క్రీడలు

PV Sindhu: బ్యాడ్మింట‌న్ అకాడ‌మీకి పీవీ సింధు భూమి పూజ, ఏడాదిలోపు అకాడ‌మీ నిర్మాణం పూర్తి చేస్తామ‌ని ప్ర‌క‌టన‌

Arun Charagonda

బ్యాడ్మింట‌న్ అకాడ‌మీకి పీవీ సింధు భూమి పూజ చేశారు. ఏపీ ప్రభుత్వం కేటాయించిన భూమిలో బ్యాడ్మింట‌న్ అకాడ‌మీని నిర్మిస్తున్నారు సింధు. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి పూజ‌లో పాల్గొన్నారు సింధు. ఏడాదిలోపు అకాడ‌మీ నిర్మాణం పూర్తి చేస్తామ‌ని ప్ర‌క‌టించగా త‌మ అకాడమీ నిర్మాణానికి ప్ర‌భుత్వ స‌హ‌కారం ఉంద‌ని తెలిపారు. అన్నీ అనుమ‌తులు ల‌భించాకే భూమి పూజ చేశానని తెలిపారు.

Thomas Draca: ఐపీఎల్ 2025 మెగా వేలం, రూ.30 లక్షల కనీస ధరతో ఇటలీ నుంచి తొలిసారిగా పేరు నమోదు చేసుకున్న థామస్ డ్రాకా, అతని క్రీడా బయోడేటా ఇదే..

Vikas M

ఇటలీ క్రికెటర్ థామస్ డ్రాకా తొలిసారి ఐపీఎల్ మెగా వేలంలో పేరు నమోదు చేసుకున్నాడు. ఈ నెల 24, 25న సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఐపీఎల్ వేలం జరగనుండగా ఇటాలియన్ క్రికెటర్ థామస్ డ్రాకా తన పేరును నమోదు చేసుకున్నాడు.

Match Fixing Scandal in Mizoram: భార‌త‌ ఫుట్‌బాల్‌లో మ్యాచ్ ఫికింగ్స్ క‌ల‌క‌లం, 24 మంది ఆటగాళ్లపై వేటు వేసిన మిజోరాం ఫుట్‌బాల్ స‌మాఖ్య

Vikas M

భార‌త‌ ఫుట్‌బాల్‌ అయిన మిజోరం ప్రీమియ‌ర్ లీగ్‌(Mizoram Premier League)లో ప‌లువురు ఆట‌గాళ్లు ఫిక్సింగ్‌కు పాల్ప‌డ్డారు. దాంతో, స్థానిక పోలీసుల సాయంతో విచార‌ణ చేపట్టిన మిజోరం ఫుట్‌బాల్ స‌మాఖ్య (MFA) క‌ఠిన నిర్ణ‌యం తీసుకుంది.

AUS vs PAK 1st ODI: పాకిస్తాన్‌పై చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా, తొలి వన్డేలో రెండు వికెట్ల తేడాతో ఘన విజయం

Vikas M

పాకిస్తాన్‌తో మూడు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ లో భాగంగా ఆస్ట్రేలియా తొలి వన్డేలో గెలిచి వన్డే సిరీస్‌ను విజయంతో ప్రారంభించింది. మెల్‌బోర్న్‌ వేదికగా సోమవారం జరిగిన తొలి మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాతో గెలిచింది.

Advertisement

AUS vs PAK 1st ODI: వారెవ్వా.. సిక్స్ పోయే బంతిని ఆపిన ఇర్ఫాన్ ఖాన్ ఫీల్డింగ్ చూస్తే సూపర్ అనాల్సిందే, అయితే దురదృష్టం ఏంటంటే..

Vikas M

AUS vs PAK 1వ ODI సమయంలో అదిరిపోయే సంఘటన చోటు చేసుకుంది. ఇర్ఫాన్ ఖాన్ యొక్క సూపర్‌మ్యాన్-ఎస్క్యూ ఒక నిర్దిష్ట సిక్స్‌ను నిరోధించడానికి ప్రయత్నించింది. అయితే అతను బంతిని ఆపే ముందు బౌండరీ లైన్ తొక్కి సిక్స్ పోయే బంతిని ఆపడంతో అంపైర్ దాన్ని సిక్స్ గా ప్రకటించారు. ఈ వీడియో క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది.

WTC Points Table: వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పడిపోయిన భారత్, టాప్ ప్లేసులోకి దూసుకువచ్చిన ఆస్ట్రేలియా

Vikas M

న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్‌లో ఓటమి అనంతరం వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో టీమిండియా రెండో స్థానానికి పడిపోయింది. భారత్‌ రెండో స్థానానికి పడిపోవడంతో ఆస్ట్రేలియా టాప్‌ ప్లేస్‌కు చేరుకుంది.

IND vs NZ, Third Test: సొంత గడ్డపై టీమిండియాకు ఘోర పరాభవం, మూడో టెస్టులో 25 పరుగుల తేడాతో న్యూజీలాండ్ ఘన విజయం

Vikas M

సొంత గడ్డపై టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టెస్టులో 25 పరుగుల తేడాతో భారత్ దారుణ ఓటమి చవిచూసింది. 147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించడంలో టీమిండియా చతకలపడిం‍ది.లక్ష్య చేధనలో కేవలం 121 పరుగులకే భారత జట్టు కుప్పకూలింది.

IND vs NZ: టీమిండియాను వైట్ వాష్ చేసిన కివీస్, ప్రపంచంలోనే తొలి జట్టుగా చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్‌

Vikas M

టీమిండియాతో జ‌రిగిన మూడో టెస్టులో 25 ప‌రుగుల తేడాతో న్యూజిలాండ్ అద్బుత విజ‌యం సాధించింది. తద్వారా మూడు టెస్టుల సిరీస్‌లో భార‌త్‌ను 3-0 తేడాతో న్యూజిలాండ్ వైట్ వాష్ చేసింది. ముంబై వేదిక‌గా జరిగిన ఆఖ‌రి టెస్టులో కివీస్ స్పిన్న‌ర్లు సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచారు.

Advertisement

MI Retention List for IPL 2025: ముంబై ఇండియన్స్ రిటెయిన్ ఆటగాళ్ల జాబితా ఇదిగో, కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా, రూ.18 కోట్లతో జస్ప్రీత్ బుమ్రా, రూ.8 కోట్లతో తిలక్ వర్మ రిటెయిన్

Vikas M

. ముంబై ఇండియన్స్ కూడా తమ రిటెయిన్ ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్ ధీర్, జస్ప్రీత్ బుమ్రాలను అట్టిపెట్టుకుంది. ముంబై కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రాకు అవకాశం ఇవ్వొచ్చంటూ ఊహాగానాలు వెలువడినప్పటికీ హార్దిక్ పాండ్యానే కొనసాగించారు.

SRH Retention List for IPL 2025: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రిటైన్‌ చేసుకున్న ఆటగాళ్లు వీరే, వదులుకున్న ఆటగాళ్లు లిస్టు ఇదిగో..

Vikas M

ఐపీఎల్ రిటెన్షన్ జాబితాలు వచ్చేశాయి. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు జట్లు అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాలను ఆయా ఫ్రాంచైజీలు నేడు ప్రకటించాయి. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సాధ్యమైనంత వరకు ఆటగాళ్లను అట్టిపెట్టుకునే ప్రయత్నం చేసింది.

IPL 2025: స్టార్ ప్లేయర్లతో పాటు కెప్టెన్లను వదిలేసిన పలు ఫ్రాంచైజీలు, వేలంలో అదృష్టం పరీక్షించుకోనున్న ఆటగాళ్లు వీరే..

Vikas M

ఐపీఎల్‌ 2025 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్‌ జాబితాను కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. అన్ని ఫ్రాంచైజీలు ఊహించినట్టుగానే తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించాయి. అయితే కొన్ని ఫ్రాంచైజీలు ఆసక్తికరంగా తమ కెప్టెన్లను వదిలేశాయి.అలాగే పలు చోట్ల స్టార్ ప్లేయర్లను సైతం విడుదల చేశాయి.

IPL 2025 Retentions: వామ్మో, ఈ ఆటగాడికి ఏకంగా రూ.21 కోట్లు వెచ్చించిన సన్‌రైజర్స్ హైదరాబాద్, విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన హెన్రిచ్ క్లాసెన్‌

Vikas M

ఐపీఎల్‌ 2025 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్‌ జాబితాను కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. అన్ని ఫ్రాంచైజీలు ఊహించినట్టుగానే తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించాయి. ప్రస్తుతం రిటైన్‌ చేసుకున్న ఆటగాళ్లు మినహా మిగతా ఆటగాళ్లంతా నవంబర్‌ చివరి వారంలో జరిగే వేలంలో పాల్గొంటారు.

Advertisement

IPL 2025 Retentions: ఐపీఎల్ రిటెన్షన్‌లో అన్ని జట్ల ఆటగాళ్ల జాబితా ఇదిగో, మిగతా ఆటగాళ్లకు నవంబర్‌ చివరి వారంలో వేలం

Vikas M

ఐపీఎల్‌ 2025 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్‌ జాబితాను కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. అన్ని ఫ్రాంచైజీలు ఊహించినట్టుగానే తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించాయి. ప్రస్తుతం రిటైన్‌ చేసుకున్న ఆటగాళ్లు మినహా మిగతా ఆటగాళ్లంతా నవంబర్‌ చివరి వారంలో జరిగే వేలంలో పాల్గొంటారు.

ICC Test Rankings: ప్రపంచ నంబర్ 1 బౌలర్‌గా కగిసో రబాడ, నంబర్ వన్ ర్యాంకు నుంచి 3వ స్థానానికి పడిపోయిన భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా

Vikas M

ఐసీసీ తాజాగా టెస్ట్ బౌలింగ్ ర్యాంకులను బుధవారం విడుదల చేసింది. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో 9 వికెట్లతో అదరగొట్టిన దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ ప్రపంచ నంబర్ 1 బౌలర్‌గా అవతరించాడు. పూణే టెస్టులో న్యూజిలాండ్‌పై ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయిన భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా నంబర్ వన్ ర్యాంకు నుంచి 3వ స్థానానికి దిగజారాడు.

Kapil Dev: సీఏం చంద్రబాబుతో భేటీ కోసం విజయవాడ చేరుకున్న టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, రాష్ట్రంలో గోల్ఫ్ కోర్ట్ ఏర్పాటుపై ముఖ్యమంత్రితో చర్చించే అవకాశం

Hazarath Reddy

భారత క్రికెట్ జట్టు మాజీ సారధి కపిల్ దేవ్ విజయవాడకు చేరుకున్నారు. కపిల్ దేవ్‌కి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు ,ఎంపి కేశినేని శివనాథ్, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్వాగతం పలికారు.

New Zealand Women Defeats India Women: రెండో వ‌న్డేలో 76 ప‌రుగుల తేడాతో న్యూజిలాండ్ విజ‌యం, ఆల్ రౌండ్ ప్ర‌తిభ‌తో అద‌ర‌గొట్టిన‌ సోఫీ డివైన్‌, సిరీస్ 1-1 తో స‌మం

VNS

అహ్మదాబాద్‌ వేదికగా భారత మహిళల క్రికెట్‌ జట్టుతో ​ఇవాళ జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్‌ 78 పరుగుల తేడాతో గెలుపొందింది (New Zealand Women Defeats India Women). ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది.

Advertisement

India vs New Zealand 2nd Test: రెండో టెస్టులోనూ టీమిండియా ఓటమి,113 పరుగుల తేడాతో గెలుపొందిన న్యూజిలాండ్, సిరీస్ కైవసం చేసుకున్న కివీస్

Arun Charagonda

భారత్‌తో జరిగిన మూడు టెస్టులో సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే గెలుపొందింది న్యూజిలాండ్. పూణే వేదిక‌గా జ‌రిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ 113 ప‌రుగుల తేడాతో భార‌త్ పై విజ‌యం సాధించింది. 359 ప‌రుగుల భారీ విజ‌య ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్ 245 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దీంతో 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. య‌శ‌స్వి జైస్వాల్ (77) పరుగులతో రాణించగా జ‌డేజా (42) ఫ‌ర్వాలేద‌నిపించాడు. కివీస్ బౌల‌ర్ల‌లో మిచెల్ శాంట్న‌ర్ ఆరు వికెట్లు తీశాడు.

India vs New Zealand 2nd Test: టీమిండియా టార్గెట్ 359, రెండో ఇన్నింగ్స్‌లో 255 పరుగలకు న్యూజిలాండ్ ఆలౌట్, ధాటిగా రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన రోహిత్ సేన

Arun Charagonda

పూణే వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో 359 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ముందు ఉంచింది న్యూజిలాండ్. రెండో ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ టామ్ లాథ‌మ్ (86) హాఫ్ సెంచ‌రీతో రాణించగా గ్లెన్ ఫిలిప్స్ ( 48 నాటౌట్‌), టామ్ బ్లండెల్ (41) పరుగులు చేశారు.

India Squads Announced: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 కోసం భారత జట్టు ప్రకటన, గాయం నుంచి ఇంకా కోలుకోని షమీకి నో ఛాన్స్

Vikas M

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 కోసం భారత జట్టులను ప్రకటించారు. నితీష్ కుమార్ రెడ్డి, అతి తక్కువ ఫార్మాట్‌లో తన ఆకట్టుకునే ప్రదర్శనల తర్వాత, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 జట్టులో చేర్చబడ్డాడు, ఇది చాలా ఉత్తేజకరమైన పరిణామం

R Ashwin New Record: రవిచంద్రన్ అశ్విన్ సరికొత్త రికార్డు, అంతర్జాతీయ క్రికెట్‌లో 150 వికెట్లు ఎల్‌బీడబ్ల్యూ ఔట్‌ల రూపంలో సాధించిన రెండవ బౌలర్‌గా ఘనత

Vikas M

పూణే వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్‌‌లో తొలి రోజున టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రాణించిన విషయం తెలిసిందే. మూడు కీలకమైన వికెట్లు తీసి తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ను 259 పరుగులకే ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

Advertisement
Advertisement