రాష్ట్రీయం

YSRCP Manifesto: వైయ‌స్ఆర్‌సీపీ 2024 మేనిఫెస్టో విడుదల..రెండు విడతల్లో పెన్షన్‌ రూ.3,500 దాకా పెంపు..అమ్మ ఒడి రూ. 17వేలకు పెంపు ...మేనిఫెస్టోలోని ముఖ్య అంశాలు ఇవే

sajaya

శనివారం ఉదయం తాడేపల్లిలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వైయ‌స్ఆర్‌సీపీ మేనిఫెస్టో 2024ను విడుదల చేశారు.

YSRCP Manifesto: రెండు పేజీలతో వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం వైఎస్‌ జగన్‌.. చేయగలిగినవి మాత్రమే చెబుతున్నాం.. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటన

sajaya

వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను సీఎం జగన్ విడుదల చేశారు. శనివారం తాడేపల్లిగూడెంలోని పార్టీ కార్యాలయంలో కీలక నేతలతో కలిసి లాంఛనంగా ప్రకటించారు. ఇందులో ప్రధానంగా విద్య, వైద్య, వ్యవసాయం, పేదలందరికీ పక్కా ఇళ్లపై స్పష్టమైన హామీ ఇచ్చారు.

YSRCP Manifesto Live Video : తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో వైసీపీ మేనిఫెస్టో విడుదల చేస్తున్న సీఎం..ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రజలు

sajaya

వైయ‌స్ఆర్‌సీపీ మేనిఫెస్టో తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో విడుదల చేశారు. శనివారం తాడేపల్లిలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మేనిఫెస్టోను ఆవిష్కరించారు

YSRCP Manifesto Today: వైసీపీ మేనిఫెస్టో నేడే విడుదల.. ఆవిష్కరించనున్న సీఎం జగన్.. పారిశ్రామికీకరణ, ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం.. అమ్మఒడి, పెన్షన్లు, రైతు భరోసా, చేదోడు నిధుల పెంపునకు ఛాన్స్.. ఈసారి మరో 2 కొత్త పథకాలు ఉండే అవకాశం

Rudra

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైసీపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈక్రమంలో నేడు వైసీపీ మేనిఫెస్టో విడుదల కాబోతోంది. పార్టీ అధినేత, సీఎం జగన్ ఈ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.

Advertisement

Mallareddy Meets Etala Rajender: మ‌ల్కాజిగిరిలో ఈట‌ల‌దే గెలుపు! షాకింగ్ కామెంట్స్ చేసిన మ‌ల్లారెడ్డి, వివాహ వేడుక‌లో ఈట‌ల‌ను క‌లిసిన మ‌ల్లారెడ్డి (వీడియో ఇదుగోండి)

VNS

మల్లారెడ్డి మల్కాజిగిరిలో ఈటలదే విజయం అంటూ జోస్యం చెప్పారు. అన్నా.. నువ్వే గెలుస్తున్నావ్ అంటూ ఈటల రాజేందర్‌‌ను ఆయన కౌగిలించుకున్నారు. అడిగి మరీ ఈటలతో మల్లారెడ్డి ఫోటోలు, వీడియోలు తీయించుకున్నారు. దాంతో తెలంగాణ రాజకీయాల్లో మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

KA Paul: నాకు క్రెడిట్ ఇవ్వని తెలుగు మీడియా కుటుంబాలు సర్వనాశనం అవుతాయి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నా వల్లే ఆగిందని తెలిపిన కేఎ పాల్,వీడియో ఇదిగో..

Hazarath Reddy

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తన వల్లే ఆగిపోయిందని ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ (KA Paul) సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో తన సత్తా ఏంటో సీఎం జగన్, ప్రధాని మోదీకి తెలిసిందని వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లాయర్ లేకుండా వాదించానని గుర్తుచేశారు.

Andhra Pradesh Elections 2024: గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు నన్ను చంపేందుకు ప్లాన్ చేస్తున్నారు, పోలీసులను ఆశ్రయించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

Hazarath Reddy

జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ విశాఖ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అయితే, తనకు ప్రాణహాని ఉందంటూ లక్ష్మీనారాయణ విశాఖ పోలీస్ కమిషనర్ కు ఇవాళ ఫిర్యాదు చేశారు. తనను అంతమొందించేందుకు గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు ప్రణాళిక రచించారని ఆరోపించినట్టు తెలుస్తోంది.

Orange Alert for Telangana: మండుతున్న ఎండలు, తెలంగాణలో ఆరెంజ్ అలెర్ట్, వచ్చే 5 రోజులు వడగాలులతో జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక 

Hazarath Reddy

తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. వచ్చే అయిదు రోజులు తెలంగాణలో వడ గాల్పులు వీచే అవకాశం ఉందని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్‌లో వాతావరణం కేంద్రం పేర్కొంది. ఈనెల 28, 29, 30 అధికంగా వడగాల్పులు వీచే అవకాశంతో ఉందని తెలిపింది.

Advertisement

Hyderabad Fire Video: షాద్ నగర్ అగ్నిప్రమాదం, మంటల్లో చిక్కుకున్న 50 మంది కార్మికుల ప్రాణాలను కాపాడిన బాలుడు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నందిగామ మండల కేంద్రంలోని అల్విన్‌ ఫార్మసీ కంపెనీలో ప్రమదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే అగ్నికీలలు ఎగిసిపడటంతో.. కంపెనీ మొత్తానికి మంటలు వ్యాపించాయి.

Hyderabad Fire: వీడియోలు ఇవిగో, భారీ అగ్నిప్రమాదంలో భయంతో బిల్డింగ్ పై నుండి దూకుతున్న సిబ్బంది, మంటల్లో చిక్కుకున్న 50 మంది

Hazarath Reddy

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నందిగామ మండల కేంద్రంలోని అల్విన్‌ ఫార్మసీ కంపెనీలో ప్రమదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే అగ్నికీలలు ఎగిసిపడటంతో.. కంపెనీ మొత్తానికి మంటలు వ్యాపించాయి.

Breaking News, Fire Accident: షాద్ నగర్ లో ఓ ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం...మంటల్లో చిక్కుకున్న 50 మంది కార్మికులు

sajaya

రంగారెడ్డి జిల్లాలోని షాద్ నగర్ పరిధిలో అల్వీన్ ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 50 మంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం అందుతోంది. అయితే ఈ ఘటనపై మరింత సమాచారం రావాల్సి ఉంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ వద్ద చోటుచేసుకుంది.

Telugu States Weather Update: మరో మూడు రోజులు వడగాడ్పులు మరింతగా పెరిగే అవకాశం, తెలుగు రాష్ట్రాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ

Hazarath Reddy

సూర్యుడి ప్రతాపానికి ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇదిలా ఉంటే రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని వాతావరణ శాఖలు హెచ్చరిస్తున్నాయి. వడగాడ్పులు అంతకంతకూ పెరుగుతాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ నివేదికలు చెబుతున్నాయి.

Advertisement

Harish Rao Vs Revanth Reddy: ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ సవాల్, రాజీనామా లేఖతో వచ్చిన హరీష్ రావు, దమ్ముంటే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా లేఖతో రావాలని ఛాలెంజ్

Hazarath Reddy

తెలంగాణలో ఎన్నికల వేళ రాజకీయాలు వేడెక్కాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా రైతు రుణమాఫీ అంశంలో రెండు పార్టీలు సవాళ్లు విసురుకుంటున్నాయి. తాజాగా గన్‌ పార్క్‌ దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

2024 భారతదేశం ఎన్నికలు: తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు 547 నామినేషన్లు.. మొదలైన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ... 29వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు.. మే 13న పోలింగ్.. జూన్ 4న ఎన్నికల ఫలితాలు

Rudra

తెలంగాణలో ఎన్నికల నామినేషన్ దాఖలు ప్రక్రియ గురువారం ముగిసింది. 17వ లోక్ సభ స్థానాలకు గాను 547 నామినేషన్లు దాఖలయ్యాయి.

2024 భారతదేశం ఎన్నికలు: దేశవ్యాప్తంగా మొదలైన లోక్‌ సభ రెండో దశ పోలింగ్.. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 88 స్థానాలకు పోలింగ్.. 15.88 కోట్ల మంది ఓటర్లకు ఓటు హక్కు అవకాశం.. బరిలో రాహుల్ గాంధీ సహా అతిరథులు

Rudra

లోక్‌ సభ ఎన్నికలు-2024లో భాగంగా దేశవ్యాప్తంగా రెండో దఫా పోలింగ్ మొదలైంది. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 88 స్థానాల్లో శుక్రవారం ఉదయం 7 గంటలకు ఓటింగ్ షురూ అయ్యింది.

Andhra Pradesh Elections 2024: 175కు 175 సీట్లు గెలుపే లక్ష్యంగా మరో జైత్రయాత్రకు సిద్దమైన సీఎం జగన్, నాలుగు రోజుల టూర్ షెడ్యూల్‌ను విడుదల చేసిన వైసీపీ

Hazarath Reddy

రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకువెళ్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరో జైత్రయాత్రకు సీఎం జగన్‌ సిద్ధమయ్యారు. ఈ నెల 28న తాడిపత్రి నుంచి ఎన్నికల ప్రచార సభలు ప్రారంభించనున్నారు.మొదటి నాలుగు రోజుల టూర్ షెడ్యూల్‌ను వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం గురువారం విడుదల చేసింది.

Advertisement

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ, రేపటి నుంచి నామినేషన్ల పరిశీలన, ఈనెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు

Hazarath Reddy

రానున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కోసం తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నేడు చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలతోపాటు డమ్మీ, ఇండిపెండెంట్‌ అభ్యర్ధులు భారీగానే నామినేషన్లు వేశారు. రేపు(శుక్రవారం) నామినేషన్లు పరిశీలించనున్నారు. ఈనెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.

Andhra Pradesh Elections 2024: పులివెందులలో టీడీపీకి ఎదురుదెబ్బ, వైసీపీలో చేరిన మాజీ మంత్రి అమర్‌నాథ్‌ రెడ్డి సోదరుడు శ్రీనాథ్‌ రెడ్డి దంపతులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

పులివెందులలో సీఎం జగన్‌ సమక్షంలో చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత, మాజీ మంత్రి అమర్‌నాథ్‌ రెడ్డి సోదరుడు శ్రీనాథ్‌ రెడ్డి దంపతులు వైఎస్సార్‌సీపీలోకి చేరారు. గత ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పుంగనూరులో టీడీపీ తరపున శ్రీనాథ్‌ రెడ్డి భార్య అనీషా రెడ్డి పోటీ చేశారు

AP Intelligence New Chief: ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్‌గా కుమార్ విశ్వజిత్, విజయవాడ కొత్త బాస్‌గా పీహెచ్‌డీ రామకృష్ణ, అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేసిన ఈసీ

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) ఇంటిలిజెన్స్ చీఫ్ (Intelligence Chief )గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి కుమార్‌ విశ్వజిత్‌ (Kumar Vishwajit), విజయవాడ నగర పోలీసు కమిషనర్‌గా పీహెచ్‌డీ రామకృష్ణ (PHD Ramakrishna)ను కేంద్ర ఎన్నికల సంఘం (CEC) నియమించింది

Veera Siva Reddy Joins YSRCP: కడప జిల్లాలో టీడీపీకి మరో షాక్, వైసీపీలో చేరిన కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, ఏ పని అప్పగించినా విధేయంగా పని చేస్తానని వెల్లడి

Hazarath Reddy

కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి టీడీపీనీ వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. గురువారం పులివెందులలో నామినేషన్‌ వేయడానికి వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు.

Advertisement
Advertisement