రాష్ట్రీయం

Young Man Dies of Heart Attack: షాకింగ్ వీడియో, స్నేహితుడి పెళ్లి వేడుకలో గిఫ్ట్ ఇస్తూ స్టేజ్ పైనే గుండెపోటుతో యువకుడు మృతి, కర్నూల్ జిల్లాలో విషాదకర ఘటన

Hazarath Reddy

కర్నూలు జిల్లా కృష్ణగిరిలో ఓ యువకుడు తన స్నేహితుడికి బహుమతి ఇస్తూ స్టేజిపైనే గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు విడిచాడు.దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది.

Posani Krishna Murali: వీడియో ఇదిగో, తెలంగాణ తెచ్చాడని కేసీఆర్‌కు ఓటేసా, తర్వాత విమర్శించినా ఏనాడు నా మీద కేసులు పెట్టలేదని తెలిపిన పోసాని

Hazarath Reddy

పోసాని కృష్ణ మురళి రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లుగా ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఇక మీదట నుంచి తాను రాజకీయాల గురించి మాట్లాడనని, ఏ పార్టీని పొగడను ఏ పార్టీ గురించి మాట్లాడను, మరే పార్టీని విమర్శించను అంటూ ఒక ప్రకటన రిలీజ్ చేశారు.

Posani Krishna Murali: రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లుగా ప్రకటించిన పోసాని కృష్ణ మురళి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

పోసాని కృష్ణ మురళి రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లుగా ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఇక మీదట నుంచి తాను రాజకీయాల గురించి మాట్లాడనని, ఏ పార్టీని పొగడను ఏ పార్టీ గురించి మాట్లాడను, మరే పార్టీని విమర్శించను అంటూ ఒక ప్రకటన రిలీజ్ చేశారు.

Andhra Pradesh: వీడియో ఇదిగో, కర్నూలు జిల్లాలో రంగుపూసుకుని భిక్షాటన చేస్తున్న మరికొందరు పిల్లలను రక్షించిన అధికారులు, తల్లిదండ్రులకి వార్నింగ్

Hazarath Reddy

కర్నూల్ నగరంలో ఓ బాలుడు ఒంటిపై రంగు పూసుకొని భిక్షాటన చేస్తున్న వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఓ నెటిజన్ ఆ వీడియోను మంత్రి నారా లోకేష్ కు ట్యాగ్ చేసి చెప్పాడు.వీడియోపై మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. నారా లోకేష్ ఇచ్చిన ఆదేశాలతో రంగంలోకి దిగారు అధికారులు.

Advertisement

Andhra Pradesh Shocker: అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం, 5 నెలల చిన్నారిని చంపి ఆత్మహత్య చేసుకున్న దంపతులు, ఆర్థిక ఇబ్బందులే కారణమని అనుమానిస్తున్న పోలీసులు

Hazarath Reddy

అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శింగనమల నియోజకవర్గం నార్పలలో ఐదు నెలల చిన్నారిని చంపి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఐదు రోజుల కిందట తలుపులు వేసుకొని భార్యాభర్తలు బలవన్మరణానికి పాల్పడ్డారు.

Pushpa 2: The Rule: ట్వీట్ ఇదిగో, అల్లు అర్జున్ కు బెస్ట్ విషెస్ తెలిపిన వైసీపీ నేత శిల్పా రవిచంద్ర కిషోర్‌ రెడ్డి, థాంక్యూ సో మచ్ బ్రదర్ అంటూ బన్నీ రిప్లై

Hazarath Reddy

స్టార్ హీరో అల్లు అర్జున్ తాజా చిత్రం 'పుష్ప 2' డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ తరుణంలో అల్లు అర్జున్ కు ఆయన మిత్రుడు, వైసీపీ నేత శిల్పా రవీంద్రా రెడ్డి ఎక్స్ వేదికగా విషెస్ తెలిపారు. 'పుష్ప 2' కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ట్వీట్ చేశారు.

Telangana: చార్జింగ్ పెడుతుండగా పేలిన ఎలక్ట్రిక్ స్కూటర్..జగిత్యాలలో ఘటన, స్కూటర్ తో పాటు డబ్బు బూడిద పాలు

Arun Charagonda

చార్జింగ్ పెడుతుండగా ఎలక్ట్రిక్ స్కూటర్ పేలింది. జగిత్యాల జిల్లా బాలపెల్లి గ్రామంలో ఈ ఘటన జరుగగా 40 రోజుల క్రితం ఓ ప్రముఖ టూవీలర్ సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్నారు తిరుపతి రెడ్డి. ప్రమాద సమయంలో స్కూటర్ డిక్కిలో రూ.1.90 లక్షలు ఉన్నాయని...స్కూటర్, డబ్బు కాలి బుడిద కావడంతో లబోదిబోమంటున్నాడు బాధితుడు తిరుపతి రెడ్డి.

Andhra Pradesh Horror: కడప జిల్లాలో దారుణం, మహిళను చంపి ఆమె తలను రాళ్లతో చిధ్రం చేసిన దుండగులు, ఒంటిపై వస్త్రాలు లేకపోవడంతో అత్యాచారం చేసి హత్య చేశారా అనే అనుమానాలు

Hazarath Reddy

మహిళ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు రాళ్లతో తలను ఛిద్రం చేశారు. మహిళపై వస్త్రాలు లేకపోవడంతో అత్యాచారం చేసి హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Andhra Pradesh Assembly Session: పీఏసీ చైర్మన్‌ పదవికి నామినేషన్ వేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నామినేషన్ టైంలో అసెంబ్లీలో హైడ్రామా

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పీఏసీ చైర్మన్‌ పదవికి మాజీ మంత్రి, పుంగనూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే నామినేషన్‌ స్వీకరణకు ముందు అసెంబ్లీలో పెద్ద హైడ్రామా నడిచింది.

Rahul Gandhi: అదాని ఇష్యూలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్న అరెస్ట్ చేయాల్సిందే, ఎవరిని వదిలిపెట్టొదన్న ఎంపీ రాహుల్ గాంధీ..అదాని వెనుక ఉంది మోడీనే అని కామెంట్

Arun Charagonda

అమెరికాలోనూ అదానీ అక్రమాలకు పాల్పడ్డారు అని మండిపడ్డారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. అదాని వెనుక ఎవరు ఉన్న అరెస్ట్ చేయాల్సిందే అన్నారు . ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ ఆదాని దగ్గర డబ్బులు తీసుకున్న రేవంత్ రెడ్డి అయినా ఎవరైనా అరెస్ట్ చేయాల్సిందేనన్నారు రాహుల్ గాంధీ.

YSRCP: జగన్ అధ్యక్షతన ముగిసిన వైసీపీ పార్లమెంటరీ సమావేశం, త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై దిశానిర్దేశం

Hazarath Reddy

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన వైసీపీ పార్లమెంటరీ సమావేశం ముగిసింది. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరగబోయే ఈ సమావేశానికి అందుబాటులో ఉన్న లోక్ సభ, రాజ్యసభ ఎంపీలంతా హాజరయ్యారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై పార్టీ ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేశారు.

KTR On Adani Issue: అదానితో కాంగ్రెస్ - బీజేపీ అనుబంధం.. దేశానికి అవమానం, తెలంగాణలో అదాని పెట్టుబడుల వెనుక కాంగ్రెస్ వాట ఎంతో బయట పెట్టాలని కేటీఆర్ డిమాండ్

Arun Charagonda

అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలో నేరాభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా కాంగ్రెస్‌తో పాటు బీఆర్ఎస్‌ని టార్గెట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అదాని కంపెనీ - తెలంగాణ ప్రభుత్వం మధ్య ఉన్న చీకటి ఒప్పందాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

Advertisement

Man Performs CPR on Monkey: వీడియో ఇదిగో, చనిపోయిందనుకున్న కోతికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన యువకుడు, మహబూబాబాద్ జిల్లాలో ఘటన

Hazarath Reddy

ఒక వానరం విద్యుత్ షాక్‌ గురై అక్కడే పడిపోయింది. అయితే ఆ కోతి చనిపోయింది అనుకుని అంతా వదిలేశారు.నాగరాజు అనే యువకుడు దానికి సిపిఆర్ చేశాడు. కొంత సేపటి తర్వాత చనిపోయిందనుకున్న వానరం ఒక్కసారిగా లేచి చెంగుచెంగున ఎగిరింది.

Telangana: హీరో రామ్ చరణ్ క్షమాపణ చెప్పాల్సిందే, అయ్యప్ప మాల తొలగించాలని డిమాండ్ చేసిన రంగారెడ్డి జిల్లా లాయర్లు, మాలలో దర్గా దర్శనం తప్పేనని కామెంట్

Arun Charagonda

సినీ హీరో రామ్ చరణ్ పవిత్రమైన అయ్యప్ప మాలలో కడపలోని అమీన్పూర్ దర్గాను సందర్శించడానికి యావత్ హిందూ సమాజము,యావత్ అయ్యప్ప భక్తులు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు రంగారెడ్డి జిల్లా లాయర్లు. వెంటనే రామ్‌చరణ్ అయ్యప్ప మాల తొలగించి ఆ స్వామి వారిని క్షమాపణ కోరి యావత్ అయ్యప్ప భక్తులకు యావత్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Mahabubabad: శభాష్ పోలీస్..ఉరి వేసుకున్న మహిళకు సీపీఆర్...మహిళ ప్రాణం కాపాడిన కానిస్టేబుల్....వీడియో ఇదిగో

Arun Charagonda

ఉరి వేసుకున్న మహిళకు సీపీఆర్ చేసి ప్రాణం కాపాడారు ఓ కానిస్టేబుల్. మహబూబాబాద్‌కి చెందిన ఓ మహిళ కుటుంబ కలహాలతో ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకున్న కానిస్టేబుల్ రాంబాబు CPR చేసి మహిళ ప్రాణాలను కాపాడారు.

Andhra Pradesh: షాకింగ్..50 కేజీల కారంతో శివస్వామి బాబాకు అభిషేకం, గత మూడు ఏళ్లుగా ఇదే తంతు..శ్రీ శివ దత్తాత్రేయ ప్రత్యంగిరా వృద్ధాశ్రమంలో ఘటన

Arun Charagonda

ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడు గ్రామంలో 50 కేజీల కారంతో అభిషేకం చేయించుకున్నారు ఓ బాబా. శ్రీ శివ దత్తాత్రేయ ప్రత్యంగిరా వృద్ధాశ్రమంలో 50 కేజీల కారంతో అభిషేకం చేయించుకున్నారు శివస్వామి బాబా. ప్రత్యంగిరా దేవికి ఇష్టమైన కారంతో శివస్వామి బాబాకు అభిషేకం చేశారు. గత మూడేళ్లుగా స్వస్తిశ్రీ చాంద్రమానేన బహుళ పంచమి తిథి రోజే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు శివస్వామి బాబా.

Advertisement

CM Chandrababu: ప్రధానమంత్రి మోదీ బాటలో ఏపీ సీఎం చంద్రబాబు, సంక్రాంతి నుండి 'మన్ కీ బాత్'..ప్రజలతో మమేకం కానున్న టీడీపీ అధినేత

Arun Charagonda

సంక్రాంతి నుంచి ప్రజలతో నేరుగా మాట్లాడనున్నారు సీఎం చంద్రబాబు. ప్రధాని మోదీ నిర్వహిస్తున్న 'మన్ కీ బాత్' తరహాలోనే ప్రజలతో మమేకం కానున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆడియో లేదా వీడియో విధానంలో నిర్వహించే అవకాశం ఉంది. గతంలో 1995-2004 మధ్య 'డయల్ యువర్ సీఎం' నిర్వహించిన సంగతి తెలిసిందే.

Software Engineer Suicide: హైదరాబాద్ మాదాపూర్‌లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య, మైండ్ స్పేస్ 13వ అంతస్తు పైనుంచి దూకేసిన నవీన్ రెడ్డి..పోలీసుల విచారణ

Arun Charagonda

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మాదాపూర్‌లో నవీన్ రెడ్డి అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మైండ్ స్పేస్ 13వ అంతస్తు పైనుంచి దూకేశాడు. ఈ క్రమంలో అతడు అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు.. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు పాల్పడడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

President Draupadi Murmu: హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్‌ హెల్ప్‌లైన్‌ కోసం టోల్ ఫ్రీ నెంబర్...!

Arun Charagonda

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌కు రాష్ట్రపతి చేరుకోనున్నారు. 6.20 నుంచి 7.10 వరకు రాజ్‌భవన్‌లో విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం రాత్రి 7.20కి ఎన్టీఆర్‌ స్టేడియంలో భక్తి టీవీ కోటి దీపోత్సవంలో పాల్గొననున్నారు ముర్ము.

CM Revanth Reddy: మాగనూరు స్కూల్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశం..ఘటనపై నివేదిక ఇవ్వాలని అధికారులపై ఫైర్

Arun Charagonda

నారాయణపేట జిల్లాలోని మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థినీ విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులెవరైనా సరే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ ను సీఎం ఆదేశించారు.

Advertisement
Advertisement