రాష్ట్రీయం

Gaddam Vinod: మాజీ మంత్రి మొబైల్ నుంచి అశ్లీల వీడియో బయటకు, ఆ వీడియోతో తనకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేసిన కాంగ్రెస్‌ నేత గడ్డం వినోద్

Hazarath Reddy

తెలంగాణ కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి గడ్డం వినోద్‌ సెల్‌ఫోన్‌ నుంచి ఓ అశ్లీల వీడియో మంచిర్యాల జిల్లా వాట్సాప్‌ గ్రూప్‌లో షేర్‌ చేయడం జిల్లాలో కలకలం రేపింది. వాట్సాప్ గ్రూపులో ఎవరు పోస్టు చేశారో తెలియకపోయినా మాజీ మంత్రి వినోద్ ఫోన్‌ నుంచి ఈ వీడియో బయటకు రావడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది.

Akbaruddin Owaisi: వీడియో ఇదిగో, మా తాత ముత్తాతలు హిందూస్తాన్లో పుట్టారు, రాహుల్ గాంధీ మీ అమ్మమ్మ ఎక్కడ పుట్టింది? రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన అక్బరుద్దీన్ ఒవైసి

Hazarath Reddy

రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి.. అక్బరుద్దీన్ ఒవైసి సవాల్. మా తాత ముత్తాతలు హిందూస్తాన్లో పుట్టారు, రాహుల్ గాంధీ మీ అమ్మమ్మ ఎక్కడ పుట్టింది?. రేవంత్ రెడ్డి ఛార్మినార్ లోని భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరికి వచ్చి ఒట్టు వేసి చెప్పు నేను ఆర్ఎస్ఎస్ లో పని చేయలేదు, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకిని అని - అక్బరుద్దీన్ ఒవైసి

RBI- Repo Rate: కీలక వడ్డీ రేట్లు యథాతథం.. 6.50% వద్ద యథాతథంగా రెపో రేటు.. ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ నిర్ణయం

Rudra

రిజర్వ్‌ బ్యాంక్‌ రెపో రేటులో ఈసారి కూడా ఎలాంటి సవరణలు చేయలేదు. రెపో రేటును 6.50% వద్ద యథాతథంగా ఉంచారు. దీంతో వరుసగా నాలుగోసారి కూడా రెపో రేటు 6.50% వద్దే స్థిరంగా కొనసాగుతున్నట్లయింది.

Singareni Bonus: 16న సింగరేణి దసరా బోనస్‌.. ఒక్కో కార్మికుడికి 1.53 లక్షలు.. బోనస్ లెక్కింపు ఇలా..

Rudra

సింగరేణి కార్మికులకు దసరా కానుకగా లాభాల వాటా బోనస్‌ కింద రూ.711.18 కోట్లను ఈ నెల 16న చెల్లించనున్నట్టు సింగరేణి సీఎండీ ఎన్‌ శ్రీధర్‌ వెల్లడించారు. సగటున ఒక్కో ఉద్యోగికి రూ.1.53 లక్షల వరకు లాభాల బోనస్‌ అందుతుందని చెప్పారు.

Advertisement

CM Breakfast Scheme: నేటి నుంచి సీఎం బ్రేక్‌ ఫాస్ట్‌.. తెలంగాణలో 1 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ప్రతిరోజు అల్పాహారం.. మెనూలో నోరూరించే ఐటమ్స్ ఏం ఉన్నాయంటే?

Rudra

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్‌’ స్కీం శుక్రవారం ప్రారంభం కానున్నది.

CM Jagan Delhi Tour: కేంద్ర మంత్రులతో భేటీ అయిన సీఎం జగన్, రాష్ట్రానికి రావాల్సిన నిధులు గురించి చర్చ, రేపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా హస్తినకు చేరుకున్నారు. ఢిల్లీలో సీఎం జగన్‌కు ఎయిర్‌పోర్టులో వైఎస్సార్‌సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, భరత్‌, రెడ్డప్పా, అయోధ్య రామిరెడ్డి, బాలశౌరి, గోరంట్ల మాధవ్‌, రంగయ్యలు ఘన స్వాగతం పలికారు.

Skill Development Case: చంద్రబాబు రిమాండ్‌ మరో 14 రోజులు పొడిగించిన ఏసీబీ కోర్టు, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా

Hazarath Reddy

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో (Skill Development case) అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) రిమాండ్‌ను ఏసీబీ కోర్టు పొడిగించింది. అక్టోబరు 19 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో రాజమహేంద్రవరం జైలులో ఉన్న చంద్రబాబుకు రెండో దఫా విధించిన రిమాండ్‌ గడువు గురువారంతో ముగిసింది.

Skill Development Case: చంద్రబాబు జ్యుడిషియల్‌ రిమాండ్‌ పొడిగించండి, ఏసీబీ కోర్టులో మెమో దాఖలు దాఖలు చేసిన సీఐడీ

Hazarath Reddy

స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు జ్యుడిషియల్‌ రిమాండ్‌ పొడిగించాలంటూ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది. ఈ కేసులో రాజమహేంద్రవరం జైలులో ఉన్న చంద్రబాబుకు రెండోదఫా విధించిన రిమాండ్‌ గడువు గురువారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో సీఐడీ మళ్లీ మెమో దాఖలు చేసింది

Advertisement

Telangana Assembly Elections 2023: తెలంగాణ ఎన్నికల కోసం 14 కమిటీలను ప్రకటించిన బీజేపీ అధిష్టానం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కీలక బాధ్యతలు

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ కమిటీలను ప్రకటించింది . స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని నియమిస్తూ గురువారం ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం మొత్తం 14 కమిటీల్ని ప్రకటించింది బీజేపీ

Andhra Pradesh Shocker: కడపలో దారుణం, భార్యతో సహా ఇద్దరు పిల్లలను తుఫాకీతో కాల్చి ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్, వ్యక్తిగత కారణాలే కారణమని తెలిపిన కడప డీఎస్పీ షరీఫ్‌

Hazarath Reddy

కడపలో కో-ఆపరేటివ్‌ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. వెంకటేశ్వర్లు (50) అనే హెడ్‌ కానిస్టేబుల్‌ తన భార్య, ఇద్దరు పిల్లలను పిస్తోలుతో కాల్చి చంపి ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంకటేశ్వర్లు ప్రస్తుతం కడప రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు

Pawan Kalyan: వీడియో ఇదిగో, 2009 నేను ప్రజా రాజ్యం పార్టీలోనే ఎంపీ అయిపోయే వాడిని, నాకు ఆ సత్తా ఉందని తెలిపిన పవన్ కళ్యాణ్

Hazarath Reddy

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ..నేను 2009 ప్రజా రాజ్యం పార్టీలోనే ఎంపీ అయిపోయే వాడిని.. నాకు ఆ సత్తా ఉందని తెలిపారు. కాగా గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు.

Chandrababu Judicial Remand: చంద్రబాబు బెయిల్‌ పై సర్వత్రా ఉత్కంఠ, నేటితో ముగియనున్న రిమాండ్ గడువు, మళ్లీ పొడిగిస్తారా? లేకపోతే బెయిల్ వస్తుందా?

VNS

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుకు (Skill Development Case) సంబంధించి రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుకు (Chandrababu) రెండోసారి విధించిన రిమాండ్‌ గడువు ఇవాల్టితో ముగియనుంది. ఈ నేపథ్యంలో విజయవాడ ఏసీబీ కోర్టు (ACB Court) న్యాయమూర్తి ఎదుట వర్చువల్‌లో ఆయనను హాజరుపరిచే అవకాశం ఉంది.

Advertisement

Turmeric Board: పసుపుబోర్డు ఏర్పాటుపై ప్రధాని మోదీ హర్షం, తెలుగులో ట్వీట్ చేసిన నరేంద్రమోదీ, కోట్లాది రైతులకు మేలు జరుగుతుందంటూ తెలుగులో పోస్టు పెట్టిన ప్రధాని

VNS

నిజామాబాద్‌ లో పసుపు బోర్డు (Turmeric Board) ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. పసుపు బోర్డుతో రైతులకు మేలు జరుగుతుందని ఆయన తెలుగులో ట్వీట్ (PM MODI) చేశారు. పసుపుబోర్డు ఏర్పాటుపై తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

IT Raids: బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలు, 100 బృందాలతో విస్తృతంగా తనిఖీలు చేస్తున్న అధికారులు, రూ. 40 కోట్ల ఐటీ స్కామ్‌ కు సంబంధించి సోదాలు చేస్తున్నట్లు వార్తలు

VNS

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ (Maganti Gopinath) తోపాటు కూకట్ పల్లిలోని ఆయన సోదరుల నివాసాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా అనేక సార్టు హైదరాబాద్ లో ఐటీ సోదాలు నిర్వహించారు.

Telangana Assembly Election 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ఇదిగో, మొత్తం 3,17,17,389 మంది ఓటర్లు, సెప్టెంబర్ 28 నాటికి కొత్త ఓటర్ల సంఖ్య 17,01,087

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ ఏడాది జనవరితో పోలిస్తే 5.8 శాతం ఓట్లు పెరిగినట్లు పేర్కొంది.18-19 సంవత్సరాల మధ్య వయసు వారు 8,11,640 మంది ఓటర్లు. అంటే 5.1.2023 కంటే 5,32,990 పెరుగుదల నమోదైంది.

TSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు 4.8 శాతంతో మరో డీఏ మంజూరు చేసిన కేసీఆర్ సర్కారు, పెండింగ్‌లో ఉన్న మొత్తం 9 డీఏలు మంజూరు చేసినట్లు తెలిపిన టీఎస్ఆర్టీసీ

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఉద్యోగులకు కేసీఆర్‌ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు 4.8 శాతంతో మరో డీఏ మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది.

Advertisement

Pawan Kalyan on Jagan Govt: రాబోయేది జనసేన - టీడీపీ ప్రభుత్వమే, జగన్‌ది రూపాయి పావలా ప్రభుత్వమని విమర్శలు గుప్పించిన పవన్ కళ్యాణ్

Hazarath Reddy

జగన్‌ మోహన్ రెడ్డిది రూపాయి పావలా ప్రభుత్వమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ దుయ్యబట్టారు. సీఎం జగన్‌కు ఒంట్లో పావలా దమ్ము లేదని ధ్వజమెత్తారు. వైసీపీ పథకాల్లో అంతా డొల్లతనమేనని.. రాబోయేది జనసేన - టీడీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.

CM Jagan Delhi Tour: రేపటి నుండి రెండు రోజుల పాటు సీఎం జగన్ ఢిల్లీ పర్యటన, వామపక్ష తీవ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సమీక్షా సమావేశంలో పాల్గొననున్న ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. రేపు(గురువారం), ఎల్లుండి(శుక్రవారం) సీఎం జగన్‌ ఢిల్లీలోనే ఉండనున్నారు. రేపు(గురువారం) ఉదయం 10 గంటలకు సీఎం జగన్‌ ఢిల్లీ బయలుదేరనున్నారు. శుక్రవారం వామపక్ష తీవ్రవాదంపై కేంద్రం నిర్వహించే సమావేశానికి ముఖ్యమంత్రి జగన్‌ హాజరుకానున్నారు

Skill development Scam Case: చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా, ఏసీబీ కోర్టులో ఇరువురి వాదనలు ఇవిగో..

Hazarath Reddy

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను అక్టోబర్‌ 5కు వాయిదా వేసిన ఏసీబీ కోర్టు.స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో లభించిన అన్ని ఆధారాలు కోర్టు ఎదుట ఉంచామని, చంద్రబాబు పాత్ర ఉందని సీఐడీ గుర్తించిన అన్ని వివరాలను పరిశీలిస్తే అర్థమవుతుందని పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు.

Chandrababu Arrest Row: చంద్రబాబు అరెస్టు, జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడంపై ఎమ్మెల్యే బాలకృష్ణ రియాక్షన్ ఇదిగో

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై సినిమా వాళ్లు స్పందించకపోవడాన్ని తాను పట్టించుకోనని హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత, హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీడీపీ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు.

Advertisement
Advertisement