Sports

IPL 2023 Mini Auction: ఐపీఎల్‌ మినీ వేలం, రూ. 2 కోట్ల లిస్టులో ఒక్క భారత క్రికెటర్ కూడా లేడు, రూ.2 నుంచి 1.5 కోట్ల రూపాయలు బేస్‌ ప్రైస్‌‌గా నమోదు చేసుకున్న ఆటగాళ్ల జాబితా ఇదే

Hazarath Reddy

ఐపీఎల్‌-2023కు సంబంధించిన మినీ వేలంలో మొత్తం 991 మంది తమ పేర్లను రిజిస్టర్ చేయించుకున్నారు. ఇందులో 714 మంది భారత క్రికెటర్లు, 277 మది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఈ ఆటగాళ్ల జాబితాలో 185 మంది జాతీయ క్రికెటర్లు, 786 మంది ఫస్ట్‌క్లాస్‌, 20 మంది అసోసియేట్ దేశాలకు చెందిన ఆటగాళ్లు ఉన్నారు.

Mumbai Indians: విదేశాల్లో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్లుగా కీరన్‌ పొలార్డ్‌,రషీద్‌ ఖాన్‌, కీలక నిర్ణయం తీసుకున్న ముంబై ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్‌

Hazarath Reddy

వెస్టిండీస్‌ దిగ్గజం కీరన్‌ పొలార్డ్‌, అఫ్గనిస్తాన్‌ స్టార్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌కు ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం రిలయన్స్‌ కీలక బాధ్యతలు అప్పగించింది. విదేశీ టీ20 లీగ్‌లలో తమ జట్లకు వీరిద్దరిని కెప్టెన్లుగా నియమించింది. ఈ మేరకు ముంబై ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్‌ ప్రకటన విడుదల చేసింది

Ricky Ponting Hospitalised: గుండెల్లో నొప్పితో ఆసుపత్రిలో అడ్మిట్ అయిన రికీ పాంటింగ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌ సందర్భంగా ఘటన

Hazarath Reddy

పెర్త్‌లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌లో రికీ పాంటింగ్ వ్యాఖ్యాతగా ఉన్నప్పుడు గుండెల్లో నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు సెవెన్ నెట్‌వర్క్‌కు వ్యాఖ్యాతగా తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు.

Vijay Hazare Trophy 2022: వరుసగా మూడో సెంచరీ నమోదు చేసిన రుతురాజ్ గైక్వాడ్, విజయ్ హజారే ట్రోఫీ 2022 ఫైనల్‌ మ్యాచ్‌లో చెలరేగిన బ్యాటర్

Hazarath Reddy

రుతురాజ్ గైక్వాడ్ విజయ్ హజారే ట్రోఫీ 2022 ఫైనల్‌లో సెంచరీతో తన చక్కటి ఫామ్‌ను కొనసాగించాడు, ఇది టోర్నమెంట్‌లో అతనికి మూడోది. సౌరాష్ట్ర vs మహారాష్ట్ర ఫైనల్‌లో బ్యాటింగ్ చేసిన రైట్ హ్యాండర్ 125 డెలివరీలలో మూడు అంకెల మార్క్ను చేరుకున్నాడు. అతను 131 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 108 పరుగుల వద్ద ఔటయ్యాడు.

Advertisement

Rajeshwari Gayakwad: వీడియో, దుకాణదారుడిని కొట్టిన భారత మహిళా క్రికెటర్ రాజేశ్వరి గయక్వాడ్, ఆమె స్నేహితురాళ్లు, సీసీటీవీ పుటేజీ వైరల్

Hazarath Reddy

భారత మహిళా క్రికెటర్ రాజేశ్వరి గయక్వాడ్, ఆమె స్నేహితులు సూపర్ మార్కెట్ వద్ద వాగ్వాదానికి దిగారు. సిబ్బందితో కొంత వాగ్వాదం తర్వాత రాజేశ్వరి స్నేహితులు దుకాణదారుడిని కొట్టడం కనిపించింది. రిపోర్టు ప్రకారం, సిసిటివి ఫుటేజీ వైరల్ అయిన తర్వాత రెండు పార్టీలు సమస్యను పరిష్కరించాయి. పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.

Virat Kohli: విరాట్ కోహ్లీ మరో సంచలన రికార్డు, మూడు సోషల్‌ మీడియా ఖాతాలలో 50 మిలియన్ల ఫాలోవర్లను కలిగిన ఏకైక క్రికెటర్‌గా గుర్తింపు

Hazarath Reddy

టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి సోషల్ మీడియాలో మరో ఘనత సాధించాడు. ఫేస్‌బుక్‌లో విరాట్‌ పాలోవర్ల సంఖ్య 50 మిలియన్లకు చేరింది. తద్వారా విరాట్‌ కోహ్లి ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ట్విటర్‌, ఇనస్ట్రాగమ్‌, ఫేస్‌బుక్‌ మూడు సోషల్‌ మీడియా ఖాతాలలో 50 మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్న తొలి క్రికెటర్‌గా కోహ్లీ రికార్డులకెక్కాడు.

PAK vs ENG: పాక్‌లో 13 మంది ఇంగ్లండ్ ఆటగాళ్లకు అంటుకున్న అంతుచిక్కని వైరస్, అందరూ ఇంటి లోపలే ఉండాలని తెలిపిన వైద్యులు

Hazarath Reddy

మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రావల్పిండి వేదికగా పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. చారిత్రాత్మక టెస్ట్‌కు ముందు, బెన్ స్టోక్స్, పలువురు ఇతర ఆటగాళ్లు, సిబ్బంది తెలియని వైరస్ కారణంగా అస్వస్థతకు గురవుతున్నారు. ఇంటి లోపల ఉండమని వైద్యులు సలహా ఇచ్చారు. ఈ వ్యాధితో ఆటకు ముందు ఆటగాళ్ళు చివరి ప్రాక్టీస్ సెషన్‌ను కోల్పోతారు.

Danish Kaneria Slams BCCI: అంబటి రాయుడుని నాశనం చేశారు, ఇప్పుడు శాంసన్‌కు కూడా అన్యాయం చేస్తున్నారు, బీసీసీఐపై మండిపడిన పాక్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా

Hazarath Reddy

Advertisement

Notice to BCCI President Roger Binny: బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నెలకే రోజర్ బిన్నీకి షాక్, మ్యాచ్‌ల ప్రసార హక్కులు స్టార్ స్పోర్ట్స్‌ కు ఇవ్వడంపై ఎథిక్స్ ఆఫీసర్ నోటీసులు, కోడలు కోసమే అలా చేశారంటూ ఫిర్యాదు

Naresh. VNS

భారత్‌లో బీసీసీఐ మ్యాచ్‌ల (BCCI Matches) ప్రసార హక్కులు ఉన్న స్టార్ స్పోర్ట్స్‌లో రోజర్ బిన్నీ కోడలు మయంతి లాంగర్ (Mayanthi Launger) పనిచేస్తోంది. ఇది కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ కిందకే వస్తుందని మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘానికి చెందిన సంజీవ్ గుప్తా (Sanjeev Gupta) ఫిర్యాదు చేశాడు.

AP Minister Roja Fell Down: నగరి క్రీడా సంబరాల్లో అనుకోని ఘటన.. కబడ్డీ ఆడుతూ కిందపడ్డ మంత్రి రోజా.. వీడియో ఇదిగో!

Rudra

ఏపీ మంత్రి రోజా కబడ్డీ ఆడుతూ కిందపడిపోయారు. నగరి డిగ్రీ కాలేజీలో క్రీడా సంబరాలను నిన్న ఆమె ప్రారంభించారు. ఈ పోటీల్లో చిత్తూరు, పూతలపట్టు, పుంగనూరు, నెల్లూరు, నగరి, కుప్పం, పలమనేరు నియోజకవర్గాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా కబడ్డీ ఆడుతూ రెయిడ్ కు వెళ్లి అనుకోకుండా పడిపోయారు.

Lankan Cricketers Marriage: ఒకే రోజు పెళ్లి చేసుకున్న ముగ్గురు శ్రీలంక క్రికెటర్లు.. ఆఫ్ఘనిస్థాన్ తో వన్డే సిరీస్ ఆడుతున్న లంక.. సిరీస్ మధ్యలోనే పెళ్లి బాజాలు.. కొలంబోలో వేర్వేరు ప్రాంతాల్లో వివాహాలు

Rudra

శ్రీలంక క్రికెట్ లో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఒకే రోజు ముగ్గురు క్రికెటర్లు వైవాహిక జీవితంలోకి ప్రవేశించారు. పథుమ్ నిస్సంక, కసున్ రజిత, చరిత్ అసలంక నేడు కొలొంబో నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో పెళ్లి చేసుకున్నారు.

PT Usha: భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలిగా పిటి ఉష, ఈ పదవికి ఎన్నికైన తొలి మహిళగా గుర్తింపు పొందిన పరుగుల రాణి, ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించిన అధికారులు

Hazarath Reddy

పరుగుల రాణి భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.ఈ పదవికి వచ్చే నెల 10న ఎన్నికలు జరగాల్సి ఉండగా, నామినేషన్లకు గడువు ఆదివారమే ముగిసింది. అయితే ఉషకు పోటీగా వేరెవరూ నామినేషన్‌లు దాఖలు చేయకపోవడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.

Advertisement

Ruturaj Gaikwad 7 Sixes Video: ఒకే ఒవర్‌లో ఏడు సిక్సర్లు బాదిన రుతురాజ్ గైక్వాడ్, ఆరు బంతుల్లో 43 పరుగులు పిండుకున్న మహారాష్ట్ర ఓపెనింగ్ బ్యాటర్

Hazarath Reddy

విజయ్ హజారే ట్రోఫీ 2022లో సంచలనం నమోదైంది. మహారాష్ట్ర ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఉత్తరప్రదేశ్‌పై డబుల్ సెంచరీ సాధించాడు. అంతే కాకుండా మరో అద్భుతాన్ని సాధించాడు. ఒకే ఓవర్‌లో ఏడు సిక్సర్లు కొట్టాడు.

Sanju Samson Fans Protest: సంజూ శాంసన్‌ను ఇండియా టీంలోకి తీసుకోవాల్సిందే, FIFA ప్రపంచకప్ 2022లో బ్యానర్లతో మద్ధతుగా నిలుస్తున్న అభిమానులు

Hazarath Reddy

సంజూ శాంసన్ అభిమానులు భారత్ మ్యాచ్‌లు,సోషల్ మీడియాలో మాత్రమే కాకుండా ప్రస్తుతం జరుగుతున్న FIFA ప్రపంచ కప్ 2022లో కూడా అతనికి మద్దతునిస్తున్నారు. అభిమానులు ప్రత్యేక బ్యానర్‌లను ప్రదర్శించడం, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కోసం సందేశాలు ఇవ్వడం కనిపించింది,

FIFA World Cup 2022: ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్‌లో బెల్జియంను చిత్తు చేసిన మొరాకో.. అల్లర్లకు దారితీసిన ఘటన.. వీడియోతో..

Rudra

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్‌లో మ‌రో సంచ‌ల‌నం న‌మోదైంది. మొరాకో జ‌ట్టు బెల్జియంను 2-0తో చిత్తుగా ఓడించింది. అయితే, ఈ విజయం బ్రసెల్స్ లో ఉద్రిక్తతలకు దారి తీసింది.

Camel Flu Infection in Qatar: ఖతార్ లో ఫిఫా వరల్డ్ కప్... పొంచి ఉన్న 'కేమెల్ ఫ్లూ' ముప్పు.. మధ్య ప్రాచ్యదేశాల్లో అధికంగా కనిపించే వైరస్.. కరోనా కంటే ప్రమాదకరమైనదా? అసలు ఏమిటీ 'కేమెల్ ఫ్లూ'??

Rudra

ఖతార్ లో ఫిఫా వరల్డ్ కప్ ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో సాగుతోంది. ప్రపంచం నలుమూలల నుంచి ఈ సాకర్ మెగా ఈవెంట్ చూసేందుకు ఖతార్ కు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఖతార్ లో 'కేమెల్ ఫ్లూ' వైరస్ వ్యాప్తి చెందే ముప్పు పొంచి ఉందని ఓ అధ్యయనం చెబుతోంది.

Advertisement

India vs New Zealand, 2nd ODI: ఆటను ఆపేసిన వరుణుడు.. 4.5 ఓవర్ల వద్ద ఆగిన ఆట.. భారత్‌కు ఈ మ్యాచ్ కీలకం.. మ్యాచ్ కొనసాగడం కష్టమే!

Rudra

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య హమిల్టన్‌లోని సెడాన్‌ పార్క్‌లో జరుగుతున్న రెండో వన్డేకు వరుణుడు అడ్డు తగిలాడు. 4.5 ఓవర్ల వద్ద వర్షం ప్రారంభం కావడంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. ఆట ఆగిపోయే సమయానికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది.

Virat Kohli Fitness Video: వైరల్ వీడియో, జిమ్‌లో పరుగులు పెడుతున్న విరాట్‌ కోహ్లీ, ఫిట్‌నెస్‌కి సంబంధించిన క్లిప్ వైరల్

Hazarath Reddy

విరాట్‌ కోహ్లీ ఫిట్‌నెస్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలో బంగ్లాదేశ్‌ టూర్‌ వెళ్లనున్న నేపథ్యంలో జిమ్‌లో చమటోడుస్తున్నాడు. ఈ మేరకు వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఈ వీడియోలో ట్రెడ్‌మిల్‌పై పరుగులు తీశాడు. అనంతరం చొక్కా లేకుండా బరువులు లాగుతూ కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

FIFA World Cup 2022: బైనాక్యుల‌ర్స్‌లో బీర్‌ను తీసుకువెళ్లిన అభిమాని,షాకయిన సెక్యూరిటీ సిబ్బంది, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

ఖతర్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో స్టేడియాల వద్ద మద్యం అమ్మడం నిషేధంలో ఉంది.అయితే టెన్ష‌న్ త‌ట్టుకోలేని కొంద‌రు అభిమానులు స్టేడియంకు మ‌ద్యాన్ని తీసుకువెళ్తున్నారు.

India vs New Zealand: న్యూజిలాండ్‌తో మొదటి వన్డేలో టీమిండియా ఘోర పరాజయం, ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన కివీస్,మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ

Hazarath Reddy

న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా పరాజయవ పాలైంది. కివీస్‌ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ధావన్‌ సేన ఓటమిని మూటగట్టుకుంది. బ్యాటర్లు రాణించినప్పటికీ బౌలర్లు విఫలం కావడంతో భారత జట్టుకు పరాజయం తప్పలేదు.

Advertisement
Advertisement