రాష్ట్రీయం

Pawan Kalyan Slams CM Jagan: నవ్వుతూ ఉండే ఆ తండ్రి లేని బిడ్డ ఫొటో మనకెందుకు,సీఎం జగన్‌పై విరుచుకుపడిన పవన్ కళ్యాణ్

Hazarath Reddy

జనసేనాధి నేత పవన్ కల్యాణ్ ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలో వారాహి విజయభేరి సభలో సీఎం జగన్ మీద విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, స్థానిక ఎమ్మెల్యే పుప్పాల వాసుపై ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే అయి ఉండి సొంత ఇంటికే దారి వేయించుకోలేని వ్యక్తి... మన దారులు ఏం పూడ్చుతాడు, మన రోడ్లు ఏం వేస్తాడు? అంటూ పవన్ విమర్శించారు.

CM Jagan Slams Chandrababu: పోయేకాలం వస్తే హీరో విలన్లకి బచ్చాలానే కనిపిస్తాడు, చంద్రబాబు బచ్చా వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన సీఎం జగన్

Hazarath Reddy

గుంటూరు పొన్నూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం జగన్‌ మోహన్ రెడ్డి.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై నిప్పులు చెరిగారు. చంద్రబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమేనని అన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. చంద్రబాబు ఎలాంటివాడో చెప్పడానికి 2014 కూటమి మేనిఫెస్టో సరిపోతుందని మండిపడ్డారు

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు, మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల అధికారి విడుదల చేయనున్నారు. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు , అలాగే 25 ఎంపి స్థానాలకు ఎన్నికలు జరగనుండగా తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Amit Shah Doctored Video Case: కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వీడియో మార్ఫింగ్‌ కేసు, సీఎం రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేసిన హోంశాఖ, మే 1న ఢిల్లీకి విచారణకు రావాలని ఆదేశాలు

Hazarath Reddy

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వీడియో మార్ఫింగ్‌ కేసులో సీఎం రేవంత్‌ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. మే 1న విచారణకు ఢిల్లీకి రావాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన ఉపయోగించిన ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ను సైతం విచారణకు తీసుకురావాలన్నారు.

Advertisement

Telangana Weather Update: హైదరాబాద్ వాసులకు చల్లటి కబురు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం, తెలంగాణలో 14 జిల్లాల్లో వర్షాలు

Hazarath Reddy

మండే ఎండలతో అల్లాడిపోతున్న నగర వాసులకు ఐఎండీ చల్లని కబురును అందించింది. తెలంగాణ జిల్లాల్లో ఏప్రిల్ 30న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్‌ తెలిపింది. అలాగే హైదరాబాద్ నగరంలో కూడా వర్షాలు పడతాయని అంచనా వేసింది.

TS SSC Results 2024: తెలంగాణ 10వ తరగతి పరీక్షా ఫలితాలు రేపు విడుదల, Results.bsetelangana.org ద్వారా మీ ఫలితాలను చెక్ చేసుకోండి

Hazarath Reddy

తెలంగాణలో పదవ తరగతి పరీక్షా ఫలితాలు రేపు విడుదల కాబోతున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు.

CM Jagan Tweet: మళ్లీ అధికారంలోకి రాగానే జన్మభూమి కమిటీలను తెస్తానని చెప్పే ధైర్యం నీకుందా చంద్రబాబు...సీఎం వైయ‌స్ జగన్‌ ట్వీట్‌

sajaya

మళ్లీ అధికారంలోకి రాగానే జన్మభూమి కమిటీలను తెస్తానని చెప్పే ధైర్యం నీకుందా చంద్రబాబు...? వచ్చే ఎన్నికల్లో మన వైసీపి అభ్యర్థులను ఆశీర్వదించి, ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను’’ అంటూ సీఎం వైయ‌స్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

Heat Wave In Telangana, AP: తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు.. పలు జిల్లాల్లో డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు.. తెలంగాణలో 9 జిల్లాలకు కొనసాగుతున్న ఆరెంజ్‌ అలర్ట్..

sajaya

తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు.. పలు జిల్లాల్లో డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు.. తెలంగాణలో 9 జిల్లాలకు కొనసాగుతున్న ఆరెంజ్‌ అలర్ట్.. ఏపీలో 51 మండలాల్లో తీవ్ర వడగాలులు, 151 మండలాల్లో వడగాలులు వీస్తాయి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచన.

Advertisement

Leopard Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌ పోర్టులో చిరుత క‌ల‌క‌లం.. విమానాశ్ర‌యం ప్రహరీ దూకి లోప‌లికి వ‌చ్చిన‌ట్లు గుర్తించిన‌ అధికారులు.. పట్టుకునేందుకు రెండు బోన్ల ఏర్పాటు

Rudra

శంషాబాద్ ఎయిర్‌ పోర్టులో చిరుత సంచారం క‌ల‌క‌లం రేపుతోంది. విమానాశ్రయం ప్రహరీ గోడ దూకి చిరుత లోపలి భాగంలోకి ప్రవేశించినట్టు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

Jewellery Theft: నగలు కొనడానికి వచ్చినట్టు నటించి మాయ మాటలు చెప్పి 50 తులాల వెండిని, ఆభరణాలను చోరీ చేసిన మహిళలు.. మెదక్ లో ఘటన (వీడియో)

Rudra

మెదక్ జిల్లా కౌడిపల్లిలోని ఓ బంగారం షాపులో చోరీ జరిగింది. గిరాకీ చేసేందుకు వచ్చినట్టు వచ్చిన మహిళలు మాయ మాటలు చెప్పి 50 తులాల వెండిని, ఆభరణాలు చోరీ చేసి ఉడాయించారు.

KTR Comments on Union Territory: హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేసేందుకు భారీ కుట్ర‌, సంచ‌లన వ్యాఖ్య‌లు చేసిన కేటీఆర్

VNS

మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్, బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ ని కేంద్ర పాలిత ప్రాంతంగా (Hyderabad Union Territory) మార్చే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. జూన్ 2 తర్వాత ప్రయత్నాలు ప్రారంభిస్తారనే అనుమానం ఉందన్నారు.

Mohan Bhagwat On Reservations Row: రిజ‌ర్వేష‌న్ల వివాదంపై తొలిసారి స్పందించిన‌ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ , హైద‌రాబాద్ వేదిక‌గా ఆయ‌న ఏమ‌న్నారంటే?

VNS

రిజర్వేషన్స్ వివాదం (Reservations Row) దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. రిజర్వేషన్స్ తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోసారి బీజేపీ (BJP) అధికారంలోకి వస్తే ప్రధాని మోదీ రిజర్వేషన్లు ఎత్తివేస్తారని కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది.

Advertisement

AP Pensions: ఏపీలో పెన్షన్ల పంపిణీపై కీలక నిర్ణయం.. మే 1నే పెన్షన్లు బ్యాంక్ ఖాతాల్లోకి జమ..బ్యాంక్ ఖాతాలు లేనివారికి ఇంటికే పెన్షన్ పంపిణీ.. సీఈసీ ఆదేశాలతో రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు..

sajaya

రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో మే 1నే పెన్షన్లు బ్యాంక్ ఖాతాల్లోకి జమ.. సీఈసీ ఆదేశాలతో రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు.. బ్యాంక్ ఖాతాలు లేనివారికి ఇంటికే పెన్షన్ పంపిణీ.. ఏపీలో 65 లక్షల 49 వేల 864 మంది పెన్షనర్లు.. 48 లక్షల 92 వేల 503 మందికి బ్యాంకుల్లో జమ.. మిగిలిన వాళ్లకు ఇంటికే పెన్షన్ పంపిణీ చేయనున్న అధికారులు.

CM Jagan Bus Yatra: చంద్రబాబును నమ్మడం అంటే పులినోట్లో తలపెట్టినట్లే...వెంకటగిరి బహిరంగ సభలో సీఎం జగన్

sajaya

చంద్రబాబు అమలు చేసిన ఒక్క పథకం గురించైనా చెప్పగలరా?.. చంద్రబాబును నమ్మడం అంటే పులినోట్లో తలపెట్టినట్లే అని వెంకటగిరి బహిరంగ సభలో సీఎం జగన్ పేర్కొన్నారు.

Telangana Shocker: సదాశివపేటలో విషాదం... క్రికెట్ బెట్టింగ్‌లో 25 లక్షలు లాస్.. బీటెక్ విద్యార్థి సూసైడ్

sajaya

క్రికెట్ బెట్టింగ్‌లో 25 లక్షలు లాస్.. బీటెక్ విద్యార్థి సూసైడ్ సంగారెడ్డి - సదాశివపేట పట్టణానికి చెందిన బీటెక్ విద్యార్థి చింత వినీత్(25) రూ.25 లక్షలు అప్పు తెచ్చి బెట్టింగ్‌లో పెట్టి పోగొట్టుకున్నాడు. తెచ్చిన అప్పులు చెల్లించే దారిలేక వినీత్ తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Heat Waves in Telangana: నిప్పుల కొలిమిలా తెలంగాణ.. 45 డిగ్రీలు దాటేసిన ఉష్ణోగ్రతలు.. నేడు, రేపు మరింత పెరుగనున్న ఉష్ణోగ్రతలు

Rudra

భారీ ఉష్ణోగ్రతలతో (High Temperatures) తెలంగాణ (Telangana) నిప్పులు కొలిమిలా మారుతోంది. 45 డిగ్రీలు దాటేసిన ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల దిశగా పరుగులు పెడుతున్నాయి.

Advertisement

Premikudu Re-Release: ముప్పై ఏండ్ల కిందట సంచలనం సృష్టించి మళ్లీ వస్తున్న ‘ప్రేమికుడు’.. 1న 300 థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

Rudra

సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్-ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా కాంబినేషన్‌ లో మూడు దశాబ్దాల క్రితం వచ్చిన లవ్, పొలిటికల్ డ్రామా ‘ప్రేమికుడు’ మళ్లీ విడుదలకు సిద్ధమైంది.

2024 భారతదేశం ఎన్నికలు: ఏపీలో పెద్ద ఎత్తున నామినేష‌న్ల తిర‌స్క‌ర‌ణ‌, 175 స్థానాల్లో 2705 నామినేష‌న్ల‌కు ఆమోదం, తెలంగాణ‌లో 17 లోక్ సభ స్థానాల‌కు 625 నామినేష‌న్లకు ఈసీ ఓకే

VNS

పరిశీలన తరువాత 1,060 సెట్ల నామినేషన్లకు ఆమోదం తెలిపారు. మొత్తం 893 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 268 మంది అభ్యర్థులు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు గాను 625 మంది అభ్యర్థులు నామినేషన్లకు ఆమోదం పొందాయి.

Inter Advanced Supplementary Exams: తెలంగాణ ఇంట‌ర్ సప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల‌, మే 24 నుంచి ప‌రీక్ష‌లు, పూర్తి టైం టేబుల్ ఇదుగోండి

VNS

ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ (Inter Advanced Supplementary) ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌లైంది. మే 24వ తేదీ నుంచి ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ప‌రీక్ష‌లు, మ‌ధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వ‌ర‌కు ఇంట‌ర్ సెకండియ‌ర్ ప‌రీక్ష‌లు (Inter Advanced Supplementary) నిర్వ‌హించ‌నున్నారు.

CM Revanth Reddy: మోడీ, అమిత్‌ షా అన్ని వ్యవస్థలను వాడుకుంటున్నారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి పడేస్తుంది. -సీఎం రేవంత్‌ రెడ్డి

sajaya

ఎన్నికల్లో ఏదో రకంగా లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. మోడీ, అమిత్‌ షా అన్ని వ్యవస్థలను వాడుకుంటున్నారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి పడేస్తుంది. -సీఎం రేవంత్‌ రెడ్డి

Advertisement
Advertisement