క్రీడలు

Tokyo Olympic Games 2020: కాంస్యం పైనే ఆశలు, బెల్జియంతో జరిగిన పురుషుల హాకీ సెమీఫైనల్‌లో భారత్‌ ఓటమి, పెనాల్టీలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైన భారత్ ఆటగాళ్లు

Hazarath Reddy

భారత పురుషుల హాకీ జట్టు కప్‌కు అడుగు దూరంలో ఆగిపోయింది. టోక్యో ఓలింపిక్స్ లో ( Tokyo Olympic Games 2020) సెమీస్‎లో భారత్ పురుషుల హాకీ జట్టు, వరల్డ్ నెంబర్ వన్ బెల్జియంతో సెమీ ఫైనల్లో తలపడింది. ఈ మ్యాచ్‎లో 5-2 తేడాతో బెల్జియం చేతిలో ఇండియా (India Men's Hockey Team ) పరాజయం పాలైంది.

Tokyo 2020 Olympic Games: ఆస్ట్రేలియాకు షాక్..టోక్యో ఒలింపిక్స్‌లో తొలిసారిగా హాకీ సెమీస్‌లోకి భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు, 1980 మాస్కో ఒలింపిక్స్‌ తర్వాత భారత్‌ అత్యుత్తమ ప్రదర్శన

Hazarath Reddy

భార‌త మ‌హిళ‌ల హాకీ ( Indian Women Hockey ) జ‌ట్టు చ‌రిత్ర సృష్టించింది. టోక్యో ఒలింపిక్స్ ( Tokyo Olympics ) సెమీస్‌లో ఇండియ‌న్ జ‌ట్టు ప్ర‌వేశించింది. క్వార్టర్స్‌లో బలమైన ప్రత్యర్థి ఆస్ట్రేలియాను అన్ని విధాలుగా కట్టడి చేసింది. ఏ దశలోనూ వారిని కోలుకోకుండా దెబ్బకొట్టింది.

PV Sindhu Wins Bronze Medal: భారత్ ఖాతాలో మరో పతకం, టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సింధు, భారత్ నుంచి రెండు ఒలింపిక్‌ మెడల్స్‌ అందుకున్న తొలి మహిళగా రికార్డులకెక్కిన తెలుగుతేజం

Hazarath Reddy

భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్‌లో వరుసగా రెండోసారి పతకం (PV Sindhu Wins Bronze Medal) సాధించి రికార్డుకెక్కింది. కోట్లాది మంది భారతీయులు కోరుకున్నట్టే ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకాన్ని అందించింది. కాంస్య పతకం కోసం కొద్దిసేపటి క్రితం ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ హే బింగ్‌జియావో (చైనా)తో జరిగిన పోరులో వరుస సెట్లలో (21-13, 21-15) విజయం సాధించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.

Tokyo Olympics 2020: సహనం కోల్పోయిన వరల్డ్‌ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌, ఓటమితో రాకెట్‌తో నెట్‌పై బలంగా బాదేసిన సెర్బియా ఆటగాడు, సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

Hazarath Reddy

ఒలింపిక్‌ స్వర్ణ పతకంతో పాటు క్యాలెండర్‌ సంవత్సరంలో ‘గోల్డెన్‌ స్లామ్‌’ సాధించాలనే లక్ష్యంతో టోక్యోకు వచ్చిన టెన్నిస్‌ సెర్బియా ఆటగాడు వరల్డ్‌ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ ఆశలు అడియాసలు అయ్యాయి.

Advertisement

Tokyo Olympics 2020: ఒట్టి చేతులతో తిరిగి రావడం చాలా బాధగా ఉంది, అయితే బాక్సింగ్ వదిలిపెట్టను, 0 ఏళ్లు వచ్చేవరకు బాక్సింగ్‌ రింగ్‌ బరిలో ఉంటానని తెలిపిన భారత ​బాక్సర్‌ మేరీకోమ్‌

Hazarath Reddy

పతకం లేకుండా స్వదేశానికి రావడం బాధగా ఉందని భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను పతకం గెలిచి దేశానికి రావాలనుకున్నానని, కానీ వట్టి చేతులతో తిరిగి రావడాన్ని (Mary Kom on Making Comeback ) జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. అయితే తాను బాక్సింగ్‌ను మాత్రం అప్పుడే వదిలిపెట్టనని, కచ్చితంగా కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

Tokyo Olympics 2020: కాంస్యంపై గురిపెట్టిన పీ.వీ. సింధు, సెమీఫైనల్లో తైజూయింగ్‌తో పోరాడి ఓడిన తెలుగమ్మాయి, ఓటమితో కాంస్యం, రజత పతకాలకు దూరమైన తెలుగు తేజం 

Hazarath Reddy

మరోసారి ఒలింపిక్స్ ఫైనల్‌కు చేరాలనుకున్న షట్లర్ పీ.వీ. సింధు కు (PV Sindhu) నిరాశే ఎదురైంది. చైనీస్ తైపీ క్రీడాకారిణి తైజూయింగ్‌తో నిన్న జరిగిన సెమీస్‌లో తలపడిన సింధూ వరుస సెట్లు కోల్పోయి ఓటమిని చవిచూసింది. సెమీఫైనల్లో తై జు 21–18, 21–12 తేడాతో సింధుపై విజయం సాధించింది.

Tokyo Olympics 2020: మరో పతకానికి చేరువలో! టోక్యో ఒలంపిక్స్‌లో సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు, క్వార్టర్‌ ఫైనల్స్‌లో జపాన్‌ క్రీడాకారిణి యమగుచిపై అద్భుత విజయం

Team Latestly

Tokyo Olympics 2020: టొక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయం, బాక్సింగ్ విభాగంలో సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన లవ్లీనా బోర్గాహిన్, మరోవైపు ఆర్చరీలో జోరు కొనసాగిస్తున్న దీపిక కుమారి

Team Latestly

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయమైంది. యువ బాక్సర్‌ లవ్లీనా బొర్గోహెన్‌ సెమీస్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం హోరాహోరీగా సాగిన క్వార్టర్స్‌ పోరులో తైపీకి చెందిన మాజీ ప్రపంచ ఛాంపియన్‌ నీన్‌-చిన్‌పై 4-1 తేడాతో ఘన విజయం సాధించి సెమీస్‌లో బెర్త్‌ ఖరారు చేసుకుంది...

Advertisement

Ind vs SL 3rd T20I Highlights: చివరి టీ20లో యంగ్ టీమిండియా అద్భుత బ్యాటింగ్.. శ్రీలంక ఘన విజయం, సిరీస్ కైవసం; టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ బయలుదేరనున్న భారత జట్టు

Team Latestly

బుధవారం జరిగిన రెండో టీ20లో తృటిలో ఓటమి పాలై ఏం పర్వాలేదనిపించుకున్న టీమిండియా, గురువారం జరిగిన చివరి టీ20లో మాత్రం కసితీరా ఓడింది. శ్రీలంక జట్టుకు తిరుగులేని సిరీస్ విజయాన్ని కట్టబెట్టి వారిలో స్పూర్థి నింపింది.

Tokyo Olympics 2020: ఒలంపిక్స్ క్రీడల్లో భారత అథ్లెట్ల దూకుడు.. క్వార్టర్స్‌ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లిన పివి సింధు, మరో మ్యాచ్‌లో అర్జెంటీనాపై భారత హాకీ జట్టు ఘన విజయం; ఇంకా ఎన్నో విశేషాలు

Vikas Manda

టోక్యో ఒలంపిక్స్ క్రీడలు- 2020 గురువారం 6వ రోజు కొనసాగుతున్నాయి. భారత్ కు సంబంధించి షట్లర్ పివి సింధు, బాక్సర్ మేరీకోమ్, భారత హాకీ జట్టు తదితర ఆసక్తికర మ్యాచ్‌లు ఉన్నాయి. ఇప్పటికే పలు మ్యాచ్‌లు పూర్తి కాగా, మిగతావి మధ్యాహ్నానికి షెడ్యూల్ చేయబడి ఉన్నాయి....

Ind vs SL 2nd T20 Highlights: రెండో టీ20లో భారత్‌పై శ్రీలంక 4 వికెట్ల తేడాతో గెలుపు, స్వల్ప స్కోరును ఛేదించేందుకు చెమటోడ్చిన లంక టీమ్, సిరీస్ 1-1తో సమం; నేడు నిర్ణయాత్మక చివరి టీ20 మ్యాచ్

Team Latestly

శ్రీలంకకు 10 బంతుల్లో 18 పరుగులు కావాల్సిన సమయంలో టీమిండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఒక ఫుల్ టాస్ వేశాడు, దీంతో టెయిలెండర్ కరుణరత్నే నేరుగా దానిని సిక్స్ గా మలిచాడు. ఇక్కడితో స్కోర్ అమాంతం తగ్గిపోయింది, అప్పటివరకు భారత్ చేతిలో ఉన్న మ్యాచ్ ఒక్కసారిగా...

India vs Sri Lanka: 8 మంది భారత క్రికెటర్లు సిరీస్ నుండి ఔట్, కృనాల్ పాండ్యాతో సన్నిహితంగా ఉన్నవారిని ఐసోలేష‌న్‌లో ఉంచనున్న బీసీసీఐ, లిస్టులో శిఖ‌ర్ ధావ‌న్, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిష‌న్‌, కృష్ణ‌ప్ప గౌత‌మ్‌, పృథ్వి షా, సూర్య‌కుమార్ యాద‌వ్‌, మ‌నీష్ పాండే, య‌జువేంద్ర చాహ‌ల్

Hazarath Reddy

శ్రీలంక‌లో ఉన్న ఇండియ‌న్ టీమ్ ప్లేయ‌ర్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా (Krunal Pandya ) కరోనా బారిన ప‌డిన విష‌యం విదితమే. ఇప్పుడు పాండ్యాతో స‌న్నిహితంగా ఉన్న 8 మంది (Eight key Players) ఇండియ‌న్ ప్లేయ‌ర్స్ శ్రీలంక సిరీస్ (India vs Sri Lanka) మొత్తానికీ దూర‌మ‌య్యారు.

Advertisement

Tokyo Olympics 2020: రెండు సార్లు కరోనా..బతకడమే కష్టమన్నారు, ఏకంగా ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు, అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న బ్రిటన్‌ స్విమ్మర్‌ టామ్‌ డియాన్ కథ

Hazarath Reddy

ఏడాదిలో రెండుసార్లు కరోనా మహమ్మారి బారీన పడ్డాడు. అయినా అదరలేదు..బెదరలేదు...ఏకంగా టోక్యో ఒలింపిక్స్ లో (Tokyo Olympics 2020) స్వర్ణంతో మెరిసాడు. ఇది బ్రిటన్‌కు చెందిన స్విమ్మర్‌ టామ్‌ డియాన్‌ (British swimmer Tom Dean) కథ.

Krunal Pandya Tests Positive: భారత్ టీంలో కరోనా కలకలం, కోవిడ్ బారీన పడిన ఆల్‌రౌండ‌ర్ కృనాల్ పాండ్యా, రెండో టీ20 జూలై 28కి వాయిదా, ఐసోలేష‌న్‌లోకి వెళ్లిన రెండు జట్లు

Hazarath Reddy

శ్రీలంక టూర్‌లో ఉన్న భారత్ టీమ్‌లో క‌రోనా క‌ల‌క‌లం రేపింది. ఆల్‌రౌండ‌ర్ కృనాల్ పాండ్యా (Krunal Pandya Tests Positive) కోవిడ్ వైర‌స్ బారిన ప‌డ్డాడు. దీంతో మంగ‌ళ‌వారం జ‌ర‌గాల్సిన రెండో టీ20ని వాయిదా ( T20I Postponed to July 28) వేశారు. ప్ర‌స్తుతం రెండు జ‌ట్లూ ఐసోలేష‌న్‌లో ఉన్నాయి.

'Do You Want to Marry Me': టీవీ కెమెరాల ముందే నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ ప్లేయర్‌కి ప్రపోజ్ చేసిన కోచ్, వెంటనే ఒకే చెప్పిన ప్లేయర్, సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ అవుతున్న వీడియో

Hazarath Reddy

అర్జెంటీనా ఫెన్స‌ర్ మారియా బెలెన్ పెరెజ్ మారిస్ అనే ఆ ప్లేయ‌ర్ లైవ్‌లో మాట్లాడుతుండగా ఆమె కోచ్ లూకాస్ సాసెడో ఆమె వెనుక నుంచి.. న‌న్ను పెళ్లి చేసుకుంటావా అని రాసి ఉన్న ప్ల‌కార్డు ప‌ట్టుకొని నిల్చున్నాడు.కోచ్ స‌డెన్‌గా అలా చేయ‌డం చూసి పెరెజ్ ఆశ్చ‌ర్య‌పోయింది.

Covid In Tokyo: టోక్యోలో కరోనా కల్లోలం, అత్యధికంగా ఒక్కరోజే 2,848 కేసులు నమోదు, ఒలింపిక్స్ గేమ్స్ ప్రారంభమైన తర్వాత జపాన్ రాజధానిలో పంజా విప్పిన కోవిడ్, ఆందోళనకరంగా మారిన డెల్టా వేరియంట్

Hazarath Reddy

టోక్యోలో కరోనా పంజా విసిరింది. అత్యధికంగా నిన్న ఒక్కరోజే 2,848 కేసులు టోక్యోలో (Tokyo Reports Highest Single-Day Spike) నమోదయ్యాయి. ఒలింపిక్స్ గేమ్స్ ప్రారంభమైన తర్వాత కేసులు ఈ స్థాయిలో నమోదవడం ఇదే తొలిసారి. కాగా జపాన్ రాజధానిలో గత జనవరిలో 2520 కేసులు నమోదు కాగా ఈ సారి ఆ రికార్డును తిరగరాస్తూ నిన్న ఒక్కరోజే 2,848 కేసులు నమోదు కావడంతో ఆ దేశంలో ఆందోళన మొదలయింది

Advertisement

IND vs SL 1st T20I 2021: లంక బ్యాట్స్‌మెన్ల భరతం పట్టిన భువీ, తొలి టి20లో శ్రీలంకపై 38 పరుగులతో భారత్ గెలుపు, రేపు రెండో టి20 మ్యాచ్

Hazarath Reddy

శ్రీలంకతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భారత్‌ శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తొలి టి20లో (IND vs SL 1st T20I 2021) టీమిండియా 38 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం (India Register Comprehensive Win) సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది.

Priya Malik Wins Gold Medal: మరో పతకం భారత్ ఖాతాలో.. ప్రపంచ క్యాడెట్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన భారత రెజ్లర్ ప్రియా మాలిక్

Hazarath Reddy

హంగరీలో జరిగిన 2021 ప్రపంచ క్యాడెట్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ ప్రియా మాలిక్ బంగారు పతకం సాధించాడు. భారత మహిళా రెజ్లర్ ప్రియా మాలిక్ 75 కిలోల బరువు విభాగంలో బంగారు పతకం సాధించారు. ప్రియా మాలిక్ 5-0తో బెలారసియన్ రెజ్లర్‌ను ఓడించి బంగారు పతకం సాధించింది.

Saikhom Mirabai Chanu: జైహింద్..పతకం తీసుకురావాలంటూ దేవుణ్ణి ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన మీరాబాయి, చానుకు రూ.కోటి నజరానా ప్రకటించిన మణిపూర్ సీఎం

Hazarath Reddy

ఒలింపిక్స్ లో రజతం సాధించిన మణిపూర్ డైమండ్ చానుబాయిపై (Saikhom Mirabai Chanu) దేశ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా దేశ వ్యాప్తంగా అందరూ ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అందరికీ ధన్యవాదాలు చెబుతూ మీరాబాయి తాజాగా వీడియో విడుదల చేసింది.

CM KCR Congratulated To Mirabai: మీరాబాయ్ చానుకి సీఎం కేసీఆర్ అభినందనలు, ఇదే స్ఫూర్తిని మన క్రీడాకారులు కొనసాగించి మరిన్ని పతకాలను దేశానికి సాధించిపెట్టాలని ఆకాంక్షించిన తెలంగాణ ముఖ్యమంత్రి

Hazarath Reddy

టోక్యో ఒలింపిక్స్ ప్రారంభమైన తొలి రోజే భారత్ పతకాన్ని కైవసం చేసుకోవడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయి చాను సిల్వర్ మెడల్ సాధించడం గొప్ప విషయమన్నారు.

Advertisement
Advertisement