Tamilnadu Hooch Tragedy: కల్తీమద్యం తాగి 12 మంది మృతి.. డజనుకు పైగా దవాఖానపాలు.. తమిళనాడులో ఘోరం

తమిళనాడులో ఘోరం జరిగింది. విల్లిపురం జిల్లా ఎక్కియార్‌కుప్పం వద్ద మరక్కణంలో శనివారం రాత్రి కల్తీమద్యం తాగి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులు 45 నుంచి 55 ఏళ్ల మధ్య వారు.

Tamilnadu Hooch Tragedy: కల్తీమద్యం తాగి 12 మంది మృతి.. డజనుకు పైగా దవాఖానపాలు.. తమిళనాడులో ఘోరం
Credits: Google

Chennai, May 15: తమిళనాడులో (Tamilnadu) ఘోరం జరిగింది. వీల్లుపురం జిల్లా ఎక్కియార్‌కుప్పం వద్ద మరక్కణంలో, అలాగే చెంగల్పట్టులో శనివారం రాత్రి కల్తీమద్యం (Spurious Liquor) తాగి 12 మంది (12 Members) ప్రాణాలు కోల్పోయారు. మృతులు 45 నుంచి 55 ఏళ్ల మధ్య వారు. శనివారం రాత్రి కల్తీమద్యంతో అస్వస్థులైన వీరు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు చెప్పారు. వీరు కాక మరికొందరు మద్యం తాగడంతో అస్వస్థులు కాగా, డజను మందిని పొరుగునున్న పాండిచ్చేరిలో ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు.

Earthquake in Japan: జపాన్‌లో 5.9 తీవ్రతతో వరుస భూకంపాలు, ఇళ్లలో నుంచి బయటకు పరుగులు పెట్టిన ప్రజలు, అప్రమత్తంగా ఉండాలని జేఎంఏ హెచ్చరిక

నలుగురు పోలీసుల సస్పెండ్

ఈ సంఘటనకు సంబంధించి నలుగురు పోలీసులను సస్పెండ్ చేసినట్టు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల వంతున ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. కల్తీ మద్యం అమ్మిన నేరంపై ఒకరిని అరెస్టు చేశారు.

Naked Worship In Guntur: గుప్త నిధులతో ఎర.. నగ్నంగా పూజల్లో కూర్చుంటే లక్ష రూపాయలు ఇస్తామని ఆఫర్.. యువతులతో నగ్న పూజలు.. అనంతరం లైంగిక దాడికి యత్నం.. పూజారి సహా 12 మంది అరెస్ట్.. గుంటూరులో గగుర్పాటుకు గురిచేసే ఘటన

(The above story first appeared on LatestLY on May 15, 2023 10:29 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).