రాష్ట్రీయం
Wanaparthy : వనపర్తిలో రోడ్డు ప్రమాదం, ప్రైవేట్ బస్సు ఢీకొని ఇద్దరు మృతి, అతివేగమే కారణం!
Arun Charagondaవనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామ స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వనపర్తి డిపో కి చెందిన ప్రైవేట్ బస్సు ఢీకొని ఇద్దరు మృతి చెందగా ద్విచక్ర వాహనం అతివేగంతో వెళ్లడం తోనే ప్రమాదం జరిగినట్లు గా ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
Andhra Pradesh: నూజివీడు ట్రిపుల్ ఐటీలో 342 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత, జ్వరం కడుపునొప్పితో పాటు వాంతులు, విరేచనాలు, గత 3 రోజుల్లో 800 మందికి అనారోగ్యం
Hazarath Reddyఏలూరు జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో మంగళవారం ఒక్కరోజే 342 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. గడిచిన 3 రోజులుగా సుమారు 800 మంది అస్వస్థతకు గురయ్యారు. ఆ విద్యార్థులు జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు.
YSRCP: మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్గా జోగి రమేష్, పెనమలూరు ఇన్చార్జ్గా దేవభక్తుని చక్రవర్తి, ఉత్తర్వులు జారీ చేసిన వైసీపీ పార్టీ
Hazarath Reddyరెండు నియోజకవర్గాలకు ఇన్చార్జ్ల నియామిస్తూ వైఎస్సార్సీపీ ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా జోగి రమేష్, పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా దేవభక్తుని చక్రవర్తిలను నియమించారు.
Andhra Pradesh Cabinet Meeting: ఏపీలో రివర్స్ టెండరింగ్ విధానం రద్దు, పాత విధానంలోనే టెండర్ల ప్రతిపాదనకు చంద్రబాబు సర్కారు గ్రీన్ సిగ్నల్, క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవిగో..
Hazarath Reddyఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని మంత్రివర్గం రద్దు చేసింది.
MLC Kavitha At Shamshabad: శంషాబాద్లో ఎమ్మెల్సీ కవితకు అపూర్వ స్వాగతం, పిడికిలి బిగించి అభివాదం తెలిపిన కవిత, ఎయిర్పోర్టుకు భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు...వీడియో
Arun Charagondaఢిల్లీ మద్యం కేసులో ఐదు నెలల క్రితం అరెస్టయ్యి మంగళవారం బెయిల్పై విడుదలైన కవితకు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టులో అపూర్వ స్వాగతం లభించింది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు తరలిరాగా వారికి పిడికిలి బిగించి అభివాదం తెలిపారు కవిత.
Mahabubabad: భర్తకు రెండో పెళ్లి చేసిన భార్య, మహబూబాబాద్ జిల్లాలో జరిగిన సంఘటన, తన భర్తను మానసిక వికలాంగురాలు ఇష్టపడటంతో పెళ్లి చేసిన భార్య..వీడియో
Arun Charagondaతన భర్తకు రెండో పెళ్లి చేసింది ఓ భార్య. ఓ మానసిక వికలాంగురాలు తన భర్తను ఇష్టపడటంతో దగ్గరుండి మరి రెండో వివాహం జరిపించింది భార్య. మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని మార్కండేయ దేవాలయంలో ఈ పెళ్లి జరుగగా స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Attack On MLA Kale Yadaiah: కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలే యాదయ్యపై సొంతపార్టీ నేతలే కోడిగుడ్లతో దాడి, కష్టపడ్డ కార్యకర్తలని గుర్తించాలని డిమాండ్..వీడియో వైరల్
Arun Charagondaకాంగ్రెస్లో అంతర్గతపోరు మరోసారి బయటపడింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పై కోడిగుడ్లు,టమాటలతో కాంగ్రెస్ నేతలు దాడి చేశారు. 10 ఏళ్ల నుండి కష్టపడ్డ కాంగ్రెస్ నాయకులని,కార్యకర్తలని గుర్తించాలని డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ నుండి వచ్చిన వారిని వెంట వేసుకొని తిరుగుతున్నారని ఆగ్రహంతో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. అంతేగాదు ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, కడప వైసీపీ మేయర్ ఇంటి ముందు చెత్తను పోసిన టీడీపీ కార్యకర్తలు, చెత్త పన్ను కట్టొద్దని తెగేసి చెప్పిన ఎమ్మెల్యే మాధవి రెడ్డి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్లోని అధికార తెలుగుదేశం పార్టీ (టిడిపి), ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సిపి) మధ్య కొత్త చెత్త పన్ను నిబంధనపై రాజకీయ ఘర్షణ తీవ్రమైంది. కడపలోని వైఎస్సార్సీపీ మేయర్ సురేశ్బాబు అధికారిక నివాసం ఎదుట టీడీపీ శ్రేణులు, స్థానికులు కలిసి చెత్తబుట్టలు వేయడంతో ఉద్రిక్తత నెలకొంది. పన్ను చెల్లిస్తేనే చెత్త సేకరిస్తామన్న మేయర్ ఆదేశాల మేరకు ఈ నిరసన చేపట్టారు.
MLC Pothula Sunitha Quits YSRCP:వైసీపీకి మరో నేత గుడ్బై, ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా, పార్టీ నుంచి ఒక్కొక్కరుగా వైదొలగుతున్న కీలక నేతలు
Hazarath Reddyవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేశారు. గతంలో ఆమె టీడీపీలో పని చేశారు. 2014 ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఇండిపెంటెండెంట్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్పై ఓడిపోయారు.
Fir Agianst Bithiri Sathi: బిత్తిరి సత్తిపై పోలీస్ కేసు, భగవద్గితను బిల్లు గీత అంటూ చేసిన వీడియోపై చర్యలు..ఎఫ్ఐఆర్ ఇదిగో
Arun Charagondaబిత్తిరి సత్తికి షాక్ తగిలింది. భగవద్గీతను బిల్లు గీత అంటూ బిత్తిరి సత్తి చేసిన వీడియోపై దుమారం చెలరేగింది. దీంతో బిత్తిరి సత్తిపై చర్యలు తీసుకోవాలని ఓ హిందుత్వ సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
CM Revanth Reddy On Hydra: హైదరాబాద్ వరకే హైడ్రా, చెరువులు కబ్జా చేసిన ఎవరినీ వదలిపెట్టమన్న సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతల ఆక్రమణల నుండే కూల్చివేతలు ప్రారంభమని స్పష్టం
Arun Charagondaహైడ్రా వ్యవస్థపై సంచలన కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతానికి హైడ్రా హైదరాబాద్ వరకే పరిమితం అన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన..ఎఫ్టీఎల్, బఫర్ జోన్, పార్కులు, నాలల కబ్జాల పైన చర్యలే మా మొదటి ప్రాధాన్యం అని తేల్చిచెప్పారు.
Andhra Pradesh: నిద్రిస్తున్న విద్యార్థినులను కొరికిన ఎలుకలు, తామరాపల్లి మహిళా గురుకుల పాఠశాలలో ఘటన, 5గురు విద్యార్థినులకు అస్వస్థత
Arun Charagondaశ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం తామరాపల్లిలోని మహిళా గురుకుల కళాశాలలో ఎలుకల దాడి కలకలం రేపింది. నిద్రిస్తున్న విద్యార్థినులను ఎలుకలు కొరికేశాయ్. దాదాపు ఐదుగురు విద్యార్థినులను ఎలుకలు కొరగా మిగితా విద్యార్థులు భయబ్రాంతులకు గురయ్యారు.
Temple Vandalized in Old City: వీడియోలు ఇవిగో, పాతబస్తీలో అమ్మవారి ఆలయాన్ని ధ్వంసం చేసిన మతిస్థిమితం లేని వ్యక్తులు, ఘటనపై మండిపడిన బీజేపీ, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyహైదరాబాద్ పాతబస్తీలో సోమవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు భూలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని ధ్వంసం చేయడం, విగ్రహాలను పగులగొట్టడం దీనికి కారణమైంది. పోలీసులు సకాలంలో స్పందించి ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చారు.
Srisailam Gates Open: కృష్ణమ్మ పరవళ్లు, మళ్లీ తెరుచుకున్న శ్రీశైలం గేట్లు, 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల, విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం
Arun Charagondaకృష్ణమ్మ పరవళ్లతో శ్రీశైలం రిజర్వాయర్ వద్ద ఎగువ నుంచి కృష్ణా నదికి ఇన్ ఫ్లో కొనసాగుతోంది. రెండు క్రెస్ట్ గేట్లను 10 అడుగుల ఎత్తు వరకు ఎత్తి #నాగార్జునసాగర్ డ్యామ్కు నీటిని విడుదల చేశారు అధికారులు. శ్రీశైలం జలాశయానికి ఇన్ ఫ్లో 2,13, 624 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1,22,876 క్యూసెక్కులుగా ఉంది. రిజర్వాయర్ మొత్తం నిల్వ సామర్థ్యం 885 అడుగులు. రిజర్వాయర్లోని ఎడమ, కుడి జలవిద్యుత్ కేంద్రాల్లో అధికారులు విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు.
Grand Welcome For MLC Kavitha: సత్యమేవ జయతే, తెలంగాణ భవన్.. కవిత ఫ్లెక్సీల మయం, గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు పోటీపడి మరి ఫ్లెక్సీలు కట్టిన బీఆర్ఎస్ నేతలు
Arun Charagondaఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సుప్రీం కోర్టు ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేయడంతో తీహార్ జైలు నుండి బయటకు వచ్చారు ఎమ్మెల్సీ కవిత . ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ నుండి హైదరాబాద్ రానుండగా గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు బీఆర్ఎస్ శ్రేణులు రెడీ అయ్యారు. ఇక తెలంగాణ భవన్ మొత్తం కవిత ఫ్లెక్సీలతో నిండిపోయింది. సత్యమేవ జయతే అంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కట్టారు గులాబీ నేతలు.
Hyderabad: లంచాలతో పాటు యువతులతో కానిస్టేబుళ్ల రాసలీలలు, ముగ్గురు కానిస్టేబుళ్లపై వేటు వేసిన సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి
Arun Charagondaహైదరాబాద్ మధురానగర్ పీఎస్కు చెందిన ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. స్పా సెంటర్లు, వ్యభిచార గృహాలనుండి నెలవారీ మామూళ్లు వసూళ్లు చేయడంతో అక్కడి యువతులతో ఖాకీలు రాసలీలు కొనసాగించారు.
Khammam: మద్యం మత్తులో పేకాట రాయుళ్ల వీరంగం, తలలు పగిలే కొట్టుకున్న యువకులు..వీడియో వైరల్
Arun Charagondaఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో పేకాట రాయుళ్లు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి వరకు మద్యం సేవించి పేకాట ఆడగా ఈ క్రమంలో గొడవలు రాగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలు పలువురి తలలు పగిలి రక్తం రాగా ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Notices To Marri Rajashekar Reddy Colleges: ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో కాలేజీల నిర్మాణం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి రెవెన్యూ అధికారుల నోటీసులు
Arun Charagondaతెలంగాణలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో నిర్మాణాలు చేపట్టిన వారిపై హైడ్రా కొరడా ఝుళిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా FTL పరిధిలో ఉందని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలకు నోటీసులు అందజేశారు రెవెన్యూ అధికారులు.
Telangana Thalli statue: తెలంగాణ తల్లి విగ్రహానికి సీఎం రేవంత్ భూమిపూజ, సచివాలయం ప్రధాన ద్వారం సమీపంలో విగ్రహా ఏర్పాటు, సోనియా గాంధీ బర్త్ డే సందర్భంగా ప్రారంభం
Arun Charagondaతెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయ భవన ప్రధాన ద్వారం సమీపంలో విగ్రహాం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. డిసెంబర్ 9న సోనియా గాంధీ బర్త్ డే సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభించనున్నారు. సీఎం రేవంత్తో పాటు సీఎస్ ,
Hidden Camera In Oyo Room: శంషాబాద్లో ఓయో హోటల్ నిర్వాకం, గదిలో రహస్య సీసీ కెమెరా, ఏకాంత వీడియోలతో బెదిరింపులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన ఓ జంట..బయటపడ్డ సంచలన నిజం..వీడియో
Arun Charagondaహైదరాబాద్ శంషాబాద్లో ఓయో హోటల్ నిర్వాకం బయటపడింది. లాడ్జిలో సీసీ కెమెరా పెట్టి జంటలను బ్లాక్ మెయిల్ చేస్తున్న కంత్రీ గాడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఓయో రూమ్లో హిడెన్ కెమెరా పెట్టి జంటల వీడియోలు తీస్తున్నాడు నిర్వాహకుడు.హోటల్ సిటా గ్రాండ్లో ఈ ఘటన చోటు చేసుకోగా సీసీ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుని అదుపులోకి తీసుకొని.. రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.