రాష్ట్రీయం
Vizianagaram Train Accident: రైలు ప్రమాద ఘటనపై పలు ప్రశ్నలను సంధించిన సీఎం జగన్, వెంటనే ఉన్నత స్థాయి ఆడిట్ కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచన
Hazarath Reddyబ్రేకింగ్ సిస్టమ్ మరియు అలర్ట్ సిస్టమ్ ఎందుకు పని చేయలేదు? అలాగే సిగ్నలింగ్ ఎందుకు విఫలమైంది? కమ్యూనికేషన్ వ్యవస్థ ఎలా విఫలమైంది? వీటిపై నిజనిజాలు తెలుసుకోవాలని గౌరవనీయులైన ప్రధాన మంత్రిని, రైల్వే మంత్రిని నేను హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.
Vizianagaram Train Accident: రైలు ప్రమాదంలో గాయపడిన బాధితులు పూర్తిగా కోలుకునే వరకు ప్రభుత్వం తోడుగా ఉంటుంది, సీఎం జగన్ ట్వీట్ ఇదిగో..
Hazarath Reddyవిజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనలో పలువురు మరణించడం బాధాకరమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. ‘‘వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను
Telangana Assembly Elections 2023: వీడియో ఇదిగో, కొత్త ప్రభాకర్ రెడ్డి కోసం హాస్పిటల్‌కు పరిగెత్తుకుంటూ వెళ్ళిన మంత్రి హరీష్ రావు, దాడిని ఖండించిన తెలంగాణ మంత్రి
Hazarath Reddyమెదక్ ఎంపీ, దుబ్బాక అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిపై మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. ఈ దాడి అత్యంత గర్హనీయమన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని వ్యాఖ్యానించారు. ఈ ఘటనను ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తున్నాయన్నారు.
Telangana Assembly Elections 2023: కేసీఆర్‌ను గద్దె దించడానికి కాంగ్రెస్‌తో కలుస్తున్నాం, ఆరు అంశాలతో మద్దతు ప్రకటించిన కోదండరాం
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతిస్తున్నట్లు తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం ప్రకటించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తదితరులతో భేటీ అనంతరం ఆయన వారితో కలిసి మీడియా ముందుకు వచ్చారు.
Telangana Assembly Elections 2023: మొండి కత్తి మాకూ దొరకదా, చాతకాని ప్రతిపక్ష దద్దమ్మ పార్టీలు, వెదవలు కత్తులతో దాడికి పాల్పడుతున్నారు, సీఎం కేసీఆర్ ఫైర్ వీడియో ఇదిగో..
Hazarath Reddyఅతికష్టం మీద తెలంగాణను సాధించుకున్నామని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ఉప్పెనలా ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చిందని, 15 ఏళ్ల పోరాటం తర్వాత రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు.బాన్సువాడలో సోమవారం బీఆర్‌ఎస్‌ ప్రజాఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు
Skill Development Case: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసు, చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌, రేపు వెల్లడిస్తామని తెలిపిన ధర్మాసనం
Hazarath Reddyస్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్‌ చేసింది. మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై మంగళవారం తీర్పును వెల్లడిస్తామని న్యాయమూర్తి తెలిపారు.
Knife Attack on MP Kotha Prabhakar Reddy: మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి చేసిన దుండగుడు, కడుపులో తీవ్ర గాయాలు
Hazarath Reddyమెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. కత్తితో ఓ వ్యక్తి ఆయనపై దాడి చేయగా.. కడుపులో గాయం అయ్యింది. దీంతో ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. సూరంపల్లి ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Kotha Prabhakar Reddy: కొత్త ప్రభాకర్ రెడ్డి మీద కత్తితో దాడి చేసిన నిందితుడు అరెస్ట్, మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ యశోదకు మెదక్ ఎంపీ
Hazarath Reddyమెదక్ బీఆర్ఎస్ ఎంపీ, దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి మీద కత్తితో దాడి జరిగింది. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో గుర్తుతెలియని వ్యక్తి దాడి చేశారు. కాగా కొత్త ప్రభాకర్ రెడ్డిని పొడిచిన నిందితుడు రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Vizianagaram Train Accident: రైలు ప్రమాద బాధితుల్ని పరామర్శించిన సీఎం జగన్, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyవిజయనగరం కంటాకపల్లి రైలు ప్రమాద బాధితుల్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. తొలుత విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రి బయట ప్రమాదానికి సంబంధించి అధికారులు ఏర్పాటు చేసిన చిత్రాలను ఆ‍యన పరిశీలించారు.
Vizianagaram Train Accident: బాధితుల ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడేంత వరకు ఏపీ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది, రైలు ప్రమాద ఘటనపై మంత్రి బొత్సా సత్యనారాయణ
Hazarath Reddyవిజయనగరం రైలు ప్రమాదంలో బాధితుల ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడేంత వరకు ఏపీ ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. సోమవారం విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన ప్రభుత్వ యంత్రాగాన్ని అభినందించారు.
Vizianagaram Train Accident: విజయనగరం రైలు ప్రమాద బాధితులకు సీఎం జగన్‌ పరామర్శ, మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటన
Hazarath Reddyవిజయనగరం రైలు ప్రమాద ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వారిని ఓదార్చేందుకు విశాఖ ఎయిర్‌ పోర్టుకు చేరుకున్నారు సీఎం జగన్‌. నేరుగా విజయనగరం ప్రభుత్వాసుపత్రికి వారిని పరామర్శించనున్నారు. ముందుగా ఘటనా స్థలాన్ని పరిశీలించాలని అనుకున్నప్పటికీ.. రైల్వే అధికారుల విజ్ఞప్తితో నేరుగా బాధితుల్ని పరామర్శించనున్నారు.
Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, సరిహద్దుల్లో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోని 500 పోలింగ్ స్టేషన్‌ల వద్ద పటిష్ట భద్రత
Hazarath Reddyరాష్ట్రంలో నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ఎటువంటి ఆటంకం లేకుండా జరిగేలా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లోని వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోని 500కు పైగా పోలింగ్‌ కేంద్రాల్లో భద్రతా సిబ్బందిని అదనంగా మోహరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Vizianagaram Train Accident: రాయగడ ప్యాసింజర్‌ రైలు లోకో పైలట్ వల్లే రైలు ప్రమాదం,కీలక విషయాలు వెలుగులోకి, ఘటనాస్థలికి బయలు దేరిన సీఎం జగన్‌
Hazarath Reddyఈ ప్రమాదానికి మానవతప్పిదమే కారణమని ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే అధికారి తెలిపారు. ప్రమాదంపై ఓ మీడియా ఛానెల్‌తో ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్‌ విశ్వజిత్‌ సాహూ మాట్లాడుతూ..రాయగడ ప్యాసింజర్‌ రైలు లోకో పైలట్ వల్లే ప్రమాదం జరిగింది. రెడ్‌ సిగ్నల్‌ను రాయగడ లోకో పైలట్ పట్టించుకోలేదు. ఫలితంగానే ఘోర ప్రమాదం సంభవించిందని అధికారి సాహూ తెలిపారు
Dharmapuri Arvind on BRS: వీడియో ఇదిగో, సీఎం కేసీఆర్ సచ్చిపోతే రూ. 5 లక్షలు, మంత్రి రూ. కేటీఆర్ సచ్చిపోతే 10 లక్షలు, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వివాదాస్పద వ్యాఖ్యలు
Hazarath Reddyనిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ బీఆర్ఎస్ పార్టీ అదినతేలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సీఎం కేసీఆర్ సచ్చిపోతే 5 లక్షలు, మంత్రి కేటీఆర్ సచ్చిపోతే 10 లక్షలు, కవిత సచ్చిపోతే 20 లక్షలు ఇస్తామని మా పార్టీ మానిఫెస్టోలో పెడతామని సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇదిగో..
Onion Price: సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న ఉల్లి ధరలు.. హైదరాబాద్‌ లో కేజీ రూ.60-80
Rudraఉల్లి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. నెల క్రితం వరకు రూ.100కు 6 కేజీల వరకు దొరికిన ఉల్లి, ఇప్పుడు వందకు కేజీన్నరకు పడిపోయింది.
Viziangararam Train Accident Update: విజయనగరం రైలు ప్రమాదం.. నేడు పలు రైళ్ల రద్దు.. పూర్తి వివరాలు ఇదిగో..
Rudraవిజయనగరం జిల్లా కంటకాపల్లి-అలమండ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో నేడు పలు రైళ్లు రద్దయ్యాయి.
AP Train Accident Update: విజయనగరం రైలు ప్రమాదంలో 14కు పెరిగిన మృతుల సంఖ్య.. వందల సంఖ్యలో క్షతగాత్రులు.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
Rudraవిజయనగరం జిల్లాలో గతరాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మరణించినవారి సంఖ్య 14కు పెరిగింది. మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డినట్టు అధికారులు చెబుతున్నా వారి సంఖ్య వందకుపైనే ఉంటుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
YS Jagan on Train Accident: విజయనగరం రైలు ప్రమాదంపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి, సహాయ కార్యక్రమాలపై ఎప్పటికపుడు నివేదిక ఇవ్వాలని ఆదేశం
VNSవిజయనగరం జిల్లా కంటకాపల్లి దగ్గర జరిగిన ఘోర రైలు (train accident) ప్రమాదంపై ఏపీ సీఎం జగన్ (YS Jagan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖ నుంచి రాయగడ వెళ్తున్న ప్యాసింజర్‌ రైలుకు ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమిక సమాచారం వచ్చిందని, ఈ ఘటనలో నాలుగు బోగీలు పట్టాలు తప్పినట్టుగా సమాచారం అందుతోందని సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
Narendra Modi on Train Accident: విజయనగరం రైల్ ప్రమాదంపై ప్రధాని మోడి తీవ్ర దిగ్బ్రాంతి, సహాయ కార్యక్రమాలపై రైల్వే మంత్రి తో మాట్లాడిన మోడి
VNSసహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. మరోవైపు ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడి (Narendra Modi) తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు, రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ తో మాట్లాడారు ప్రధాని. ప్రమాద స్థలిలో జరుగుతున్న సహాయ కార్యక్రమాలపై ఆరా తీశారు.
Andhra Pradesh Train Accident: విజయనగరం రైలు ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య, ఇప్పటి వరకు ఆరుగురు మృతి, 20 మందికి పైగా గాయాలు, హెల్ప్ లైన్ నంబర్లు ఇవే!
VNSవిజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రైలు ప్రమాదం (Andhra Pradesh train accident) జరిగింది. రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను అంబులెన్స్‌లలో విజయనగరం (Andhra Pradesh train accident) ఆసుపత్రికి తరలిస్తున్నారు.