రాష్ట్రీయం

Telangana Rains: భారీ వరదలకు ఇల్లు కూలి తల్లికూతురు మృతి, రాత్రి నిద్రిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిన మట్టి ఇల్లు

Hazarath Reddy

నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. వర్షాలకు ఎక్కమేడు గ్రామంలో ఇళ్ళు కూలి ఇద్దరు మృతి చెందారు. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఇళ్ళు నానిపోయాయి. రాత్రి నిద్రిస్తున్న సమయంలో నానిన ఇల్లు కూలి తల్లి హన్మమ్మ, కూతురు అంజిలమ్మ మృతి చెందారు.

Indian Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్, భారీ వర్షాలకు 30కి పైగా రైళ్లు రద్దు, మరికొన్ని ట్రైన్స్ దారి మళ్లింపు, లిస్టు ఇదిగో..

Hazarath Reddy

రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే 30కిపైగా రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేయగా, కొన్ని రైళ్లను దారిమళ్లించింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది.

Munneru River Floods Video: వీడియో ఇదిగో, ప్రమాదకరంగా ప్రవహిస్తోన్న మున్నేరు వాగు, ముంపులో చిక్కుకున్న పలు కాలనీలు, బాధితులు ఇంటిపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూపు

Hazarath Reddy

తెలంగాణలో భారీవర్షాలతో ఖమ్మం జిల్లాలోని మున్నేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. పలు కాలనీలు ముంపులో చిక్కుకున్నాయి. రాజీవ్‌ గృహకల్ప కాలనీని మున్నేరు వరద ముంచెత్తింది. అక్కడి అపార్ట్‌మెంట్‌లో ఓ కుటుంబం చిక్కుకుంది. చిక్కుకున్నవారిలో పిల్లలతో పాటు మహిళ, వృద్ధురాలు ఉన్నారు.

Telangana Rains: వీడియోలు ఇవిగో, హైదరాబాద్ విజయవాడ హైవేపై రాకపోకలు బంద్, రెండు అడుగుల మేర ప్రవహిస్తున్న వరద నీరు

Hazarath Reddy

వాయుగుండం తీరం దాటినప్పటికీ వర్షాలు వీడలేదు. తెలంగాణను ఇవాళ కూడా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఏపీలో వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టినప్పటికీ, గత రెండ్రోజులుగా కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా ఐతవరం వద్ద రోడ్డుపైకి వరద నీరు రావడంతో ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Advertisement

Telangana Rains:భారీ వరదలు, కారులో విమానాశ్రయానికి వెళుతూ తండ్రీ కూతురు గల్లంతు, మెడవరకు నీరు వచ్చిందంటూ బంధువులకు చివరి కాల్

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాలలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం వద్ద బ్రిడ్జిపై నుంచి వరదనీరు ప్రవహిస్తోంది, ఆ సమయంలో కారులో హైదరాబాద్ విమానాశ్రయానికి బయలుదేరిన ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్ కారేపల్లి గంగారం తండాకు చెందిన తండ్రి, కూతురు … వరద ప్రవాహంలో గల్లంతయ్యారు…

No Hidden Cameras: వీడియో ఇదిగో, అక్కడ కెమెరాలు లేవు.. వీడియోలు లేవు, విచారణకు ముందే గుడ్లవల్లేరు కాలేజీ ఘటనపై తేల్చేసిన మంత్రి నారా లోకేశ్

Hazarath Reddy

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కాలేజీలో సీక్రెట్ కెమెరాల అంశంపై నారా లోకేష్ స్పందించారు. ‘‘గుడ్లవల్లేరు కాలేజీలో హిడెన్‌ కెమెరాలు లేవు. ఎక్కడ ఒక వీడియో బయటికి రాలేదు. విద్యాశాఖ మంత్రిని కాబట్టే నా మీద ఫోకస్‌ పెట్టారు. కావాలని రచ్చ చేస్తున్నారు’’ అని మీడియా ప్రతినిధులపై లోకేష్‌ ఆగ్రహం వెళ్లగక్కారు.

Vijayawada Rains: ప్రయాణికులకు అలర్ట్, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సుల నిలిపివేత, ఐతవరం వద్ద రోడ్డుపైకి భారీగా వరద నీరు

Hazarath Reddy

వాయుగుండం తీరం దాటినప్పటికీ తెలుగురాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఏపీలో వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టినప్పటికీ, గత రెండ్రోజులుగా కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా ఐతవరం వద్ద రోడ్డుపైకి వరద నీరు రావడంతో ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Telangana Rains: భారీ వర్షాలు, రేపు తెలంగాణ వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు సెలవు, అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని హెచ్చరిక

Hazarath Reddy

తుపాను ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జనాలు అడుగు బయటపెట్టలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

Advertisement

Andhra Pradesh: గాజువాకలో దారుణం, తాను సబ్ ఇన్స్‌పెక్టర్ ని అంటూ డెలివరీ బాయ్‌ని కారుతో ఢీకొట్టి బూతులు తిట్టిన కారు యజమాని

Hazarath Reddy

డెలివరీ బాయ్‌ని వెనక నుండి గుద్ది, తిడుతూ తాను సబ్ ఇన్స్‌పెక్టర్ అంటూ దౌర్జన్యం చేసిన వ్యక్తి. గాజువాక - డెలివరీ బాయ్‌ని వెనుక నుంచి గుద్ది అతని బ్యాగులను విసిరిపారేసి తిట్టిన కారు యజమాని. భారీ వర్షంలో కూడా తడుచుకుంటూ మన నిత్యావసరాలను అందించే డెలివరీ బాయ్‌ని కనికరం చూపించకుండా తాను సబ్ ఇన్స్‌పెక్టర్ అంటూ దబాయించిన వ్యక్తి.

Telangana Rains: వీడియో ఇదిగో, శ్రీశైలం ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు, తృటిలో తప్పించుకున్న కార్లు

Hazarath Reddy

శ్రీశైలం ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఈగలపెంట సమీపంలోని శ్రీశైలం ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Telangana Rains: వీడియో ఇదిగో, వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తిని ప్రాణాలకు తెగించి కాపాడిన పోలీసులు

Hazarath Reddy

గతరాత్రి 40 మంది ప్రయాణికులతో వేములవాడ నుంచి మహబూబాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు వరంగల్ జిల్లా నెక్కొండ మండలం వెంకటాపురం శివారులో వరద నీటిలో చిక్కుకుపోయింది. అలాగే నాగర్ కర్నూల్ లోని నాగనూల్ వాగులో కొట్టుకుపోయి చిక్కుకున్న వ్యక్తిని పోలీసులు సాహసోపేతంగా కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Andhra Pradesh Rains: వీడియోలు ఇవిగో, నీట మునిగిన విజయవాడ, భారీ వర్షాలకు మంగళగిరిలో విరిగిపడిన చెట్లు , నేలకొరిగిన కరెంట్ స్తంభాలు

Hazarath Reddy

భారీ వర్షాలకు విజయవాడ మంగళగిరి రహదారిపై చెట్లు విరిగిపడ్డాయి , కరెంట్ స్తంభాలు నేలకొరిగాయి. రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరి పేట ప్రస్తుత వరద పరిస్థితి.

Advertisement

Hyderabad Road Accident: వనస్థలిపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, రాష్ డ్రైవింగ్ తో పాదచారుల దూసుకొచ్చిన కారు, ఒకరికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వనస్థలిపురం ngos కాలనీ వివేకానంద పార్క్ ముందు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాష్ డ్రైవింగ్ తో పాదచారుల పైకి కారు ఒక్కసారిగా దూసుకు వచ్చింది.ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు ఇవిగో..

Telangana Rains: వీడియో ఇదిగో, భారీ వర్షాలకు కాలువలో కొట్టుకొచ్చిన రెండు కార్లు, ఓ కారులో కోదాడ వాసి మృతి

Hazarath Reddy

తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల రోడ్లు తెగిపోయి రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఇక కోదాడలో భారీ వర్షానికి రెండు కార్లు కాలువలొ కొట్టుకు వచ్చాయి.. ఓ కారులో ఒకరు మృతి చెంది కనిపించారు

CM Revanth Reddy On Rains: భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక రివ్యూ, లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలని అధికారులకు సూచన

Arun Charagonda

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురుస్తోన్న నేప‌థ్యంలో అన్ని ప్ర‌భుత్వ విభాగాల అధికారులు, సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. భారీ వర్షాల పరిస్థితులపై ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారితో మాట్లాడిన సీఎం... ముఖ్యంగా మున్సిప‌ల్‌, విద్యుత్‌, వైద్యారోగ్య, రెవెన్యూ శాఖల యంత్రాంగం మరింత చురుకుగా వ్యవహరించేలా చూడాల‌ని సీఎస్‌ శాంతికుమారికి సూచించారు.

RTC Bus Stuck In Water: వాగులో చిక్కుపోయిన ఆర్టీసీ బస్సు, కాపాడండి అంటూ ప్రయాణీకుల ఆర్తనాదాలు, రాత్రి నుండి వర్షంలోనే ఉన్నామని ఆవేదన..వీడియో

Arun Charagonda

మహబూబాబాద్ - నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామ చెరువు ఒక్కసారిగా పొంగిపొర్లడంతో వాగు వరదలో చిక్కుకుపోయింది ఆర్టీసీ బస్సు. రాత్రి నుంచి ఇక్కడే ఉన్నామని.. తమను కాపాడాలంటూ బంధువులను, అధికారులను వేడుకుంటున్నారు ప్రయాణికులు.ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Advertisement

Railway Track Destroyed Due To Rains: భారీ వర్షం, కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్, మహబూబాబాద్‌లో ఘటన, నిలిచిపోయిన పలు రైళ్లు, తప్పిన పెను ప్రమాదం

Arun Charagonda

మహబూబాబాద్ - కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి దగ్గర భారీ వర్షాలకు రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది.దీంతో మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌తో పాటు పలు రైళ్లను నిలిపేశారు రైల్వే అధికారులు. భారీ వర్షానికి కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ కొట్టుకుపోగా తక్షణమే రైల్వే సిబ్బంది స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.

Andhra Pradesh: గుడ్లవల్లేరు ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం, ఎస్సైను సస్పెండ్ చేసిన ప్రభుత్వం, బాధితులతో అలాంటి ప్రవర్తన సరికాదని హెచ్చరిక

Arun Charagonda

గుడ్లవల్లేరు ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినుల పట్ల అహంకారంతో దురుసుగా మాట్లాడిన ఎస్ఐను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. విద్యార్థినుల ఆవేదనను బాధను అర్థం చేసుకుని భరోసా ఇచ్చేలా వ్యవహరించకుండా విద్యార్థినులతో దురుసుగా ప్రవర్తించడం సరికాదని ..వారి భాదను అర్దం చేసుకుని భరోసా ఇచ్చేలా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు అన్నారు.

Viral Video: తండాను ముంచేసిన వాన.. మహబూబాబాద్ జిల్లాలో నీటమునిగిన బొడ్డి తండా ఇళ్లు (వైరల్ వీడియో)

Rudra

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజాజీవితం అస్తవ్యస్తమవుతున్నది. భా మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండలంలోని బొడ్డి తండాలో భారీ వర్షానికి ఇళ్లు మొత్తం మునిగిపోయాయి.

Viral Video: ఉప్పొంగిన వరద నీటిలో ఎన్టీఆర్ జిల్లా వ్యక్తి నిర్లక్ష్య ప్రయాణం.. తర్వాత ఏమైంది? (వీడియోతో)

Rudra

వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ఉప్పొంగిన వరద నీటిలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి చేసిన నిర్లక్ష్య ప్రయాణంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement
Advertisement