రాష్ట్రీయం

Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు, విదేశాల్లో దాక్కున్న ప్రభాకర్‌రావుపై రెడ్‌ కార్నర్‌ నోటీసులు, నిందితులపై సైబర్‌ టెర్రరిజం సెక్షన్లు నమోదు

Hazarath Reddy

తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.నిందితులపై దర్యాప్తు బృందం సైబర్‌ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. ఈ కేసులో ఐటీ యాక్ట్‌ 66(ఎఫ్‌)ను పోలీసులు ప్రయోగించనున్నారు. దీనిపై పోలీసులు నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేయనున్నారు.

Andhra Pradesh Elections 2024: పులివెందుల అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సీఎం జగన్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. గురువారం ఉదయం పులివెందుల పర్యటనకు వెళ్లిన ఆయన.. బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం నేరుగా మినీ సెక్రటేరియట్‌లోని ఆర్వో ఆఫీస్‌కు వెళ్లారు

CM Jagan Counter To Sharmila: వివేకాకు రెండో భార్య ఉందన్న మాట నిజం కాదా? చంద్ర‌బాబు కుట్ర‌లో ష‌ర్మిల‌, సునిత పావులుగా మారారంటూ తీవ్రంగా ఆరోపించిన వైయ‌స్ జ‌గ‌న్

VNS

వైఎస్ వారసులెవరో ప్రజలే చెప్పాలన్నారు. వైఎస్ఆర్ వ్యతిరేకులతో పాటు నా ఇద్దరు చెల్లెమ్మలు కుట్రలో భాగం అయ్యారు. పసుపు చీరలు కట్టుకొని వైఎస్ఆర్ శత్రువులతో చేతులు కలిపిన వీళ్లా వైఎస్ఆర్ వారసులు అంటూ షర్మిలను (Sharmila) ఉద్దేశించి జగన్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.

Warangal Road Accident: ఇంటర్ పాసైన ఆనందంలో పార్టీ, ఒకే బైక్‌పై వస్తుండగా బస్సు ఢీకొని నలుగురు స్నేహితులు మృతి, వరంగల్‌లో విషాదకర ఘటన

Hazarath Reddy

వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై గత రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్మీడియట్ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ముగ్గురు యువకులు స్పాట్‌లోనే చనిపోగా మరో యువకున్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.

Advertisement

Hyderabad Road Accident: రింగురోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం, ఆగి ఉన్న లారీని వెనుకనుంచి ఢీ కొట్టిన కారు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఓ కారు వేగంగా ఢీకొట్టింది. పటాన్‌చెరు ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్- 3 దగ్గర ఆగి ఉన్న లారీని వెనుకనుంచి ఢీ కొట్టిన కారు ఒక్కసారిగా మంటలు చెలరేగి.. కారు పూర్తిగా దగ్ధం కాగా.. మంటలు లారీకి కూడా అంటుకున్నాయి కారులో ఇద్దరు సజీవ దహనం అయినట్టు సమాచారం.

Road Accident in Kodada: కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు.. ఆరుగురు మృతి

Rudra

సూర్యాపేట జిల్లా కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని వెనుక నుంచి వచ్చిన ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది.

Telangana: ఇంటర్ ఫెయిల్, ఒక్కరోజే ఏడుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య, తెలంగాణలో ఆయా విద్యార్థుల కుటుంబాల్లో తీవ్ర విషాదం

Hazarath Reddy

నిన్న వెలువడిన ఇంటర్ పరీక్షా ఫలితాల్లో ఫెయిల్ అయ్యామనే మనస్థాపంతో ఒక్కరోజే ఏడుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.

Theenmar Mallanna: నల్గొండ - వరంగల్‌ - ఖమ్మం నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న

Rudra

నల్గొండ - వరంగల్‌ - ఖమ్మం పట్టభద్రుల ఉపఎన్నికకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌ ను బరిలో దింపుతున్నట్లు వెల్లడించింది.

Advertisement

Congress Khammam Candidate: ఖ‌మ్మం కాంగ్రెస్ అభ్య‌ర్ధిపై వీడిన ఉత్కంఠ‌, పొంగులేటి వియ్యంకుడికే ఖ‌మ్మం సీటు ఖరారు, క‌రీంన‌గ‌ర్, హైద‌రాబాద్ అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించిన కాంగ్రెస్

VNS

తెలంగాణలో మూడు పెండింగ్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ (Congress). హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి మొహమ్మద్ సమీర్ పోటీ చేయనున్నారు. ఖమ్మం ఎంపీ (Khammam MP) అభ్యర్థిగా రామ సహాయం రఘురాం రెడ్డి (Raghuram Reddy), కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా రాజేందర్ రావు (Rajender Rao) పోటీ చేస్తారు.

Telangana Elections 2024: ప్రధాని మోదీ, కేసీఆర్‌ ఇద్దరూ తోడు దొంగలే, మామా అల్లుళ్లు తోక తెగిన బల్లుల్లా ఎగురుతున్నారని మండిపడిన తెలంగాణ ముఖ్యమంత్రి

Hazarath Reddy

తెలంగాణకు రెండో రాజధానిగా వరంగల్‌కు అన్ని అర్హతలున్నాయని CM రేవంత్‌రెడ్డి అన్నారు. వరంగల్‌లో బుధవారం(ఏప్రిల్‌24) జరిగిన కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. పంద్రాగస్టులోగా రూ.2లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పారు.

Srikakulam Memantha Siddham Sabha: ముగిసిన సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర, సిక్కోలు జనం సింహాల్లా కదిలివచ్చారని టెక్కలి సభలో ప్రసంగించిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 22వ రోజైన బుధవారం శ్రీకాకుళం జిల్లాలో కొనసాగింది. నేటితో మేమంతా సిద్ధం బస్సుయాత్ర ముగిసింది. 22 రోజులు పాటు 2100 కిలోమీటర్ల మేర బస్సు యాత్ర సాగింది

Sri Sri Jayanthi: ఏప్రిల్ 30న శ్రీ శ్రీ జయంతి, తెలుగు సాహిత్యపు దశను, దిశను మార్చిన రచయిత గురించి ప్రత్యేక కథనం ఇదిగో..

Vikas M

విప్లవ రచయితగా, అభ్యుదయ వాదిగా, సినీ రచయితగా, ప్రముఖ జర్నలిస్టుగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచనల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా… తెలుగు సాహిత్యపు దశను, దిశను మార్చిన అతికొద్ది మంది రచయితల్లో శ్రీశ్రీ ఒకరు.1910 ఏప్రిల్ 30న పూడిపెద్ది వెంకటరమణయ్య, అప్పటకొండ దంపతులకు జన్మించాడు.

Advertisement

Andhra Pradesh: హిందూపురంలో దారుణం, ఆవుల్ని వధించనని చెప్పినందుకు ముస్లిం యవకుడిని స్తంభానికి కట్టేసి కొట్టిన నిర్వాహకులు, వీడియో ఇదిగో...

Hazarath Reddy

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో అక్రమంగా నడుపుతున్న కబేళాలో పశువులను వధించాలని పరిగికి చెందిన వాజిద్‌ను తీసుకెళ్లిన నిర్వాహకులు. కాని అక్కడ ఎద్దులకు బదులు ఆవులు కనిపించడంతో వాటిని వధించేందుకు వాజిద్ నిరాకరించాడు. దీంతో ఫోన్ దొంగలించావంటూ వాజిద్ పై అబద్ధపు ఆరోపణులు చేసి అతన్ని స్తంభానికి కట్టేసి కొట్టిన వ్యాపారులు.

Harish Rao Challenge to CM Revanth Reddy: ఆగస్ట్ 15 లోపు మీరు ఇచ్చిన అన్ని గ్యారెంటీలు అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్

Hazarath Reddy

ఆగస్టు 15 లోగా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, రుణమాఫీ చేయకపోతే మీరు సీఎం పదవికి రాజీనామా చేస్తారా..?’ అని బీఆర్ఎస్‌ సీనియర్‌ నేత, రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్‌ విసిరారు.

Stone Pelting Attack on Jagan: సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసు, నిందితుడు సతీష్‌కు 3 రోజులు డిమాండ్ విధించిన కోర్టు

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో ఏ1గా ఉన్న సతీష్‌ను మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించ్చింది. ఈ నేపథ్యంలో సతీష్‌ను పోలీసులు మూడు రోజుల పాటు విచారించనున్నారు. కాగా, న్యాయవాది సమక్షంలో సతీష్‌ను విచారించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.

TS Inter Results Out: తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాలు వచ్చేశాయోచ్.. ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలను Manabadi, tsbie.cgg.gov.in వెబ్ సైట్ లో చూసుకోండి మరి!!

Rudra

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలు కాసేపటి క్రితం విడుదల అయ్యాయి.

Advertisement

KCR on Congress: ఏపీలో మళ్లీ జగన్ అధికారంలోకి వస్తాడు, కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు, తెలంగాణలో ఎన్నికల తర్వాత బీజేపీ సర్కారు చేతిలో కాంగ్రెస్ బతకదని తెలిపిన బీఆర్ఎస్ అధినేత

Hazarath Reddy

తెలంగాణలో ఎన్నికల తరువాత ఏమైనా జరిగే అవకాశం ఉన్నదని బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బీజేపీ బతికనిచ్చే పరిస్థితి లేదని, ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే.. అప్పటి పరిస్థితులను బట్టి తమ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టంచేశారు.

Beer Sales in Telangana: తెలంగాణలో రికార్డు స్థాయిలో బీర్ల అమ్మకాలు, 18 రోజుల్లో రూ. 670 కోట్ల బీర్లు తాగేసిన మందుబాబులు

Hazarath Reddy

తెలంగాణలో గతేడాది రికార్డు స్థాయిలో మందుబాబులు మద్యం తాగేసిన సంగతి విదితమే. ఈ ఏడాది ఆ రికార్డును బ్రేక్ చేశారు. గడిచిన 18 రోజుల్లో 670 కోట్ల రూపాయల బీర్లు తెలంగాణ మందుబాబులు తాగేశారని నివేదికలు చెబుతున్నాయి .

Yellow Alert for TS: రాబోయే రెండు రోజ‌లు బ‌య‌ట‌కు వెళ్లే ముందు ఒక‌టికి రెండు సార్లు ఆలోచించుకోండి! వ‌డ‌గాల్పులు వీచే అవ‌కాశ‌ముందని ఐఎండీ హెచ్చ‌రిక‌, తెలంగాణలో 9 జిల్లాల‌కు ఎల్లో అల‌ర్ట్ జారీ

VNS

తెలంగాణలోనూ పగటి ఉష్ణోగ్రతలు (TS Temparatures) పెరిగిపోతున్నాయి. గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలోని 9 జిల్లాల్లో వడగాలులు వీస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (Hyderabad IMD) హెచ్చరించింది. ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది.

Kavali Road Accident: కావలిలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీని క్రాస్ చేయబోయి ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టిన కారు, ముగ్గురు అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

కావలి ముసునూరు టోల్ ప్లాజా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని క్రాస్ చేయబోయి ముందు వెళ్తున్న మరో లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది.

Advertisement
Advertisement