క్రికెట్

Virat Kohli Instagram Story: ఇప్పుడు నీ పరిస్థితి బాగోలేదా అంటూ కోహ్లీ బావోద్వేగ ట్వీట్ వైరల్, పేరు ప్రఖ్యాతులు రావాలని కోరుకోవడం కూడా ఓ జబ్బులాంటిదేనని తెలిపిన విరాట్

Hazarath Reddy

బాలీవుడ్‌ దివంగత నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ గతంలో చెప్పిన మాటలను టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి తాజాగా తన ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేశాడు. పేరు ప్రఖ్యాతులు రావాలని కోరుకోవడం కూడా ఓ జబ్బులాంటిదే! అయితే, ఏదో ఒకరోజు నేను ఈ జబ్బు నుంచి బయటపడాలి.. ఈ కోరికల వలయం నుంచి విముక్తి పొందాలని ఆశిస్తున్నా.

Dwayne Pretorius Retires: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ ప్రిటోరియస్‌, ఇక ముందు నా భవిష్యత్తు దేవుడు నిర్ణయిస్తాడని భావోద్వేగం

Hazarath Reddy

సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ ప్రిటోరియస్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని సౌతాఫ్రికా క్రికెట్‌ బోర్డు సైతం ధ్రువీకరించింది. క్రికెట్‌ కెరీర్‌కు సంబంధించి గత కొన్ని రోజుల క్రితమే నేను అత్యంత కఠిన నిర్ణయం తీసుకున్నాను. అంతర్జాతీయ స్థాయిలో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలగాలని నిశ్చయించుకున్నా.

India vs Srilanka T20: శ్రీలంకను చిత్తు చేసి 2-1తో సిరీస్ కైవసం చేసుకున్న భారత్, 3వ టీ20 మ్యాచులో 91 పరుగులతో టీమిండియా భారీ విజయం..

kanha

టీ20 సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత్ 91 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. దీంతో భారత్ 2-1తో సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ తన బ్యాట్ తో మెరుపు సెంచరీతో అందరినీ ఆశ్చర్యపరిచాడు.

Asia Cup 2023: ఆసియా కప్ 2023లో ఒకే గ్రూపులో భారత్-పాకిస్తాన్, 2023-24 కొత్త క్రికెట్ క్యాలెండర్‌ను విడుదల చేసిన ACC ప్రెసిడెంట్ జే షా

Hazarath Reddy

ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) జనవరి 05, గురువారం నాడు 2023-24 కొత్త క్రికెట్ క్యాలెండర్‌ను ప్రకటించింది. ట్విట్టర్‌లో ACC ప్రెసిడెంట్ జే షా "2023-24 కోసం పాత్‌వే స్ట్రక్చర్, క్రికెట్ క్యాలెండర్"ని పోస్ట్ చేశారు. ఆసియా కప్ 2023 సెప్టెంబర్‌లో జరుగుతుందని కొత్తగా విడుదల చేసిన క్యాలెండర్ నిర్ధారిస్తుంది. ఆసియా కప్ 2023 టోర్నమెంట్ కోసం భారత్ మరియు పాకిస్థాన్‌లు ఒకే గ్రూప్‌లోకి డ్రా అయ్యాయి

Advertisement

IND-W U19 vs SA-W U19: దుమ్మురేపిన భారత్ , 54 పరుగులకే కుప్పకూలిన దక్షిణాఫ్రికా, 4–0తో సీరిస్‌ను కైవసం చేసుకున్న భారత అండర్‌–19 మహిళల జట్టు

Hazarath Reddy

సఫారీ అండర్‌–19 మహిళల జట్టుతో ఆరో టి20 మ్యాచ్‌లో భారత అండర్‌–19 మహిళల జట్టు ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. బుధవారం జరిగిన చివరిదైన మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 4–0తో దక్కించుకుంది. ప్రిటోరియా వేదికగా జరిగిన టీ20లో టాస్‌ గెలిచిన ఆతిథ్య దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. భారత బౌలర్ల ధాటికి 13.2 ఓవర్లలో 54 పరుగులకే ఆలౌటైంది.

Rishabh pant Health Update: రిషబ్ పంత్‌ను తదుపరి చికిత్స కోసం ముంబైకి తరలించనున్న వైద్యులు, ప్రస్తుతుం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపిన DDCA డైరెక్టర్ శ్యామ్ శర్మ

Hazarath Reddy

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారత క్రికెటర్ రిషప్ పంత్ డ్రెహ్రడూన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి విదితమే. అయితే తదుపరి చికిత్స కోసం క్రికెటర్ రిషబ్ పంత్‌ను ఈరోజు ముంబైకి తరలించనున్నారని DDCA డైరెక్టర్ శ్యామ్ శర్మ ANIకి తెలిపారు.

Ind Vs SL 1st T20 : చివరి బంతితో గెలిచిన భారత్, అక్షర్ పటేల్ స్పిన్‌లో చిక్కుకున్న లంక బ్యాట్స్‌మెన్, శ్రీలంకపై తొలి T20 మ్యాచ్ విజయంతో 2023 కొత్త సంవత్సరం ఆరంభం అదుర్స్

kanha

ముంబైలోని వాంఖడే మైదానంలో భారత్-శ్రీలంక మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. చివరి బంతి వరకు సాగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమై కేవలం 2 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో సిరీస్‌లో టీమిండియా 1-0తో ముందంజ వేసింది.

Team India New Jersey: టీమిండియా ప్లేయర్లకు న్యూ జెర్సీ, కిల్ల‌ర్ లోగోతో ఉన్న జెర్సీల‌ను ధరించిన భారత క్రికెటర్లు, మార్పు ఎందుకో తెలుసా..

Hazarath Reddy

శ్రీలంక‌తో నేడు టీమిండియా తొలి టీ20 మ్యాచ్ ఆడ‌నున్న విష‌యం తెలిసిందే. ముంబైలో జ‌ర‌గ‌నున్న ఆ మ్యాచ్ క‌న్నా ముందే.. టీమిండియా ప్లేయ‌ర్లు కొత్త ఫోటోల‌ను రిలీజ్ చేశారు. ప్లేయ‌ర్లు ధ‌రించిన బ్లూ జెర్సీల‌పై కొత్త లోగో ఉంది. చాహ‌ల్ త‌న ఇన్‌స్టాలో పోస్టు చేసిన ఫోటోలో ఆ కొత్త లోగోను గుర్తుప‌ట్ట‌వ‌చ్చు

Advertisement

Team India Head Coach: బీసీసీఐ కీలక నిర్ణయం.. రాహుల్ ద్రావిడ్ స్థానంలో కొత్త కోచ్??

Rudra

టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవీ కాలంలో ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ తర్వాత ముగియనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ద్రావిడ్ స్థానంలో టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌కు కోచింగ్ పగ్గాలు అప్పగించాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది.

Rishabh Pant Health Update: నిలకడగా రిషబ్ పంత్ ఆరోగ్యం, ఇన్‌ఫెక్షన్‌ సోకుతుందన్న భయంతో ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి షిఫ్ట్‌ చేసిన వైద్యులు

Hazarath Reddy

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీం ఇండియా స్టార్‌ క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌ ఆరోగ్య పరిస్థితి (Rishabh Pant Health Update) నిలకడగా ఉందని డీడీసీఏ డైరెక్టర్‌ శ్యామ్‌ శర్మ పేర్కొన్నారు. ప్రస్తుతం రిషబ్ (Cricketer Rishabh Pant) డెహ్రాడూన్‌ మ్యాక్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

PM Modi on Rishabh Pant Accident: రిషబ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రధాని మోదీ, తల్లి పోయిన బాధలో కూడా పంత్ క్షేమం కోరుతూ ట్వీట్ చేసిన భారత ప్రధాని

Hazarath Reddy

భారత క్రికెటర్ రిషబ్ పంత్ డిసెంబర్ 30వ తేదీ శుక్రవారం ఘోర ప్రమాదానికి గురయ్యాడు. రూర్కీలోని నర్సన్ సరిహద్దు సమీపంలోని హమ్మద్‌పూర్ ఝల్ రహదారిపై తన బంధువులను కలిసేందుకు వెళుతున్న రిషబ్ డివైడర్‌ను ఢీకొట్టాడు. అదృష్టవశాత్తూ, అతను ప్రమాదం నుండి బయటపడ్డాడు.

Rishabh Pant Accident CCTV Footage: రిషబ్ పంత్ యాక్సిడెంట్ వీడియో వైరల్, నిద్రమత్తులో ఉన్న కారణంగా తన కారు డివైడర్‌ను ఢీకొన్నట్లు తెలిపిన పంత్

Hazarath Reddy

భారత స్టార్‌ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ తృటిలో ప్రాణాపాయం తప్పించుకున్నాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన అతడు.. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. కాగా పంత్‌ కారు ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో ఇదేనంటూ సోషల్‌ మీడియాలో ఓ సీసీటీవీ ఫుటేజీ వైరల్‌ అవుతోంది.

Advertisement

Rishabh Pant Car Accident: ఇండియన్ క్రికెటర్ రిషబ్ పంత్ కారుకు ఘోర ప్రమాదం.. గాయాలతో దవాఖానలో చేరిన పంత్

Rudra

ఇండియన్ క్రికెటర్ రిషబ్ పంత్ కారుకు ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో హాస్పిటల్ కి తరలించారు. ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీకి తిరిగివస్తుండగా, ఆయన కారు రోడ్డు డివైడర్ కు డీకొని ఈ ప్రమాదం జరిగింది.

Suryakumar Yadav: నేను ఇండియాకు వైస్ కెప్టెనా, ఇప్పటికీ నమ్మలేకపోతున్నా, భావోద్వేగానికి లోనైన సూర్యకుమార్ యాదవ్, టీ20 సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్

Hazarath Reddy

స్వదేశంలో శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‌లకు రెండు వేర్వేరు జట్లను బీసీసీఐ మంగళవారం ప్రకటించిన సంగతి విదితమే. జనవరి 3న ముంబై వేదికగా లంకతో జరగనున్న టీ20 సిరీస్‌కు స్టార్‌ ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా సారథ్యం వహించనున్నాడు.

ICC Women’s T20 World Cup 2023: టీ20 వరల్డ్ కప్ 2023, ట్రై-సిరీస్ కోసం టీమ్ ఇండియా వువెన్స్ జట్టు ప్రకటన, హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో 15 మంది సభ్యుల జట్టు ప్రకటన

kanha

మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టును ఈరోజు అంటే డిసెంబర్ 28న బీసీసీఐ ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు. స్మృతి మంధాన జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికైంది.

Lionel Messi Gifts to Ziva: ధోనీ కూతురు జివాకు అదిరిపోయే గిఫ్ట్ పంపించిన లియోనల్ మెస్సీ, జివా కోసమంటూ సంతకం చేసి పంపిన పుట్‌బాల్ స్టార్

Hazarath Reddy

పుట్ బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ.. తన అభిమాని, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూతురు జివా ధోనికి గిఫ్ట్ పంపించాడు. తన జెర్సీపై ఆటోగ్రాఫ్ చేసి జివాకు పంపించాడు. అభిమాన ఆటగాడి నుంచి అందిన కానుకను చూసుకుంటూ జివా ధోని మురిసిపోతోంది.

Advertisement

ODI World Cup 2023: భారత్‌లో జరిగే ప్రపంచ కప్‌కు పాకిస్తాన్ వస్తుందా ? క్లారిటీ ఇచ్చిన పీసీబీ కొత్త చీఫ్ నజామ్ సేథీ, ప్రభుత్వమే దీనిపై నిర్ణయం తీసుకుంటుందని వెల్లడి

Hazarath Reddy

భారత్-పాకిస్తాన్ మధ్య క్రికెట్ సంబంధాలు తెగిపోయి చాలా ఏళ్లు అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కొత్త చీఫ్ నజామ్ సేథీ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. 2023 వన్డే ప్రపంచకప్‌లో ఆడేందుకు పాకిస్థాన్ క్రికెట్ జట్టును భారత్‌కు పంపాలన్న తమ దేశ వైఖరిపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Viral Video: బౌండరీ కొట్టి జట్టును గెలిపించిన అశ్విన్.. డ్రెస్సింగ్‌ రూములో రియాక్షన్ ఇలా.. వీడియో ఇదిగో!

Rudra

బంగ్లాదేశ్‌తో జరిగిన మీర్పూర్ టెస్టులో టీమిండియా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లా బౌలర్ మెహిదీ హసన్ దెబ్బకు టీమిండియా బ్యాటర్లు ఒకరి తర్వాత ఒకరిగా వెనుదిరిగిన వేళ క్రీజులో పాతుకుపోయిన రవిచంద్రన్ అశ్విన్, శ్రేయాస్ అయ్యర్ జట్టును విజయ తీరాలకు చేర్చారు.

India vs Bangladesh 2nd Test: రెండో టెస్టులో భారత్ ఘనవిజయం, సిరీస్ టీమిండియా సొంతం, ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌ను గెలిపించిన శ్రెయాస్‌, అశ్విన్

VNS

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో (India vs Bangladesh 2nd Test) భారత్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్‌లోని ఢాకా (Mirpur) వేదికగా జరిగిన ఈ టెస్టులో ఇండియా నాలుగో రోజే విజయం సాధించడం విశేషం. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది.

IPL 2023 Auction: రూ.18.50 కోట్ల‌కు అమ్ముడుపోయిన ఇంగ్లండ్ ఆల్‌రౌండ‌ర్ సామ్ క‌ర‌న్, ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యధిక ధర, కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్

Hazarath Reddy

కొచ్చిలో జ‌రుగుతున్న ఐపీఎల్ 2023 వేలంలో (IPL 2023 Auction) ముగ్గురు విదేశీ ఆట‌గాళ్లు భారీ ధ‌ర‌కు (IPL history's 3 most expensive buys) అమ్ముడుపోయారు. ఇంగ్లండ్ ఆల్‌రౌండ‌ర్ సామ్ క‌ర‌న్ రూ.18.50 కోట్ల‌ భారీ ధ‌ర‌కు పంజాబ్ కింగ్స్ జ‌ట్టుకు అమ్ముడుపోయాడు. దీంతో ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్యంత ధ‌ర ప‌లికిన ఆట‌గాడిగా అత‌ను గుర్తింపు సాధించాడు.

Advertisement
Advertisement