రాష్ట్రీయం

AP Assembly Sessions: ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు, చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో హట్‌ హాట్‌గా సాగనున్న సెషన్స్, కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న ఏపీ అసెంబ్లీ

VNS

ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Sesions) ఐదు రోజులపాటు సమావేశాలు జరుగనున్నాయి. మరోవైపు ఇవాళ శాసన సభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశమై శాసన సభ, శాసన మండలి సమావేశాలు నిర్వహించాలి, ఏ ఏ అంశాలపై చర్చించాలన్న విషయాన్ని ఖరారు చేయనుంది. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

Telangana Shocker: తెలంగాణలో దారుణం, మద్యం మత్తులో భర్తను చంపిన భార్య , వీడియో ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో భార్య భర్తను చంపేసింది. రంగారెడ్డి జిల్లాలోని పెంచర్ల గ్రామంలో నిన్న రాత్రి మద్యం మత్తులో భర్త మీద కోపంతో రోకలితో దారుణంగా కొట్టి హత్య చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు సత్తెమ్మను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Green Metro Luxury: 25 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, 470 బస్సులు వచ్చే ఆరునెలల్లో నడుపుతామని తెలిపిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌

Hazarath Reddy

హైదరాబాద్‌ గచ్చిబౌలిలో 25 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు నేడు ప్రారంభం అయ్యాయి. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ ఎండీ సజ్జనర్‌లు ఈ బస్సులను ప్రారంభించారు.

Nalgonda Road Accident: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, అదుపు తప్పి బైక్‌ను ఢీకొట్టిన కారు, ప్రమాద స్థలంలోనే నలుగురు మృతి

Hazarath Reddy

నల్గొండ జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతపల్లి మండలం నసర్లపల్లి వద్ద కారు అదుపు తప్పి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు ప్రమాద స్థలంలోనే మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

Advertisement

Telangana: నాంపల్లి కోర్టు భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసిన గంజాయి కేసు నిందితుడు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

నాంపల్లి కోర్టు భవనంపై నుంచి దూకి మహ్మద్ సలీముద్దీన్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. మెహదీపట్నం ఫస్ట్ ల్యాన్సర్ ప్రాంతానికి చెందిన డుసలీముద్దీన్ గంజాయి కేసులో నిందితుడిగా ఉన్నాడు. నేడు(బుధవారం) కోర్టులో పేషీ ఉండటంతో నాంపల్లి కోర్టులో హాజరయ్యాడు

Viral Video: వీడియో ఇదిగో, వినాయకుని మండపం వద్ద శివుని మెడ మీదకి ఎక్కి నాట్యం చేసిన నాగు పాము

Hazarath Reddy

విజయనగరం - వైయస్సార్ నగర్ కాలనీవాసులు అద్భుతమైన గణేష్ మండపాన్ని ఏర్పాటు చేయగా మండపంలో శివపార్వతుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఓ నాగుపాము శివుడి మెడలో ప్రత్యక్షమై మెడకు చుట్టుకొని బుసలు కొట్టడం ప్రారంభించింది.

AP Cabinet Key Decisions: ఏపీలో ముందస్తు, జమిలి ఎన్నికలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు, విజయదశమి నుంచి విశాఖ నుంచే పాలన అని తెలిపిన ముఖ్యమంత్రి

Hazarath Reddy

సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఏపీ కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో మరో కొత్త పథకానికి ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జగనన్న సివిల్స్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకం పేరిట ఈ పథకాన్ని తీసుకురానున్నారు.

AP Cabinet Meeting Highlights: ముగిసిన ఏపీ కేబినెట్‌ భేటీ, పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపిన మంత్రి వర్గం, కేబినెట్‌ సమావేశం హైలెట్స్ ఇవిగో..

Hazarath Reddy

సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఏపీ కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో మరో కొత్త పథకానికి ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జగనన్న సివిల్స్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకం పేరిట ఈ పథకాన్ని తీసుకురానున్నారు.

Advertisement

Video: వీడియో ఇదిగో, మహిళా రిజర్వేషన్‌లో నా ఎమ్మెల్యే సీటు పోయినా నేను బాధపడనని తెలిపిన మంత్రి కేటీఆర్

Hazarath Reddy

మనందరివి చాలా చిన్న జీవితాలు , అందులో నా పాత్ర నేను పోషించాను అనుకుంటున్నాను. కాబట్టి హిళా రిజర్వేషన్‌లో నా ఎమ్మెల్యే సీటు పోయినా నేను బాధపడనని మంత్రి కేటీఆర్ తెలిపారు.

Road Accident Video: వీడియో ఇదిగో, తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం, యాదాద్రి జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా, ఇద్దరు మృతి, పలువురికి గాయాలు

Hazarath Reddy

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. యాదాద్రి జిల్లా మోత్కూరు తిరుమలగిరి రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా పలువురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆర్టీసీ బస్సు బోల్తా పడిన వీడియో ఇదిగో..

Bus Driver Dies of Heart Attack: స్కూలు బస్సు నడుపుతుండగా గుండెపోటుతో డ్రైవర్ మృతి, 40 మంది విద్యార్థులను కాపాడి మృత్యు ఒడిలోకి..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లాలో బుధవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ స్కూల్ బస్సు నడుపుతుండగా డ్రైవర్ కు గుండెపోటు రావడంతో స్టీరింగ్ పైనే కుప్పకూలాడు. ప్రాణం పోయే ముందు బ్రేక్ వేసి బస్సును రోడ్డు పక్కన ఆపాడు. గుండెపోటుతో డ్రైవర్ చనిపోయాడు..

Andhra Pradesh: స్కూల్ బస్సు నడుపుతుండగా గుండెపోటు, సమయస్ఫూర్తితో బస్సును పక్కకు ఆపి కుప్పకూలి మృతి చెందిన డ్రైవర్, బస్సులో 40 మంది విద్యార్థులు

Hazarath Reddy

బాపట్ల జిల్లాలో గల ఉప్పలపాడు వద్ద మంగళవారం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్ విద్యార్థులను ఎక్కించుకొని వెళ్తుండగా గుండెపోటు వచ్చింది. దీంతో అతను బస్సును పక్కకు ఆపి కుప్పకూలి మృతి చెందాడు. బస్సును ఆపడంతో విద్యార్థుల ప్రాణాలు దక్కాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Telangana Shocker: వీడియో ఇదిగో, వృద్ధురాలైన అత్తని చీపురుతో దారుణంగా కొట్టిన పెద్ద కోడలు, తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసిన చిన్న కొడుకు

Hazarath Reddy

యాదాద్రి భువనగిరిలో వృద్ధురాలైన లక్ష్మమ్మను పెద్ద కోడలు పద్మ చీపిరి కట్టతో విచక్షణ రహితంగా కొట్టింది, అయితే ప్రతి రోజూ ఏదో సమయంలొ తరచూ కొడుతుండటంతో సహించలేక ఆమె చిన్న కుమారుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

TSRTC Green Metro Luxury Ac Buses: హైదరాబాద్ రోడ్లపైకి గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులు, ఒక్కసారి ఛార్జ్ చేస్తేచాలు ఏకంగా 225 కి.మీ ప్రయాణించవచ్చు, ప్రారంభించనున్న మంత్రి పువ్వాడ

VNS

పర్యావరణ హితమైన గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులను తెలంగాణ ఆర్టీసీ తీసుకొస్తుంది. నేటి నుంచి గ్రేటర్ హైదరాబాద్ లో గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులు (Green Metro Luxury Ac Buses) పరుగులు తీయనున్నాయి. ఇవాళ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ బస్సులను ప్రారంభించనున్నారు. మొత్తం 50 గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ సర్వీసుల్లో మొదటి విడతగా 25 బస్సులను ప్రారంభించనున్నారు.

Leopard Trapped: బ్రహ్మోత్సవాల టైంలో తిరుమలలో చిరుత కలకలం, అలిపిరి కాలినడక మార్గంలో చిక్కిన మరో చిరుత, చిన్నారి లక్షితను పొట్టనబెట్టుకున్న ప్రాంతంలోనే బంధించిన అధికారులు

VNS

ఈ క్రమంలోనే బుధవారం తెల్లవారుజామున చిరుత బోనులో (Leopard Trapped In Cage)పడింది. దీంతో ఇప్పటివరకు ఆరు చిరుతలను బంధించినట్లు అధికారులు వెల్లడించారు. చిన్నారి లక్షితపై దాడి చేసిన ప్రాంతంలోనే తాజాగా చిరుత దొరకడం గమనార్హం.

AP Cabinet Meeting: మరికాసేపట్లో ఏపీ కేబినెట్ మీటింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ సహా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

VNS

ఏపీ కేబినెట్ సమావేశం (Cabinet Meet) నేడు జరుగనుంది. సీఎం జగన్ (Cm YS Jagan) అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. వెలగపూడి సచివాలయంలోని ఫస్ట్ ఫ్లోర్ కేబినెట్ హాల్ లో ఈ సమావేశం జరుగనుంది. ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ (Cabinet Meet) ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది.

Advertisement

Video: వీడియో ఇదిగో, స్మార్ట్‌గా హుండీలో నుంచి డబ్బులు కాజేసిన ఆలయ సెక్యూరిటీ అధికారి, కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఘటన

Hazarath Reddy

హుండీలో డబ్బులు కాజేసిన ఆలయ సెక్యూరిటీ అధికారి. అనంతపురం జిల్లాలోని కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో సెక్యూరిటీ గార్డ్‌గా విధులు నిర్వహిస్తున్న కృష్ణారెడ్డి చేతివాటం ప్రదర్శించారు. హుండీలో నుంచి డబ్బులు దొంగతనం చేశారు. దీనికి సంబంధించిన సీసీ పుటేజీ వెలుగులోకి వచ్చింది. వీడియో ఇదిగో..

Skill Development Scam Case: చంద్రబాబుకు మరో కేసులో షాకిచ్చిన సీఐడి, ఫైబర్ నెట్ కేసులో నిందితుడిగా పేర్కొంటూ ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్

Hazarath Reddy

చంద్రబాబు పై విజయవాడ ఏసీబీ కోర్టులో ఫైల్ నంబర్ 2916/2023 పేరుతో మరో పీటీ వారెంట్ దాఖలు అయింది.ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ను నిందితుడిగా పేర్కొంటూ పీటీ వారెంట్ వేసింది సీఐడి. తెరాసాఫ్ట్ కంపెనీ కి నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టు ఇచ్చారని ఆరోపిస్తోంది

Skill Development Scam Case: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై వాదనలు పూర్తి, తీర్పును రిజర్వ్‌లో ఉంచిన ఏపీ హైకోర్టు, ఏసీబీ కోర్టులో చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై విచారణ వాయిదా

Hazarath Reddy

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్ అయిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి విదితమే. కాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనలు ముగిశాయి.

Jana Sena Gets Glass Tumbler Symbol: జనసేనకు మళ్లీ గాజు గ్లాసు గుర్తు కేటాయించిన ఎన్నికల సంఘం, ఈసీకి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్

Hazarath Reddy

జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి గ్లాస్ గాజు గుర్తును కేటాయించింది. ఈ ఏడాది మే నెలలో కేంద్ర ఎన్నికల సంఘం ఆ పార్టీకి గాజు గ్లాసు గుర్తును తొలగించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా గుర్తును మళ్లీ కేటాయించింది.

Advertisement
Advertisement