ఆంధ్ర ప్రదేశ్

Andhra Pradesh: పిఠాపురం టీడీపీ ఇంఛార్జి వర్మపై దాడి, కాకినాడ జనసేన ఎంపీ టీ టైం ఉదయ్ అనుచరులే దాడి చేశారని వర్మ అరోపణలు

Hazarath Reddy

పిఠాపురంలో జనసేన శ్రేణులు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మపై దాడికి దిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనలో వర్మ కారు ధ్వంసం అయ్యింది. ఆయనకు గాయలు అయ్యాయా? అనేది తెలియాల్సి ఉంది.

Ramoji Rao Health Update: రామోజీరావు తీవ్ర అస్వస్థతకు గురైనట్లుగా వార్తలు, వెంటిలేటర్ మీద వైద్యం అందిస్తున్న స్టార్‌ హాస్పిటల్‌ వైద్యులు

Hazarath Reddy

ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు తీవ్ర అస్వస్థతకు గురయినట్లుగా వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో పేరుగాంచిన స్టార్‌ హాస్పిటల్‌ వైద్యులు వెంటిలేటర్ మీద వైద్యం అందిస్తున్నారు. ఇటీవల స్టంట్ వేయగా.. కొద్దికాలం పాటు ఆరోగ్యంగా ఉన్న రామోజీరావు ఇప్పుడు మళ్లీ అనారోగ్యం పాలయ్యారు.

Viral Video: వీడియో ఇదిగో, మద్యం మత్తులో తూలుతూ వాహనదారులను బెంబేలెత్తించిన మందుబాబు

Hazarath Reddy

విశాఖలో అత్యంత రద్దీగా ఉండే పీఎం పాలెం హై వే పై మద్యం మత్తులో తూలుతూ వాహనదారులను బెంబేలెత్తించిన మందుబాబు. అదువులోకి తీసుకున్న పోలీసులు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Nandamuri Balakrishna: బాలయ్యా మజాకా.. మేకపోతుల తలలతో బాలకృష్ణ ఫోటోకు మాల వేసిన అభిమానులు, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Vikas M

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎమ్మెల్యే, నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి బాలకృష్ణ అభిమానులు ఆయనపై అపూర్వమైన ప్రేమను ప్రదర్శించారు. హిందూపూర్ ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందిన సందర్భంగా అభిమానులు మేకపోతు తలలతో ఆయనకు పూలమాల వేశారు.

Advertisement

Andhra Pradesh Government Formation: ఈ నెల 12న ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం, కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద కార్యక్రమం

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబు నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. తాజాగా చంద్రబాబు ప్రమాణస్వీకారం కోసం వేదిక, సమయం ఖరారు చేశారు. ఈ నెల 12న ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు

Jagan on Post-Poll Violence in AP: చంద్రబాబు రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు, జగన్ సంచలన ట్వీట్, రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని ఆవేదన

Hazarath Reddy

ఏపీలో ఎన్నికల తరువాత వైసీపీ శ్రేణులే లక్ష్యంగా టీడీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులపై జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. చంద్రబాబు రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చింది. టీడీపీ యథేచ్ఛదాడులతో ఆటవిక పరిస్థితులు తలెత్తాయి

Actress Syamala on AP Elections: వీడియో ఇదిగో, ఏపీ ప్రజల తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపిన నటి శ్యామల, సోషల్ మీడియాలో ట్రోల్స్‌, బెదిరింపు కాల్స్‌పై ఆవేదన

Hazarath Reddy

Andhra Pradesh: వీడియో ఇదిగో, వల్లభనేని వంశీ ఇంటిపై కర్రలతో టీడీపీ శ్రేణులు దాడి, టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టిన ప్రత్యేక బలగాలు

Hazarath Reddy

విజయవాడలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంటిపైటీడీపీ శ్రేణులు దాడి చేశాయి. వంశీ ఉండే అపార్ట్‌మెంట్‌ను నలువైపులా చుట్టుముట్టి.. వాహనాల్లో అటు ఇటు తిరుగుతూ టీడీపీ కార్యకర్తలు హల్‌ చల్‌ చేశారు. వంశీ ఉంటున్న ఫ్లోర్‌ వైపు రాళ్లు విసిరారు.

Advertisement

Post-Poll Violence in AP: వీడియోలు ఇవిగో, వైసీపీ నేతల ఇంటిపై కోడిగుడ్లు, రాళ్లతో టీడీపీ శ్రేణులు దాడులు, అడ్డువచ్చినా పోలీసు వాహనాలను సైతం..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల తర్వాత హింస కొనసాగుతూనే ఉంది. వైఎస్సార్‌సీపీ శ్రేణుల్ని లక్ష్యంగా చేసుకుని టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారు. మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీల ఇళ్లపై దాడులకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించాయి.

Post-Poll Violence in Andhra Pradesh: ఏపీలో దాడులపై స్పందించిన చంద్రబాబు, వైసీపీ కవ్వింపు చర్యలపై టీడీపీ శ్రేణులు సంయమనం పాటించాలని పిలుపు

Hazarath Reddy

రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల అనంతరం జరుగుతున్న దాడులపై చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తూ.. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల అనంతరం జరుగుతున్న వైసీపీ కవ్వింపు చర్యలు, దాడులపై టీడీపీ క్యాడర్ అప్రమత్తంగా ఉండాలి.

'Pawan Kalyan is Cyclone': వీడియో ఇదిగో, పవన్ కళ్యాణ్ ఓ తుఫాన్ అంటూ మోదీ ప్రశంసలు, ఏపీలో కూటమి భారీ విజయానికి పవనే కారణమని వెల్లడి

Hazarath Reddy

ఢిల్లీలోని పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో జరిగిన ఎన్డీయే పక్షాల సమావేశంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ప్రదాని మోదీ ప్రశంసలు కురిపించారు. పవన్‌ కల్యాణ్‌ అంటే పవనం కాదు.. ఓ తుఫాన్‌ అని ఆకాశానికి ఎత్తారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించిందని తెలిపారు.

Andhra Pradesh Government Formation: కొత్తగా ఏర్పడబోయే టీడీపీ మంత్రివర్గం ఇదేనా? ఈ నెల 12న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం, స్పీకర్ గా ఆయనేనా..

Hazarath Reddy

జూన్ 11వ తేదీన టీడీపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆ రోజు టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబును టీడీపీ పక్ష నేతగా ఎన్నుకుంటారు. చంద్రబాబును టీడీఎల్పీ నేతగా ఎన్నుకుని గవర్నర్‌కు నివేదించాక 12న ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగుతుంది.

Advertisement

RTC Bus Overturned in Paleru River: వీడియో ఇదిగో, ఉప్పొంగిన పాలేరు వాగులో కొట్టుకుపోయిన ఆర్టీసీ బస్సు, డ్రైవర్ అప్రమత్తతో తప్పిన పెనుప్రమాదం

Hazarath Reddy

నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలోని సంజామల వద్ద పాలేరు వాగు ఉప్పొంగడంతో ఓ బస్సు వరదకు కొట్టుకుపోయింది. నాలుగు అడుగుల మేర వంతెన పై వరద నీరు ప్రవహిస్తుండడంతో తిమ్మనైనపేట నుండి వస్తున్న కోయిలకుంట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుంది.

Andhra Pradesh Road Accident: కావలి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం, కంటైనర్ లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, ఒకరు మృతి, ఏడుమందికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

నెల్లూరు - గిద్దలూరు నుంచి చెన్నైకి వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు కావలి నేషనల్ హైవే రుద్రకోట వద్ద వెనుకనుండి అతివేగంతో వెళ్లి కంటైనర్ లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో మొత్తం 40 మంది ఉండగా వారిలో ఏడుగురికి గాయాలు అయ్యాయి, ఒకరు మృతి చెందారు.

TDP on Muslim Reservation: ఏపీలో ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని టచ్ చేయం, సంచలన నిర్ణయాన్ని ప్రకటించిన టీడీపీ, ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని గతంలో తెలిపిన బీజేపీ

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న ముస్లిం రిజర్వేషన్లను టీడీపీ (తెలుగుదేశం పార్టీ) టచ్ చేయదని పార్టీ తెలిపింది. కేంద్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వం ఏర్పాటుకు ముందు, జూన్ 7, శుక్రవారం టిడిపి నాయకుడు కె రవీంద్ర కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ముస్లింలకు రిజర్వేషన్లు కొనసాగుతాయని అన్నారు.

Neerabh Kumar Prasad: ఏపీ నూతన సీఎస్‌గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. 1987 బ్యాచ్‌కు చెందిన నీరభ్ ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు

Advertisement

Chandrababu Naidu Slams Opposition: కులగణనపై చంద్రబాబు గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు, తాజాగా వీడియో బయటకు..

Hazarath Reddy

మోడీ 3.0కి ఢిల్లీలో సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. నితీష్ కుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నరేంద్ర మోదీని మళ్లీ ప్రధానమంత్రిని చేయడంతోపాటు ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. కాగా, కుల గణన చేయాలంటే నైపుణ్య గణన చేయాలని గత నెలలో చంద్రబాబు నాయుడు ఇండియా కూటమి ఎజెండాను ఉద్దేశించినట్లుగా విమర్శించారు.

Chandrababu Naidu Meet TDP MPs: టీడీపీ ఎంపీలతో భేటీ అయిన చంద్రబాబు, కేంద్రంలో మంత్రివర్గ కూర్పు, టీడీపీకి ఉన్న ప్రాధాన్యంపై ప్రముఖంగా చర్చలు

Hazarath Reddy

ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ ఎంపీలతో ఆ పార్టీ అధినేత, ఏపీకి కాబోయే సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఎంపీలతో టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ నిర్వహించారు. అందుబాటులోని లేని వారు జూమ్‌ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.

Jagan Meeting with YCP Leaders: వైసీపీ నేతలతో జగన్ భేటీ, కార్యకర్తలకు తోడుగా నిలిచి భరోసా ఇవ్వాలని నాయకులకు ఆదేశాలు

Hazarath Reddy

వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఎన్నికల్లో గెలిచిన గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలు, ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో భేటీ అయ్యారు. పార్టీ శ్రేణులకు తోడుగా నిలిచి భరోసా ఇవ్వాలని నాయకులను వైయస్‌ జగన్‌ ఆదేశించారు

Parni Nani on TDP Attacks: రెండు రోజులకే బీహార్‌ని తలపిస్తున్నారు, టీడీపీ దాడులపై మండిపడిన పేర్ని నాని, గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లిన వైసీపీ నేతలు

Hazarath Reddy

రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులనే లక్ష్యంగా టీడీపీ దాడులు జరుపుతోందని అన్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ అరాచక చేష్టలకు దిగిందని ఫైర్ అయ్యారు.

Advertisement
Advertisement