రాష్ట్రీయం

Andhra Pradesh Shocker: పదిహేనేండ్ల బాలికపై రెండేళ్లుగా పూర్ణానంద స్వామీజీ అత్యాచారం.. బాలికను గొలుసులతో తన గదిలో బంధించి అఘాయిత్యం.. పనిమనిషి సాయంతో ఆశ్రమం నుంచి తప్పించుకున్న బాలిక.. అర్ధరాత్రి స్వామీజీ అరెస్ట్

Rudra

విశాఖపట్టణంలోని జ్ఞానానంద ఆశ్రమ నిర్వాహకుడు పూర్ణానంద స్వామీజీకి సంబంధించి సంచలన ఘటన కలకలం సృష్టిస్తుంది. అత్యాచారం ఆరోపణలపై స్వామీజీ అరెస్టయ్యారు. స్వామీజీ తనపై రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్నారన్న రాజమహేంద్రవరానికి చెందిన అనాథ బాలిక (15) ఫిర్యాదుపై గత అర్ధరాత్రి స్వామీజీని పోలీసులు అరెస్ట్ చేశారు.

Telangana Govt. Hikes DA: తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 2.73 శాతం డీఏ మంజూరు.. పెంచిన డీఏ 2022 జనవరి నుండి అమల్లోకి... 7.28లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి

Rudra

ఉద్యోగులకు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏను విడుదల చేసింది. ఉద్యోగుల మూల వేతనం, పెన్షన్‌పై 2.73 శాతం డీఏ పెరగనుంది. ఉద్యోగుల డీఏను పెంచుతూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ నెల నుండి డీఏను పెంచింది.

Ramcharan Upasana Blessed With Baby Girl: మెగా ఇంట సంబరాలు.. అమ్మానాన్నలైన రామ్‌ చరణ్‌-ఉపాసన దంపతులు.. నేడు తెల్లవారుజామున పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన.. మెగా ఇంట మిన్నంటిన సంబరాలు, యువరాణి వచ్చిందంటూ మెగా ఫ్యామిలీ ప్రకటన

Rudra

మెగా ఫ్యామిలీ ఇంట సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. మెగా కుటుంబం, మెగాభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అద్భుతమైన క్షణం రానే వచ్చింది. రామ్ చరణ్, ఉపాసన అమ్మానాన్నలు అయ్యారు. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో మంగళవారం తెల్లవారుజామున ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.

National Water Awards to AP: ఆంధ్రప్రదేశ్‌కు నాలుగు జాతీయ జల అవార్డులు, అధికారులను అభినందించిన సీఎం జగన్‌

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌కు నాలుగు జాతీయ జల అవార్డులు (నేషనల్ వాటర్‌ అవార్డ్స్‌ 2022) దక్కించుకోవడంపై మంత్రి అంబటి రాంబాబు, అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు.

Advertisement

Hyderabad Shocker: తెలంగాణలో ఘోర విషాదాలు, చిన్న పిల్లల్ని ముందు చంపి తరువాత ఆత్మహత్య చేసుకున్న తల్లిదండ్రులు

Hazarath Reddy

సికింద్రాబాద్ బన్సీలాల్ పేట్ డివిజన్ జివై రెడ్డి బస్తీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ తల్లి తన పిల్లలిద్దరినీ భవనంపై నుంచి తోసిపడేసి అనంతరం తాను దూకి ఆత్మహత్య చేసుకుంది. గత కొన్ని రోజులుగా మహిళ భర్త అదనపు కట్నం కోసం వేధింపులు మొదలుపెట్టాడు

Heatwave in AP: ఏపీలో 300 మండలాలకు వడగాల్పుల హెచ్చరిక, అవసరమైతేనే బయటకు రావాలని సూచన, రెండు రోజుల తర్వాత ఏపీలో రుతుపవనాల ప్రభావం

Hazarath Reddy

వచ్చే వారం నుండి హీట్‌వేవ్స్ తగ్గుముఖం పట్టవచ్చని IMD-అమరావతి అంచనా వేసినందున, ఆంధ్రప్రదేశ్ సోమవారం (జూన్ 20) నుండి హీట్‌వేవ్ పరిస్థితుల నుండి ఉపశమనం పొందే అవకాశం ఉంది .

Indonesia Open 2023: ఇండోనేసియా ఓపెన్‌ టైటిల్‌ గెలిచిన సాత్విక్‌-చిరాగ్‌ శెట్టి జోడీకి సీఎం జగన్ అభినందనలు, ట్వీట్ ఇదిగో..

Hazarath Reddy

ఇండోనేసియా ఓపెన్‌ టైటిల్‌ గెలిచిన సాత్విక్‌-చిరాగ్‌ శెట్టి జోడీని సీఎం జగన్‌ ట్విటర్‌ వేదికగా మరోసారి అభినందించారు. మన తెలుగు కుర్రాడు సాత్విక్‌సాయిరాజ్‌తో పాటు అతనికి జోడీగా టైటిల్‌ నెగ్గిన శెట్టి చిరాగ్‌కు సైతం సీఎం జగన్‌ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు

TTD Key Decisions: తిరుమలలో రూ.14 కోట్లతో అదనపు లడ్డూ కౌంటర్ల నిర్మాణం, రూ.1 కోటి 28 లక్షలతో వసతి గృహాల ఆధునీకరణ, టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవిగో..

Hazarath Reddy

తిరుమలలో రూ. 4 కోట్లతో తిరుమలలో అదనపు లడ్డూ కౌంటర్ల నిర్మాణం చేపట్టనున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రూ. 1 కోటి 28 లక్షలతో వసతి గృహాల ఆధునీకరించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ ధర్మకర్తల మండలి సోమవారం సమావేశమైంది. సమావేశ తీర్మానాలను టీటీడీ ఛైర్మన్ మీడియాకు వెల్లడించారు.

Advertisement

Balkampet Yellamma Kalynam: నేటి నుంచి 3 రోజుల పాటు బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాలు, హైదరాబాద్‌లో ఈ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు

Hazarath Reddy

సోమవారం ఎదుర్కోళ్లు, మంగళవారం ఎల్లమ్మ కల్యాణం, బుధవారం రథోత్సవం నిర్వహిస్తామని ఆలయ ఈవో ఎస్‌ అన్నపూర్ణ తెలిపారు.ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయాన్ని విద్యుత్‌ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు.

YS Viveka Murder Case: వివేకా హత్య కేసు, అవినాశ్ రెడ్డి, సీబీఐకు సుప్రీంకోర్టు నోటీసులు, సునీతారెడ్డి పిటిషన్‌పై విచారణ జూలై3కు వాయిదా

Hazarath Reddy

వైఎస్ వివేకా హత్య కేసులో.. ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలంటూ సునీతారెడ్డి వేసిన పిటిషన్‌పై విచారణ వచ్చే నెల(జులై) 3వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణ కోసం సీజేఐ బెంచ్‌ ముందు లిస్ట్‌ చేయాలని ఆదేశిస్తూనే.. ప్రతివాదులకు సోమవారం నోటీసులూ జారీ చేసింది. అవినాశ్‌‌తో పాటు సీబీఐకి కూడా ధర్మాసనం నోటీసులు పంపించింది.

Cricket Player Dies of Heart Attack: విశాఖలో క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిన క్రికెట్ ప్లేయర్, ఆస్పత్రికి తీసుకు వెళ్లే లోపే మృతి

Hazarath Reddy

విశాఖపట్నంలో జరుగుతున్న అంతర్ జిల్లాల క్రికెట్ టోర్నీలో ఆడుతూ 26 ఏళ్ల న్యాయవాది మృతి చెందాడు. ఆదివారం గాజువాకలోని జింక్ క్రికెట్ గ్రౌండ్ నుంచి బయటకు వస్తుండగా మణికంఠ నాయుడు కుప్పకూలి మృతి చెందాడు. సాక్షుల ప్రకారం, మ్యాచ్ పూర్తయిన తర్వాత నాయుడు మైదానం నుండి బయటకు వస్తుండగా, గుండె ఆగిపోవడంతో అతను కుప్పకూలిపోయాడు.

Telangana Shocker: వీడియో ఇదిగో, చేతబడి చేశారంటూ దంపతులను చెట్టుకు వేలాడదీసి దారుణంగా కొట్టిన గ్రామస్తులు

Hazarath Reddy

సదాశివపేటకు చెందిన యాదయ్య, అతని కుటుంబ సభ్యులు చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో కొంతమంది గ్రామస్తులు యాదయ్య కుంటుంబాన్ని గ్రామ నడివీధిలోని చెట్టుకు తాళ్లతో వేలాడదీసి కర్రలతో దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Heatwave Alert: తెలంగాణ, ఏపీ సహా దేశంలోని 10 రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజులపాటు తీవ్ర వడగాల్పులు.. జాగ్రత్తగా ఉండాలంటూ భారత వాతావరణ విభాగం హెచ్చరిక

Rudra

వచ్చే మూడు రోజులపాటు దేశంలోని 10 రాష్ట్రాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. తెలంగాణ, ఏపీ, ఉత్తరప్రదేశ్, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్రలోని విదర్భ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ లో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది.

28 Trains Cancelled: ఏపీ, తెలంగాణ సహా పలు ప్రాంతాలకు ప్రయాణించే ప్యాసింజర్లు అలెర్ట్.. వారం రోజులపాటు 28 రైళ్ల రద్దు.. 23 ఎంఎంటీఎస్ రైళ్లు కూడా రద్దు.. ట్రాక్ నిర్వహణ పనుల నేపథ్యంలోనే నిర్ణయం

Rudra

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలకు ప్రయాణించే 28 రైళ్లను వారం రోజులపాటు రద్దు చేస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్ పరిధిలో ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా నేటి నుంచి 25 వరకు 28 రైళ్లను రద్దు చేసినట్టు తెలిపింది.

TTD Seva Tickets: నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల.. జూన్ 21 వరకు లక్కీడిప్ కు అవకాశం.. మరిన్ని వివరాలు ఇవే..

Rudra

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సెప్టెంబరు నెల శ్రీవారి సేవలకు సంబంధించిన టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. నేడు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఆన్ లైన్ లో ఉంచనుంది.

Kalyanam at Yellamma Devasthanam: నేడు బల్కంపేట్‌ ఎల్లమ్మ కల్యాణం.. ఆలయం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

Rudra

తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బల్కంపేట్‌ ఎల్లమ్మ కల్యాణం నేడు. ఈ సందర్భంగా సోమ, మంగళవారాల్లో ఆలయం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ సుధీర్‌బాబు వివరించారు. సోమవారం కల్యాణోత్సవం, మంగళవారం రథోత్సవ కార్యక్రమాలుంటాయని తెలిపారు. కల్యాణం సందర్భంగా ఆలయం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

Advertisement

Half Day Schools In AP: ఏపీ విద్యార్ధులకు గుడ్‌ న్యూస్! ఈ నెల 24 వరకు ఒంటిపూట బడులు, వడగాల్పులు, ఎండల దృష్ట్యా ప్రభుత్వం నిర్ణయం

VNS

ఏపీ విద్యార్థులకు శుభవార్త (Half Day Schools) ! ఒంటిపూట బడులను ఈ నెల 24 వరకు పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ (Ap Schools) నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌. సురేశ్‌కుమార్‌ (Suresh Kumar) తెలిపారు.

Rakesh Master And Prabhas Pic: ప్రభాస్‌కు డ్యాన్స్ నేర్పింది రాకేష్ మాస్టరే! సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫోటో, రాకేష్ మాస్టర్‌ తో కలిసి ప్రభాస్‌ డ్యాన్స్ ప్రాక్టీస్‌

VNS

ఆయన మరణ వార్త తెలుసుకున్న అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే రాకేష్ మాస్టర్ కి సంబంధించిన ఒక పాత ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఎంతో గొప్ప స్టార్‌డమ్ ని అందుకున్న ప్రభాస్ (Prabhas) కి కెరీర్ మొదటిలో రాకేష్ మాస్టర్ డాన్స్ పాఠాలు నేర్పించాడు.

Rakesh Master Died: రాకేష్ మాస్టర్ చనిపోతాడని రెండు నెలల క్రితమే హెచ్చరించిన డాక్టర్లు, 15 రోజుల క్రితమే శిశ్యుడితో కలిసి చావుపై రాకేష్ మాస్టర్ వీడియో, గాంధీ ఆస్పత్రిలో బెడ్‌పై రాకేష్ మాస్టర్ చివరి క్షణాలు ఇవీ!(వీడియో)

VNS

మధ్యాహ్నాం ఒంటిగంట సమయంలో గాంధీ ఆస్పత్రిలో చేరిన రాకేశ్ మాస్టర్.. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో సాయంత్ర 5 గంటల సమయంలో మరణించినట్లు సమాచారం. రాకేష్ మాస్టర్ ఆస్పత్రిలో ఉన్నప్పటి చివరి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. బెడ్‌ మీద కొన ఊపిరితో ఆయన కొట్టుమిట్టాడుతున్న వీడియో చూసిన ఫ్యాన్స్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

TSRTC: తెలంగాణ ఆర్టీసీలో ఇకపై మహిళలు, సీనియర్ సిటిజన్లకు 100 రూపాయలకే వన్ డే పాస్ పథకం ప్రారంభం..ఒక్క టికెట్ తో రోజంతా ప్రయాణించవచ్చు..

kanha

మహిళలు, వృద్ధులు కేవలం రూ.100 చెల్లించి ఈ టికెట్‌ పొందితే 60 కి.మీ పరిధిలో రానుపోను ప్రయాణించొచ్చు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకే చెల్లుబాటు అవుతుంది.

Advertisement
Advertisement