రాజకీయాలు

West Bengal Assembly Election Results 2021: కంగ్రాట్స్ దీదీ..మీకు పూర్తిగా సహకరిస్తాం, టీఎంసీ ఘనవిజయంపై శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, నందిగ్రామ్‌‌లో పరాజయం పాలైన మమతా బెనర్జీ, నీచ రాజకీయాలకే బీజేపీ ఓటమి అంటూ దీదీ ఫైర్

Hazarath Reddy

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘనవిజయం సాధించడంపై ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి ప్రధాని మోదీ అభినందలు (PM Narendra Modi Congratulates Mamata Banerjee) తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పశ్చిమబెంగాల్‌కు అన్నిరకాలుగా కేంద్రం సహాయ సహకారాన్ని (All Possible Support to the State) కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు.

Tirupati By Elections Results 2021: తిరుపతిలో 2019 రికార్డు బ్రేక్, 2 లక్షల 70 వేల 584 ఓట్ల మెజార్టీతో గెలిచిన వైసీపీ అభ్యర్థి గురుమూర్తి, ఫ్యాన్ ధాటికి రెండు, మూడు స్థానాలకే పరిమితం టీడీపీ, బీజేపీ-జనసేన

Hazarath Reddy

తిరుపతి ఉప ఎన్నికలో అధికార వైయస్సార్సీపీ ఘన విజయం సాధించింది. వైసీపీ నుంచి బరిలో నిలిచిన గురుమూర్తి (YCP Candidate Gurumurthy) సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీపై 2 లక్షల 70 వేల 584 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాగా 2019లో అధికార వైసీపీ అభ్యర్థి 2.28 లక్షల ఓట్ల మెజార్టీని సాధించగా ఈ ఉప ఎన్నికలో (Tirupati By Elections Results 2021) అది క్రాస్ అయింది.

Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం, వ్యూహకర్త పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన,రాజకీయాల్లో తాను విఫలమయ్యానని ప్రకటించిన ఎన్నికల వ్యూహకర్త

Hazarath Reddy

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ డబుల్‌ డిజిట్‌ కూడా సాధించదని పలుమార్లు సవాల్‌ చేసిన పీకే (Prashant Kishor) తాజా ఎన్నికల ఫలితాల సరళి నేథ్యంలో వ్యూహకర్త పదవి నుంచి తప్పుకుంటున్నట్లు (West Bengal Won Quitting This Space) ప్రకటించారు.

TRS Wins Sagar Assembly Seat: సాగర్‌లో గులాబీ రెపరెపలు, నోముల భగత్ విజయం, రెండో స్థానంలో జానారెడ్డి, గల్లంతయిన బీజేపీ, రౌండ్ల వారీగా ఫలితాలు ఇవే

Hazarath Reddy

తెలంగాణలోని నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ విజయం (TRS Wins Sagar Assembly Seat) సాధించారు. నాగార్జున సాగ‌ర్ గ‌డ్డ‌పై (Nagarjuna Sagar assembly) మ‌రోసారి గులాబీ జెండా రెపరెపలాడింది. టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ (nomula Bhagat) 18,449 ఓట్ల మెజార్టీతో గెలిచారు.

Advertisement

West Bengal Assembly Elections 2021: ఎదురులేని దీదీ, మ్యాజిక్ ఫిగర్ క్రాస్, బీజేపీ భారీగా వెనుకంజ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల అడ్రస్ గల్లంతు, నందిగ్రాంలో దూసుకుపోతున్న మమత, బీజేపీ ఓడిపోతే పూర్తి బాధ్యత తానే తీసుకుంటాన‌ని తెలిపిన పార్టీ రాష్ట్ర చీఫ్ దిలీప్ ఘోష్‌

Hazarath Reddy

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (West Bengal Assembly Elections 2021) ఉత్కంఠను రేపుతున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రజలంతా ఆ రాష్ట్రంలో ఎలాంటి ఫలితం వస్తుందన్న ఆసక్తిని కనపరుస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో అధికార టీఎంసీ (TMC), ప్రతిపక్ష బీజేపీ (BJP) హోరాహోరీగా తలపడిన సంగతి తెలిసిందే. తాజాగా అందిన సమాచారం ప్రకారం అధికార టీఎంసీ మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది.

Tamil Nadu Assembly Elections 2021: తమిళనాడులో భారీ మెజార్టీ దిశగా స్టాలిన్ డీఎంకే పార్టీ, వెనుకంజలో అధికార పార్టీ అన్నాడీఎంకే, స్వల్ప ఆధిక్యంలో దూసుకువెళుతున్న మక్కళ్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్‌హాసన్

Hazarath Reddy

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో (Tamil Nadu Assembly Elections 2021) డీఎంకే స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతోంది. ఇప్పటికే మ్యాజిక్‌ ఫిగర్‌(117)కు కావాల్సిన స్థానాలను దాటేసి ముందంజలో నిలిచింది. ఇక తమిళనాడులో డీఎంకేదే (DMK) అధికారం అంటూ సర్వేలన్నీ ఆ పార్టీకి పట్టం కట్టిన సంగతి తెలిసిందే.

Sagar Bypoll Result 2021: సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ లీడ్, గట్టి పోటీనిస్తున్న కాంగ్రెస్ పార్టీ, కనపడని బీజేపీ ప్రభావం, మధ్యాహ్నం 3 గంటల వరకు తుది ఫలితం వెలువడే అవకాశం

Hazarath Reddy

నాగార్జునసాగర్‌ శాసన సభ స్థానం ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ (Sagar Bypoll Result 2021) ఆదివారం ఉదయం 8 గంటకు నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రారంభమైంది. మొత్తం 25 రౌండ్లలో ఓట్ల లెక్కింపు మొదలైంది. నాలుగో రౌండ్‌లో 3457 ఓట్ల ఆధిక్యంలో భగత్ ముందంజలో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్య‌ర్థి భ‌గ‌త్‌కు తొలి రౌండ్‌లో 1,475 ఓట్లు, రెండో రౌండ్‌లో 2,216 ఓట్లు, మూడో రౌండ్‌లో 2,665 ఓట్ల‌ మెజార్టీతో ముందంజ‌లో ఉన్నారు.

Assembly Elections Results 2021: పశ్చిమ బెంగాల్‌లో దీదీ దూకుడు, గట్టి పోటీనిస్తున్న బీజేపీ, తమిళనాడులో దూసుకుపోతున్న స్టాలిన్, కేరళలో ముందంజలో అధికార పార్టీ, అసోంలో బీజేపీ ముందంజ, ప్రారంభమైన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కౌంటింగ్

Hazarath Reddy

పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాంతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి ఇటీవల పలు విడతలుగా జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, తెలంగాణలోని నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా మొదలైంది.

Advertisement

Mini Municipal Polls 2021: తెలంగాణలో ప్రారంభమైన మినీ మున్సిపల్ ఎన్నికలు, కరోనా నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేసిన ఈసీ, సాయంత్రం 5 వరకు జరగనున్న పోలింగ్, మే 3న ఫలితాల వెల్లడి

Team Latestly

గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట, సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్‌ మున్సిపాలిటీలతోపాటు పలు పురపాలక సంస్థల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి...

AP Politics: 'జగన్ ప్రభుత్వానికి మానవత్వమే లేదు.. అక్రమ కేసులపై కోర్టులో పోరాడతాం'! సీఐడి విచారణకు హాజరైన ఏపి మాజీ మంత్రి దేవినేని ఉమ, వైకాపా ప్రభుత్వంపై విమర్శలు

Team Latestly

తాను జైలుకెళ్లినా తన గొంతునొక్కలేరని, జగన్ అక్రమాలపై తాను ప్రశ్నిస్తూనే ఉంటానని దేవినేని ఉమ అన్నారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉందని విమర్శించారు. ధూళిపాల్ల నరేంద్ర చేసిన తప్పేంటని నిలదీశారు.....

Delhi NCT Bill: ఢిల్లీలో ఇక లెఫ్టినెంట్ గవర్నరే ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వ సవరణ చట్టం 2021ని అమల్లోకి తీసుకొచ్చిన కేంద్రం, గత నెలలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదం పొందిన సవరణ బిల్లు

Hazarath Reddy

దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఎన్నికైన ప్రభుత్వంపై లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్-జి) కు ప్రాధాన్యతనిచ్చే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ ప్రభుత్వం (సవరణ) చట్టం 2021 (Government of National Capital Territory of Delhi (Amendment) Act, 2021) నేటి నుంచి అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం ఇకపై ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో లెఫ్టినెంట్ గవర్నరే ‘ప్రభుత్వం’ ( 'Govt in Delhi Now Means Lt Governor') అవుతారు.

Second Wave in TS: ప్రాణాలు పోతుంటే ఛార్జీలు వసూలు చేసేది అదొక ప్రభుత్వమా? కేంద్రంపై టీఎస్ మంత్రి మండిపాటు; తెలంగాణలో కొత్తగా 8,061 పాజిటివ్ కేసులు నమోదు

Team Latestly

భారతదేశం ప్రపంచంలోనే ఒక బలమైన ఆర్థిక శక్తి, తలుచుకుంటే తమ దేశ ప్రజల కోసం ఎంతో చేయొచ్చు. మరోవైపు ఇతర దేశాలు కూడా సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అలాంటప్పుడు....

Advertisement

Haryana CM Khattar: కరోనాతో చనిపోయిన వారు మళ్లీ బతకరు, ఆ మరణాలపై ఆందోళన ఎందుకు, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

Hazarath Reddy

క‌రోనా వైర‌స్ సెకండ్ వేవ్ పలువురి ప్రాణాల‌ను హ‌రిస్తూ ప్రాణాంతకంగా మారిన నేపథ్యంలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ (Haryana Chief Minister Manohar Lal Khattar) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోవిడ్-19 సంబంధిత మరణాల గురించి ఆందోళన చెందడంలో (no point debating death data) అర్థం లేదన్నారు

EC Bans Victory Processions: రాజకీయ పార్టీలు సంబరాలు చేసుకుంటే కఠిన చర్యలు తప్పవు, ఎన్నికల విజయోత్సవ ర్యాలీలపై నిషేధం విధించిన ఈసీ, కోవిడ్ కల్లోలం నేపథ్యంలో కీలక నిర్ణయం

Hazarath Reddy

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మే 2న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చేటప్పుడు గానీ... వచ్చిన తర్వాత గానీ... రాజకీయ పార్టీలు సంబరాలు చేయడానికి వీల్లేదని (EC Bans Victory Processions) ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.

West Bengal Assembly Elections 2021 Phase 7: ఓ వైపు కరోనా కల్లోలం..మరోవైపు బెంగాల్‌లో మొదలైన ఏడో దశ ఎన్నికల పోలింగ్, మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్‌, మే 2న ఎన్నికల ఫలితాలు

Hazarath Reddy

పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ఏడో దశ పోలింగ్ (West Bengal Assembly Elections 2021 Phase 7) సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు తరలివస్తున్నారు. మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో (34 Vidhan Sabha Seats) ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. ఏడో దశ ఎన్నికల పోటీలో 268 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

Tamil Nadu: ఏపీ, తెలంగాణకు ఆక్సిజన్ మళ్లింపు వద్దు, ప్రధాని మోదీకి లేఖ రాసిన తమిళనాడు ముఖ్యమంత్రి, రాష్ట్రంలో తీవ్ర సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని లేఖలో తెలిపిన సీఎం కె పళనిస్వామి

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాలకు రాష్ట్రాలకు తమిళనాడు నుంచి 80 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ మళ్లింపును నిలిపివేయాలని (Tamil Nadu wants diversion of oxygen) ప్రధాని నరేంద్ర మోదీకి తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ఆదివారంనాడు విజ్ఞప్తి చేశారు. ఆక్సిజన్ డిమాండ్ పెరగడం దృష్ట్యా దీనిని వెంటనే నిలిపివేయాలని (stopped immediately) తమిళనాడు ముఖ్యమంత్రి కె పళనిస్వామి (Tamil Nadu Chief Minister E Palaniswami) ప్రధానికి లేఖలో రాశారు.

Advertisement

'Need Solution': అనవసర ప్రసంగాలు వద్దూ.. పరిష్కారం చూపండి! ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు; ఒకే దేశం - ఒకే పన్ను అన్న మోదీ, వ్యాక్సిన్ కూడా ఒకే ధరకు ఎందుకివ్వరు? అని ప్రశ్నించిన టీఎస్ మంత్రి కేటీఆర్

Vikas Manda

రాహుల్ గాంధీ, ప్రస్తుతం తాను హోం క్వారైంటైన్ లో ఉన్నానని, అయితే దేశం నలుమూలల నుంచి ఎన్నో విషాదగాథలు వింటున్నట్లు చెప్పుకొచ్చారు. నేడు భారతదేశం కోవిడ్ సంక్షోభం వల్ల కాకుండా, ప్రభుత్వ విధానాల వల్ల నష్టపోయిందని రాహుల్ అన్నారు....

Manmohan Singh Covid: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌‌కు కరోనా, ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స, ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో కొనసాగుతున్న చికిత్స్

Hazarath Reddy

మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మన్మోహన్‌ సింగ్‌ కరోనా బారిన పడ్డారు. సోమవారం నాడు కరోనా పరీక్షలు నిర్వహించగా ఆయనకు పాజిటివ్‌గా (Manmohan Singh Covid) తేలింది. దీంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రిలో అడ్మిట్‌ అయ్యారు. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఆయన చికిత్స పొందుతున్నారు.

Delhi Lockdown: దేశ రాజధానిలో 6 రోజుల పాటు పూర్తి స్థాయి లాక్‌డౌన్, రాత్రి కర్ఫ్యూని లాక్‌డౌన్‌గా మార్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీలో కొనసాగుతున్న నాలుగో వేవ్‌

Hazarath Reddy

దేశ రాజ‌ధాని ఢిల్లీలో లాక్‌డౌన్ ప్ర‌క‌టించారు. ఏడు రోజుల పాటు క‌ఠిన రీతిలో లాక్‌డౌన్ (Delhi Lockdown) అమ‌లు చేయ‌నున్న‌ట్లు ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ వెల్ల‌డించారు. ఇవాళ ‌రాత్రి 10 గంట‌ల నుంచి వ‌చ్చే సోమ‌వారం ఉద‌యం 5 గంటల వ‌ర‌కు లాక్‌డౌన్ (Lockdown in Delhi) అమ‌లులో ఉంటుంద‌న్నారు.

Shiv Sena MLA Sanjay Gaikwad: వైరస్ దొరికితే నేరుగా బీజేపీ నేత ఫడ్నవీస్‌ నోట్లో వేస్తాను, సంచలన వ్యాఖ్యలు చేసిన శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్, మహారాష్ట్రలో ముదురుతున్న కరోనా రాజకీయాలు

Hazarath Reddy

శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్.. మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘తనకు కరోనా వైరస్ గనుక దొరికితే దానిని నేరుగా ఫడ్నవీస్ నోటిలో వేస్తానని అన్నారు.

Advertisement
Advertisement