మధ్యప్రదేశ్ బుర్హాన్‌పూర్ జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఖక్నార్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో పోస్ట్‌మార్టం కోసం ఉంచిన మహిళ మృతదేహాన్ని ఒక వ్యక్తి లైంగికంగా వేధించిన దృశ్యం సీసీటీవీలో రికార్డు అయింది. ఈ ఘటన ఏప్రిల్ 18, 2024న చోటుచేసుకుంది. అయితే, సీసీటీవీ ఫుటేజ్ అక్టోబర్ 7, 2025న సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం వల్ల మాత్రమే ప్రజలకు తెలిసింది.

వీడియోలో, నిందితుడు స్ట్రెచర్‌లో ఉన్న మృతదేహాన్ని లాగి ఏకాంత ప్రాంతానికి తీసుకెళ్తున్న దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది. కొంత సమయం తర్వాత మృతదేహాన్ని తిరిగి స్ట్రెచర్ వద్ద ఉంచినట్టు కనిపిస్తోంది. ఈ ఫుటేజ్ బయటకు వచ్చిన వెంటనే ప్రజల్లో తీవ్ర ఆగ్రహం రేకెత్తింది. ఈ ఘటనపై ఖక్నార్ ఆరోగ్య కేంద్రంలో పనిచేసిన డాక్టర్ అధ్య దావర్ అక్టోబర్ 7న ఖక్నార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

వీడియో ఇదిగో, గుండెపోటుతో కుప్పకూలిన ఢిల్లీ పోలీస్ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్, ఆస్పత్రికి వెళ్లేలోపే తిరిగిరాని లోకాలకు..

ఫిర్యాదు మేరకు పోలీసులు భారత శిక్షాసంహిత (IPC) సెక్షన్ 297 కింద కేసు నమోదు చేశారు, ఇది మానవ శవాలను అవమానించడాన్ని కవర చేస్తుంది.తదుపరి దర్యాప్తులో, భౌరాఘాట్ ప్రాంతంలోని తంగియాపట్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల నీలేష్ భిలాలాను అరెస్ట్ చేశారు. అదనపు పోలీస్ సూపరింటెండెంట్ అంతర్ సింగ్ తెలిపారు. భిలాలాను గుర్తించడంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ అభిషేక్ జాదవ్ నేతృత్వంలోని దర్యాప్తు బృందం కీలకపాత్ర వహించింది. అక్కడ ఉన్న రోగులు, సిబ్బంది నుండి లభించిన స్టేట్‌మెంట్‌లు మరియు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు.

Man Molests Woman’s Dead Body in Morgue 

Man Molests Woman’s Dead Body in Morgue in MP (Photo-Video Grab)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)