రాష్ట్రీయం

Telangana: టీవీ కేబుల్ వైర్లు సరిచేస్తుండగా విద్యుత్ షాక్, స్తంభంపైనే యువకుడు మృతి, కంటతడి పెట్టిస్తున్న వీడియో ఇదిగో...

Hazarath Reddy

తెలంగాణలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. రంగారెడ్డి - చేవెళ్ల పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న హై ఓల్టేజ్ విద్యుత్ స్తంభంపై నేపాల్ కు చెందిన అనిల్ (21) విద్యుత్ షాక్ తగిలి స్తంభంపైనే మృతి చెందాడు, ప్రొక్లెయినర్ సాయంతో మృతదేహాన్ని కిందకు దించారు. దీనికి సంబంధించిన వీడియోను చూసి అందరూ కంటతడి పెడుతున్నారు.

Bogatha Waterfall: తెలంగాణ నయాగార జలపాతం వీడియో ఇదిగో, ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పరవళ్లు తొక్కుతోన్న బొగత జలపాతం

Hazarath Reddy

తెలంగాణ ‘నయాగార’గా గుర్తింపు పొందిన అందాల బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ములుగు జిల్లా, వాజేడు మండలంలోని చీకుపల్లిలో ఉన్న బొగత జలపాతం ఉరకలెత్తుతోంది. ఆ అందాలను కనులారా చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వీడియో ఇదిగో..

Ramachandrapuram Politics: ఆయన నాకు గురువుతో సమానం, బోస్ వ్యాఖ్యలకు స్పందించిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, వేణుకి టికెట్ ఇస్తే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని తెలిపిన ఎంపీ

Hazarath Reddy

రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ (Pilli Subhash Chandrabose) చేసిన వ్యాఖ్యలపై మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ స్పందించారు. సుభాష్ చంద్రబోస్ తనకు గురువుతో సమానమని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలపై ఏమీ మాట్లాడబోనని వేణు చెప్పారు.

AP Weather Forecast: ఉత్తరాంధ్ర జిల్లా­లకు భారీ వర్ష ముప్పు, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరో వారం రోజులు వర్షాలు పడతాయని తెలిపిన వాతావరణ శాఖ

Hazarath Reddy

ఏపీ రాష్ట్రంపై ఉపరి­తల ఆవర్తనం, రుతు పవన ద్రోణులు ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా ఏపీలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మరో వారం రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్న­ట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర జిల్లా­ల్లో విస్తారంగా వర్షాలు పడతాయని, పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది

Advertisement

Telangana Shocker: య్యూట్యూబ్‌కు బానిసై వంటింట్లో ఉరి వేసుకున్న 6వ తరగతి విద్యార్థి, సిరిసిల్ల జిల్లాలో విషాదకర ఘటన

Hazarath Reddy

తెలంగాణలోని సిరిసిల్ల జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఎప్పుడు ఫోన్‌లో యూ ట్యూబ్‌ చూడొద్దని బాగా చదువుకోవాలని తల్లిదండ్రులు మందలించడంతో మనస్థాపానికి గురైన విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కిష్టునాయక్‌తండాలో శనివారం రాత్రి చోటుచేసుకుంది.

Chandramukhi-2: చంద్రముఖి-2పై ఆసక్తి పెంచేసిన ఎంఎం కీరవాణి.. పాత్రలు చావు భయంతో నిద్రలేని రాత్రులు గడిపితే... ఆ సీన్లకు జీవం పోసేందుకు తాను నిద్రలేని రాత్రులు గడిపానన్న ఆస్కార్ విజేత

Rudra

హారర్ చిత్రాలకు కొత్త అర్థం చెప్పిన సినిమా చంద్రముఖి. ఇప్పుడు ఆ మూవీకి కొనసాగింపుగా చంద్రముఖి-2 వస్తోంది. రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ జంటగా పి.వాసు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి దర్శకత్వం వహిస్తున్నారు.

Rains in Telugu States: రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక

Rudra

తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) భారీ వర్ష సూచన చేసింది. ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ, యానాంలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Hyderabad Shocker: ఫ్లైఓవర్ పైనుంచి కిందనున్న మరో ఫ్లైఓవర్ పైపడి యువకుడి మృతి.. బైక్‌ పై వేగంగా వెళుతూ డివైడర్‌ను ఢీకొట్టిన యువకుడు.. ఘటనాస్థలంలోనే మృతి, వెనక కూర్చున్న వ్యక్తికి ఆసుపత్రిలో చికిత్స.. ఆదివారం రాత్రి గచ్చిబౌలి ఫ్లైఓవర్‌పై ప్రమాదం.. వీడియోతో..

Rudra

హైదరాబాద్ లోని గచ్చిబౌలీలో ఘోరం జరిగింది. ఫ్లైఓవర్‌ పైనుంచి కిందనున్న మరో ఫ్లైఓవర్ పైపడి ఓ యువకుడు దుర్మరణం చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది.

Advertisement

Shocking Incident in Kakinada: హమ్మో! కుక్క కరిచిన ఆరు నెలలకు రేబీస్.. బాలుడి దుర్మరణం.. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో వెలుగు చూసిన ఘటన.. కుక్క కరిచినా భయపడి ఇంట్లో చెప్పని బాలుడు.. అందుకే, ఇలా!!

Rudra

కుక్క కరిచిన విషయం ఇంట్లో చెబితే తిరిగి తననే తిడతారని ఓ బాలుడు భయపడ్డాడు. ఆరు నెలలు గడిచింది. అయితే, అనూహ్యంగా అతడికి రేబీస్ సోకింది. దీంతో ఆదివారం మృతి చెందాడు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది.

VRA System: వీఆర్‌ఏ వ్యవస్థ రద్దు, కీలక నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్, వీఆర్‌ఏలను పలు శాఖల్లో పర్మినెంట్ ఉద్యోగులుగా సర్ధుబాటు చేసిన ప్రభుత్వం

VNS

రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలుగా పనిచేస్తున్న సిబ్బందిని రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరించనున్నట్టు సీఎం తెలిపారు. మంత్రుల సబ్ కమిటీ (Sub Committee) సిఫారసుల మేరకు, నిబంధనలను అనుసరించి వీఆర్ఏల అర్హతలను ప్రకారం, మున్సిపాలిటీ, మిషన్ భగీరథ, ఇరిగేషన్ తదితర శాఖల్లో సర్దుబాటు చేస్తూ వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.

Avinash Reddy Letter to CBI: ఆస్తి పత్రాల కోసమే వివేకా హత్య జరిగి ఉండొచ్చు! సీబీఐ డైరక్టర్‌ కు లేఖ రాసిన ఎంపీ అవినాష్‌ రెడ్డి, విచారణ అధికారి రామ్‌ సింగ్‌పై సీబీఐకి ఫిర్యాదు

VNS

వైయస్ వివేకానంద హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న కడప ఎంపీ వైయస్ అవినాష్‌ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. వివేకా కేసులో జరుగుతున్న విచారణపై ఆయన ఆరోపణలు చేశారు. ఈ మేరకు సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్‌సూద్‌కు (CBI Director) ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ (Avinash reddy letter) రాశారు. వివేకా కేసును గతంలో విచారించిన ఎస్పీ రామ్‌సింగ్‌ పై (Sp Ram singh) ఫిర్యాదు చేశారు.

Viral Video: చెరువులో చేపల కోసమని వేసిన వలలో మొసలి లభ్యం, గద్వాల జిల్లాలో షాక్‌ తిన్న మత్య్సకారులు వీడియో చూస్తే గుండె ఆగిపోవడం ఖాయం..

kanha

జోగుళాంబ గద్వాల జిల్లాలోని కేటిదొడ్డి మండలం వెంకటాపురం గ్రామంలో మొసలి కలకలం సృష్టించింది. వెంకటాపురం గ్రామంలో ఉన్న చెరువులో చేపల కోసమని వేసిన వలలో మొసలి లభ్యం అయ్యింది. దీంతో గ్రామస్థులు షాక్ కు గురయ్యారు.

Advertisement

Telangana CM KCR: ముస్లిం మైనారిటీలకు 1 లక్ష రూపాయల ఆర్థిక సాయంపై జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

kanha

ముస్లిం మైనారిటీలకు 1 లక్ష రూపాయల ఆర్థిక సాయంపై జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం - తెలంగాణ మైనారిటీలకు ఆర్థిక, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సీఎం కేసీఆర్ శుభవార్త ప్రకటించారు

Telangana High Court: తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణస్వీకారం

kanha

తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణస్వీకారం చేశారు. రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.

Telangana: తెలంగాణలో దివ్యాంగులకు పెన్షన్‌ రూ.3,016 నుంచి రూ. 4,016కు పెంచుతూ కేసీఆర్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

kanha

తెలంగాణ రాష్ట్రంలోని దివ్యాంగులకు పెన్షన్‌ మొత్తాన్ని రూ.3,016 నుంచి రూ.4,016కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చారిత్రాత్మక నిర్ణయంతో 5 లక్షల మందికి పైగా దివ్యాంగులకు ప్రయోజనం చేకూరుతుంది.

Viral Video: నడిరోడ్డు మీద బురద గుంతలో మంచం వేసుకొన్న యువకుడు.. ఎందుకో తెలుసా? వీడియో వైరల్

Rudra

ఏపీలో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు పలుప్రాంతాల‌లో రోడ్లు చెరువుల‌ను త‌ల‌పిస్తున్నాయి. గ‌త కొంత‌కాలంగా రోడ్ల మ‌ర‌మ్మ‌తు చేయ‌క‌పోవ‌డంతో గుంత‌ల‌తో పూర్తిగా పాడ‌య్యాయి. దీంతో ఏలూరు ప్రాంత ప్ర‌జ‌లు అధ్వాన రహదారులతో నిత్యం నరకం చూస్తున్నామని వాపోతున్నారు.

Advertisement

Viral Video: నేను అరెస్టు చేస్తే వాళ్లు లంచం తీసుకుని విడుదల చేస్తున్నారు.. పంజాబ్‌లోని జలంధర్‌ జాతీయ రహదారిపై హోంగార్డు నిరసన.. వీడియో వైరల్

Rudra

సహోద్యోగుల అవినీతిని చూసి నిజాయితీ గల ఓ హోంగార్డు తట్టుకోలేకపోయారు. దీంతో హైవేపై నిరసనకు దిగారు. పంజాబ్‌‌లోని జలంధర్‌ లో తాజాగా జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Tirumala Venkateswara Swamy Assets: తిరుమల శ్రీవారి పేరిట రూ.17 వేల కోట్ల నగదు డిపాజిట్లు.. బ్యాంకులో 11 టన్నుల బంగారం.. టీటీడీ పరిధిలో 600 ఎకరాల అటవీప్రాంతం.. తిరుమల శ్రీవారి ఆస్తుల వివరాలను వెల్లడించిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి

Rudra

కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించేందుకు రోజూ లక్షలాది మంది ఉవ్విళ్ళూరుతుంటారు. నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకునే వెంకన్నస్వామి అత్యంత సంపన్నుడు అని తెలిసిందే.

Six Died Road Accident: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురు మృతి, తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్, మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషషియా ప్రకటన

VNS

ఏపీలోని శనివారం ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. ఆర్టీసీ బస్సు – లారీ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా పుల్లంపేట (Pullampeta) మండలంలో చోటు చేసుకున్నది. ప్రమాదంలో ఎనిమిది మంది గాయడగా.. వారిని రాజంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.

TS Govt Increased Aasara Pension: ఆసరా పింఛన్ పెంచుతూ తెలంగాణ సర్కారు నిర్ణయం, వచ్చే నెల నుంచి దివ్యాంగులకు రూ. 4016 పెన్షన్

VNS

తెలంగాణలోని దివ్యాంగులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) శుభవార్త చెప్పారు. ఆసరా పెన్షన్లను (Asara pension) రూ.4016 పెంచుతూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. పెంచిన పెన్షన్‌ జులై నెల నుంచి అమలులోకి రానుందని ప్రభుత్వం తెలిపింది.

Advertisement
Advertisement