రాష్ట్రీయం

TS DSC 2023:నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 6,500 పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్న తెలంగాణ ప్రభుత్వం, కీలక వివరాలు ఇవిగో..

Hazarath Reddy

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.పాఠశాల విద్యకు సంబంధించి టీచర్‌ పోస్టుల భర్తీకి త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. 6,500 పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ఆమె తెలిపారు.

Andhra Pradesh: సంక్షేమ పథకాల కోసం మరో రూ.216.34 కోట్లు విడుదల, కులం​, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా పథకాలు అందజేస్తున్నామని తెలిపిన సీఎం జగన్

Hazarath Reddy

ఏపీ రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాల ఫలాలను సంతృప్త స్థాయిలో అందిస్తున్నారు. ఈ క్రమంలో ఏదైనా కారణం చేతనైనా వివిధ సంక్షేమ పథకాలను అందుకోలేక మిగిలిపోయిన అర్హులకు కూడా లబ్ధి చేకూర్చారు. ఈ క్రమంలో వారి ఖాతాల్లోకి డబ్బు జమ చేశారు.

TTD: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్, నవంబర్ నెల ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల చేసిన టీటీడీ, శ్రీవారి బ్రహ్మోత్సవాల తేదీలు ఇవిగో, అధికమాసం కారణంగా రెండు బ్రహ్మోత్సవాలు

Hazarath Reddy

నవంబర్ నెల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు నేటి(గురువార) ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేసింది. నవంబర్‌ నెలకు సంబంధించిన ఆన్‌లైన్‌ వసతి కోటాను రేపు విడుదల చేయనుంది. ఇక తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది

Weather Forecast: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, వచ్చే 5 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు, రెండు రాష్ట్రాల్లో ఈ జిల్లాలకు గ్రీన్ అలర్ట్

Hazarath Reddy

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోని పలు ప్రాంతాలకు ఎల్లో, గ్రీన్ అలర్ట్ జారీ చేసింది.

Advertisement

Nara Lokesh on Kodali Nani: వీడియో ఇదిగో, కొడాలి నానిని గుడివాడ సెంటర్లో కట్ డ్రాయర్ మీద ఊరేగిస్తా, గన్నవరంలో నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

సీఎం జగన్‌ ఓ పిరికి వ్యక్తి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. యువగళం సాగనిస్తే పాదయాత్ర అని, లేదంటే దండయాత్రేనని హెచ్చరించారు. గన్నవరంలో జరిగిన టీడీపీ గర్జన సభలో సీఎం జగన్‌పై లోకేష్ విమర్శల వర్షం గుప్పించారు.భయం అనేది తమ బ్లడ్‌లోనే లేదని నారా లోకేశ్ చెప్పారు.కొడాలి నానిని గుడివాడ సెంటర్లో కట్ డ్రాయర్ మీద ఊరేగిస్తానని నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Huge Fire At TVS Showroom: టీవీఎస్‌ షోరూంలో అగ్నిప్రమాదం, కాలిబూడిదైన 600 బైక్‌లు, దాదాపు 8 కోట్లకు పైగా ఆస్తినష్టం, షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు అనుమానం

VNS

ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం (Fire accident) జరిగింది. స్టెల్లా కాలేజ్ సమీపంలోని టీవీఎస్ షోరూమ్ లో మంటలు (Huge Fire At TVS Showroom) చెలరేగాయి. టీవీఎస్ షోరూం అగ్నికి ఆహుతి అయింది. పెద్ద ఎత్తున చెలరేగిన మంటలకు షోరూంలోని కొత్త బైకులు కాలి బూడిదయ్యాయి. భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి.

Bathini Harinath Goud Passed Away: బత్తిని హరినాథ్‌ గౌడ్ కన్నుమూత, తరతరాలుగా ఉచితంగా చేపప్రసాదం పంపిణీ చేస్తున్న బత్తిని సోదరులు, కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హరినాథ్ గౌడ్

VNS

ఆస్తమా (Asthma), ఉబ్బసం బాధితులకు చేప మందు పంపిణీ (Fish prasadam) చేసే బత్తిని హరినాథ్‌ గౌడ్‌ (Bathini Harinath goud) కన్నుమూశారు. బత్తిని సోదరుల్లో ఒకరైన 84 ఏండ్ల హరినాథ్‌ గౌడ్‌ గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన పేరు చెబితే ముందుగా గుర్తుకువచ్చేది చేప ప్రసాదం

Mokila Layout Auction: మోకిలలో భూముల వేలానికి అనూహ్య స్పందన, ఏకంగా గజం లక్ష పలికిన ధర, తొలిరోజే ప్రభుత్వానికి ఏకంగా రూ. 122 కోట్ల ఆదాయం

VNS

మోకిలలోని (Mokila) హెచ్‌ఎండీఏ లేఅవుట్‌లో (HMDA Layout) ప్లాట్ల వేలానికి కొనుగోలుదారుల నుంచి మరోసారి విశేష స్పందన వచ్చింది. బుధవారం ఆన్‌లైన్‌లో ప్రారంభమైన రెండో విడత వేలంలోనూ గజం భూమి ధర రూ.లక్ష వరకు పలికింది. బుధవారం నుంచి రోజుకు 60 ప్లాట్ల చొప్పున 5 రోజుల్లో మొత్తం 300 ప్లాట్లను హెచ్‌ఎండీఏ విక్రయానికి ఉంచింది

Advertisement

Telanagana Cabinet: తెలంగాణ కేబినెట్ విస్తరణ, ఈటల స్థానంలో పట్నం మహేందర్ రెడ్డికి ఛాన్స్, ఇవాళ ప్రమాణస్వీకారం

VNS

రంగారెడ్డి జిల్లా ఎ మ్మెల్సీ డాక్టర్‌ పట్నం మహేందర్‌రెడ్డికి మంత్రివర్గంలో మరోసారి స్థానం దకనున్నది. సీఎం కేసీఆర్‌ గురువారం చేపట్టనున్న క్యాబినెట్‌ విస్తరణలో రెండోసారి మం త్రిగా ప్రమాణం స్వీకరించనున్నారు. రాష్ట్ర తొలి క్యాబినెట్‌లో రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో ఫలితాల అనంతరం మహేందర్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ (BRS) అధిష్ఠానం ఎమ్మెల్సీగా రెండుసార్లు అవకాశం ఇచ్చింది.

RS.100Cr Cheque Found In Temple Hundi: హుండీలో రూ.100కోట్ల చెక్కు, సింహాద్రి అప్పన్న హుండీలో భారీ విరాళం వేసిన భక్తుడు, ఇంతకీ చెక్కును హుండీలో వేసిందెవరంటే?

VNS

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువుదీరిన తిరుమల శ్రీవారి (Tirumala) ఆలయంలో ఇలాంటివి సర్వసాధారణం. కానీ, విశాఖలోని సింహాద్రి అప్పన్న ఆలయంలో చిత్రవిచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఆలయంలోని హుండీలో ఏకంగా 100 కోట్ల రూపాయల చెక్ కనిపించింది.

CM KCR Medak District Collectorate: మెదక్ జిల్లా కలెక్టరేట్ ప్రారంభించిన సీఎం కేసీఆర్

ahana

ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్‌ జిల్లాలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం కలెక్టరేట్‌ ప్రారంభించారు. సీఎం కలెక్టరేట్‌ ప్రాంగణంలోకి చేరుకోగానే పోలీసులు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు.

Posani On Lokesh: నారా లోకేష్ నుంచి నాకు పొంచి ఉన్న ప్రమాదంపై డీజీపీకి ఫిర్యాదు చేశా

ahana

. నారా లోకేష్ గురించి ఇటీవల నేను ఫొటోలు చూపించి విమర్శించాను. అందుకే అతను కక్ష పెంచుకున్నాడు

Advertisement

Chandrayaan 3 LIVE Streaming: మీ బంధు మిత్రులతో కలిసి చంద్రయాన్ 3 లైవ్ స్ట్రీమింగ్ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేసి చూడండి..

ahana

చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని అన్వేషించడానికి చంద్రయాన్-3 అంతరిక్ష నౌక పంపిన ల్యాండర్ కలాన్ రేపు (ఆగస్టు 23) చంద్రునిపై దిగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని అందరూ ఆనందించేలా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్టు ఇస్రో ప్రకటించింది

Jupally Krishna Rao: కేసీఆర్ కుటుంబం తెలంగాణ అమరుల రక్తపు కూడు తింటోంది: జూపల్లి

Rudra

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్లా పోటీకి దిగడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఓటమిని ముందే అంగీకరించారని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు.

Gun Misfire in Hyderabad: తుపాకీ మిస్‌ ఫైర్.. హెడ్‌ కానిస్టేబుల్ మృతి.. హైదరాబాద్‌ లోని హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్‌ లో ఘటన

Rudra

తుపాకీ మిస్‌ ఫైర్ అయి హెడ్‌ కానిస్టేబుల్ మరణించిన ఘటన హైదరాబాద్‌ లో జరిగింది. కబుతర్ఖానా ప్రాంతంలో రాత్రి విధులు ముగించుకుని వచ్చిన హెడ్‌ కానిస్టేబుల్ భూపతి శ్రీకాంత్ నిద్రించే సమయంలో అతడి చేతిలోని తుపాకి మిస్‌ ఫైర్ అయింది.

Chandrayaan-3: నేడే చంద్రయాన్ 3 ల్యాండింగ్‌.. ఈ అద్భుత దృశ్యాలను లైవ్‌ లో చూపించాలన్న నిర్ణయంపై తెలంగాణ విద్యాశాఖ యూటర్న్.. ఆ నిర్ణయం వెనక్కి.. కారణం ఏమిటంటే??

Rudra

యావత్తు ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న జాబిల్లిపై చంద్రయాన్ ల్యాండింగ్‌‌ ను లైవ్‌ లో చూపించాలన్న నిర్ణయాన్ని తెలంగాణ విద్యాశాఖ వెనక్కి తీసుకుంది. పాఠశాలల పని వేళల్లో ఎలాంటి మార్పు ఉండదని నిన్న సాయంత్రం ప్రకటించింది.

Advertisement

Chandrayaan 3 Landing: అన్ని స్కూళ్లూ, కాలేజీల్లో చంద్రయాన్-3 ల్యాండింగ్‌ ప్రత్యక్షప్రసారం, ప్రభుత్వం పాఠశాలల్లో ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేసిన తెలంగాణ సర్కార్ నిర్ణయం

VNS

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) జూలై 14న ప్రయోగించిన చంద్రయాన్‌-3 స్పేస్‌క్రాఫ్ట్‌ బుధవారం (ఆగస్టు 23) సాయంత్రం చుంద్రుడిపై దిగనుంది. ఈ ల్యాండింగ్‌ ప్రక్రియ సజావుగా పూర్తవుతుందా, లేదా అనే విషయంలో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. ఈ నేపథ్యంలో చంద్రయాన్‌-3 చందమామపై దిగే అద్భుతాన్ని రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి చూపించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

Youth Commits Suicide: ట్రాన్స్‌జెండర్‌తో పెళ్లి, విడిపోయిన తర్వాత యువకుడి అంతుచూస్తానంటూ బెదిరింపులు, భయంతో ఆత్మహత్య చేసుకున్న యువకుడు

VNS

ట్రాన్స్‌జెండర్‌ (Transgender) వేధింపులు భరించలేక యువకుడు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం భూపతిపేట జీపీ పరిధిలోని కోమటిపల్లి తండాలో మంగళవారం జరిగింది.

Maoist party on Malla Raji Reddy Death: మావోయిస్టు కీలకనేత మల్లారాజిరెడ్డి చనిపోలేదు, క్షేమంగా ఉన్నారంటూ మావోయిస్టు పార్టీ ప్రకటన, అబద్దపు ప్రచారాలు నమ్మొద్దంటూ లేఖ

VNS

మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి (Malla Raji Reddy) అలియాస్‌ సంగ్రామ్‌ (71) దండకారణ్యంలో మృతి చెందినట్లు వచ్చిన వార్తలను ఆ పార్టీ ఖండించింది. మావోయిస్టు నేతలు మల్లా రాజిరెడ్డి (Malla Raji Reddy), కట్టా రామచంద్రారెడ్డి క్షేమమని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈమేరకు దండకారణ్యం మావోయిస్టు నేత మంగ్లి పేరుతో మంగళవారం ప్రకటన విడుదల చేసింది

MLA Rajaiah Crying Video: వీడియో ఇదిగో, టికెట్ దక్కకపోవడంతో భోరున ఏడ్చేసిన రాజయ్య, కేసీఆర్ గీసిన గీతను దాటేది లేదని స్పష్టం చేసిన స్టేషన్ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే

Hazarath Reddy

అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్‌ టికెట్‌ దక్కకపోవడంపై స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కన్నీటి పర్యంతం అయ్యారు. టికెట్‌ మీద గంపెడాశలు పెట్టుకున్న రాజయ్య తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలో అంబేద్కర్‌ విగ్రహం ముందు కూర్చుని ఆయన బోరున విలపించారు.

Advertisement
Advertisement