Cricket
ICC Women’s T20 World Cup 202: దుబాయ్, షార్జాలో ICC మహిళల T20 ప్రపంచ కప్ 2024, బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ అశాంతితో ఐసీసీ కీలక నిర్ణయం
Vikas Mఒక ప్రధాన పరిణామంలో, బంగ్లాదేశ్లో రాజకీయ అశాంతి మధ్య ICC మహిళల T20 ప్రపంచ కప్ 2024 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి మార్చబడింది. విద్యార్థుల నిరసనల కారణంగా ఈ నెల ప్రారంభంలో ప్రధాని షేక్ హసీనా బహిష్కరణకు దారితీసిన తర్వాత టోర్నమెంట్ను ఆసియా దేశం నుంచి తరలించడంపై చర్చలు జరిగాయి.
U19 Women’s T20 World Cup 2025: మహిళల అండర్-19 ప్రపంచకప్ షెడ్యూల్ వచ్చేసింది, జనవరి 19న వెస్టిండీస్తో వరల్డ్ కప్ వేటను ప్రారంభించనున్న భారత్
Vikas Mరెండేండ్లకోసారి జరిగే మహిళల అండర్-19 ప్రపంచకప్లో రెండో ఎడిషన్కు సంబంధించిన షెడ్యూల్ ను ఐసీసీ విడుదల చేసింది. మలేషియా ఆతిథ్యమివ్వనున్న ఈ టోర్నీ 2025 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 దాకా కొనసాగనుంది. 16 జట్లు పాల్గొనబోయే ఈ మెగా టోర్నీలో జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు.
Virat Kohli in London: వీడియో ఇదిగో, లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న విరాట్ కోహ్లీ, బ్లాక్ డ్రెస్ వేసుకుని రోడ్డు దాటుతున్న వీడియో వైరల్
Vikas Mటీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి లండన్ వీధుల్లో ప్రత్యక్షమయ్యాడు. శ్రీలంకతో వన్డే సిరీస్ అనంతరం కోహ్లి తన భార్య పిల్లలను కలిసేందుకు లండన్కు పయనమయ్యాడు. ఈ క్రమంలో లండన్ వీధుల్లో కోహ్లి తిరుగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది.బ్లాక్ డ్రెస్ వేసుకున్న కోహ్లి రోడ్డును దాటుతున్నట్లు ఈ వీడియోలో కన్పించింది.
Hardik Pandya Dating Jasmin Walia? భార్యతో విడిపోగానే బ్రిటిష్ సింగర్తో హార్దిక్ పాండ్యా డేటింగ్ ? ఇన్స్టాలో వైరల్ అవుతున్న ఫోటోలు
Vikas Mభారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya), సెర్బియా నటి నటాషా స్టాంకోవిచ్ గత నెలలో తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. అయితే హార్ధిక్ పాండ్యా(Hardik Pandya).. బ్రిటీష్ సింగర్ జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్లు వస్తున్నాయి.
Latest ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ ఇవిగో, నంబర్ వన్ స్థానంలో పాక్ బ్యాటర్ బాబర్ అజామ్, రెండవ స్థానంలో రోహిత్ శర్మ, మూడో స్థానానికి పడిపోయిన శుభ్మన్ గిల్
Vikas Mటీమ్ఇండియా స్టార్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో ఒక స్థానం మెరుగై రెండో స్థానానికి చేరుకున్నాడు. రోహిత్కు కెరీర్లో ఇదే అత్యుత్తమ ర్యాంకు. పాక్ బ్యాటర్ బాబర్ అజామ్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్లో రోహిత్ రాణించాడు. మూడు ఇన్నింగ్స్ల్లో కలిపి 157 పరుగులు చేశాడు.
Morne Morkel: టీమిండియా బౌలింగ్ కోచ్గా మోర్నే మోర్కెల్, అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ కార్యదర్శి జే షా, గతంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్గా పనిచేసిన సౌతాఫ్రికా మాజీ బౌలర్
Vikas Mటీమిండియా బౌలింగ్ కోచ్గా మోర్నే మోర్కెల్(Morne Morkel)ను నియమించారు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జే షా ద్రువీకరించారు. సౌతాఫ్రికా మాజీ బౌలర్.. గతంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్గా చేశాడు. ఇండియాలో 2023లో వన్డే వరల్డ్కప్ జరిగిన సమయంలో పాక్ బౌలింగ్ కోచ్గా మోర్కెల్ ఉన్నాడు.
Duleep Trophy 2024 Squads Announced: దులీప్ ట్రోఫీ 2024 స్క్వాడ్స్ ప్రకటించిన బీసీసీఐ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మిస్ అవుట్, కెప్టెన్లు ఎవరెవరంటే..
Vikas Mచాలా అంచనాల తర్వాత, BCCI యొక్క సెలక్షన్ కమిటీ బుధవారం దులీప్ ట్రోఫీ 2024 మొదటి రౌండ్ కోసం జట్టులను ప్రకటించింది. దేశవాళీ సీజన్లో రెడ్-బాల్ క్రికెట్కు నాంది పలికే దులీప్ ట్రోఫీ, అంతర్జాతీయ అత్యుత్తమ ఆటగాళ్లను చూడనుంది. సర్క్యూట్, కొంతమంది యువకులు,టాలెంట్ నిరూపించుకోవాలనుకునే ప్రతిభావంతులు అత్యున్నత స్థాయిలో పోటీ పడుతున్నారు.
Sachin on Vinesh Phogat Disqualification: వినేశ్ ఫొగాట్ రజత పతకానికి అర్హురాలే, భారత్ రెజ్లర్కు బాసటగా నిలిచిన సచిన్ టెండూల్కర్
Vikas Mఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్స్కు చేరిన వినేశ్ ఫొగాట్ 100 గ్రాముల అదనపు బరువు కారణంగా పతకానికి దూరమైన విషయం తెలిసిందే. దీనిపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS) విచారణ జరపనున్న నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించారు. వినేశ్ ఫొగాట్ రజత పతకానికి అర్హురాలేనన్నారు
PAK New Coach: పాకిస్థాన్ కొత్త కోచ్ గా ఆస్ట్రేలియన్ సీనియర్ ఆటగాడు, బంగ్లాదేశ్ తో టెస్టు ముందు కీలక నిర్ణయం
VNSపాకిస్తాన్ టెస్ట్ జట్టు హై పెర్ఫార్మెన్స్ కోచ్గా ఆస్ట్రేలియా మాజీ కోచ్ టిమ్ నీల్సన్ (Tim Nielsen) నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. నీల్సన్ పేరును పాక్ టెస్ట్ జట్టు హెడ్ కోచ్ జేసన్ గిలెస్పీ ప్రతిపాదించాడు. గిలెస్సీ, నీల్సన్ కలిసి గతంలో సౌత్ ఆస్ట్రేలియా క్రికెట్ అకాడమీలో పని చేశారు
Virat Kohli: విరాట్ కోహ్లీ 1300వ ఫోర్ చూశారా, ఎంత సింపుల్గా కొట్టేశాడో..వీడియో వైరల్
Arun Charagondaశ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్లో టీమిండియా పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ముఖ్యంగా శ్రీలంతో జరిగిన మూడో వన్డేలో ఘోరమైన ఓటమిని మూటగట్టుకుంది. బ్యాటింగ్లో రోహిత్ శర్మ ఒక్కడే రాణిస్తుండగా మిగితా బ్యాట్స్మెన్ అంతా విఫలమవుతున్నారు. అయితే మూడో వన్డేలో అద్భుతమైన ఫోర్ కొట్టడం ద్వారా ఇప్పటివరకు 1300 ఫోర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు విరాట్.
Sri Lanka Win By 110 Runs: కీలక మ్యాచ్ లో చేతులెత్తేసిన టీమిండియా, మూడో వన్డేలో భారీ తేడాతో శ్రీలంక విజయం, 2-0 తేడాతో సిరీస్ లంక కైవసం
VNSటాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకు ఓపెనర్లు అవిష్క ఫెర్నాండో, పాతుమ్ నిస్సాంక అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. మొదటి వికెట్కు 89 పరుగులు జోడించారు. హాఫ్ సెంచరీకి ఐదు పరుగుల దూరంలో అక్షర్ పటేల్ బౌలింగ్లో పంత్ క్యాచ్ అందుకోవడంతో నిస్సాంక ఔట్ అయ్యాడు.
Graham Thorpe Dies: తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రాహం థోర్ప్ కన్నుమూత, సంతాపం వ్యక్తం చేసిన ఇంగ్లండ్ ఆటగాళ్లు
Vikas Mఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రాహం థోర్ప్ (55) కన్నుమూశారు. గత రెండేండ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న థోర్ప్ సోమవారం తుదిశ్వాస విడిచినట్టు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తెలిపింది. 1993 నుంచి 2005 వరకు ఇంగ్లండ్ తరఫున ఆడిన థోర్ప్.. వంద టెస్టులు, 82 వన్డేలలో ప్రాతినిథ్యం వహించాడు.
Bangladesh Unrest: బంగ్లాదేశ్ నిరసనలు, ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ వేదిక మారనున్నట్లు వార్తలు, భారత్ లేదా UAE లేదా శ్రీలంకకు ఐసీసీ తరలిస్తుందా?
Vikas Mబంగ్లాదేశ్లో చెలరేగుతున్న హింస ప్రపంచ క్రికెట్పై పడనుంది. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా (Shaikh Hasina) రాజీనామాతో దేశం సైన్యం చేతుల్లోకి వెళ్ళింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లో మరో రెండు నెలల్లో జరగాల్సిన మహిళల టీ20 వరల్డ్ కప్ (T20 World Cup 2024)పై అనిశ్చితి నెలకొంది.
Vinod Kambli Viral Video: ఓ సచిన్.. నీ స్నేహితుడిని చూశావా, నడవలేని స్థితిలో వినోద్ కాంబ్లీ వీడియో వైరల్, సాయం చేయాలంటూ టెండూల్కర్కి ట్యాగ్ చేస్తున్న అభిమానులు
Vikas Mమాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్క్ర్ చిన్ననాటి స్నేహితుడు, 90వ దశకంలో టీమిండియా స్టార్ బ్యాటర్గా వెలుగొందిన భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియోలో 52 ఏళ్ల కాంబ్లీ నడవలేని స్థితిలో కనిపించాడు.
Anshuman Gaekwad: క్యాన్సర్తో పోరాడి ఓడిన టీమిండియా లెజెండరీ అన్షుమాన్ గైక్వాడ్,ఆటగాడిగా,కోచ్గా,సెలక్టర్గా రికార్డ్స్ ఇవే
Arun Charagondaభారత లెజండరీ క్రికెటర్ అన్షుమాన్ గైక్వాడ్ ఇకలేరు. క్యాన్సర్తో సుదీర్ఘ పోరాటం చేసిన గైక్వాడ్ బుధవారం అర్థరాత్రి మృతి చెందాడు. ఆయన వయస్సు 71. గైక్వాడ్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
India Vs Sri Lanka ODI Series: భారత్-శ్రీలంక వన్డే సిరీస్ ను ఇలా ఉచితంగా చూసేయండి! జియో సినిమాలో కాదు..ఇక్కడ ఉచితంగా స్ట్రీమింగ్, ఇంతకీ సిరీస్ ఎప్పటి నుంచి అంటే?
VNSశ్రీలంకతో జరిగిన మూడు మ్యాచుల టీ20 సిరీస్ను టీమ్ఇండియా (Team India) క్లీన్స్వీప్ చేసింది. ఇప్పుడు అందరి దృష్టి ఆగస్టు 2 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్ పై పడింది. టీ20 సిరీస్ ఇచ్చిన ఉత్సాహంతో టీమ్ఇండియా వన్డే సిరీస్కు (IND Vs SL ODI sreies) సిద్ధం అవుతోంది.
Rinku Singh Bowling: రింకూ సింగ్ గేమ్ ఛేంజర్, వీడియో ఇదిగో..అద్భుత బౌలింగ్,వావ్ అనకుండా ఉండలేరు!
Arun Charagondaశ్రీలంకతో జరిగిన మూడు టీ 20ల సిరీస్ను కైవసం చేసుకుంది టీమిండియా. ఇక ఈ మ్యాచ్లో శ్రీలంక 12 బంతుల్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా అనూహ్యంగా మ్యాచ్ టైగా ముగిసింది. 19వ ఓవర్లో ఎవరూ ఉహించని విధంగా బ్యాట్స్మెన్ రింకూ సింగ్కు బాల్ అప్పగించాడు కెప్టెన్ సూర్య.
Suryakumar Yadav Bowling: వీడియో ఇదిగో, సూర్యకుమార్ యాదవ్ సూపర్బ్ బౌలింగ్, ఒకే ఓవర్లో రెండు వికెట్లు, మ్యాచ్ టై
Arun Charagondaభారత్ - శ్రీలంక మధ్య జరిగిన మూడో టీ20లో అద్భుతం చేశాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. చివరి ఓవర్లో శ్రీలంక 6 పరుగులు చేస్తే విజయం సాధిస్తుందన్న తరుణంలో బౌలింగ్కు దిగాడు సూర్య. ఈ ఓవర్లో 5 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీసి మ్యాచ్ టైగా ముగియడంలో కీ రోల్ పోషించాడు.
IND vs SL: సూపర్ ఓవర్లో సూర్య సేన గెలుపు, కెప్టెన్గా తొలి సిరీసే క్లీన్ స్వీప్, బంతితో మ్యాజిక్ చేసిన రింకూ,సూర్య
Arun Charagondaశ్రీలంకతో జరిగిన టీ 20 సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది టీమిండియా. కోచ్గా గంభీర్కు, కెప్టెన్గా సూర్యకుమార్కు ఇది తొలి సిరీస్ కాగా అదరగొట్టింది టీమిండియా. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను కైవసం చేసుకుంది. చివరి టీ20 సూపర్ ఓవర్లో విజయం సాధించింది టీమిండియా.
Sri Lanka's Squad For ODI Series: భారత్తో మూడు వన్డేల సిరీస్కు శ్రీలంక జట్టు ప్రకటన, ఆ స్టార్ ఆటగాళ్లకు నో ఛాన్స్
Vikas Mభారత్తో మూడు వన్డేల సిరీస్కు 16 మంది సభ్యులతో కూడిన జట్టును శ్రీలంక క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. ఈ జట్టుకు ఆల్రౌండర్ చరిత్ అసలంక కెప్టెన్గా ఎంపికయ్యాడు. కుసాల్ మెండిస్ను తప్పించి వన్డే జట్టు కెప్టెన్సీ బాధ్యతలను అసలంకకు లంక క్రికెట్ అప్పగించింది.