ఆంధ్ర ప్రదేశ్

Andhra Pradesh: వీడియో ఇదిగో, శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల గుంపు హల్ చల్...భయాందోళనలో రెండు గ్రామాల ప్రజలు, విద్యుత్ నిలిపేసిన అధికారులు

Arun Charagonda

శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల గుంపు హల్ చల్ సృష్టించింది. వంగర మండలం వివిఆర్ పేట, రాజుల గుమడ గ్రామల్లో తిష్ట వేశాయి ఏనుగుల గుంపు. భయాందోళనలో రెండు గ్రామాల ప్రజలు ఉండగా అప్రమత్తమై విద్యుత్ శాఖ అధికారులు చుట్టుపక్క గ్రామాలకు విద్యుత్ నిలిపివేశారు.

Andhra Pradesh: అల్లుడి కోసం 100 వంటకాలు.. తొలిసారి ఇంటికి వచ్చిన అల్లుడికి అదిరే వంటకాలు, ఆంధ్ర అత్తకు జేజేలు పలుకుతున్న నెటిజన్లు!

Arun Charagonda

తొలిసారి ఇంటికి వచ్చిన అల్లుడికి అదిరే సర్‌ప్రైజ్ ఇచ్చారు ఓ అత్త. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తామరాడ గ్రామానికి చెందిన రత్నకుమారికి కాకినాడకు చెందిన రవితేజకు గతేడాది సెప్టెంబర్లో వివాహం జరిగింది. వివాహం అయి ఆషాడం మాసం ముగిసిన తర్వాత తొలిసారిగా అత్తారింటికి వచ్చిన అల్లుడికి అత్తమామలు ఏకంగా 100 రకాల పిండివంటలతో భోజన ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Attack On YSRCP Leader: అన్నమయ్య జిల్లాలో దారుణం, వైసీపీ నాయకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి, తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. వైఎస్సార్సీపీ నాయకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. తంబళ్లపల్లి నియోజకవర్గం పులికల్లు గ్రామ పంచాయతీకి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు లక్ష్మీ నారాయణ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కుటుంబ సమేతంగా దర్శనం..వీడియో

Arun Charagonda

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇక అంతకముందు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న భట్టికి అనుకోకుండా తారసపడ్డారు మోహన్ బాబు. వీరిద్దరి కాసేపు ముచ్చటించుకున్నారు.

Advertisement

Tungabhadra Dam Gate Chain Snaps: అలర్ట్.. భారీ వరదకు కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్‌ గేటు.. గత 70 ఏండ్లలో ఇలాంటి ఘటన ఇదే మొదటిసారి.. తెగిన గేట్ మార్గం నుంచి 35 వేల క్యూసెక్కుల వరద.. ఏపీలోని మంత్రాలయం, నందవరం ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు

Rudra

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర, కృష్ణానదిలో వరద పోటెత్తుతున్నది. వరద ప్రవాహ తీవ్రతకు కర్ణాటకలోని హోస్పేట్‌ లో ఉన్న తుంగభద్ర డ్యామ్‌ 19వ గేటు కొట్టుకుపోయింది.

Ashwini Vaishnaw About New Rail Projects: తెలుగు రాష్ట్రాలకు కొత్త రైల్వే లైన్లు, బెంగాల్ టూ వరంగల్, భద్రాచాలం టూ తూర్పుగోదావరి కొత్త రైల్వే లైన్ల ఏర్పాటు, ఐదేళ్లలో పూర్తి చేస్తామన్న కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్

Arun Charagonda

తెలుగు రాష్ట్రాలకు కొత్త రైల్వే కారిడార్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్. బెంగాల్‌లోని అసోన్‌సోల్ నుండి వరంగల్ వరకు అలాగే భద్రాచలం మీదుగా తూర్పుగోదావరి వరకు కొత్త రైల్వే లైన్ ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏపీ, తెలంగాణతో పాటు బిహార్, ఝార్ఖండ్ కొత్త రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను తెలిపారు.

Duvvada Srinivas: మాకు నాన్న కావాలి, నా కుటుంబమే నాపై దాడి చేస్తోంది, కుటుంబ సభ్యులపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కేసు, వాణికి విడాకులు ఇస్తానని వెల్లడి

Arun Charagonda

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ పరిస్థితులు రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. మాకు నాన్న కావాలి అంటూ దువ్వాడ శ్రీనివాస్ మరో మహిళతో ఉన్న ఇంటిపై దాడికి చేయగా దీనిపై స్పందించారు శ్రీనివాస్. సమాజంలో, జగన్ ముందు తనను దోషిగా నిలబెట్టారని మండిపడ్డారు. మంత్రి అచ్చెన్నాయుడు దర్శకత్వంలోనే వాణి నడుస్తోందని ఆరోపించారు. వాణికి రాజకీయ ఆకాంక్ష ఎక్కువని ఓ కూతురు పెళ్లి చేశాను మరో కూతురు పెళ్లి చేయాల్సి ఉందన్నారు. క్వారీ డబ్బులు అన్ని తనకే ఇవ్వాలని రచ్చ చేసేదని మండిపడ్డారు. ఇవాళ తనపైకి తన పిల్లలతో పాటు చాలా మందిని తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Viral Video: ఎంతకు తెగించావ్రా..? అమ్మవారికి భక్తితో మొక్కినట్టే మొక్కి.. ఆభరణాలు చోరీ చేసిన దొంగ.. అన్నమయ్య జిల్లాలో ఘటన (వీడియో)

Rudra

దొంగతనానికి హద్దూ అదుపు లేకుండా పోతుంది. భక్తిమాటున కొందరు దొంగలు హద్దులు దాటుతున్నారు. ఇదీ అలాంటి ఘటనే. అమ్మవారికి మొక్కినట్టే మొక్కి.. ఆ తర్వాత అమ్మవారి మెడలో ఆభరణాలు చోరీ చేశాడు ఓ దొంగ.

Advertisement

Marriage in Theatre: ‘మురారి’ రీ రిలీజ్ హంగామా.. థియేటర్ లోనే పెళ్లిళ్లు చేసుకున్న మహేష్ ఫ్యాన్స్.. వీడియోలు వైరల్

Rudra

ప్రస్తుతం టాలీవుడ్ లో రీ-రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘మురారి’ రీ రిలీజ్ అయింది. మహేష్ బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ చేసిన ఈ మూవీ థియేటర్స్ లో ఆసక్తికర ఘటనలు జరుగుతున్నాయి.

Jagan on Nara Lokesh 'Red Book': ఏపీలో లా అండ్ ఆర్డర్ బతకాలంటే చంద్రబాబు, నారా లోకేష్‌లను హత్య కేసుల్లో ముద్దాయిలుగా చేర్చాలి, జగన్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

ఏపీలో లా అండ్‌ ఆర్డర్‌ నాశనం చేస్తున్నారు. ఏపీలో జరుగుతున్న హత్యల్లో చంద్రబాబు, లోకేష్‌లను ముద్దాయిలుగా చేర్చాలన్నారు. కేవలం ఆధిపత్యం కోసమే దాడులకు తెగబడుతున్నారని వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. కావాలనే భయానక వాతావరణం సృష్టిస్తున్నారని.. ఇదెక్కడి పాలన అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Jagan Slams TDP-led Alliance Ruling: టీడీపీ ఎమ్మెల్యేలే చంపండని చెబుతున్నారు, ఇదేం పాలన అంటూ మండిపడిన వైఎస్ జగన్, హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని హామీ

Hazarath Reddy

Jagan on Subbarayudu Murder Case: ప్రతి ఊరిలో ఇద్దరు వైసీపీ నాయకులను చంపాలని శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే చెబుతున్నాడు, వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

ప్రతి ఊరిలో ఇద్దరు వైయస్ఆర్ సీపీ నాయకులను చంపండి అని శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మీటింగ్ లు పెట్టి మరీ చెబుతున్నాడని మండిపడ్డారు.

Advertisement

Jagan on AP Law and Order: పోలీసుల సమక్షంలోనే హత్యలు చేస్తున్నారు, రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండని కోరిన వైఎస్ జగన్, వీడియో ఇదిగో

Hazarath Reddy

రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది.మారణహోమం సృష్టించే పాలన చేస్తున్నారు. రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ పాలన అమలు చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల సమక్షంలోనే హత్యలు చేస్తున్నారంటే.. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండని ప్రజలను కోరారు.

Jagan on Subbarayudu Murder Case: ఎస్ఐ సమక్షంలోనే సుబ్బారాయుడిని హత్య చేశారు, రాజకీయ కుట్ర లేకపోతే హత్య జరిగిన తర్వాత అడిషనల్‌ ఫోర్స్ ఎందుకు రాలేదని ప్రశ్నించిన వైఎస్ జగన్

Hazarath Reddy

వైఎస్‌ జగన్‌ నంద్యాలలో సీతారామపురంలో టీడీపీ గూండాల దాడితో హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబ సభ్యులను వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. ఈ క్రమంలో వారి కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం, వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ.. పోలీసుల సమక్షంలోనే పెద్దసుబ్బారాయుడిని చంపేశారు.

Andhra Pradesh: వీడియో ఇదిగో, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ పీఠంపై ఉన్న జగన్ పేరును తొలగించిన అధికారులు, పేరు తొలగించినంత మాత్రాన చరిత్రను చెరిపేయలేరని వైసీపీ నేతలు మండిపాటు

Hazarath Reddy

విజయవాడ స్వరాజ్య మైదానంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ న్యాయ మహాశిల్పం పీఠంపై ఏర్పాటు చేసిన మాజీ సీఎం జగన్‌ పేరును అర్ధరాత్రి లైట్లు ఆపేసి తొలగించారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసుల సమక్షంలోనే నగరపాలక సిబ్బంది ఈ దుశ్చర్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన‌ జగన్ పేరు తొలగించడాన్ని వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు.

Theft Caught on Camera: వీడియో ఇదిగో, కడపలో మహిళలు షాపులో చీరలను ఎంత స్మార్ట్‌గా దొంగిలించారో మీరే చూడండి

Hazarath Reddy

ఏపీలోని కడపలో ఓ వస్త్ర దుకాణంలో బట్టలు దొంగిలించినందుకు ఐదుగురు మహిళలపై కేసు నమోదైంది. దుకాణంలోని సీసీటీవీ ఫుటేజీలో మహిళలు వారు ధరించిన చీరల వెనుక దొంగిలించిన చీరలను దాచిపెట్టారు. వీడియోలో, ఐదుగురు మహిళలు షాప్‌లోకి ప్రవేశించి.. చీరలను చూడటం ప్రారంభించారు.

Advertisement

Alla Nani Quits YSRCP: వైసీపీకి మరో బిగ్ షాక్, మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రాజీనామా, వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా వెళుతున్నానని వెల్లడి

Hazarath Reddy

వైసీపీకి మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీకి మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు జిల్లాకు చెందిన ముఖ్యనేత ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని) రాజీనామా చేశారు. ఏలూరు జిల్లా అధ్యక్ష పదవితో పాటు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌కు రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

Andhra Pradesh: మన్యం జిల్లాలో అభివృద్ధి ఎక్కడ? రోడ్డు మార్గం లేకపోవడంతో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగును దాటుతున్న వందలాది మంది కూలీలు

Hazarath Reddy

అల్లూరీ సీతారామరాజు జిల్లా చింతూరు ఏజన్సీలో భారీ వర్షాలు..వి.అర్.పురం మండలంలో అన్నవరం వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. నాటుకు వెళ్లిన కూలీలు భారీ వర్షానికి తిరిగి వస్తుండగా, సాయంత్రం వరకు వేచి చూసిన వాగు ఉధృతి తగ్గకపోవడంతో ప్రమాదకరంగా వాగు దాటుతున్న వందలాది మంది కూలీలు.

Chandrababu Dance Video: చంద్రబాబు డ్యాన్స్ వీడియో ఇదిగో, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మహిళలతో కలిసి నృత్యం చేసిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆదివాసీ మహిళలతో కలిసి నృత్యం చేసిన సీఎం.. అనంతరం డప్పు వాయించారు

Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో.. సెల్ఫీ వీడియో తీసుకుంటూ యువకుడి ఆత్మహత్య, భార్య వదిలి వెళ్లిపోవడంతో మనస్తాపం

Arun Charagonda

విజయనగరం జిల్లా రాజాం మండలం ఇల్లంనాయుడులో విషాదం చోటు చేసుకుంది. ఘంటసాల సత్యాధర్, భార్య తనని వదిలి వెళ్లిపోవడంతో మనస్తాపం చెంది సెల్ఫీ వీడియో తీసుకుంటూ గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు రాజాం ఏరియా ఆసుపత్రికి తరలించగా...చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Advertisement
Advertisement