రాజకీయాలు

Telangana Politics: దానం నాగేందర్ బూతుల వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని అక్బరుద్దీన్ ఓవైసీ డిమాండ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అసభ్య పదజాలంతో రెచ్చిపోయిన నాగేందర్

Hazarath Reddy

అసెంబ్లీలో నీ అమ్మ అని మాట్లాడటం కరెక్ట్ కాదు, జనాలకు రాంగ్ మెసేజ్ పోతుంది.. ఎమ్మెల్యే దానం నాగేందర్ బేషరతుగా అతని వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు.

MLA Danam Nagender: అసెంబ్లీలో బూతులతో రెచ్చిపోయిన దానం నాగేందర్, తోలు తీస్తా, బయట తిరగనియ్య అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బెదిరింపులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేల మాధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అసభ్య పదజాలంతో రెచ్చిపోయారు.

Vallabhaneni Vamsi Arrest: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్‌, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీపై ఆరోపణలు

Hazarath Reddy

వైసీపీ సీనియర్ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ( Vallabhaneni Vamsi Arrest) పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరం దగ్గరలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని గన్నవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Visakha Local Bodies Election: విశాఖ స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ, అధికారికంగా ప్రకటించిన జగన్, ఆగస్టు 30న పోలింగ్, సెప్టెంబరు 3న ఓట్ల లెక్కింపు

Hazarath Reddy

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పోటీ చేయనున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ ఎంపిక చేస్తూవైసీపీ అధ్యక్షుడు జగన్ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

Rahul Gandhi: నాపై ఈడీ దాడికి ప్లాన్.. చక్రవ్యూహం వ్యాఖ్యలే దీనికి కారణం.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

Rudra

ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) త‌న‌పై దాడి చేసేందుకు ప్లాన్ చేస్తోంద‌ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ మేరకు ఈడీలో ప‌నిచేస్తున్న కొంద‌రు ఉన్నతాధికారులు త‌న‌కు స‌మాచారాన్ని చేర‌వేసిన‌ట్లు చెప్పారు.

YS Jagan Passport Renewal: భార్య వైఎస్ భారతితో కలిసి పాస్‌ పోర్ట్ రెన్యువల్ చేయించుకున్న మాజీ సీఎం జగన్

Rudra

ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన పాస్‌ పోర్ట్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రం 5.30 గంటల సమయంలో తన భార్య వైఎస్ భారతితో కలిసి విజయవాడ బందరు రోడ్డులోని పాస్‌ పోర్టు కార్యాలయానికి వచ్చారు.

TG Job Calendar: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నేడే అసెంబ్లీలో జాబ్ క్యాలెండ‌ర్ ప్రకటన.. తెల్ల రేషన్‌ కార్డులు జారీపై కూడా కీలక ప్రకటన

Rudra

నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ఏర్పడ్డ తెలంగాణలో నిరుద్యోగులు గత ఏండ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం.. ప్రతి ఏడాది నిర్దిష్టమైన కాల వ్యవధిలో ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు ఉద్దేశించిన జాబ్ క్యాలెండర్‌ ను నేటి అసెంబ్లీలో రేవంత్ ప్రభుత్వం ప్రకటించబోతున్నది.

Bhumata Portal: ధరణి పోర్టల్ పేరును భూమాత పోర్టల్‌గా మార్చిన తెలంగాణ ప్రభుత్వం, తిరిగి తెరుచుకోనున్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్​లో ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ అయింది. ఇందులో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ భేటీలో ధరణి పోర్టల్‌ పేరును భూమాతగా మారుస్తూ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. కాగా ధరణి పేరును భూమాతగా మార్చనున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ.. తన ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టిన సంగతి విదితమే.

Advertisement

YS Jagan Praja Darbar: వైఎస్ జగన్ ప్రజాదర్బార్ వీడియోలు ఇవిగో, ఇంకా ఏ మాత్రం తగ్గని క్రేజ్, అధినేతను కలవడానికి దూర ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు

Hazarath Reddy

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్ ను నేడు విశాఖపట్నంకు చెందిన వైసీపీ కార్పొరేటర్లు, పార్టీ నేతలు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైసీపీ కార్యకర్తలు కలిశారు. దాంతో తాడేపల్లిలోని ఆయన కార్యాలయం కోలాహలంగా మారింది. వైజాగ్ వైసీపీ కార్పొరేటర్లు, వైసీపీ నేతలు నేడు తాడేపల్లిలోని జగన్ నివాసానికి వచ్చారు. జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

Telangana Cabinet Meeting: తెలంగాణలో త్వరలో కొత్త రేషన్ కార్డులు జారీ, జాబ్ క్యాలెండర్‌‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

Hazarath Reddy

సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది.ఈ భేటీలో మంత్రివర్గం పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ధరణి పోర్టల్ పేరు ‘భూమాత’గా మారుస్తూ కేబినెట్ నిర్ణయించింది. జాబ్ క్యాలెండర్‌‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేషన్ కార్డుల కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

New Parliament Building Leaking? కొత్త పార్లమెంట్ భవనంలో వర్షపు నీరు లీక్, బయట పేపర్ లీకేజీ, లోపల వాటర్ లీకేజీ అంటూ మోదీ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టిన ప్రతిపక్షాలు

Hazarath Reddy

నరేంద్ర మోదీ సర్కారు నూతనంగా నిర్మించిన పార్లమెంట్ భవనం సెంట్రల్ విస్టా పైకప్పు నుంచి వర్షపు నీరు లీక్ కావడంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. వాటర్ లీక్ కు సంబంధంచిన వీడియోలను ఆయా పార్టీల నేతలు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

ADR Report on Lok Sabha Poll: మొన్నటి ఎన్నికల్లో 365 సీట్లలో లక్షల్లో ఓట్ల తేడా, ఏపీలో 85 వేల ఓట్లకు పైగానే, ఓట్ల లెక్కింపు ప్రక్రియపై సంచలన నివేదికను బయటపెట్టిన ఏడీఆర్

Hazarath Reddy

సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మీద ADR సంస్ధ నివేదిక సంచలన విషయాలను బైట పెట్టింది. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో (Lok Sabha Poll 2024) 538 నియోజకవర్గాల్లో , 365 స్థానాల్లో లక్షల్లో ఓట్ల తేడా ఉనట్టు తెలిపింది

Advertisement

Amit Shah on Wayanad Landslide: విపత్తు గురించి ముందే అలర్ట్ చేసినా కేరళ సీఎం పట్టించుకోలేదు, వయనాడ్‌ మృత్యుఘోషపై పార్లమెంట్‌లో హోమంత్రి అమిత్ షా కీలక ప్రకటన

Hazarath Reddy

వయనాడ్‌ (Wayanad)లో మృత్యుఘోష కొనసాగుతోంది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ అందిన తాజా సమాచారం ప్రకారం..164 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 91 మంది మిస్సింగ్ కాగా, 200 మందికిపైగా ప్రజలు ఆస్పత్రి పాల‌య్యారు

Puja Khedkar: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ పై జీవితకాల నిషేధం విధించిన యూపీఎస్సీ, పుణే సబ్ కలెక్టర్ గా పనిచేసిన సమయంలో అక్రమాల ఆరోపణలు

Hazarath Reddy

వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ సెలెక్షన్ ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) రద్దు చేసింది. భవిష్యత్తులో పూజా ఖేద్కర్ సివిల్స్ పరీక్షలో పాల్గొనకుండా జీవితకాల నిషేధం విధించింది. ఫూజా ఖేద్కర్ పుణే ప్రొబేషనరీ సబ్ కలెక్టర్ గా పనిచేసిన సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి.

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసు, అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కె కవిత జ్యుడీషియల్ కస్టడీ ఆగస్టు 13 వరకు పొడిగింపు

Hazarath Reddy

లిక్కర్‌ స్కాం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రిమాండ్‌ పొడిగించింది ట్రయల్‌ కోర్టు. రిమాండ్‌ గడువు ముగియడంతో ఇవాళ(బుధవారం) ఆమెను వర్చువల్‌గా ట్రయల్‌ కోర్టు(రౌస్‌ అవెన్యూ కోర్టు) ముందు తీహార్‌ జైలు అధికారులు హాజరుపరిచారు. దీంతో ఆగష్టు 13దాకా జ్యూడీషియల్‌ రిమాండ్‌ను పొడిగించింది ట్రయల్‌ కోర్టు.

Andhra Pradesh: రూ.1.30 లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌, ఆన్‌లైన్‌లో తీర్మానాన్ని ఆమోదించిన రాష్ట్ర మంత్రి మండలి

Hazarath Reddy

చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం (Andhra Pradesh government) రాబోయే నాలుగు నెలలకు రూ.1.30 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌కు ఆర్డినెన్సు జారీ చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర మంత్రిమండలి మంగళవారం ఆన్‌లైన్‌లో తీర్మానాన్ని ఆమోదించింది

Advertisement

MLA Bandla Krishna Mohan Reddy: మళ్ళీ సొంత గూటికి గ‌ద్వాల ఎమ్మెల్యే, గులాబీ పార్టీలో కొనసాగుతాన‌ని స్పష్టం చేసిన బండ్ల కృష్ణ‌మోహ‌న్ రెడ్డి

Hazarath Reddy

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవ‌లే కాంగ్రెస్ పార్టీలో చేరిన గ‌ద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ‌మోహ‌న్ రెడ్డి త‌న మ‌న‌సు మార్చుకున్నారు. మ‌ళ్లీ సొంత‌గూటికి చేరుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను అసెంబ్లీలో కలిసి గులాబీ పార్టీలో కొనసాగుతాన‌ని ఎమ్మెల్యే కృష్ణ‌మోహ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

CM Revanth Reddy Vs Jagadish Reddy: మీరు నిరూపిస్తే ఇదే సభలో ముక్కు నేల‌కు రాసి ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తా, సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డి, అసెంబ్లీలో విద్యుత్ ప‌ద్దుల‌పై వాడి వేడి చర్చ

Hazarath Reddy

తెలంగాణ శాస‌న‌స‌భ‌లో విద్యుత్ ప‌ద్దుల‌పై వాడి వేడి చర్చ జరిగింది. ఈ సంద‌ర్భంగా మాజీ విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి మ‌ధ్య మాట‌ల యుద్ధం (CM Revanth Reddy Vs Jagadish Reddy) జ‌రిగింది. జ‌గ‌దీశ్ రెడ్డి హ‌త్య కేసుల్లో నిందితుడు అని సీఎం రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంక‌ట్ రెడ్డి ఆరోపించారు.

Akbaruddin Owaisi on Bribe: హైదరాబాదులో అన్ని పోలీస్ స్టేషన్లకు లంచాలు వెళుతున్నాయి, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

హైదరాబాదులో అన్ని పోలీస్ స్టేషనులకు లంచాలు వెళ్తున్నాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఒక ఏసీపీ నాకు ఫోన్ చేసి మీ ఏరియాలో పోలీస్ స్టేషన్ నిర్మాణానికి డబ్బులు సాయం చేయమని అడిగితే, నేనెందుకు ఇవ్వాలి మీకు లంచాలు వస్తున్నాయి కదా దానితో కట్టండి అని చెప్పానని తెలిపారు.

JC Prabhakar Reddy Meets YS Vijayamma: వైఎస్ విజయమ్మతో జేసీ ప్రభాకర్‌రెడ్డి భేటీ, పొలిటికల్‌ సర్కిల్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన ఏం మాట్లాడారనే చర్చ

Hazarath Reddy

టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సతీమణి వైఎస్‌ విజయమ్మను కలిశారు.హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని విజయమ్మ నివాసానికి వెళ్లి భేటీ అయిన జేసీ ప్రభాకర్‌ రెడ్డి.. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

Advertisement
Advertisement