Politics

CM Jagan Writes to PM Modi: ప్రధాని గారు..వెంటనే ఏపీకి ఆక్సిజన్ కేటాయించండి, 910 టన్నుల ఆక్సిజన్‌ను కేటాయించాలని పీఎం మోదీకి లేఖ రాసిన ఏపీ సీఎం, కోవాగ్జిన్‌ ఉత్పత్తి పెంచాలని సూచన

Hazarath Reddy

రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత నేపథ్యంలో ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS jagan Mohan Reddy) ప్రధాని నరేంద్ర మోదీకి (PM Narendra Modi) లేఖ రాశారు. అవసరమైన మేరకు ఆక్సిజన్‌ను కేటాయించి కరోనా (Coronavirus)మహమ్మారిని ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని లేఖలో (CM Jagan writes to PM Modi) విజ్ఞప్తి చేశారు.

Himanta Biswa Sarma Sworn-In: అసోం సీఎంగా హిమంత విశ్వ శర్మ ప్రమాణస్వీకారం, ఆయనతో ప్రమాణం చేయించిన గవర్నర్‌ జగదీశ్‌ ముఖి, హాజరైన పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ నేతలు

Hazarath Reddy

అసోం రాష్ట్ర ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ నేడు ప్రమాణ స్వీకారం (Himanta Biswa Sarma Sworn-In) చేశారు. గవర్నర్‌ జగదీశ్‌ ముఖి ఆయనతో ప్రమాణం చేయించారు. హిమంత బిశ్వ‌శ‌ర్మ (Himanta Biswa Sarma) అసోంకి 15వ ముఖ్య‌మంత్రిగా కొన‌సాగ‌నున్నారు. ఈ ప్ర‌మాణ స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మానికి బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, త్రిపుర, మేఘాలయ, మణిపూర్‌, నాగాలాండ్ సీఎంలు బిప్లవ్‌ దేవ్‌, కాన్రాడ్‌ సంగ్మా, బీరేన్‌ సింగ్‌, నేపియూ రియో హాజ‌ర‌య్యారు.

Himanta Biswa Sarma: అస్సాం కొత్త ముఖ్య‌మంత్రిగా హిమంత బిశ్వ శ‌ర్మ, ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసిన స‌ర్బానంద సోనోవాలే, హిమంత‌ను బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ లీడ‌ర్‌గా ప్రకటించిన కేంద్ర మంత్రి తోమర్

Hazarath Reddy

ఈశాన్య రాష్ట్రం అస్సాం కొత్త ముఖ్య‌మంత్రిగా హిమంత బిశ్వ శ‌ర్మ (Himanta Biswa Sarma) ప్ర‌మాణం చేయ‌నున్నారు. బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ లీడ‌ర్‌గా హిమంత‌ను ఎన్నికైన‌ట్లు కేంద్ర మంత్రి, బీజేపీ నేత న‌రేంద్ర సింగ్ తోమార్ వెల్ల‌డించారు.

Putta Madhu Arrested: పెద్ద‌ప‌ల్లి జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ పుట్ట మ‌ధు అరెస్ట్, భీమ‌వ‌రంలో అదుపులోకి తీసుకున్న రామ‌గుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు, వామ‌న్ రావు దంప‌తుల హ‌త్య కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న మధు

Hazarath Reddy

పెద్ద‌ప‌ల్లి జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ పుట్ట మ‌ధును రామ‌గుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు (Peddapalli zilla parishad chairman Putta Madhu arrested) చేశారు. గ‌త వారం రోజులుగా పుట్ట మ‌ధు అదృశ్య‌మైన సంగ‌తి తెలిసిందే. భీమ‌వ‌రంలో పుట్ట మ‌ధును అరెస్టు (Putta Madhu Arrested) చేసిన పోలీసులు.. పెద్ద‌ప‌ల్లి జిల్లాకు తీసుకొచ్చారు.

Advertisement

Delhi Restrictions: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చే వారిపై దిల్లీ ప్రభుత్వం ఆంక్షలు, 14 రోజుల సంస్థాగత క్వారైంటైన్ వెళ్లాలని ఉత్తర్వులు జారీ

Team Latestly

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుంచి దిల్లీ వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించారు. తెలుగు రాష్ట్రాల నుంచి దిల్లీ వచ్చేవారు కచ్చితంగా 14 రోజుల పాటు తమ సంస్థాగత క్వారైంటైన్ కేంద్రాలకు వెళ్లాలని దిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చిన వారు...

Andhra Pradesh: ఏలూరు కార్పోరేషన్ ఎన్నికల కౌంటింగ్‌కు ఏపి హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్; సంగం డెయిరీపై ప్రభుత్వం ఇచ్చిన జీవో నిలిపివేత, మరోవైపు సీఎం జగన్ బెయిల్ రద్దుపై విచారణ వాయిదా

Team Latestly

. ఇక్కడ 56.86 శాతం పోలింగ్ నమోదైంది. తాజాగా విచారణ చేపట్టిన హైకోర్టు ఫలితాలు వెల్లడించవచ్చునని ఉత్తర్వులు ఇచ్చింది. ఇక, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నీలం సాహ్ని కౌంటింగ్ కు ఏర్పాట్లు చేయడమే మిగిలి ఉంది....

MK Stalin Takes Oath as CM: 'స్టాలిన్ అనే నేను తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను' తమిళనాడు 14వ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన డీఎంకే అధినేత ఎం.కే స్టాలిన్

Vikas Manda

EC Defers By-polls: కరోనా ఉధృతి దృష్ట్యా ఉప ఎన్నికలను వాయిదా వేసిన కేంద్ర ఎన్నికల సంఘం, దేశవ్యాప్తంగా 3 పార్లమెంట్ సహా 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరగాల్సిన ఎన్నికలు వాయిదా

Team Latestly

ఎన్నికలే దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తికి కారణమయ్యాయని విమర్శలు ఉన్నాయి. మద్రాస్ హైకోర్ట్ అయితే నేరుగా తమిళనాడులో కరోనా కేసులు పెరగడానికి ఎన్నికల సంఘమే కారణం అని నిందించింది. ఈ క్రమంలో అప్రమత్తమైన ఎన్నికల సంఘం, దేశవ్యాప్తంగా

Advertisement

RIP Ajit Singh: కరోనాతో కేంద్ర మాజీమంత్రి, ఆర్ఎల్డీ అధినేత అజిత్ సింగ్ కన్నుమూత, రాష్ట్రపతి రామ్ నాథ్, ప్రధాని మోదీ సహా ప్రముఖుల సంతాపం

Vikas Manda

కోవిడ్ -19 సమస్యలతో పోరాడుతూ కేంద్ర కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్రీయ లోక్ దళ్ ప్రెసిడెంట్ చౌదరి అజిత్ సింగ్ మే 6న, గురువారం కన్నుమూశారు. ఆయన వయసు 82 ఏళ్లు. అజిత్ సింగ్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సహా దేశవ్యాప్తంగా ఎంతోమంది రాజకీయ ప్రముఖులు ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు.

Telangana: తెలంగాణ వ్యాప్తంగా ఔట్ పేషెంట్ సేవల ఏర్పాటు, ఇంటింటి సర్వే.. లక్షణాలు ఉంటే కిట్ల పంపిణీ; వ్యాక్సిన్ సరఫరాకు అనుగుణంగా 45 ఏళ్లలోపు వారికి టీకా!

Team Latestly

జీహెచ్ఎంసీ తరహా లోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటిలో ప్రతి 1000 జనాభాకు ఒక బృందాన్ని ఏర్పరుచుకొని, ప్రజల ఇండ్ల వద్దకే వెళ్లి అవుట్ రీచ్ కార్యక్రమాన్ని చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు సీఎస్ తెలిపారు. ఈ టీంలు వారి ఆరోగ్య పరిస్థితిని మానిటర్ చేస్తాయని, ఎవరైనా లక్షణాలు కనబరిస్తే వారికి అక్కడిక్కడే మెడికల్ కిట్లను అందచేస్తారని....

Mamata Banerjee Swearing-in Ceremony: పశ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రిగా మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌మాణ స్వీకారం, బెంగాలీలో ప్ర‌మాణస్వీకారం చేసిన దీదీ, కొత్తగా ఎన్నికైన సభ్యులు మే 6 న అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం

Hazarath Reddy

టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ ముచ్చటగా మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం (Mamata Banerjee Swearing-in Ceremony) చేశారు. కోల్‌కతాలోని రాజ్‌భ‌వన్‌లో బుధవారం గవర్నర్ జగదీప్ ధన్‌కర్ ఆమెచేత ప్రమాణ స్వీకారం చేయించారు. కోవిడ్ ప్రోటోకాల్ కారణంగా మమతా బెన‌ర్జీ ప్రమాణ స్వీకార కార్యక్రమం (Mamata Banerjee Takes Oath As the Chief Minister of West Bengal ) చాలా సాదాసీదాగా జరిగింది.

Kangana Ranaut: అకౌంట్ సస్పెండ్, ట్విట్టర్‌పై విరుచుకుపడిన కంగనా రనౌత్‌, తెల్ల తోలు ఉన్నోళ్లు గోధుమ రంగు వారిని బానిసలుగా చూస్తారంటూ విమర్శ, సినిమాల ద్వారా గొంతును వినిపిస్తానని తెలిపిన బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌

Hazarath Reddy

ఎప్పుడూ వివాదాల్లో నానుతూ ఉండే బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ అకౌంట్‌ను ట్విట్టర్ సస్పెండ్‌ (Kangana Ranaut's Twitter account suspended) చేసిన సంగతి విదితమే. నిబంధనలకు విరుద్ధంగా వరుస ట్వీట్లు చేసినందునే ఆమె అకౌంట్‌ను రద్దు (Kangana Ranaut Twitter suspended) చేసింది. ట్విట్టర్‌లో తన అధికారిక ఖాతాను శాశ్వతంగా సస్పెండ్ చేయడం పట్ల బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

West Bengal Post-Poll Violence: బెంగాల్‌లో భారీ హింసాకాండ, ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని, రేపు దేశ వ్యాప్త ధర్నా చేయనున్న బీజేపీ, మే 5న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న మమతాబెనర్జీ

Hazarath Reddy

ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల ఫ‌లితాల అనంతరం బెంగాల్‌లో భారీ హింసాకాండ (West Bengal Post-Poll Violence) చెలరేగిన సంగతి విదితమే. ఈ హింస‌లోదాదాపు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా ఈ హింస‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆందోళ‌న (PM Narendra Modi Expressed Serious Anguish) వ్య‌క్తం చేశారని గ‌వ‌ర్న‌రే ట్విట‌ర్ ద్వారా వెల్ల‌డించారు.

Fact Check: కరోనాతో మరణిస్తే కేంద్రం నుంచి రూ. 2 లక్షలు, వైరల్ అవుతున్న మెసేజ్‌ అంతా అబద్దం, ఫ్యాక్ట్ చెక్ ద్వారా నిర్ధారణ, ఈ ఫేక్ మెసేజ్ గురించి ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. మీ బంధుమిత్రుల్లో ఎవరైనా కరోనావైరస్ సోకి మరణిస్తే (COVID-19 Deaths) ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన(పీఎంజెజెబీవై), ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన(పీఎంఎస్ బీవై) పథకాల కింద వారికి రెండు లక్షలు పరిహారం కేంద్రం ఇస్తున్నట్లు వాట్సాప్, ఇతర సోషల్ మీడియాలో మెసేజ్ తెగ వైరల్ అవుతుంది.

Lingojiguda Division Bypoll Result: లింగోజిగూడలో బీజేపీకి పరాభవం, ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ద‌ర్ప‌ల్లి రాజ‌శేఖ‌ర్ రెడ్డి విజయం, తాజా విజయంతో బల్దియాలో మూడుకు చేరిన కాంగ్రెస్ కార్పొరేటర్ల సంఖ్య

Hazarath Reddy

జీహెచ్ఎంసీ ప‌రిధిలోని లింగోజిగూడ డివిజ‌న్ ఉప ఎన్నిక ఫ‌లితం (Lingojiguda Division Bypoll Result) వెలువ‌డింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. లింగోజిగూడ డివిజన్‎లో ( Lingojiguda division) జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు.

Puducherry Election Results 2021: పుదుచ్చేరి సీఎం ఆయనేనా? అత్యధిక సీట్లను కైవసం చేసుకున్న ఎన్‌డీఏ కూటమి, రంగస్వామికే ముఖ్యమంత్రి పదవి పగ్గాలు అప్పజెప్పే అవకాశం

Hazarath Reddy

కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిని ఎన్‌డీఏ కూటమి (NDA) సొంతం చేసుకుంది. ఆలిండియా ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ (NR Congress) నేతృత్వంలోని ఈ కూటమి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత ఎన్‌.రంగస్వామి పుదుచ్చేరి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం దాదాపు ఖాయమైపోయింది.

Advertisement

Assam Assembly Election Results 2021: అసోం మళ్లీ బీజేపీదే, కాంగ్రెస్ పార్టీకి రెండో సారి పరాభవం, 74 సీట్లు గెలుచుకున్న ఎన్డీఏ కూటమి, 52 స్థానాలతో సరిపెట్టుకున్న కాంగ్రెస్‌ మహాకూటమి

Hazarath Reddy

అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో (Assam Assembly Election Results 2021) బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ (NDA) వరుసగా రెండోసారి విజయదుందుభి మోగించింది. 126 స్థానాలున్న అసెంబ్లీలో 74 సీట్లు గెలుచుకుంది. 2016 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే ఎన్డీఏకు స్వల్పంగా సీట్లు తగ్గాయి.

Kerala Assembly Elections Results 2021: మోదీ షాలను కేరళలో అడుగుపెట్టనివ్వని మొనగాడు, దశాబ్దాల చరిత్రను తిరగ రాసిన విజయన్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను మట్టికరిపిస్తూ ఏకపక్ష విజయాన్ని సాధించిన ఎల్‌డీఎఫ్‌

Hazarath Reddy

గడిచిన నాలుగు దశాబ్దాలుగా అధికార పార్టీ/కూటమికి రెండోసారి విజయం అనేది కలగానే మిగిలిపోయిన నేపథ్యంలో కేరళ సీఎం పినరయి విజయన్‌ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌ కూటమి చరిత్రను తిరగరాసింది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను (Kerala Assembly Elections Results 2021) నిజం చేస్తూ విపక్ష యూడీఎఫ్‌ కూటమిపై స్పష్టమైన మెజారిటీని సాధించింది.

West Bengal Election Results 2021: దీదీ దెబ్బకు మూడు పార్టీలు అవుట్, బెంగాల్లో కనుమరుగైన కాంగ్రెస్, వామపక్షాలు, మోదీ షా ద్వయానికి పశ్చిమ బెంగాల్లో చుక్కెదురు, ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ హ్యాట్రిక్

Hazarath Reddy

ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు తల్లకిందులు చేస్తూ..పశ్చిమ బెంగాల్లో సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) హ్యాట్రిక్‌ కొట్టారు. తృణమూల్‌ కాంగ్రెస్‌కు (Trinamool Congress (TMC)ఒంటిచేత్తో వరుసగా మూడోసారి కూడా అప్రతిహత విజయాన్ని సాధించిపెట్టారు.

Tamil Nadu Assembly Election Results 2021: పదేళ్ల తరువాత ఉదయించిన సూర్యుడు, తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా స్టాలిన్.., ప్రభావం చూపని అధికార పార్టీ అన్నాడీఎంకే, భారీ ఓటమిని మూటగట్టుకున్న కమల్ పార్టీ

Hazarath Reddy

తమిళనాడులో సూర్యుడు ఉదయించాడు, అధికార పార్టీ అన్నా డీఎంకే-బీజేపీ కూటమిని చిత్తు చేస్తూ స్టాలిన్ అధ్వర్యంలోని డీఎంకే-కాంగ్రెస్ కూటమి ఘన విజయం (Tamil Nadu Assembly Election Results 2021) సాధించింది. మళ్లీ అధికారంలోకి రావాలనుకున్న అన్నాడీఎంకే ఆశలు చిత్తు చేస్తూ స్టాలిన్ (MK Stalin) ఏకపక్ష విజయాన్ని సాధించాడు

Advertisement
Advertisement