Politics
Maharashtra Politics: మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వం, ఎన్సీపీకి డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ పార్టీకి స్పీకర్ పదవి, ప్రతిపక్షానికే పరిమితం కాబోతున్న బీజేపీ?
Vikas Mandaఈసారి కూడా ప్రతిపక్షానికే పరిమితమనుకున్న ఎన్సీపీ- కాంగ్రెస్ కూటమి, శివసేన చొరవతో ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతున్నాయి. ఇటు అధికార పక్షం అనుకున్న బీజేపీ ప్రతిపక్షానికి పరిమితం కాబోతుంది...
Cyclone Bulbul Batters Bengal: బుల్‌బుల్‌కు 20 మంది బలి, బెంగాల్‌లో 2.73 లక్షల కుటుంబాలపై తుఫాను ప్రభావం, బంగ్లాదేశ్‌లో 21 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు, తీరం దాటిన బుల్‌బుల్‌
Hazarath Reddyబుల్‌బుల్‌ తుపాన్‌ (Cyclone Bulbul)పశ్చిమ బెంగాల్‌లోని సాగర్‌ ద్వీపం వద్ద తీరాన్ని దాటింది. తీరం దాటినా బుల్‌బుల్‌... పశ్చిమ బెంగాల్‌(West Bengal state), ఒడిశా(Odisha state) తీరాలను వణికిస్తోంది. ఆదివారం ఈ తుఫాన్ పశ్చిమ బెంగాల్‌, బంగ్లాదేశ్‌లను కుదిపేసింది. దీని ధాటికి పశ్చిమ బెంగాల్ లో 10 మంది, బంగ్లాదేశ్‌(Bangladesh )లో 10 మంది, ఒడిశాలో ఇద్దరు మృతి చెందారు.
Abhinandan Varthaman: పాకిస్తాన్ మరో దుశ్చర్య, పాకిస్తాన్‌ వైమానికదళ యుద్ధ మ్యూజియంలో అభినందన్ వర్థమాన్ బొమ్మ, దాని పక్కనే ఛాయ్ కప్పు
Hazarath Reddyభారత్‌పై విషప్రచారం చేయడంలో ఏ అవకాశాన్నీ వదులుకోని పాకిస్తాన్‌ మరో దుశ్చర్యకు పాల్పడింది. కరాచీలోని పాకిస్థాన్ వాయుసేన వార్ మ్యూజియం(Pakistan Air Force War Museum)లో భారత వాయుసేన వింగ్‌కమాండర్ అభినందన్ వర్ధమాన్ (Wing Pilot Abhinandan Varthaman) బొమ్మను కొలువుదీర్చారు. వర్ధమాన్‌ చుట్టూ పాక్‌సైనికులు చుట్టుముట్టి ఉండగా, ఎడమ పక్క ఒక టీ కప్పును కూడా ఉంచింది. ఈ ఫొటోను పాకిస్థానీ జర్నలిస్ట్ అన్వర్ లోధీ ఆదివారం ట్వీట్ చేశారు.
Another Twist In 'MAHA' Politics: తీవ్ర ఉత్కంఠలో మహా రాజకీయాలు,కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన అరవింద్ సావంత్, ఎన్డీయే కూటమి నుంచి వైదొలిగే ఆలోచనలో శివసేన, ప్రభుత్వ ఏర్పాటుకు వ్యూహాలు
Hazarath Reddyమహా రాజకీయాలు తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. బీజేపీ-శివసేనల మధ్య ఉన్న దశాబ్దాల బంధానికి రారాం చెప్పే విధంగా ముందుకు సాగుతున్నాయి. మహారాష్ట్రలో అధికార ఏర్పాటులో బీజేపీకి-శివసేన కూటమి మధ్య సయోధ్య కుదరకపోవడంతో వార్ మరింతగా వేడెక్కింది.
Who Will Be MAHA CM: అధికారాన్ని ఏర్పాటు చేయలేమన్న బీజేపీ, ప్రభుత్వ ఏర్పాటు దిశగా శివసేన వ్యూహాలు, హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అంటున్న కాంగ్రెస్ నేతలు, ఎన్సీపీ దారెటు ?
Hazarath Reddyమహారాష్ట్ర(Maharashtra)లో అధికార ఏర్పాటు అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎన్నికల ఫలితాల్లో లార్జెస్ట్ పార్టీగా అవతరించిన బీజేపీ- శివసేన (BJP-Sena) కూటముల మధ్య సయోధ్య కుదరకపోవడంతో అక్కడ అధికార ఏర్పాటు(Maharashtra Govt Formation) అనేది సందిగ్ధంలో పడింది. సీఎం పదవీ కాలం ముగియడంతో దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా చేయడంతో.. అధికారాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ బీజేపీని ఆహ్వానించారు.
Ashwathama Reddy: తెలంగాణాలో కొనసాగుతున్న సమ్మె సస్పెన్స్, 12వ తేదీ నుంచి అశ్వత్థామరెడ్డి నిరవధిక దీక్ష, ఆర్టీసీ కార్మికులు మావోయిస్టులతో చేయి కలిపారన్న హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్, వ్యాఖ్యలను ఖండించిన ఆర్టీసీ జేఏసీ
Hazarath Reddyతెలంగాణా(Telangana)లో ఆర్టీసీ కార్మికుల సమ్మె (RTC Strike) 37వ రోజుకు చేరుకుంది. 2019, అక్టోబర్ 05వ తేదీ నుంచి సమ్మె కొనసాగుతున్న సంగతి విదితమే. ఇటు ప్రభుత్వం కాని, అటు కార్మికులు కాని మెట్టు దిగడం లేదు. ఓ వైపు కోర్టులో కేసు నడుస్తోంది.
Terror Attack Alert: 3 రాష్ట్రాల్లో ఉగ్రదాడులకు జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యూహ రచన, హెచ్చరికలు జారీ చేసిన నిఘా వర్గాలు, అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం, డార్క్‌వెబ్ వేదికగా సమాచార మార్పిడి
Hazarath Reddyగత 10 రోజుల నుంచి బాబ్రీ మసీద్ -రామ్ జన్మభూమి కేసు (Babri Masjid- Ram Janmabhoomi case) మీద కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టడం, సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇవ్వడం జరిగిపోయింది. దేశ వ్యాప్తంగా ఏమైనా దాడులు జరుగుతామయేమోనని ముందస్తు జాగ్రత్తగా కేంద్ర ప్రభుత్వం అన్ని చోట్లా భద్రతను కట్టుదిట్టం చేసింది. అయితే పాకిస్తాన్ కేంద్రంగా ఇండియాలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు(Military Intelligence) హెచ్చరిస్తున్నాయి.
Karnataka Assembly Bypolls: కర్ణాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు, షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం, డిసెంబర్ 5న ఉప ఎన్నికలు, డిసెంబర్ 9న ఫలితాలు, రేపటినుంచి కోడ్ అమల్లోకి
Hazarath Reddyకర్ణాటక(Karnataka )లో మళ్లీ ఎన్నికల నగారా మోగనుంది. అక్కడ 15 అసెంబ్లీ స్థానాలకు(15 Assembly Constituencies)సంబంధించిన ఉప ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైంది. ఈ స్థానాలకు డిసెంబర్‌ 5(December)న పోలింగ్‌ జరగనుంది. వీటి ఫలితాలు డిసెంబర్‌ 9(December 9)న విడుదల కానున్నాయి.
MAHA CM Poster At Matoshree: ఉద్ధవ్ ఠాక్రే సీఎం అంటూ పోస్టర్, శివసేన చీఫ్ ఇంటివద్ద ఫ్లెక్సీ బ్యానర్, గతంలో ఆదిత్య ఠాక్రే సీఎం అంటూ బ్యానర్లు, మహాలో రంజుగా సాగుతున్న రాజకీయం
Hazarath Reddyఫలితాలొచ్చి ఒక్కరోజు కూడా గడవక ముందే ‘భావి సీఎం ఆదిత్య ఠాక్రే’ అంటూ మహారాష్ట్ర అంతటా పోస్టర్లుతో సంచలనం రేకెత్తించిన శివసేన కార్యకర్తలు ఇప్పుడు మళ్లీ కొత్త పోస్టర్లతో రాజకీయాల్లో మరింతగా వేడిని పుట్టిస్తున్నారు. ఇందులో భాగంగా శివసేన పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేనే మాకు సీఎంగా ఉండాలంటూ వెలిసిన ఓ బ్యానర్ మహా రాజకీయాల్లో మరింత వేడిని రాజేస్తోంది.
Sanjay Raut On 'MAHA' Episode: బీజేపీ విఫలమైతే శివసేన రెడీగా ఉంది, వ్యూహాంతో సిద్ధంగా ఉన్నాం, మా సీఎం ఎవరేనది అప్పుడే చెబుతాం, సంచలన వ్యాఖ్యలు చేసిన శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్
Hazarath Reddyమహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అక్కడ ప్రభుత్వ ఏర్పాటు ఎవరు చేస్తారనే ప్రశ్నకు సమాధానం చిక్కడం లేదు. ఎవరికి వారే తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర(Maharashtra)లో తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధంగా ఉన్నామని శివసేన (Shiv Sena) స్పష్టం చేసింది.
MAHA Govt Formation Deadline: క్లైమాక్స్‌లో మహారాష్ట్ర పొలిటికల్ ఎపిసోడ్, సోమవారంలోగా ప్రభుత్వ ఏర్పాటుకు రావాలన్న గవర్నర్, బీజేపీ-శివసేన మధ్య తేలని పంచాయితీ, సీఎం కుర్చీపై కూర్చునేదెవరు ?
Hazarath Reddyదేశ వ్యాప్తంగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఎంతో ఆసక్తిని రేకెత్తించగా, ఇప్పుడు అక్కడ ప్రభుత్వ ఏర్పాటు (Maharashtra Govt Formation) అంతకన్నా ఆసక్తిగా మారింది. సీఎం సీటులో ఎవరు కూర్చుంటారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. అత్యధిక సీట్లు గెలుచుకున్న బీజేపీ (BJP) దాని మిత్ర పక్షం శివసేన(Shiv Sena)ల మధ్య సీఎం సీటు విషయంలో ఇంకా పంచాయితీ నడుస్తూనే ఉంది.
Ram Janmabhoomi Nyas Design: అయోధ్యలో రామ మందిర్ న్యాస్‌ డిజైన్, 2024లోగా నిర్మాణం పూర్తి, ఏర్పాటు కాబోతున్న రామాలయ నిర్మాణ ట్రస్ట్, తీర్పు అందరికీ ఆమోద యోగ్యమన్న విశ్వహిందూ పరిషత్‌
Hazarath Reddyఅయోధ్య కేసు( Ayodhya Verdict)లో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు (Supreme Court verdict in the Ayodhya case) ఇచ్చిన నేపథ్యంలో అక్కడ రామమందిర(Ram Temple) నిర్మాణానికి సంబంధించిన చర్చలు మొదలయ్యాయి. సుప్రీం కోర్టు తీర్పుకు రాజకీయ పార్టీ నాయకుల నుంచి గానీ, ముస్లిం మత పెద్దల నుంచి గానీ పెద్దగా సుప్రీం తీర్పు పట్ల నెగెటివ్ రియాక్షన్ రాలేదు. దీంతో రివ్యూ పిటిషన్ వేస్తామన్న సున్నీ వక్ఫ్ బోర్డు సైతం ఆ నిర్ణయం నుంచి తప్పుకున్నట్లేనని తెలుస్తోంది.
PAPPU LAANTI ABBAYI In KRKR: ఎవరీ పప్పు లాంటి అబ్బాయి, కెఆర్‌కెర్‌లో మరో పాటను విడుదల కాంట్రవర్సీ డైరక్టర్ వర్మ, ఇప్పటికే పాల్ మీద సాంగ్ విడుదల, పాత్రలను యాదృచ్చికంగానే చూడాలంటున్న వర్మ
Hazarath Reddyకాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని ప్రతిబింబిస్తూ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాను నిర్మిస్తున్న సంగతి అందిరీ తెలిసిందే. ఇప్పటికే దానికి సంబంధించిన ట్రైలర్ కూడా విడుదలయింది. ఈ నేపథ్యంలో ఆ సినిమాలో మారో పాటను ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. పప్పులాంటి అబ్బాయి..శుద్ధ పప్పు చిన్నారి..బాధ నేను పడుతున్నా..చెప్పుకోలేకున్నా..అంటూ సాగే ఈ పాటను పరమ బ్రహ్మ ముహూర్తం..2019, నవంబర్ 10వ తేదీ ఆదివారం 9.36 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు వర్మ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
Chandrababu Naidu: అబ్దుల్ కలాం నా దగ్గరే విజన్ నేర్చుకున్నారు, విజన్-2020 పత్రాలతోనే దేశ ఆర్థిక విజన్‌పై పుస్తకాన్ని విడుదల చేశారు, చిత్తూరు మీటింగ్‌లో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
Hazarath Reddyచిత్తురూ పర్యటనలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ రాష్ట్రపతి, అపర మేధావి దివంగత అబ్దుల్ కలాం(Former President Abdul Kalam) తనవద్దే విజన్ నేర్చుకున్నారని వ్యాఖ్యానించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు విజన్‌–2020తో ముందుకెళ్లానన్నారు.
‘Ayodhya Verdict’ Closed Doors For BJP: రామమందిర నిర్మాణానికి తలుపులు తెరుచుకున్నాయి, బీజేపీకి డోర్స్ క్లోజ్ అయ్యాయి, సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా ఆసక్తికర వ్యాఖ్యలు
Hazarath Reddyదశాబ్దాల నుంచి కొనసాగుతూ వస్తున్న అయోధ్య భూవివాదం కేసుపై సుప్రీం కోర్టు తుది తీర్పును వెలువరించింది. ఈ సమయంలో అన్ని పార్టీలు ఈ తీర్పును స్వాగతిస్తున్నాయి. అలాగే తమదైన శైలిలో బీజేపీ మీద వ్యంగ్యాస్త్రాలను విసురుతున్నాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ కూడా నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Sanjay Raut Cryptic Tweet: ఫస్ట్ మందిర్, తరువాత సర్కార్, శివసేన లీడర్ సంజయ్ రౌత్ ఆసక్తికర ట్వీట్, ‘మహా’లో తేలని పంచాయితీ, హోటల్ రీట్రీట్‌కు శివసేన ఎమ్మెల్యేలు, బీజేపీ మద్దతు అవసరం లేదన్న శివసేన
Hazarath Reddyదశాబ్దాల నుంచి సాగుతూ వస్తున్న వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీమసీదు స్థల వివాదంపై సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు (Ayodhya verdict) వెల్లడించింది. ఈ క్రమంలో శివసేన నేత సంజయ్‌ రౌత్‌ (Shiv Sena Leader Sanjay Raut) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Kartarpur Corridor: కర్తార్‌పూర్‌ కారిడార్‌ను ప్రారంభించిన మోడీ, పాక్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన ఇండియా పీఎం, గురు నానక్ దేవ్‌ అన్ని పుణ్య క్షేత్రాలను కలుపుతూ ప్రత్యేక రైలు సేవలు
Hazarath Reddyభారత్, పాక్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతుండగా..రెండు దేశాలను కలిపే కర్తార్‌పూర్‌ కారిడార్‌ (Kartarpur Corridor) ప్రారంభం ఎట్టకేలకు ప్రారంభం అయింది. సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్‌ 550వ జయంతి సందర్భంగా పంజాబ్ లోని గురుదాస్ పూర్ లోని డేరాబాబా నానక్ దగ్గర భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ (Prime Minister Modi ) కర్తార్‌పూర్‌ కారిడార్‌ను ప్రారంభించారు.
RTC Chalo Tank Bund: ఛలో ట్యాంక్‌బండ్‌తో హైదరాబాద్‌లో ఉద్రిక్త వాతావరణం,పోలీసుల అదుపులో అశ్వత్థామరెడ్డి, పలువురు నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు, నిఘా నీడలో ట్యాంక్‌బండ్
Hazarath Reddyతమ డిమాండ్లను నెరవేర్చాలంటూ తెలంగాణ ఆర్టీసీ కార్మికులు, కార్మికనేతలు ‘చలో ట్యాంక్‌బండ్‌’కు ఇచ్చిన పిలుపుతో హైదరాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన ఛలో ట్యాంక్ బండ్ పిలుపుతో ట్యాంక్‌బండ్‌ పైకి భారీ ఎత్తున ఆర్టీసీ కార్మికులు చేరుకున్నారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Sunni Waqf Board On Supreme Court Judgment: తీర్పు నిరాశపరిచింది, అయినా తీర్పును గౌరవిస్తున్నాం, తీర్పు కాపీని మరింతగా పరిశీలించిన తరువాతనే భవిష్యత్ కార్యాచరణ, క్లయిమ్‌ని తిరస్కరించిన సున్నీ వక్ఫ్ బోర్డు
Hazarath Reddyయావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూసిన సున్నితమైన అంశం అయోధ్యలో రామజన్మభూమి - బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తుది తీర్పును గౌరవిస్తున్నామని సున్నీ వక్ఫ్‌ బోర్డు లాయర్‌ జిలానీ పేర్కొన్నారు. సుప్రీం తీర్పు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీం తీర్పును గౌరవిస్తాం. కానీ తాము ఆ తీర్పుతో సంతృప్తి చెందలేదు. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.