ఆంధ్ర ప్రదేశ్

Andhra Pradesh Elections 2024: ఏపీవాసుల ఓటు చైతన్యం.. అర్ధరాత్రి 12 గంటల వరకు 78.36 శాతం పోలింగ్ నమోదు.. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అత్యధికంగా 83.19 శాతం పోలింగ్.. 63.19 శాతంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలో అతి తక్కువగా పోలింగ్ నమోదు.. ఈసీ అధికారిక గణాంకాలు విడుదల

Rudra

ఆంధ్రప్రదేశ్‌ లో సోమవారం జరిగిన అసెంబ్లీ, లోక్‌ సభ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఏపీవాసులు ఆసక్తి కనబర్చారు. కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ కొనసాగింది.

Andhra Pradesh Elections 2024: ఏపీలో సాయంత్రం 5 గంటలకు జిల్లాల వారీగా పోలింగ్ శాతం ఇదిగో, లోక్ సభ స్థానాల వారీగా పోలింగ్ శాతం ఎంతంటే..

Hazarath Reddy

ఏపీలో సార్వత్రిక ఎన్నికల (AP Elections 2024) కోసం ఉదయం 7 గంటల నుంచే మొదలైన పోలింగ్ సాయంత్రం 6గంటలకు ముగిసింది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల కోసం ఈ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల పోలింగ్ పై ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా కీలక ప్రకటన చేశారు.

Andhra Pradesh Elections 2024: ఏపీ ఎన్నికల పోలింగ్‌పై ఈసీ కీలక ప్రకటన, ఎక్కడా రీ పోలింగ్‌ నిర్వహించాల్సిన అవసరం లేదని వెల్లడి, సాయంత్రం 5 గంటలకు 68 శాతం ఓటింగ్ నమోదు

Hazarath Reddy

ఏపీలో సార్వత్రిక ఎన్నికల (AP Elections 2024) కోసం ఉదయం 7 గంటల నుంచే మొదలైన పోలింగ్ సాయంత్రం 6గంటలకు ముగిసింది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల కోసం ఈ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల పోలింగ్ పై ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా కీలక ప్రకటన చేశారు

Andhra Pradesh Elections 2024: నా భార్య ముందు నువ్వు అస‌లు క‌మ్మొడివేనా అని దూషించాడు, అందుకే చెంప పగలగొట్టానంటూ క్లారిటీ ఇచ్చిన తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌

Hazarath Reddy

తెనాలిలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ ఓటు వేయడానికి వెళ్లిన సమయంలో ఓ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి విదితమే. దీనిపై తాజాగా ఎమ్మెల్యే శివకుమార్ స్పందించారు.

Advertisement

Lok Sabha Elections 2024: మధ్యాహ్నం 3 గంటల వరకు తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్ శాతం ఇదిగో, ఏపీలో 55.49శాతం, తెలంగాణలో 52.34శాతం పోలింగ్‌ నమోదు

Hazarath Reddy

రెండు తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో సోమవారం ఓటింగ్‌ జరుగుతోంది.మధ్యాహ్నం మూడు గంటల వరకు ఏపీలో 55.49శాతం, తెలంగాణలో 52.34శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లోని మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్, క్యూలైన్ల‌లో ఉన్న‌వారికి ఓటేసేందుకు అవకాశం ఇస్తున్న అధికారులు

Hazarath Reddy

ఏపీలో మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతాలైన రంప‌చోడ‌వ‌రం, అర‌కు, పాడేరులో అధికారులు సాయంత్రం నాలుగు గంట‌ల‌కే పోలింగ్ ముగించారు. అలాగే తెలంగాణ‌లోని మంచిర్యాల‌, మంథ‌ని, భూపాల‌ప‌ల్లి, ఇల్లందు, పిన‌పాక‌, సిర్పూర్, చెన్నూర్, ఆసిఫాబాద్‌, బెల్లంప‌ల్లి, భ‌ద్రాచ‌లం, కొత్తగూడెం, అశ్వ‌రావుపేట‌, ములుగులో క‌డా 4 గంట‌ల‌కే పోలింగ్ పూర్త‌యింది.

Blue Shirt Mania: బ్లూ షర్టుతో ఓటేయడానికి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, సోషల్ మీడియాలో ఖుషీ అవుతున్న వైసీపీ ఫ్యాన్స్, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

ఎన్నికల పోలింగ్‌ జరుగుతున్న వేళ టాలీవుడ్ హారోలు జూనియర్ ఎన్టీఆర్‌, మహేష్ బాబు బ్లూ షర్ట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇద్దరు హీరోలు బ్లూ షర్ట్స్ ధరించి పోలింగ్‌ కేంద్రానికి వచ్చారు. దీంతో ఎన్టీఆర్‌, మహేష్ బాబు పరోక్షంగా వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇచ్చారంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

Andhra Pradesh Elections 2024: వీడియో ఇదిగో, గన్నవరంలో చెప్పులు, రాళ్లతో దాడి చేసుకున్న వల్లభనేని వంశీ, యార్లగడ్డ వర్గీయులు

Hazarath Reddy

ఏపీలో పోలింగ్ సందర్భంగా పలు చోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.తాజాగా గన్నవరం నియోజకవర్గంలోని ముస్తాబాద్ లో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ, టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు వర్గీయుల మధ్య తోపులాట జరిగింది.

Advertisement

Andhra Pradesh Elections 2024: ఎర్రకండువాతో ఓటేయడానికి వచ్చిన ఓటరు, తీవ్ర అభ్యంతరం తెలిపిన వంగా గీత, నాగబాబు దీనిపై ఏమన్నారంటే..

Hazarath Reddy

ఏపీలో నేడు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. అందరి దృష్టి కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ స్థానంపై కేంద్రీకృతమై ఉంది. ఇక్కడ జనసేన నుంచి పవన్ కల్యాణ్, వైసీపీ నుంచి వంగా గీత బరిలో ఉన్నారు. ఓ పోలింగ్ కేంద్రం వద్ద పరిశీలనకు వచ్చిన వంగా గీత ఓ వ్యక్తిపై మండిపడ్డారు.

Andhra Pradesh Elections 2024: చీరాలలో రక్తమొచ్చేలా కొట్టుకున్న టీడీపీ, వైసీపీ వర్గీయులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

బాపట్ల - చీరాల మండలం గవినివారి పాలెంలో చీరాల కూటమి అభ్యర్థి ఎం ఎం కొండయ్య గవినివారిపాలెం పోలింగ్ బూత్లను సందర్శించడానికి వచ్చిన సమయంలో ఇరువర్గాల మధ్యన ఘర్షణ చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చిన పోలీసులు

Andhra Pradesh Elections 2024: వీడియో ఇదిగో, ఓటరు చెంప చెళ్లుమనిపించిన తెనాలి వైసీపీ ఎమ్మెల్యే, ఎదురు తిరిగి ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన ఓటరు

Hazarath Reddy

తెనాలి ఎమ్మెల్యే పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే ఓటరు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తెనాలిలో సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్‌ ఓటేసేందుకు పోలింగ్ బూత్ కు వచ్చారు. అప్పటికే క్యూలో ఉన్న జనాలను పట్టించుకోకుండా నేరుగా పోలింగ్ బూత్ లోకి వెళుతున్నారు.

Lok Sabha Elections 2024: తొలి రెండు గంటల్లో పిఠాపురంలో 10.02 శాతం పోలింగ్ నమోదు, ఉదయం 9 గంటలకు ఏపీలో 9.05శాతం, తెలంగాణలో 9.51 శాతం పోలింగ్‌ నమోదైందని తెలిపిన అధికారులు

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఏపీలోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో సోమవారం పోలింగ్ జరుగుతోంది.

Advertisement

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల ఎన్నికలపై పీఎం మోదీ, అమిత్ షా స్పెషల్ ట్వీట్స్, రికార్డు స్థాయిలో ప్ర‌జ‌లు పోలింగ్‌లో పాల్గొనాల‌ని పిలుపు

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌పై ప్ర‌ధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్ర‌త్యేకంగా ట్వీట్స్ చేశారు. అసెంబ్లీ స‌హా లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఏపీ ప్ర‌జ‌లు రికార్డు స్థాయిలో పోలింగ్‌లో పాల్గొనాల‌ని మోదీ పిలుపునిచ్చారు. మ‌రోవైపు తెలుగు సంస్కృతిని, గౌర‌వాన్ని కాపాడే ప్ర‌భుత్వాన్ని ఎన్నుకోండి అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు.

Andhra Pradesh Elections 2024: వీడియో ఇదిగో, మంగళగిరిలో ఓటేసిన పవన్ కళ్యాణ్, ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు ప్రారంభమైన పోలింగ్

Hazarath Reddy

ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 ఎంపీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ఓటు వేసేందుకు మంగళగిరిలోని పోలింగ్ బూత్‌కు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, ఎంపీ స్థానాలకు నాల్గవ దశలో ఈరోజు ఏకకాలంలో ఓటింగ్ జరుగుతోంది.

Tender Vote: మీ ఓటును మరొకరు వేశారా? అయితే, బాధ పడొద్దు. టెండర్ ఓటు/చాలెంజ్ ఓటు వేయొచ్చు. ఆ ఓటును ఎలా వేయాలంటే?

Rudra

తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్ జోరుగా సాగుతున్నది. ఇలాంటి సమయాల్లో దొంగ ఓట్లు వేయడం, ఒకరి ఓటును మరొకరు వేయడం ఎక్కువగా కనిపిస్తుంది.

Andhra Pradesh Elections 2024: పిఠాపురంలో పోటెత్తిన ఓటర్లు, ఉదయం 7 గంటల నుంచి భారీ క్యూలు, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 ఎంపీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న పిఠాపురంలో ఓటర్లు పోటెత్తారు. ఉదయం 7 గంటల నుంచి క్యూలైన్లో నిలుచున్నారు. ఉప్పాడలో ఓటర్లు భారీగా ఓటు వేయడానికి కదలి వచ్చారు.

Advertisement

Andhra Pradesh Elections 2024: పుంగనూరులో టీడీపీ ఏజెంట్లు కిడ్నాప్, వైసీపీ నేతలే కిడ్నాప్ చేశారంటూ టీడీపీ విమర్శలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 ఎంపీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. పలువురు ప్రముఖలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో (Chittoor) టీడీపీ ఏజెంట్లను కిడ్నాప్ కలకలం రేపింది.

Andhra Pradesh Elections 2024: వీడియో ఇదిగో పులివెందుల భాకరాపురంలో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి

Hazarath Reddy

కుటుంబ సభ్యులతో కలిసి పులివెందుల భాకరాపురం 138 పోలింగ్‌ బూత్‌లో సీఎం జగన్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ సమయంలో క్యూ నిల్చున్న ఓటర్లకు ఆయన అభివాదం చేశారు.

Lok Sabha Elections 2024 Phase 4: ప్రారంభమైన నాలుగో దశ పోలింగ్, ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్

Hazarath Reddy

సార్వత్రిక ఎన్నికల నాలోగుదశ ఎన్నికల పోలింగ్‌ ఉదయగం 7 గంటల నుంచి ప్రారంభమైంది.సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరుగనుంది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా 10 రాష్ట్రాలు/యూటీల్లోని 96 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతున్నది.

2024 భారతదేశం ఎన్నికలు: తెలుగు రాష్ట్రాల్లో మొదలైన ఓట్ల జాతర.. పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్న ఓటరు మహాశయులు.. ఓటు హక్కును వినియోగించుకున్న ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు, నటులు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్.. ఇతరత్రా ప్రముఖులు

Rudra

తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండుగ మొదలైంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 ఎంపీ స్థానాలున్న ఏపీలో ఓటింగ్ ప్రారంభమైంది. ఇటు తెలంగాణ పరిధిలోని 17 లోక్‌ సభ స్థానాలకు కూడా పోలింగ్ మొదలైంది.

Advertisement
Advertisement