Cricket

IND Vs Sl 3rd ODI: వన్డేల్లో చరిత్ర సృష్టించిన భారత్, భారీ తేడాతో శ్రీలంకపై విజయం, మూడో వన్డేలో దుమ్మురేపిన టీమిండియా బ్యాట్స్ మెన్, బౌలర్లు

VNS

మూడో వ‌న్డేలో భార‌త (India) జ‌ట్టు భారీ విజ‌యం సాధించింది. ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో అద‌ర‌గొట్టిన ఇండియా 317 ప‌రుగుల తేడాతో శ్రీ‌లంక‌ను చిత్తుగా ఓడిచింది. పేస‌ర్ మ‌హమ్మ‌ద్ సిరాజ్ ధాటికి శ్రీ‌లంక (Sri Lanka) టాపార్డ‌ర్ కుప్ప‌కూలింది. కీల‌క‌మైన న‌వ‌నిదు ఫెర్నాండో (19), కుశాల్ మెండిస్ (4), ఆవిష్క ఫెర్నాండో (1) చ‌రిత అస‌లంక (1)ల‌ను సిరాజ్ అవుట్ చేయ‌డంతో లంక కోలుకోలేక‌పోయింది.

IND vs SL 3rd ODI: 3వ వన్డేలో శ్రీలంకకు ఘోర పరాజయం, 317 పరుగుల తేడాతో లంకను చిత్తు చేసిన టీమిండియా, 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్

kanha

తిరువనంతపురం వన్డేలో భారత జట్టు 317 పరుగుల తేడాతో శ్రీలంకపై భారీ విజయాన్ని నమోదు చేసి చరిత్ర సృష్టించింది. అత్యంత అధిక పరుగుల తేడాతో వన్డే క్రికెట్‌లో ఇదే అతిపెద్ద విజయం. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 3-0తో కైవసం చేసుకుంది.

Lalit Modi: కోలుకుంటున్న లలిత్ మోదీ.. సోషల్ మీడియాలో పోస్ట్

Rudra

ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీ కోలుకుంటున్నారు. కరోనా అనంతరం తలెత్తిన ఆరోగ్య సమస్యలు, న్యుమోనియాతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఆయనకు వైద్యులు ఆక్సిజన్ సపోర్ట్ తో వైద్యం అందించారు. దీంతో కోలుకుంటున్న ఆయన ఇన్స్టాగ్రామ్ లో తన హెల్త్ అప్డేట్, ఇతర విషయాలను వెల్లడించారు.

IND Vs NZ ODI Tickets : ఉప్పల్ మ్యాచ్‌ టికెట్లు విడదల, తొలిరోజు అందుబాటులోకి కేవలం 6వేల టికెట్లు, ఎక్కడ బుక్ చేసుకోవాలి? ఎప్పటివరకు అమ్ముతారంటే?

VNS

ఈ నెల 16, సోమవారం వరకు టిక్కెట్లు ఆన్‌లైన్‌లో ఉంటాయి. ఇటీవల ఉప్పల్‌లో జరిగిన టీ20 మ్యాచ్ సందర్భంగా జింఖానా గ్రౌండ్ వద్ద తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, వచ్చే వారం జరగబోయే మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లను కేవలం ఆన్‌లైన్‌లోనే విక్రయిస్తున్నారు.

Advertisement

India Squad for Australia Test Series: లాంగ్ గ్యాప్‌ తర్వాత టీమిండియాలోకి రవీంద్ర జడేజా, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కోసం టీమ్ ప్రకటించిన బీసీసీఐ, రిషబ్ పంత్ ప్లేస్‌లో ఎవరిని తీసుకున్నారంటే?

VNS

గాయం కారణంగా చాలాకాలంగా ఆటకు దూరంగా ఉన్న రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అంతేకాదు ఈ మధ్య చెలరేగి ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్ కూడా తొలి రెండు టెస్టుల్లో ఆడే టీమ్‌ లో చోటు సంపాదించాడు. ఇక రిషబ్ పంత్ యాక్సిడెంట్ కారణంగా దూరం అవ్వడంతో ఇషాన్ కిషన్, కేఎస్ భరత్ లకు స్థానం దక్కింది. ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రాకు ఈ జట్టులో ప్లేస్ దక్కలేదు.

Himachal Cricketer Dies: అనారోగ్యంతో భారత క్రికెటర్ మృతి, 28 ఏళ్లకే అనారోగ్యంతో కన్నుమూసిన సిద్ధార్ధ్ శర్మ, షాక్‌ లో అభిమానులు

VNS

హిమాచ‌ల్ ప్రదేశ్ క్రికెట్‌లో విషాదం నిండింది. అనారోగ్యంతో ఫాస్ట్ బౌల‌ర్ సిద్ధార్థ్ శ‌ర్మ గురువారం రాత్రి 9 గంట‌ల‌కు మ‌ర‌ణించాడు. రంజీ ట్రోఫీ కోసం గుజ‌రాత్‌లో జ‌ట్టుతో ఉన్న అతను అనారోగ్యానికి గురయ్యాడు. దాంతో, వ‌డోద‌ర‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. రెండు వారాలుగా వైద్యులు అత‌డికి వెంటిలేట‌ర్ మీద చికిత్స అందించారు. అయినా కూడా అత‌ని శ‌రీరం స్పదించ‌లేదు.

Odisha: అడవిలో చెట్టుకు ఉరి వేసుకున్న వర్ధమాన మహిళా క్రికెటర్, ఒడిషాలో విషాదకర ఘటన, ఒడిశా క్రికెట్ అసోసియేషన్ వల్లే మృతి చెందిందని కుటుంబ సభ్యుల ఆరోపణ

Hazarath Reddy

ఒడిశా మహిళా క్రికెటర్ రాజశ్రీ స్వైన్ గురుడిఝాటియా అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకుని కనిపించింది. ఒడిశా క్రికెట్ అసోసియేషన్ (ఓసీఏ), మహిళా జట్టు కోచ్ పుష్పాంజలి బెనర్జీపై మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు. వారి వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు.

IND vs SL 2nd ODI: వీడియో ఇదే, సిరాజ్‌ అద్బుతమైన ఇన్‌స్వింగర్‌తో క్లీన్‌ బౌల్డ్‌ అయిన ఫెర్నాండో, బంతి స్వింగ్‌ అయ్యి మిడిల్‌ స్టం‍ప్‌ను గిరాటేయడంతో ఎగిరిపోయిన స్టంప్

Hazarath Reddy

తొలి వన్డేలో అదరగొట్టిన టీమిండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ రెండో వన్డేలో కూడా మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్‌లో 5.4 ఓవర్లు బౌలింగ్‌ చేసిన సిరాజ్‌ 30 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఫెర్నాండోను సిరాజ్‌ అద్బుతమైన ఇన్‌స్వింగర్‌తో క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు

Advertisement

IND vs SL 2nd ODI: మరో మ్యాచ్ మిగిలుండగానే సీరిస్ కైవసం చేసుకున్న భారత్, రెండో వన్డేలో శ్రీలంకపై నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం, అదరగొట్టిన కెఎల్ రాహుల్, మెరిసిన హార్థిక్ పాండ్యా

Hazarath Reddy

జనవరి 12న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన రెండో వన్డేలో శ్రీలంకను నాలుగు వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. కెఎల్ రాహుల్ అదిరిపోయే బ్యాటింగ్ చేయడంతో ఇండియా సునాయాసంగా విజయం సాధించింది. మూడు వన్డేల సీరిస్ లో 2-0తో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది

PAK vs NZ 2nd ODI: అంపైర్‌కి చిర్రెత్తుకొచ్చింది, పాకిస్తాన్ జెర్సీని నేలకేసి కొట్టిన అలీం దార్‌, పాక్‌ ఆటగాళ్లు అంపైర్‌ కాలిని రుద్దుతూ సేవలు, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

కరాచీ వేదికగా పాకిస్తాన్‌తో నిన్న (జనవరి 11) జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్‌ 79 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో చోటు చేసుకున్న ఓ ఊహించని పరిణామం ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది.

Australia: ఆఫ్ఘనిస్తాన్‌ క్రికెట్‌ జట్టుకు షాకిచ్చిన ఆస్ట్రేలియా, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటన,అక్కడ మహిళల హక్కులు కాలరాస్తున్న నేపథ్యంలో కీలక నిర్ణయం

Hazarath Reddy

ఆఫ్ఘనిస్తాన్‌ క్రికెట్‌ జట్టుకు క్రికెట్‌ ఆస్ట్రేలియా (CA) భారీ షాకిచ్చింది. 2023 మార్చిలో యూఏఈ వేదికగా ఆప్ఘనిస్తాన్‌తో జరగాల్సిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను (ODI series ) రద్దు చేసుకుంటున్నట్లు సీఏ ప్రకటించింది.

India vs Sri Lanka, 2nd ODI: విజయోత్సాహంలో భారత్‌, వన్డే సిరీస్ కైవసం చేసుకునేందుకు స్కెచ్‌, శ్రీలంకతో రెండో వన్డేకు భారత్ సిద్ధం, ఈడెన్ గార్డెన్స్‌ లో రోహిత్ రికార్డుల మోత

VNS

టీమిండియాపై తొలి వన్డేలో ఘోర పరాభవాన్ని చవిచూసిన శ్రీలంక.. రెండో వన్డేలో గెలిచి సిరీస్ ను సమం చేయాలన్న పట్టుదలతో ఉంది. కెప్టెన్ శనక (Shanaka) బ్యాటింగ్ ఒక్కటే ఆ జట్టుకు ఊరట. సెంచరీతో తొలి వన్డేలో ఆకట్టుకున్న అతను ఫామ్ ను కొనసాగించాలని లంక కోరుకుంటోంది. తొలివన్డేలో ఫీల్డింగ్ లో లంక ఆటగాళ్లు విఫలమయ్యారు

Advertisement

IND vs SL 1st ODI: తొలి వన్డేలో శ్రీలంకను చిత్తు చేసిన టీమిండియా, కోహ్లీ శతక బాదుడుతో లంకకు తప్పని ఓటమి, 64 పరుగుల తేడాతో టీమిండియా గెలుపు..

kanha

గౌహతి వన్డేలో భారత్ 67 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది.

Rohit Sharma: రోహిత్ శర్మని చూసి ఏడ్చేసిన చిన్నారి, దగ్గరకు వెళ్లి బుగ్గ గిల్లి ఓదార్చిన రోహిత్, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మను చూసిన ఆనందంలో ఓ చిన్నారి కన్నీళ్లు పెట్టుకున్నాడు.అభిమాని ఏవటం చూసిన రోహిత్..ఏడుస్తున్న అభిమాని దగ్గరికి వెళ్లి ఓదార్చాడు.బుగ్గ గిల్లి, కలిసి ఫొటోలు దిగి నవ్వించే ప్రయత్నం చేశాడు.

Virat Kohli Instagram Story: ఇప్పుడు నీ పరిస్థితి బాగోలేదా అంటూ కోహ్లీ బావోద్వేగ ట్వీట్ వైరల్, పేరు ప్రఖ్యాతులు రావాలని కోరుకోవడం కూడా ఓ జబ్బులాంటిదేనని తెలిపిన విరాట్

Hazarath Reddy

బాలీవుడ్‌ దివంగత నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ గతంలో చెప్పిన మాటలను టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి తాజాగా తన ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేశాడు. పేరు ప్రఖ్యాతులు రావాలని కోరుకోవడం కూడా ఓ జబ్బులాంటిదే! అయితే, ఏదో ఒకరోజు నేను ఈ జబ్బు నుంచి బయటపడాలి.. ఈ కోరికల వలయం నుంచి విముక్తి పొందాలని ఆశిస్తున్నా.

Dwayne Pretorius Retires: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ ప్రిటోరియస్‌, ఇక ముందు నా భవిష్యత్తు దేవుడు నిర్ణయిస్తాడని భావోద్వేగం

Hazarath Reddy

సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ ప్రిటోరియస్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని సౌతాఫ్రికా క్రికెట్‌ బోర్డు సైతం ధ్రువీకరించింది. క్రికెట్‌ కెరీర్‌కు సంబంధించి గత కొన్ని రోజుల క్రితమే నేను అత్యంత కఠిన నిర్ణయం తీసుకున్నాను. అంతర్జాతీయ స్థాయిలో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలగాలని నిశ్చయించుకున్నా.

Advertisement

India vs Srilanka T20: శ్రీలంకను చిత్తు చేసి 2-1తో సిరీస్ కైవసం చేసుకున్న భారత్, 3వ టీ20 మ్యాచులో 91 పరుగులతో టీమిండియా భారీ విజయం..

kanha

టీ20 సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత్ 91 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. దీంతో భారత్ 2-1తో సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ తన బ్యాట్ తో మెరుపు సెంచరీతో అందరినీ ఆశ్చర్యపరిచాడు.

Asia Cup 2023: ఆసియా కప్ 2023లో ఒకే గ్రూపులో భారత్-పాకిస్తాన్, 2023-24 కొత్త క్రికెట్ క్యాలెండర్‌ను విడుదల చేసిన ACC ప్రెసిడెంట్ జే షా

Hazarath Reddy

ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) జనవరి 05, గురువారం నాడు 2023-24 కొత్త క్రికెట్ క్యాలెండర్‌ను ప్రకటించింది. ట్విట్టర్‌లో ACC ప్రెసిడెంట్ జే షా "2023-24 కోసం పాత్‌వే స్ట్రక్చర్, క్రికెట్ క్యాలెండర్"ని పోస్ట్ చేశారు. ఆసియా కప్ 2023 సెప్టెంబర్‌లో జరుగుతుందని కొత్తగా విడుదల చేసిన క్యాలెండర్ నిర్ధారిస్తుంది. ఆసియా కప్ 2023 టోర్నమెంట్ కోసం భారత్ మరియు పాకిస్థాన్‌లు ఒకే గ్రూప్‌లోకి డ్రా అయ్యాయి

IND-W U19 vs SA-W U19: దుమ్మురేపిన భారత్ , 54 పరుగులకే కుప్పకూలిన దక్షిణాఫ్రికా, 4–0తో సీరిస్‌ను కైవసం చేసుకున్న భారత అండర్‌–19 మహిళల జట్టు

Hazarath Reddy

సఫారీ అండర్‌–19 మహిళల జట్టుతో ఆరో టి20 మ్యాచ్‌లో భారత అండర్‌–19 మహిళల జట్టు ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. బుధవారం జరిగిన చివరిదైన మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 4–0తో దక్కించుకుంది. ప్రిటోరియా వేదికగా జరిగిన టీ20లో టాస్‌ గెలిచిన ఆతిథ్య దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. భారత బౌలర్ల ధాటికి 13.2 ఓవర్లలో 54 పరుగులకే ఆలౌటైంది.

Rishabh pant Health Update: రిషబ్ పంత్‌ను తదుపరి చికిత్స కోసం ముంబైకి తరలించనున్న వైద్యులు, ప్రస్తుతుం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపిన DDCA డైరెక్టర్ శ్యామ్ శర్మ

Hazarath Reddy

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారత క్రికెటర్ రిషప్ పంత్ డ్రెహ్రడూన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి విదితమే. అయితే తదుపరి చికిత్స కోసం క్రికెటర్ రిషబ్ పంత్‌ను ఈరోజు ముంబైకి తరలించనున్నారని DDCA డైరెక్టర్ శ్యామ్ శర్మ ANIకి తెలిపారు.

Advertisement
Advertisement