BJP MLA Son Bribe Video: రూ. 40 లక్షల లంచం తీసుకుంటూ దొరికిపోయిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే తనయుడు.. వీడియో వైరల్
అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి ఇబ్బంది కలిగించే ఘటన తాజాగా ఎదురైంది. కర్ణాటకలోని చెన్నగిరి బీజేపీ ఎమ్మెల్యే కె. మదల్ విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ మదల్ తన తండ్రి కార్యాలయంలో ఓ వ్యక్తి నుంచి రూ. 40 లక్షల లంచం తీసుకుంటుండగా లోకాయుక్త పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
Bengaluru, March 3: అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Elections) ముందు బీజేపీకి (BJP) ఇబ్బంది కలిగించే ఘటన తాజాగా ఎదురైంది. కర్ణాటకలోని (Karnataka) చెన్నగిరి బీజేపీ ఎమ్మెల్యే కె. మదల్ విరూపాక్షప్ప (Madal Virupakshappa) కుమారుడు ప్రశాంత్ (Prashanth) మదల్ తన తండ్రి కార్యాలయంలో ఓ వ్యక్తి నుంచి రూ. 40 లక్షల లంచం తీసుకుంటుండగా లోకాయుక్త పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
ఆ సమయంలో ఆయన టేబుల్పై కుప్పలుగా పోసిన నగదుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (బీడబ్ల్యూఎస్ఎస్బీ)లో ప్రశాంత్ చీఫ్ అకౌంటెంట్గా పనిచేస్తున్నారు.
BIG
K'taka Lokayukta sleuths have raided & trapped son of BJP MLA Madal Virupakshappa, the accused Prashanth works as Chief accountant in BWSSB, he was collecting bribe on behalf of his father/chairman KSDL for raw material procurement tender. Raids on at crescent road office. pic.twitter.com/5NWAbLDeId
— Deepak Bopanna (@dpkBopanna) March 2, 2023
(The above story first appeared on LatestLY on Mar 03, 2023 09:13 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

