్‌లో VVPATని ఉపయోగించడం ప్రారంభించాము. రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలకు సీల్‌ వేశారని తెలిపారు.

Punjab Election Results 2022: పంజాబ్‌లో వ‌న్‌మ్యాన్ షో, హేమాహేమీలకు షాక్ ఇచ్చిన అరవింద్ కేజ్రీవాల్, ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఆమ్ ఆద్మీ పార్టీ, 89 స్థానాల్లో లీడింగ్‌లో ఆప్

Hazarath Reddy

పంజాబ్‌లో ఇతర పార్టీలను ఆమ్ ఆద్మీ ఊడ్చేసింది. వ‌న్‌మ్యాన్ షో ప్ర‌ద‌ర్శించింది. ఆమ్‌ఆద్మీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకుపోతోంది. మ్యాజిక్‌ ఫిగర్‌ 59 కంటే ఎక్కువ స్థానాల్లో (Punjab Election Results 2022) ఆధిక్యంలో కొనసాగుతోంది.

Uttar Pradesh Assembly Election Results 2022: అఖిలేష్ యాదవ్‌కు రెండో సారి కూడా దక్కని విజయం, తండ్రి వ్యూహాలను పక్కన పెట్టడమే కొంప ముంచిందా, సమాజ్‌వాదీ పార్టీ ఓటమికి కారణాలు ఇవే..

Krishna

2012 ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ గెలిచింది. అయితే ఆ గెలుపు తన వల్లనేనన్న భ్రమలో ఉన్న అఖిలేష్ యాదవ్ కుటుంబాన్ని పక్కన పెట్టారు. సొంత బాబాయిని దూరం చేసుకున్నారు. ములాయంను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. ఈసారి ఎన్నికల్లో గెలుపు తనదేనని బలంగా విశ్వసించిన అఖిలేష్ కు నిరాశే ఎదురయింది.

Uttar Pradesh Assembly Election Results 2022: యూపీలో గోరఖ్ పూర్ అర్బన్ నుంచి యోగి ఆదిత్యనాథ్ ముందంజ, కర్హాల్ నుంచి అఖిలేష్ యాదవ్ ముందంజ...

Krishna

దేశ వ్యాప్తంగా అందరి చూపు ఉత్తరప్రదేశ్‌పైనే ఉంది. ఇక గోరఖ్‌పూర్‌ అర్బన్‌ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా మొదటిసారి యోగి ఆదిత్యానాథ్‌ ప్రస్తుతం ముందంజలో ఉన్నారు. ఇక ఆయన సమీప అభ్యర్థిగా ఎస్పీ నుంచి సుభావతి శుక్లా పోటీ చేస్తున్నారు.

Advertisement

Assembly Election Results 2022: 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ కు భారీ నష్టం, పంజాబ్ లో చేజేతులా పోగొట్టుకున్న అధికారం, ఉత్తరాఖండ్, గోవాలో అధికారానికి దూరం..

Krishna

ఉత్తర్ ప్రదేశ్ లో గత మూడేళ్లుగా ప్రియాంక గాంధీ స్వయంగా రంగంలోకి దిగి పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేశారు. ఊరూరా తిరిగి పార్టీ శ్రేణులను ఉత్తేజపర్చారు. కానీ ఆ శ్రమ ఫలితాల్లో కన్పించలేదు. యూపీ ప్రజలు కాంగ్రెస్ ను నమ్మలేదు.

UP Assembly Election Results 2022: ఉత్తర్ ప్రదేశ్ లో మరోసారి అధికారం దిశగా బీజేపీ పయనం, మ్యాజిక్ ఫిగర్ దాటేసిన యోగీ సర్కార్, వెనుకంజలో సమాజ్ వాదీ పార్టీ

Krishna

ఉత్తర్ ప్రదేశ్ లో మరోసారి బీజేపీ అధికారం దిశగా పయనిస్తుంది. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను దాటి ఆధిక్యంలో కొనసాగుతుంది. బీజేపీ మొత్తం 221 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఉత్తర్ ప్రదేశ్ లో మొత్తం 403 స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్ 202.

Punjab Election Results 2022: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ దూకుడు, 64 స్థానాల్లో ముందంజలో దూసుకుపోతున్న కేజ్రీవాల్ పార్టీ, అధికార ఏర్పాటుకు 59 సీట్లు అవసరం

Hazarath Reddy

తాజా న్యూస్ ప్రకారం పంజాబ్ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతోంది. మొత్తం 117 స్థానాలకు గాను 64 స్థానాల్లో ఆప్ ముందంజలో ఉంది. అక్కడ అధికార ఏర్పాటుకు 59 సీట్లు అవసరం. అయితే ఈ సంఖ్యను ఆమ్ ఆద్మీ దాటేసి ముందుకు దూసుకుపోతోంది.

Rajasthan: మనది మగాళ్ల రాష్ట్రం, అందుకే అత్యాచారాల్లో అగ్రస్థానంలో ఉన్నాం, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజస్థాన్ మంత్రి శాంతి ధరివాల్‌

Hazarath Reddy

మనది మగాళ్ల రాష్ట్రం. అందుకే అత్యాచార కేసుల్లో దేశంలోనే మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నదని స్వయానా మంత్రే అసెంబ్లీలో ప్రకటించాడు. రేప్‌ కేసుల్లో దేశంలోనే రాజస్థాన్‌ (Rajasthan) మొదటి స్థానంలో ఉందని ఆ రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శాంతి ధరివాల్‌ అసెంబ్లీలో ( minister Shanti Dhariwal in assembly) ప్రకటించారు.

Advertisement

UP Elections Results 2022: యోగి ఆదిత్యనాథ్ వైపే మొగ్గుచూపుతున్న సర్వేలు, మళ్లీ యూపీలో బీజేపీదే అధికారమంటున్న ఎగ్జిట్ పోల్స్, 403 అసెంబ్లీ స్థానాలకు ప్రారంభమైన కౌంటింగ్

Hazarath Reddy

ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. గోవా, మణిపూర్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (UP Elections Results 2022) ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Uttarakhand Assembly Election Results 2022: బీజేపీ, కాంగ్రెస్‌ మధ్యే గట్టి పోటీ, 70 అసెంబ్లీ స్థానాలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 36 సీట్లు అవసరం

Hazarath Reddy

హోరాహోరీగా సాగిన ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ మరోసారి గట్టెక్కేందుకు పరిస్థితులు అంత సులభంగా లేనట్టు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు చెప్తున్నాయి. కాంగ్రెస్‌ గతంలో కంటే మరింత పుంజుకునే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

Goa Assembly Election Results 2022: గోవాలో కింగ్ మేకర్ ఎవరు కాబోతున్నారు, 40 స్థానాలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు, ప్రధాన పోటీ కాంగ్రెస్‌, బీజేపీ మధ్యనే..

Hazarath Reddy

మొత్తం 40 స్థానాలున్న రాష్ట్రలో అధికారాన్ని చేపట్టేందుకు 21 సీట్లు రావాల్సి ఉంది. అయితే గోవాలో ఎగ్జిట్‌ ఫోల్‌ ఫలితాలు మిగతా రాష్ట్రాల కంటే భిన్నంగా ఉన్నాయి. ఈసారి ఎన్నికల్లో ఆప్ రంగంలోకి దిగడంతో ఇక్కడ హంగ్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెబుతున్నాయి.

Manipur Assembly Election Results 2022: మణిపూర్‌లో కమలం Vs కాంగ్రెస్‌, మళ్లీ అధికారంలోకి బీజేపీ వస్తుందని చెబుతున్న సర్వేలు, ప్రారంభమైన ఓట్ల లెక్కింపు

Hazarath Reddy

మణిపూర్‌లో 60 సీట్లకు రెండు విడతల్లో ( ఫిబ్రవరి 28, మార్చి 5) పోలింగ్ నిర్వహించారు. మొత్తం 60 సీటల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 31 సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పీపుల్స్‌ అనే సంస్థ బీజేపీ 25 నుంచి 29 స్థానాల వరకు గెలుచుకోనున్నట్లు తెలిపింది.

Advertisement
Advertisement