Cricket

IPL Matches In Uppal Stadium: ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ ల సందడి.. స్టేడియంలో 7 మ్యాచ్ లు వివరాలు ఇవిగో.. భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన రాచకొండ సీపీ

Rudra

క్రికెట్ ప్రియులను ఉర్రూతలూగించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వచ్చేస్తోంది. ఈ నెల 31న ఐపీఎల్ తాజా సీజన్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో హైదరాబాదీ క్రికెట్ ప్రేమికులకు గుడ్ న్యూస్. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సొంత మైదానం అయిన ఉప్పల్ స్టేడియంలో ఈసారి 7 ఐపీఎల్ మ్యాచ్ లు జరగనున్నాయి.

International Cricket Stadium in Varanasi: భారత్‌లో మరో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మాణం, రూ.300 కోట్లతో చేపట్టనున్న బీసీసీఐ, ప్రధాని మోదీ నియోజకవర్గంలోనే భారీ స్టేడియం నిర్మిస్తున్నట్లు ప్రకటన

VNS

ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక నగరమైన వారణాసిలో (Varanasi) ఈ స్టేడియం రూపుదిద్దుకోనుంది. ఇందుకు సంబంధించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే 31 ఎకరాల భూమిని సేకరించింది. ఇందుకు పరిహారంగా రూ. 120 కోట్ల రూపాయలను రైతులకు అందించింది. తాజాగా స్టేడియం నిర్మించే ప్రాంతాన్ని ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు పరిశీలించారు.

IND vs AUS: స్టార్క్ స్వింగ్ దెబ్బకు మా బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు, ఓటమిపై స్పందించిన రోహిత్ శర్మ, మార్ష్‌ ప్రపంచం‍లోనే పవర్‌ హిట్టర్లలో టాప్‌ 3లో ఒకడని వెల్లడి

Hazarath Reddy

భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ తన జట్టు బ్యాట్‌తో తమను తాము ఉపయోగించుకోలేక పోయిందని అంగీకరించారు, ఫలితంగా రెండో వన్డే ఇంటర్నేషనల్ (ODI)లో ఆస్ట్రేలియా చేతిలో 10 వికెట్ల తేడాతో అవమానకరమైన ఓటమిని ఎదుర్కొన్నారు.

IND v AUS 2nd ODI: భారత బౌలింగ్‌ను చీల్చి చెండాడిన ఆస్ట్రేలియా ఓపెనర్లు, రెండో వన్డేలో టీమిండియా ఘోర పరాజయం, పది వికెట్ల తేడాతో గెలిచిన కంగారులు

Hazarath Reddy

విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘోర పరాజయం పాలైంది.కంగారులు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను ఆసీస్‌ 1-1తో సమం చేసింది.

Advertisement

IND Vs AUS: విశాఖలో ఉదయం నుంచి భారీ వర్షం.. రోజంతా వర్షం కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ.. రెండో వన్డేపై నీలినీడలు.. మ్యాచ్ నిర్వహణ కష్టమనే అభిప్రాయం

Rudra

గత మూడు రోజులుగా వర్షంతో తడిసి ముద్దైన విశాఖపట్టణంలో నేడు కూడా వర్షం కురుస్తున్నది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య నేడు నగరంలో రెండో వన్డే జరగాల్సి ఉంది. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి.

'I Have Had My Aadhar Card Made': భారత్ అంటే నాకు చాలా ఇష్టం, పాక్ మాజీ స్పీడ్ బౌలర్ షోయబ్ అక్తర్ కీలక వ్యాఖ్యలు, నా ఆధార్ కార్డు అక్కడే తయారు చేయించుకున్నానని వెల్లడి

Hazarath Reddy

పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తనకు భారత్ అంటే చాలా ఇష్టమని, తన ఆధార్ కార్డు కూడా తయారు చేయించుకున్నానని పేర్కొన్నాడు. వార్తా సంస్థ ANI స్పీడ్‌స్టర్‌ను ఉటంకిస్తూ “నేను భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను. అక్కడ చాలా మంది స్నేహితులు ఉన్నారు.

Rohit Sharma's Dance Video: బావ పెళ్లిలో డ్యాన్స్‌తో అదరగొట్టిన రోహిత్ శర్మ, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

గురువారం రాత్రి జరిగిన వివాహ వేడుకలో రోహిత్ తన భార్య రితికా సజ్దేహ్‌తో కలిసి వేదికపై డ్యాన్స్ చేస్తూ కనిపించిన క్లిప్ బయటకు వచ్చింది.రోహిత్ తన డ్యాన్స్ మూవ్‌లను అదరగొట్టాడు,అభిమానులు దానిని ఇష్టపడుతున్నారు. ఇప్పుడు వైరల్ అవుతున్న క్లిప్ ఇక్కడ ఉంది

Yuvraj Singh Meets Rishabh Pant: మరోసారి సత్తా చాటేందుకు రెడీ అవుతున్న రిషబ్ పంత్, సోషల్‌ మీడియాలో కలిసిన ఫోటోను షేర్ చేసిన యువరాజ్ సింగ్

Hazarath Reddy

ఈ చాంపియన్‌ మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు’’ అంటూ భారత మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌.. టీమిండియా యువ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌తో ఉన్న ఫొటోను పంచుకున్నాడు.

Advertisement

India vs Australia: కేఎల్‌ రాహుల్‌కు భారీ షాక్, గిల్‌కు ఓపెనింగ్‌ జోడీగా ఇషాన్‌ కిషన్‌, కీలక వ్యాఖ్యలు చేసిన తాత్కాలిక కెప్టెన్ హార్దిక్‌ పాండ్యా

Hazarath Reddy

ఆస్ట్రేలియాతో భారత్ వన్డే సీరిస్ (India vs Australia) ఆడనున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో తొలి వన్డేలో టీమిండియా గిల్ కు ఓపెనింగ్‌ జోడీగా (Kishan vs Rahul) ఎవరు వస్తారనే దాని గురించి జరుగుతున్న చర్చపై తాత్కాలిక కెప్టెన్ హార్దిక్‌ పాండ్యా (All-rounder Hardik Pandya) స్పందించాడు.

Ex-Ranji Cricketer Arrested: సీఎం జగన్ పీఏనంటూ ముంబై వ్యాపారికి రూ.12 లక్షలు టోకరా, మాజీ రంజీ క్రికెటర్‌ను అరెస్ట్ చేసిన సైబర్ క్రైం పోలీసులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వ్యక్తిగత సహాయకుడినంటూ ముంబై వ్యాపారిని బురిడీ కొట్టించిన మాజీ రంజీ క్రికెటర్‌ నాగరాజును ముంబై సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ (Ex Ranji Cricketer Arrested) చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన 28 ఏళ్ల బుడుమూరు నాగరాజు ఆంధ్రప్రదేశ్‌ మాజీ రంజీ క్రికెటర్‌.

Virat Kohli Quick Style Dance Video: వీడియో ఇదిగో, నార్వేజియన్ డ్యాన్స్ గ్రూప్‌తో కలిసి చిందులేసిన విరాట్ కోహ్లీ, సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

'బార్ బార్ దేఖో' సినిమా నుండి 'కాలా చష్మా' వంటి ప్రసిద్ధ హిట్‌లను అందించిన ప్రసిద్ధ నార్వేజియన్ డ్యాన్స్ గ్రూప్ గుర్తుందా? ఇప్పుడు విరాట్ కోహ్లీ ప్రసిద్ధ బృందంతో కలుసుకున్నారు. వారు Instagramలో భాగస్వామ్యం చేసిన ఒక సరదా డ్యాన్స్ వీడియో కోసం కలిసిపోయారు.

IND vs AUS: ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ, వన్డే సీరిస్ మొత్తానికి దూరమైన కెప్టెన్ కమిన్స్, ఆసీస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్న స్టీవ్‌ స్మిత్‌

Hazarath Reddy

ఈ నెల 17 నుంచి టీమిండియాతో ప్రారంభంకాబోయే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ పాట్‌ కమిన్స్‌ వన్డే సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. ఇటీవలే తుదిశ్వాస విడిచిన తల్లి మరణాంతర కార్యక్రమాలు జరిపించేందుకు కమిన్స్‌ స్వదేశంలోనే ఉండిపోనున్నాడు.

Advertisement

Border Gavaskar Trophy 2023: వరుసగా నాలుగోసారి బోర్డర్‌–గవాస్కర్‌ ట్రోఫీ కైవసం చేసుకున్న భారత్, 2–1తో సిరీస్‌ వశం చేసుకున్న టీమిండియా, ఆఖరి మ్యాచ్ డ్రా

Hazarath Reddy

భారత్, ఆస్ట్రేలియాల మధ్య మూడు రోజుల్లో ముగిసిన గత టెస్టులకు భిన్నంగా ఆఖరి మ్యాచ్‌ ‘డ్రా’ అయ్యింది. 2–1తో సిరీస్‌ను వశం చేసుకున్న టీమిండియా ‘బోర్డర్‌–గవాస్కర్‌ ట్రోఫీ’ని వరుసగా నాలుగోసారి చేజిక్కించుకుంది. నాలుగో టెస్టు చివరి రోజు ఫలితానికి అవకాశం లేకపోవడంతో గంట ముందే ‘డ్రా’కు ఇరుజట్ల కెప్టెన్లు అంగీకరించారు

IND vs AUS ODI: విశాఖలో టీమిండియా, ఆస్ట్రేలియా రెండో వన్డే, టికెట్ల కోసం చిన్న పిల్లల్ని చంకనేసుకుని లైన్‌లో నిలబడిన మహిళలు, కౌంటర్ల వద్ద వేకువజాము నుంచే జనం బారులు

Hazarath Reddy

టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య 17వ తేదీ నుంచి వన్డే సమరం మొదలు కానుంది.తొలి వన్డే 17న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఇక రెండో వన్డే మాత్రం 19న విశాఖలో జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్లను ఈనెల 10 నుంచే ఆన్ లైన్ లో అమ్ముతున్నారు.

Harbhajan Singh: సచిన్ వంద సెంచరీ రికార్డును కోహ్లీ బద్దలుగొట్టేస్తాడు: హర్భజన్ సింగ్

Rudra

దాదాపు మూడేళ్ల తర్వాత సెంచరీ సాధించి కోహ్లీ పరుగుల దాహాన్ని తీర్చుకున్నాడు. ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్‌లో జరిగిన చివరి టెస్టులో భారీ సెంచరీ (186) సాధించిన ఈ ఆటగాడు.. తన టెస్టు సెంచరీల సంఖ్యను 28కి పెంచుకున్నాడు.

India Qualifies for WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్, జూన్‌ 7 నుంచి భారత్‌-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌

Hazarath Reddy

డబ్ల్యూటీసీ 2021-23 ఫైనల్‌కు చేరాలనుకున్న శ్రీలంక ఆశలపై న్యూజిలాండ్‌ నీళ్లు చల్లింది. స్వదేశంలో శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్‌లో అజేయమైన సూపర్‌ సెంచరీ సాధించిన కేన్‌ మామ (121), తన జట్టుకు అపురూప విజయాన్ని అందించడంతో పాటు శ్రీలంకను డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరకుండా అడ్డుకున్నాడు.

Advertisement

IND vs AUS Test Match Day 4: ఆస్ట్రేలియాపై తొలి ఇన్నింగ్స్ లో అదరగొట్టిన విరాట్ కోహ్లీ, డబుల్ సెంచరీ మిస్, ఆసీస్ పై 91 పరుగుల ఆధిక్యంలో భారత్..

kanha

మార్చి 12న అహ్మదాబాద్‌లో జరిగిన నాలుగో రోజు ఆటలో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. విరాట్ కోహ్లీ సెంచరీ కారణంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 571 పరుగుల స్కోరు సాధించింది. ఈ క్రమంలో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాపై 91 పరుగుల ఆధిక్యం సాధించింది.

Cricketer Dies of Heart Attack: క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిన క్రికెటర్, సూరత్‌లో విషాదకర ఘటన

Hazarath Reddy

సూరత్‌లో క్రికెట్ ఆడుతూ 32 ఏళ్ల వ్యక్తి చనిపోయాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం, నిమేష్ అహిర్ KNVSS ఏక్తా గ్రూప్ నిర్వహించిన ఎనిమిది జట్ల టోర్నమెంట్‌లో పాల్గొనగా మార్చి 5న సూరత్‌లోని నర్తన్ గ్రామంలో ఛాతీ నొప్పితో కుప్పకూలిపోయాడు.

Mohammed Shami Delivery Video: వీడియో ఇదిగో, మహమ్మద్ షమీ స్టన్నింగ్ డెలివరీకి క్లీన్ బౌల్డ్ అయిన ఆసీస్‌ బ్యాటర్‌ హ్యాండ్స్‌కాంబ్‌

Hazarath Reddy

అహ్మదాబాద్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ నిప్పులు చెరిగే బంతితో ఆసీస్‌ బ్యాటర్‌ హ్యాండ్స్‌కాంబ్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌ 71 ఓ‍వర్‌ వేసిన షమీ బౌలింగ్‌లో నాలుగో బంతిని హ్యాండ్స్‌కాంబ్‌ డిఫెన్స్‌ ఆడే ప్రయత్నం చేశాడు.

India vs Australia, 4th Test, Day 1: మరికాసేపట్లో భారత్‌-ఆస్ట్రేలియా మధ్య కీలక మ్యాచ్‌, అహ్మదాబాద్‌లో నిర్ణయాత్మక నాలుగో టెస్ట్ మ్యాచ్‌, స్టేడియానికి చేరుకున్న ఇరుదేశాల ప్రధానులు

VNS

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో (Border-Gavaskar Trophy) భాగంగా నిర్ణయాత్మక నాల్గో టెస్టు మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో (Narendra Modi Stadium in Ahmedabad) జరుగుతోంది.ఇండియా, ఆస్ట్రేలియా ప్రధానులు స్టేడియంకు చేరుకున్నారు. ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ప్రధానులు రాక సందర్భంగా ఎస్పీజీ భద్రతను కట్టుదిట్టం చేసింది.

Advertisement
Advertisement