రాష్ట్రీయం
Telangana: రాత్రి చికెన్ తిన్న 40 మంది విద్యార్థులకు అస్వస్థత, వాంతులు విరోచనాలతో ఆస్పత్రి పాలైన ఇంటర్ ఎంపీసీ స్టూడెంట్స్, బట్టుపల్లి ఎస్సార్‌ప్రైమ్ క్యాంపస్‌‌లో ఘటన
Hazarath Reddyవరంగల్ జిల్లాలోని బట్టుపల్లి ఎస్సార్‌ప్రైమ్ క్యాంపస్‌లో ఫుడ్ పాయిజన్ కావడంతో కలకలం రేగింది.బట్టుపల్లిలోని ఎస్ఆర్ ప్రైమ్ జూనియర్ కళాశాలలో కలుషిత ఆహారం వల్ల 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు ఆదివారం రాత్రి ఎగ్ బిర్యానీతోపాటు చికెన్ వడ్డించారు.
Andhra Pradesh Weather Forecast: బంగాళాఖాతంలో 48 గంటల్లో వాయుగుండం ఏర్పడే అవకాశం, జూలై 17 నుండి 21 వరకు ఏపీలో భారీ వర్షాలు
Hazarath Reddyఈ నెల 17 నుంచి జూలై 21 వరకు రానున్న ఐదు రోజుల్లో ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉత్తరాదిలోని కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Andhra Pradesh Shocker: ఏపీలో మరో టమాటా రైతు దారుణ హత్య, అన్నమయ్య జిల్లాలో రైతు గొంతు కోసి పారిపోయిన గుర్తుతెలియని వ్యక్తులు
Hazarath Reddyమదనపల్లెలో టమాటా రైతు హత్య మరువకముందే మరో టమాటా పండించే రైతును హత్య చేశారు. అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలంలోని నవాబుకోటకు చెందిన భర్తల మధుకర్ రెడ్డి తన టమోటా పొలం వద్ద టెంటు వేసుకుని ఆదివారం రాత్రి నిద్రపోయాడు. గుర్తుతెలియని వ్యక్తులు అక్కడికి వచ్చి మధుకర్ రెడ్డి గొంతు కోసి పారిపోయారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Telangana: ప్రైవేట్ కాలేజీలో ఫుడ్ పాయిజన్, 40 మంది విద్యార్థులకి వాంతులు విరోచనాలు, నిన్న రాత్రి తిన్న చికెన్ బిరియానే కారణమని అనుమానాలు
Hazarath Reddyవరంగల్ - భట్టుపల్లిలోని ఎస్ఆర్ ప్రైమ్ ప్రైవేట్ కాలేజీ క్యాంపస్‌లో ఫుడ్ పాయిజన్ వల్ల 40 మంది విద్యార్థులకి వాంతులు విరోచనాలు అయ్యాయి. నిన్న రాత్రి తిన్న చికెన్ బిరియాని వల్ల ఇలా జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Pallevelugu Town Bus Pass: ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్, కొత్తగా పల్లెవెలుగు టౌన్ బస్ పాస్‌ అమలు, ధరల వివరాలు ఇవిగో..
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ప్రయాణికుల ఆర్ధిక భారం తగ్గించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ‘పల్లెవెలుగు టౌన్ బస్ పాస్‌కు శ్రీకారం చుట్టింది. మొదటగా కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సుల్లో ఈ పాస్‌ను అమలు చేయాలని సంస్థ నిర్ణయించింది.
Andhra Pradesh: ఏపీలో అన్ని స్కూళ్ల తరగతుల గదులలోని స్క్రీన్‌లపై చంద్రయాన్ 3 ప్రత్యక్ష ప్రసారం, వీడియో ఇదిగో..
Hazarath Reddyఏపీలో విద్యారంగంపై జగన్ పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్న సంగతి తెలిసిందే..ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు అన్ని పాఠశాలలను డిజిటల్‌గా మార్చారు. కాగా చంద్రయాన్ 3 ప్రారంభించినప్పుడు, AP ప్రభుత్వం అన్ని తరగతి గదులలో స్క్రీన్‌లపై దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. దీనినే ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారంటూ ఓ నెటిజన్ ట్వీట్ షేర్ చేశారు.
Andhra Pradesh: సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన ఆరుమంది, తాడు సాయంతో పడవకు కట్టి ఒడ్డుకు చేర్చిన మత్స్యకారులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఅంబేద్కర్ కోనసీమ - కాట్రేనికోన మండలం బ్రహ్మ సమేధ్యం గ్రామానికి చెందిన ఆరుగురు పైబర్ బోటుపై సముద్రంలో వేటకు వెళ్ళారు. రాత్రి తిరిగి వచ్చే క్రమంలో విపరీతమైన గాలులు వీయడంతో బోటు తిరగబడిపోయింది
Video: అభిమానమా లేక పిచ్చా..క్రేన్ మీద వచ్చి శాలువా కప్పిన పవన్ కల్యాణ్‌ అభిమాని, భిన్నంగా స్పందిస్తున్న నెటిజన్లు
Hazarath Reddyతిరుపతిలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.పవన్ కల్యాణ్‌ అభిమాని ఒకరు ప్రాణాలను లెక్కచేయకుండా క్రేన్ మీద వచ్చి శాలువా కప్పాడు. అయితే అంత ప్రమాదకర స్టంట్ ఏంటంటూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి, వీడియో ఇదిగో..
Video: రాత్రిపూట స్మార్ట్‌గా వచ్చి బైక్ నుంచి పెట్రోల్ ఎత్తుకెళ్లిన దొంగ, సీసీటీవీ ఫుటేజీ ఇదిగో..
Hazarath Reddyనిజామాబాద్ - పిట్లం మండల కేంద్రంలోని తులసీరాం కాలనీలో ఈనెల 15న రాత్రివేళ పార్క్ చేసిన బైక్ నుంచి ఓ వ్యక్తి పెట్రోల్ దొంగలించినట్లు కేసు నమోదైంది. చాటుగా వచ్చిన దొంగ ఇంటిముందు నిలిపి ఉన్న బైక్ నుంచి పెట్రోల్ లాగేశాడు.
Revanth Reddy on KCR: కేసీఆర్ మగాడయితే గజ్వేల్ నుండి పోటీ చేయాలి లేదా మాడా అని ఒప్పుకోవాలి, సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి
Hazarath Reddyకేసీఆర్ మగాడు అయితే గజ్వేల్ నుండి పోటీ చేయాలి లేదంటే మాడా అని ఒప్పుకోవాలి. కేసీఆర్ గజ్వేల్ నుండి పోటీ చేస్తే వాళ్లు వేసే ఏ శిక్షకి అయినా నేను సిద్ధం. 80 శాతం బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోతారు అందులో కేసీఆర్ కూడా ఉన్నాడు. - టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
Fire Accident in Shadnagar: షాద్‌నగర్ శ్రీనాథ్ రోటో ప్యాక్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు.. 11 మందికి తీవ్ర గాయాలు.. పలువురి పరిస్థితి విషయం (వీడియోతో)
Rudraహైదరాబాద్ శివారులోని మరో కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం బూర్గుల సమీపంలో గల శ్రీనాథ్ రోటో ప్యాక్ కంపెనీలో పేలుడు సంభవించింది.
ATM Withdraw: 8 వేల కోసం విత్ డ్రా చేస్తే.. ఆరు వందలే.. హైదరాబాద్ మల్లాపూర్‌ లోని ఏటీఎంలో సాంకేతిక లోపం.. వినియోగదారుల గగ్గోలు (వీడియోతో)
Rudraహైదరాబాద్ మల్లాపూర్‌ లోని హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు ఏటీఎంలో సాంకేతిక లోపం కారణంగా వెయ్యి రూపాయలకు బదులు 2 వందల రూపాయలే వస్తున్నాయని బాధితులు ఆందోళనకు దిగారు.
Rains in Telugu States: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఐఎండీ వర్ష సూచన.. నేటి నుంచి 20 వరకు వర్షాలు.. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు
Rudraనేటి నుంచి రానున్న నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నట్టు భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ లపై అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని వెల్లడించింది.
KTR Comments On Congress: నేడు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్, ఒరిజినల్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కాదు, తెలంగాణలో చంద్రబాబు కాంగ్రెస్ నడుస్తోంది..మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
kanhaఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. ఆ ఒరిజినల్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కాదు..చంద్రబాబు కాంగ్రెస్. రాజశేఖర్ రెడ్డి విధానాలు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో లేవు. ఒరిజినల్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్‌ను జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ఆంధ్రకి తీసుకుపోయారు.
Nellore Shocker: నెల్లూరు జిల్లాలో మద్యం సేవించి విధులకు హాజరవుతన్న ఎంపీడీవో, వీడియో చూస్తే షాక్ తినడం ఖాయం...
kanhaతాగి విధులకు హాజరవుతున్న ఎంపీడీవో...నెల్లూరు - వరికుంటపాడు మండలం ఎంపీడీవో విజయభాస్కరరావు మద్యం మత్తులో విధులకు హాజరు అవుతున్నారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. మండల స్థాయి అధికారి అయి ఉండి క్రింది స్థాయి సిబ్బంది చేసే తప్పులను ప్రశ్నించి క్రమశిక్షణలో పెట్టాల్సి ఉండగా తానే మద్యం మత్తులో తూలుతున్నారు.
MP K. Keshavarao: బీఆర్ఎస్ రాజ్య సభ ఎంపీ కే. కేశవరావు కుమారుల మీద బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు..
kanhaబీఆర్ఎస్ రాజ్య సభ ఎంపీ కే. కేశవ రావు కుమారుల మీద బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు. ఫోర్జరీ సంతకాలతో ఎన్అర్ఐ మహిళకు చెందిన స్థలం కబ్జా చేశారని ఆరోపణలు. ఎంపీ కేకే కుమారులు విప్లవ్ కుమార్, వేంకటేశ్వర రావు మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.
VC Sajjanar Tweet: షాకింగ్ వీడియో షేర్ చేసిన వీసీ సజ్జనార్, మద్యం మత్తులో వాహనాలు నడిపి కుటుంబాలకు తీరని శోకాన్ని మిగల్చవద్దంటూ క్యాప్షన్
Hazarath Reddyమద్యం మత్తు, అతివేగమే అనేక రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం. కొందరి నిర్లక్ష్యం ఎంతో మంది జీవితాల్లో చీకట్లు నింపుతోంది. ఎవరో చేసిన తప్పుకు ఇలా అమాయకులు బలవుతున్నారు. మితిమీరిన వేగం, మద్యం మత్తులో వాహనాలు నడపొద్దు. కుటుంబాలకు తీరని శోకాన్ని మిగల్చవద్దు.
Chandrayaan Latest Update: చంద్రయాన్-3పై ఇస్రో తొలి అప్‌ డేట్.. మిషన్ సజావుగా సాగుతోందని ఇస్రో ప్రకటన
Rudraచంద్రయాన్-3 ప్రయాణానికి సంబంధించి ఇస్రో తాజాగా ఓ అప్‌ డేట్ విడుదల చేసింది. శనివారం చంద్రయాన్-3 కక్ష్యను మార్చామని వెల్లడించింది. ప్రస్తుతం ఈ మిషన్ సజావుగా తనకు నిర్దేశించిన మార్గంలో పయనిస్తోందని వెల్లడించింది.
Lal Darwaza Bonalu: సందడిగా లాల్ దర్వాజ బోనాలు.. సింహవాహిని చెంత శివసత్తుల పూనకాలు, పోతరాజుల నృత్యాలు.. వీడియోతో
Rudraశివసత్తుల పూనకాలు, పోతరాజుల నృత్యాలు, డప్పుల వాద్యాలు, నృత్యాలు, ఘటాల ఊరేగింపుతో ఆదివారం హైదరాబాద్‌ పాతబస్తీ బోనమెత్తనుంది. సింహవాహిని ఆలయంలో బోనాల సందడి కొనసాగుతున్నది.
Sai Dharam Tej: వివాదంలో ఇరుక్కున్న హీరో సాయిధరమ్ తేజ్...శ్రీకాళహస్తిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి హారతి ఇవ్వడం ధర్మశాస్త్రానికి విరుద్ధం..అంటున్న పండితులు
kanhaవివాదంలో సినీ నటుడు సాయిధరమ్ తేజ్...శ్రీకాళహస్తిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి హారతి ఇచ్చిన సాయిధరమ్ తేజ్. పూజారులు తప్ప మరి ఎవ్వరు ఇవ్వకూడదు అంటు భక్తులు ఆగ్రహాం. ఎలా అనుమతి ఇచ్చారు అంటూ ఆలయ అధికారులు పై భక్తులు అసహనం. పట్టించుకొని ఆలయ అధికారులు మరియు సిబ్బంది.