ఆంధ్ర ప్రదేశ్
Andhra Pradesh: పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బతో వృద్ధురాలు మృతి, కుటుంబాన్ని పరామర్శించేందుకు ఒకేసారి వెళ్లిన టీడీపీ, వైసీపీ నేతలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyకృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరులో వజ్రమ్మ (80) అనే వృద్ధురాలు పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బతో మృతి చెందింది. ఆమె కుటుంబాన్ని పరామర్శించేందుకు మంత్రి జోగి రమేశ్, టీడీపీ నేత బోడె ప్రసాద్ ఒకేసారి వెళ్లారు.
Andhra Pradesh Elections 2024: చంద్రబాబు మనిషా శాడిస్టా, పూతలపట్టులో సీఎం జగన్ తీవ్ర విమర్శలు, ఈసీకి నిమ్మగడ్డతో లేఖ రాయించి వాలంటీర్ల వ్యవస్థను అడ్డుకున్నారని మండిపాటు
Hazarath Reddyవచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైసీపీ పార్టీ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర 7వ రోజు కొనసాగుతోంది. 7వ రోజు చిత్తూరు జిల్లా పూతలపట్టు బైపాస్‌లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ (CM Jagan Speech in Memantha Siddham Puthalapattu) మాట్లాడారు.
Andhra Pradesh: ఒకటో తేదీ ఇంటికి రాని పెన్సన్, ఇద్దరు వృద్ధులు గుండెపోటుతో మృతి, ఎక్స్ వేదికగా ప్రతిపక్షాలపై వైసీపీ ఫైర్
Hazarath Reddyకాకినాడ రూరల్ తూరంగిలో ఫించన్ అందలేదన్న బాధతో ఓ వృద్ధుడు గుండె ఆగి మరణించాడు.కూలీ పని చేసుకునే వెంకట్రావ్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వెంకట్రావ్ మృతి పట్ల కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు సంతాపం వ్యక్తం చేశారు. ఆ కుటుంబాన్ని కలిసి ఓదార్చారు.
Memantha Siddham: ఒక్కడిపై ఎంతమంది దాడి చేస్తున్నారో చూడండి, మదనపల్లి మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్, ఇంటింటికి వెళ్లి ఓటు అడిగే నైతిక హక్కు మనకు మాత్రమే ఉందని వెల్లడి
Hazarath Reddyమదనపల్లిలో ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్ధేశించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ గెలవబోతుంది. ఎక్కడా ఒక్క సీటు కూడా తగ్గేందుకు వీలు లేదు.. డబుల్‌ సెంచరీ కొట్టేందుకు నేను సిద్ధంగా ఉన్నాను.. మీరంతా కూడా సిద్ధమేనా’ అన్నారు.
Pension Distribution in AP: ఏపీలో రేపటి నుంచి పెన్షన్ల పంపిణీ, దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇంటి దగ్గరకే పెన్షన్‌, విధి విధానాలు ఇవిగో..
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి(ఏప్రిల్‌3) పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. బుధవారం నుంచి ఈనెల 6 వరకు (మొత్తం నాలుగు రోజులు) పెన్షన్లను పంపిణీ జరగనుంది. అయితే సచివాలయ సిబ్బంది కొరత కారణంగా రెండు విధానాల్లో పంపిణీ చేయనుంది ప్రభుత్వం. ఈ మేరకు మంగళవారం విధివిధానాలు జారీ చేసింది.
Andhra Pradesh Elections 2024: ఏపీ ఎన్నికలు, ఆరుగురు ఐపీఎస్, ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ఎన్నికల సంఘం
Hazarath Reddyఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆరుగురు ఐపీఎస్ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ( central election commission) బదిలీ చేసింది. ప్రకాశం, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల ఎస్పీలను వెంటనే బదిలీ చేయాలని రాష్ట ఎన్నికల సంఘం సీఈవో ఎంకే మీనాను ఆదేశించింది
Andhra Pradesh Elections 2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసే 114 మంది అభ్యర్థులు వీరే, శింగనమల నుంచి మాజీ మంత్రి శైలజానాథ్‌ పోటీ
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో సాధారణ ఎన్నికల్లో పోటీ చేసే ఐదుగురు లోక్‌సభ, 114 మంది ఎ‍మ్మెల్యే అభ్యర్థుల జాబితాను ఏఐసీసీ మంగళవారం(ఏప్రిల్‌ 2) విడుదల చేసింది.అసెంబ్లీ టికెట్లు పొందినవారిలో పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలున్నారు.
Pension Distribution in Andhra Pradesh: పెన్సన్ ఇంటికి రాదేమోననే భయంతో ఇద్దరు గుండెపోటుతో మృతి, పెన్సన్ల పంపిణీపై మార్గదర్శకాలు సిద్ధం చేసిన ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyఏపీలో ఇప్పుడు పెన్సన్ చుట్టూ రాజకీయం తిరుగుతోంది. పెన్షన్ పంపిణీ నుంచి వాలంటీర్లను తప్పించాలంటూ ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో ఏపీలో పెన్షన్ పంపిణీ ఆలస్యం అవుతోందని ప్రభుత్వం తెలిపింది. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు పేర్కొంది.
Andhra Pradesh Elections 2024: ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల, 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన, కడప నుంచి ఎంపీగా బరిలో వైఎస్ షర్మిల
Hazarath Reddyలోక్ సభ, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న ఏపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయింది. అభ్యర్థుల జాబితాను ఏఐసీసీ విడుదల చేసింది. 114 అసెంబ్లీ, 5 లోక్ సభ అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించారు. కడప లోక్ సభ స్థానం నుంచి షర్మిల పోటీ చేస్తున్నారు. కాకినాడ నుంచి పల్లంరాజు, రాజమండ్రి నుంచి గిడుగు రుద్దరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం, కర్నూల్ నుంచి రామ్ పుల్లయ్య యాదవ్ పోటీ చేయనున్నారు.
AP School Summer Holidays: ఏపీలో ఏప్రిల్ 24 నుంచి జూన్ 13 వరకు స్కూళ్లకు వేసవి సెలవులు, మొత్తం 50 రోజుల పాటు విద్యార్థులకు హాలిడేస్
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలకు వేసవి సెలవులపై అధికారిక ప్రకటన వెలువడింది. ఈ నెల 24 నుండి ఏపీలో స్కూళ్లకు సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. జూన్ 11 వరకు వేసవి సెలవులుగా ప్రకటించిన విద్యా శాఖ.. వచ్చే అకడమిక్‌ ఇయర్‌ కోసం జూన్ 12న తిరిగి స్కూల్స్‌ తెరుచుకుంటాయని స్కూళ్ల విభాగం కార్యదర్శి సురేష్‌కుమార్‌ పేరిట విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
Visakhapatnam Shocker: విశాఖలో దారుణం.. లైంగిక వేధింపులతో చైతన్య ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య
Rudraవిశాఖపట్నం నగర శివారు కొమ్మాది వద్దగల చైతన్య ఇంజనీరింగ్‌ అండ్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో దారుణం జరిగింది. కళాశాలలో ఫస్ట్ ఇయర్ డిప్లొమా చదువుతున్న విద్యార్థిని గురువారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడింది.
Andhra Pradesh Shocker: పల్నాడులో దారుణం, సలసల కాగే నీటిని భర్త పురుషాంగంపై పోసిన భార్య, లబోదిబోమంటూ ఆస్పత్రికి పరిగెత్తిన బాధితుడు
Hazarath Reddyపల్నాడు జిల్లా వినుకొండ పట్టణం హనుమాన్ నగర్‌లో నివాసముంటున్న భార్యాభర్తలు నాయిని ప్రభుదాసు, అనూషా మధ్య కొంతకాలంగా గొడవలు జరిగాయి.. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున నిద్రిస్తున్న తన భర్త మర్మాంగంపై సల సల మసిలే నీటిని పోసి భార్య హత్యాయత్నం చేసింది.
Andhra Pradesh Elections 2024: మచిలీపట్నంలో వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు, ప్రజలకు సేవ చేస్తుంటే తమపై రాజకీయ పార్టీలు నిందలు వేస్తున్నారని ఆవేదన
Hazarath Reddyమచిలీపట్నంలో వాలంటీర్ల (Volunteers) మూకుమ్మడి రాజీనామాలు చేశారు.రాజీనామా చేసేందుకు వచ్చిన వాలంటీర్లతో మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నిండిపోయింది. వాలంటీర్లు తమ రాజీనామా పత్రాలను మున్సిపల్ కమిషనర్‌కి అందజేశారు
USB Charger Scam: పబ్లిక్‌ ప్లేస్ లలో ఉండే యూఎస్బీ చార్జింగ్‌ పోర్టళ్ల పట్ల జాగ్రత్త.. పోర్టళ్ల ద్వారా దుండగులు ఫోన్‌ లలోని సమాచారాన్ని చోరీ చేసే ప్రమాదం.. ప్రజలకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక
Rudraదేశ ప్రజలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. హోటళ్లు, బస్టాండ్లు, కేఫ్‌ లు, ఎయిర్‌పోర్టులు తదితర ప్రదేశాల్లో ఉండే పబ్లిక్‌ చార్జింగ్‌ పోర్టళ్ల స్మార్ట్‌ ఫోన్‌ లకు చార్జింగ్‌ పెట్టే సమయంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నది.
Pawan Kalyan Campaign: ప‌వ‌న్ క‌ల్యాణ్ వారాహి యాత్ర‌కు పోలీసుల బ్రేక్, ఎన్నిక‌ల సంఘం ద‌గ్గర అనుమ‌తి లేదంటూ నిలిపివేత‌
VNSఎన్నికల వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) పిఠాపురం వెళ్లారు. అక్కడి నుంచి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. అయితే, వారాహిపై (Vaarahi) ప్రచారానికి అనుమతులు లేవని పోలీసులు చెప్పారు. వారాహి వాహనం ఏపీ వ్యాప్తంగా తిరగడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ (EC) దగ్గర అనుమతులు తీసుకోవాలని అన్నారు.
EC on Volunteers: ఏపీలో వ‌లంటీర్లపై కేంద్ర ఎన్నిక‌ల సంఘం కీల‌క నిర్ణ‌యం, పెన్ష‌న్ల పంపిణీకి దూరంగా ఉండాల‌ని ఈసీ కీల‌క ఆదేశాలు
VNSసంక్షేమ పథకాల డబ్బును వాలంటీర్లతో పంపిణీ చేయించవద్దని ఆదేశించింది. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పెన్షన్ల పంపిణీలోనూ వాలంటీర్లను దూరంగా ఉంచాలని చెప్పింది.
AP CM YS Jagan Bus Yatra: విజయవంతంగా నాలుగో రోజు 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర ...సీఎం జగన్ తో ముఖాముఖి కార్య‌క్ర‌మంలో పాల్గొన్న తుగ్గులి, రాతన గ్రామ ప్రజలు
sajayaముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహన్ రెడ్డి చేపట్టిన 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర కర్నూలు జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. నాలుగో రోజు యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా తుగ్గులి, రాతన గ్రామ ప్రజలతో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ ముచ్చటించారు.
Election Commission Exit Polls: ఏప్రిల్ 19 ఉదయం 7 నుంచి జూన్ 1న సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌‌ బ్యాన్.. కీలక నోటిఫికేషన్ జారీ చేసిన ఎన్నికల సంఘం
Rudraకేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక ప్రకటన విడుదల చేసింది. లోక్‌ సభ ఎన్నికలు2024లో ప్రారంభ దశ ఏప్రిల్ 19 ఉదయం 7 గంటల నుంచి ఏడవ దశ పోలింగ్ జరగాల్సిన జూన్ 1న సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడానికి వీల్లేదని సూచించింది.
Rajya Sabha Seat For Hafiz Khan: క‌ర్నూల్ ఎమ్మెల్యేకు వైయ‌స్ జ‌గ‌న్ బంప‌ర్ ఆఫ‌ర్! రెండు సంవ‌త్స‌రాల ముందే రాజ్య‌స‌భ అభ్య‌ర్ధిగా ప్ర‌క‌టన‌
VNSవైసీపీ అధినేత జగన్‌ (YS Jagan) ప్రసంగించారు. కర్నూలు నుంచి హఫీజ్‌ ఖాన్‌కు వైసీపీ నుంచి టికెట్‌ ఇవ్వలేకపోయామని తెలిపారు. కానీ ఇదే హఫీజ్‌ను రెండేండ్ల తర్వాత వచ్చే రాజ్యసభకు పంపిస్తానని హామీ ఇచ్చారు.
Hero Nikhil Joined TDP: టీడీపీలో చేరిన టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నారా లోకేశ్
Hazarath Reddyటాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. నిఖిల్ కు పసుపు కండువా కప్పిన నారా లోకేశ్ పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. టాలీవుడ్ లో మాంచి సక్సెస్ రేట్ ఉన్న యువ హీరోల్లో నిఖిల్ ఒకరు.