రాష్ట్రీయం

Talasani Srinivas Yadav Dance Video: తలసాని శ్రీనివాస్ యాదవ్ డ్యాన్స్ వీడియో ఇదిగో, అమ్మవారి ఫలహారం బండ్ల ఊరేగింపులో చిందేసిన తెలంగాణ మంత్రి

Hazarath Reddy

సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఫలహారం బండ్ల ఊరేగింపులో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నృత్యం చేసి భక్తుల్లో జోష్ నింపారు. బోనాల ఉత్సవాల్లో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఫలహారం బండి ప్రారంభ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.

Y Category Security for MP Dharmapuri Arvind: బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు వై కేటగిరి భద్రత, ఇప్పటికే ఈటెలకు వై ప్లస్‌ కేటగిరి భద్రత

Hazarath Reddy

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వరుసగా చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు కేంద్ర ప్రభుత్వం ‘వై’ కేటగిరి భద్రత కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.ఇక నుంచి అర్వింద్‌ కాన్వాయ్‌లో ముగ్గురు, ఇంటి వద్ద ఐదుగురు సీఆర్‌పీఎఫ్‌ కమాండోలు భద్రతా వలయంగా ఉండనున్నారు

Darshi Road Accident: దర్శి ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి, గాయపడ్డ వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులకు ఆదేశాలు

Hazarath Reddy

ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు

AP Road Accident Video: సాగర్ కాల్వలో పడిన ఆర్టీసీ బస్సు వీడియో ఇదిగో, వివాహ రిసెప్షన్‌కు వెళ్తూ 7 మంది తిరిగిరాని లోకాలకు

Hazarath Reddy

ప్రకాశం జిల్లాలో మంగళవారం తెల్లవారు జామున దర్శి సమీపంలో పెళ్లి బస్సు సాగర్ కాల్వలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. 20 మందికిపైగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 40 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు.

Advertisement

Metro in Pathabasti: త్వరలో పాతబస్తీ వరకూ మెట్రో పరుగులు.. ఎంజీబీఎస్-ఫలక్‌ నుమా రూట్‌ లో 5.5 కిలోమీటర్ల మెట్రో మార్గంపై సీఎం కేసీఆర్ దృష్టి.. ఆదేశాలు

Rudra

పాతబస్తీవాసులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెట్రో రైలు త్వరలో అందుబాటులోకి రానుంది. ఎంజీబీఎస్-ఫలక్‌ నుమా మార్గంలో మెట్రో మార్గాన్ని నిర్మించాలంటూ మున్సిపల్ శాఖ, ఎల్ అండ్ టీ సంస్థకు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

Accident in Prakasam: ప్రకాశంలో ఘోర ప్రమాదం.. సాగర్ కాలువలోకి దూసుకుపోయిన పెళ్లి బస్సు.. ఏడుగురు మృతి.. 15 మందికి తీవ్ర గాయాలు.. అతివేగమే ప్రమాదానికి కారణమని వెల్లడి

Rudra

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అర్ధరాత్రి పెళ్లి వారితో వెళుతున్న ఓ బస్సు సాగర్ కాలువలోకి దూసుకుపోయింది. పొదిలి నుంచి కాకినాడకు వెళ్తుండగా దర్శికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు.

CM KCR On UCC Bill: బీజేపీ విద్వేష రాజకీయం చేస్తోంది, యూసీసీ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేసిన సీఎం కేసీఆర్

kanha

దేశాభివృద్ధిని విస్మరించి విద్వేష రాజకీయం కోసమే తెస్తున్న యూసీసీని వ్యతిరేకిస్తున్నట్లు సీఎం కేసీఆర్ తేల్చేశారు. యూసీసీ వల్ల అన్ని మతాల ప్రజల్లో అయోమయం నెలకొంటుందన్నారు. యూసీసీ పేరుతో మరోసారి ప్రజలను విభజించేందుకు కుట్ర చేస్తోంది. యూసీసీపై కేంద్రం నిర్ణయాలను తిరస్కరిస్తున్నాం అని కేసీఆర్ వెల్లడించారు.

Video: షాకింగ్ వీడియో ఇదిగో, పాల వ్యాపారిని అతివేగంగా ఢీకొట్టిన కారు, దెబ్బకి ఎగిరిపడి మృతి చెందిన పాల వ్యాపారి

Hazarath Reddy

ఏలూరు - జోగన్నపాలెం అడ్డరోడ్డు దగ్గర పాల వ్యాపారిని అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో పాల వ్యాపారి అక్కడికక్కడే మృతి చెందాడు.కాగా మద్యం సేవించి డ్రైవర్ కారు నడిపినట్లు తెలుస్తోంది.

Advertisement

Telangana Shocker: వీడియో ఇదిగో, భార్య తిట్టిందని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న భర్త, జగిత్యాల జిల్లాలో విషాదకర ఘటన

Hazarath Reddy

జగిత్యాల జిల్లా కోరుట్లలో విషాదం చోటు చేసుకుంది. భార్య తిట్టిందని మనస్థాపం చెందిన ఓ భర్త బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోరుట్ల పట్టణానికి చెందిన నరేష్ అతని భార్యతో గతరాత్రి గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఆమె నరేష్‌ను తిట్టింది.

Telangana BJP: అమిత్ షా లాంటి వ్యక్తి దళితుల పట్ల అంటరానితనం పాటిస్తే ఈ దేశం, రాష్ట్రం బాగుపడుతుందా - BJP నేత చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు..

kanha

ఆరోజు చేవెళ్ల సభలో అమిత్ షా నన్ను శాలువా కప్పనీయకుండా అవమానించిన తీరును మేధావులు, దళిత సంఘాలు, జర్నలిస్టులు ప్రశ్నించారు. అమిత్ షా లాంటి వ్యక్తికి అంటరానితనం ఉంటే ఈ దేశం, రాష్ట్రం బాగుపడుతుందా - మాజీ మంత్రి చంద్రశేఖర్

Perni Nani on Pawan Kalyan: సిగ్గుందా పవన్, చంద్రబాబు ఏది మాట్లాడమంటే అది మాట్లాడేస్తావా, జనసేనానిపై విరుచుకుపడిన పేర్ని నాని

Hazarath Reddy

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వాలంటీర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్‌ వెంటనే క్షమాపణలు చెప్పాలని వాలంటీర్లు డిమాండ్‌ చేస్తున్నారు. పవన్‌ వ్యాఖ్యలపై పేర్నినాని సీరియస్‌ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంపై పవన్‌ విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు

Pawan Kalyan vs Volunteers: పవన్‌ కల్యాణ్‌పై ఉరవకొండ పోలీస్ స్టేషన్‌లో వాలంటీర్ల ఫిర్యాదు, ఏపీలో దుమారం రేపుతున్న జనసేన అధినేత వివాదాస్పద వ్యాఖ్యలు

Hazarath Reddy

ఏపీలో వాలంటీర్‌ వ్యవస్థపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబీకింది. ఒంటరి మహిళలు, వితంతువుల వివరాలు సేకరించి సంఘ విద్రోహ శక్తులకు వాలంటీర్లు సమాచారం ఇస్తున్నారన్న పవన్ ఆరోపణలపై నిరసనలు వెల్లు వెల్లువెత్తుతున్నాయి

Advertisement

Hyderabad Shocker: హైదరాబాద్‌లో విషాదం, తాను వండిపెట్టిన అన్నం భర్త తినలేదని భార్య ఆత్మహత్య

Hazarath Reddy

భర్త అన్నం తినడం లేదని అలిగి భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. గత మూడు రోజులుగా తాను చేసిన వంటలు తినకుండా బయట తినడమే కాకుండా ఇదేమిటని అడిగితే సరైన సమాధానం చెప్పకపోవడంతో మనస్థాపానికి గురైన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది

Youth Dies of Heart Attack: జిమ్ నుంచి రాగానే గుండెపోటు, గంటల వ్యవధిలో ఇద్దరు యువకులు మృతి, ఖమ్మంలో విషాదకర ఘటన

Hazarath Reddy

ఖమ్మం నగరం అల్లీపురంలో గరికపాటి నాగరాజు అనే యువకుడు ఆదివారం గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా ఖమ్మంలో హార్ట్‌స్ట్రోక్‌తో మరో యువకుడు మరణించాడు.కాంగ్రెస్‌ నాయకుడు, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మానుకొండ రాధా కిషోర్‌ కుమారుడు శ్రీధర్‌(31) గుండెపోటుతో మృతిచెందాడు.

Dada Oxygen Park: మహారాష్ట్రలో సీఎం జగన్ మీద వెలువెత్తిన అభిమానం, లక్షా 11వేల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిన దాదాశ్రీ ఫౌండేషన్‌ వీఈటీ

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పేరిట దాదాశ్రీ ఫౌండేషన్‌ వీఈటీ తరపున మహారాష్ట్ర షోలాపూర్‌ జిల్లాలోని 11 తాలూకాలోని అన్ని గ్రామాల్లో, పాఠశాలల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (దాదాశ్రీ) ఆక్సిజన్ పార్క్ ప్రచారం ద్వారా మొక్కలు నాటుతున్నారు

Volunteers Protest: ఆ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాల్సిందే,  దిష్టిబొమ్మ దహనం చేసిన వాలంటీర్లు

Hazarath Reddy

పవన్‌ కల్యాణ్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఏపీ వాలంటీర్ల భగ్గుమంటున్నారు. పవన్‌ కల్యాణ్‌ వివాదాస్పద వ్యాఖ్యలపై వాలంటీర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒంటరి మహిళలు, వితంతువుల వివరాలు సేకరించి సంఘ విద్రోహ శక్తులకు వాలంటీర్లు సమాచారం ఇస్తున్నారన్న పవన్ ఆరోపణలపై నిరసనలు వెల్లు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Pawan Kalyan Comments Row: వాలంటీర్లపై పవన్‌ విషం, సీరియస్ అయిన ఏపీ మహిళా కమిషన్‌, సమన్లు జారీ

Hazarath Reddy

ఏపీ వాలంటీర్ల పట్ల పవన్‌ కల్యాణ్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్‌ సీరియస్‌ అయ్యింది. ఈ మేరకు పవన్‌కు కమిషన్‌ సమన్లు జారీ చేయనుంది. మహిళలను ఉద్ధేశించి చేసిన పవన్‌ వ్యాఖ్యలపై భారీగా ఫిర్యాదులు వస్తున్నాయని మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు

CM Jagan in Kadapa: కడపలో రూ.871.77 కోట్లతో అభివృద్ధి ప‌నులకు శంకుస్థాపనలు చేసిన సీఎం జగన్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

కడప నగరంలో రూ.871.77 కోట్లతో అభివృద్ధి ప‌నులకు శంకుస్థాపనలు చేసిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌. అందులో భాగంగా రూ.1.37 కోట్లతో పూర్తయిన రాజీవ్‌ పార్కు, రూ. 5.61 కోట్లతో పూర్తయిన రాజీవ్‌ మార్గ్‌ అభివృద్ధి పనులను ప్రారంభించిన‌ సీఎం వైయ‌స్ జగన్.

Andhra Pradesh: వాగు దాటాలంటే బైక్ ఎత్తుకు వెళ్లాల్సిందే, ఏపీలో 36 గ్రామాల పరిస్థితి ఇది, బ్రిడ్జి మార్గం ఏర్పాటు చేయాలని కోరుతున్న గ్రామస్థులు

Hazarath Reddy

వర్షాలకి వాగు పొంగిపొర్లడంతో అటుగా వెళ్లాల్సిన గ్రామ గిరిజన గ్రామస్తులు వాగు దాటేందుకు బైకు భుజాలపై ఎత్తుకొని వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరుగలేదు.

TDP Workers Fight in Tana Videos: వీడియోలు ఇవిగో, తెలుగు తమ్ముళ్ల తన్నులాటతో రచ్చ రచ్చగా మారిన తానా సభలు, టీడీపీ ఎన్నారై అధ్యక్షుడి ముందే ఫైటింగ్

Hazarath Reddy

అమెరికాలో ‘తానా’(ఉత్తర అమెరికా తెలుగు సంఘం) సభల సందర్భంగా జూనియర్‌ ఎన్టీఆర్, లోకేశ్‌ వర్గాలు పరస్పరం తన్నుకున్నాయి. రెండుగా చీలిపోయిన టీడీపీ ఎన్నారై సభ్యులు పిడిగుద్దులు గుద్దుకున్నారు. తరని పరుచూరి, సతీష్‌ వేమన వర్గాలు పరస్పరం చొక్కాలు పట్టుకుని మరీ దాడులకు దిగాయి.

Advertisement
Advertisement