Politics

Andhra Pradesh Elections 2024: తాజా సర్వే.. ఏపీలో మళ్ళీ వైసీపీదే అధికారం, అయితే ఎంపీ సీట్లు తగ్గే అవకాశముందని తెలిపిన ఇండియా టీవీ - సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ సర్వే

Hazarath Reddy

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి వస్తుందని ఇండియా టీవీ - సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. జగన్ పార్టీ- చంద్రబాబు పార్టీ మధ్య పోటీ ఉండవచ్చని అంచనా వేసింది. 2024 లోక్ సభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 15 సీట్లు, తెలుగుదేశం పార్టీ 10 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని ఈ సర్వేలో వెల్లడైంది.

CM Revanth Reddy on English: గుంటూరు, గుడివాడ వెళ్లి కార్పోరేట్ స్కూళ్లలో చదవలేదు, తనకు ఇంగ్లీష్ రాదనే వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్

Hazarath Reddy

తనకు ఇంగ్లిష్ రాదని కొంతమంది ఎగతాళి చేస్తున్నారని... కానీ తాను ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చదివి... ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Kesineni Nani on Prashant Kishore: చెప్పినవన్నీ జరగడానికి ప్రశాంత్ కిశోర్ ఏమీ దేవుడు కాదు, కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు వీడియో ఇదిగో..

Hazarath Reddy

విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రశాంత్ కిశోర్ అంచనాలపై స్పందించారు. ప్రశాంత్ కిశోర్ చెప్పినవి పట్టించుకోవాల్సి అవసరం లేదని అన్నారు. ఇటీవల ఆయన చెప్పినవి ఏవీ నిజం కాలేదని అన్నారు.తెలంగాణ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తుందని చెప్పాడు... కానీ ఓడిపోయింది.

Chandrababu on Volunteer System: వీడియో ఇదిగో, వాలంటీర్ల ఉద్యోగాలు తీసేయం, మేము అధికారంలోకి వచ్చినా ఆ వ్యవస్థ కొనసాగుతుందని తెలిపిన చంద్రబాబు

Hazarath Reddy

టీడీపీ-జనసేన అధికారంలోకి వచ్చినా వాలంటీరు వ్యవస్థ ఉంటుందని, ఎవరినీ ఉద్యోగం నుంచి తొలగించబోమని స్పష్టం చేశారు. అయితే, వాలంటీర్లు వైసీపీ కోసం పనిచేయవద్దని కోరుతున్నా అని అన్నారు. వాలంటీర్లకు మంచి భవిష్యత్ ఉంటుందని, వారికి న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Advertisement

Modi Ka Parivar Campaign: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మోదీ కా పరివార్, లాలూ ప్రసాద్ వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన బీజేపీ అగ్రనేతలు, విషయం ఏంటంటే..

Hazarath Reddy

భారతీయ జనతా పార్టీ సోమవారం ‘మోదీ కా పరివార్’తో ప్రధాన ఆన్‌లైన్ ప్రచారాన్ని ప్రారంభించింది . ప్రధానిపై RJD అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ "పరివార్వాద్" వ్యాఖ్యలకు కౌంటర్ గా అమిత్ షా, JP నడ్డాతో సహా అనేక మంది అగ్రనేతలు ఈ క్యాంపెయిన్ ప్రారంభించారు.

Telangana Elections 2024: ఖమ్మం లోక్‌సభ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్‌ నుంచి మాలోత్‌ కవిత, ఖమ్మం, మహబూబాబాద్‌ నేతలతో కేసీఆర్‌ భేటీ

Hazarath Reddy

ఖమ్మం లోక్‌సభ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు, అలాగే మహబూబాబాద్‌ నుంచి మాలోత్‌ కవితే మరోసారి పోటీ చేస్తారని తెలుస్తోంది. సోమవారం ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన ఖమ్మం, మహబూబాబాద్‌ పార్లమెంట్‌ ముఖ్యనేతల భేటీలో ఈ మేరకు నిర్ణయం ప్రకటించినట్లు తెలుస్తోంది.

Babu Mohan Joins Praja Shanti Party: ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబూ మోహన్, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పార్ట అధ్యక్షుడు కేఏ పాల్

Hazarath Reddy

సినీ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు.కేఏ పాల్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు . ఇటీవలే బాబూ మోహన్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయనకు అందోల్ నుంచి బీజేపీ టికెట్ ఇచ్చింది.

PM Modi on Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు, బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ కుమ్మక్కు అయిందని తెలిపిన ప్రధాని

Hazarath Reddy

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ కుమ్మక్కవుతుంది. గతంలో మీరు తిన్నారు. ఇప్పుడు మేము తింటాం అన్నట్లు కాంగ్రెస్ పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చినా పాలనలో ఎలాంటి మార్పు లేదని మండిపడ్డారు.

Advertisement

PM Modi Telangana Visit: దేశంలో 140 కోట్ల మంది ప్రజలు నా కుటుంబమే, ప్రతిపక్షాల వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన ప్రధాని మోదీ, నా జీవితం తెరిచిన పుస్తకం లాంటిదని వెల్లడి

Hazarath Reddy

ఇప్పుడు 2024 ఎన్నికలకు తమ అసలు మ్యానిఫెస్టోను బయటపెట్టారని.. వారి వంశ రాజకీయాలను ప్రశ్నిస్తే.. మోడీకి కుటుంబం లేదని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నా జీవితం తెరిచిన పుస్తకం లాంటిది.. దేశ ప్రజలకు నేను బాగా తెలుసు..అర్థం చేసుకుంటారని తెలిపారు. దేశ ప్రజల కోసం బతుకుతానని, నా జీవితంలో ప్రతి క్షణం నీ కోసమే,

PM Modi Telangana Visit: వికాస్ ఉత్సవ్ జరుపుకోవడానికే తెలంగాణకు వచ్చాను, ఆదిలాబాద్‌ బహిరంగ ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగం

Hazarath Reddy

ప్రధాని మోదీ తన ప్రసంగంలో, “వారు (ప్రతిపక్షాలు) ఎన్నికల గురించి మాట్లాడుతూనే ఉన్నారు. నిన్న మొత్తం రోజంతా నేను భారత ప్రభుత్వ మంత్రులు, సీనియర్ సెక్రటరీలు, దాదాపు 125 మందితో కూడిన టాప్ టీమ్, అధికారులందరితో కూర్చున్నాను

PM Modi Telangana Visit: ఆదిలాబాద్‌లో రూ.56 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంఖుస్థాపన, రాష్ట్ర అభివృద్ధికి పెద్దన్నలా సహకరించాలని కోరిన సీఎం రేవంత్ రెడ్డి

Hazarath Reddy

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఆదిలాబాద్‌లో రూ. 56,000 కోట్లకు పైగా బహుళ అభివృద్ధి కార్యక్రమాలను (Multiple Development Projects) ప్రారంభించి, శంకుస్థాపన చేశారు

PM Modi on SC Verdict on Bribery Cases: స్వాగతం..ఇదో గొప్ప తీర్పు, ఎంపీ, ఎమ్మెల్యేల లంచాల కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై ప్రధాని మోదీ ప్రశంసలు

Hazarath Reddy

ఈ తీర్పుపై ప్రధాని మోదీ స్పందించారు. ఎక్స్ లో ఆయన ట్వీట్ చేస్తూ.. స్వాగతం! స్వచ్ఛమైన రాజకీయాలను నిర్ధారిస్తూ, వ్యవస్థపై ప్రజలకు విశ్వాసాన్ని పెంపొందింపజేసే గొప్ప తీర్పు సుప్రీం కోర్టు ఇచ్చిందని తెలిపారు.

Advertisement

BJP MP Upendra Rawat: అశ్లీల స్థితిలో అమ్మాయితో బెడ్ మీద బీజేపీ ఎంపీ నకిలీ వీడియో వైరల్, ఫేక్ వీడియో క్రియేట్ చేశారంటూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఉపేంద్రసింగ్‌ రావత్‌

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి బీజేపీ ఎంపీ ఉపేంద్రసింగ్‌ రావత్‌కు సోషల్ మీడియాలో షాక్ తగిలింది. రావత్‌ను పోలి ఉన్న వ్యక్తి బెడ్‌పై ఒక అమ్మాయితో అశ్లీల స్థితిలో లిక్కర్‌ గ్లాసు చేతిలో పట్టుకుని ఉన్న వీడియో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైంది. వీడియో వచ్చిన కొద్దిసేపటికే వైరల్‌గా మారింది.

Andhra Pradesh Elections 2024: ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలు వెనుక అసలు నిజం ఇదేనా, ఒక పీకే సరిపోక మరో పీకేని తెచ్చుకున్నారని వైసీపీ నేతలు కౌంటర్,గతంలో ఆయన అంచనాలు రిపోర్ట్ ఇదే..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై ప్రముఖ రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. ఈ ఎన్నికల్లో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో జరిగిన ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన.. ఏపీ ప్రజలు ఉచిత పథకాల కంటే అభివృద్ధికి పట్టం కడతారని జోస్యం చెప్పారు.

PM Modi Telangana Visit: నేడే మోదీ రెండ్రోజుల తెలంగాణ టూర్ ప్రారంభం.. నేడూ, రేపు ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో పర్యటన.. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు.. ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం

Rudra

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు తెలంగాణకు రానున్నారు. రాష్ట్రంలో రెండు రోజుల పాటు పర్యటించనున్న ప్రధాని నేడు ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో పాల్గొంటారు.

BRS MP List: నేడు తెలంగాణ భవన్ కు కేసీఆర్.. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం

Rudra

హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తెలంగాణ భవన్‌ కు నేడు మాజీ సీఎం కేసీఆర్ రానున్నట్టు సమాచారం. మధ్యాహ్నం బీఆర్ఎస్ తరపున పోటీ చేయబోయే కొందరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.

Advertisement

YSRCP Election Manifesto: వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఫిక్స్.. ఈ నెల 10న విడుదలకు నిర్ణయం.. ఈసారి కూడా సంక్షేమానికే పెద్దపీట

Rudra

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. 'సిద్ధం' పేరిట ఇప్పటికే భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ఎన్నికల శంఖారావాన్ని పూరించిన అధికార వైఎస్సార్సీపీ.... ఎన్నికల మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది.

BJP 1st List of 195 Candidates: బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల, 195 సీట్లతో తొలి జాబితా, వారణాసి నుంచి మరోసారి ప్రధాని మోడీ పోటీ..400 సీట్లే లక్ష్యం

sajaya

లోక్‌సభ ఎన్నికలకు బిజెపి తన అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది. పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను శనివారం విడుదల చేసింది. 16 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 195 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే తెలిపారు.

Mahasena Rajesh: ఎన్నికల బరి నుంచి తప్పుకున్న టీడీపీ-జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మహాసేన రాజేష్

sajaya

పి గన్నవరం నుండి టిడిపి అభ్యర్థిగా ప్రకటించిన మహాసేన రాజేష్ పోటీ నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు.

YSRCP 9th List: నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి, తొమ్మిదవ జాబితాను విడుదల చేసిన జగన్ సర్కారు, మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జిగా మురుగుడు లావణ్య నియామకం

Hazarath Reddy

అసెంబ్లీ ఎన్నికల కోసం మార్పులు చేస్తున్న అధికార వైఎస్సార్‌సీపీ తాజాగా తొమ్మిదవ జాబితాను శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. మొత్తం మూడు స్థానాలకు ఇన్‌ఛార్జిల నియమిస్తూ లిస్ట్‌ను రిలీజ్‌ చేసింది. ఇందులో.. నెల్లూరు పార్లమెంటరీ స్థానం సమన్వయకర్తగా విజయసాయిరెడ్డిని నియమించింది

Advertisement
Advertisement