ఆంధ్ర ప్రదేశ్

Adudam Andhra Closing Ceremony: మట్టిలోని మాణిక్యాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ఆడుదాం ఆంధ్రా లక్ష్యం, ముగింపు వేడుకల్లో ప్రసంగించిన సీఎం జగన్

Hazarath Reddy

విశాఖలో జరిగిన ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు కార్యక్రమం‍లో (Adudam Andhra Closing Ceremony) సీఎం జగన్‌ పాల్గొని ప్రసంగించారు.ఆరోగ్యం పట్ల, వ్యాయామానికి ఉన్న అవసరం పట్ల ప్రజలకు అవగాహన పెరగటం చాలా అవసరమన్నది ఆడుదాం ఆంధ్రా పోటీల మొదటి ఉద్దేశమని సీఎం వైస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM Jagan Mohan Reddy) స్పష్టం చేశారు.

Roja Playing Kabaddi Video: వీడియో ఇదిగో, ట్వంటీ ట్వంటీ ఫోర్ జగనన్న వన్స్ మోర్ అంటూ కూతపెట్టి కబడ్డీ ఆడిన రోజా

Hazarath Reddy

ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా ఆడుదాం ఆంధ్రా కబడ్డీ పోటీల సందర్భంగా మరోసారి జగన్ పై అభిమానాన్ని చాటుకున్నారు. కబడ్డీ బరిలో దిగిన మంత్రి రోజా... "కబడ్డీ, కబడ్డీ" అని కూత పెట్టేందుకు బదులుగా "ట్వంటీ ట్వంటీ ఫోర్ (2024)... జగనన్న వన్స్ మోర్" అంటూ కూత పెట్టారు.

YV Subba Reddy on Capital: విశాఖ రాజధాని అయ్యేవరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి, సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ అగ్రనేత వైవీ సుబ్బారెడ్డి

Hazarath Reddy

రాష్ట్ర రాజధాని మీద వైసీపీ అగ్రనేత వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు హైదరాబాద్ ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు. ఇప్పుడా గడువు కూడా పూర్తి కావొస్తోంది. రాష్ట్రానికి మేలు జరగాలంటే హైదరాబాద్ నగరం మరి కొంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉండాలనేది తమ ఆలోచన అని పేర్కొన్నారు.

Visakhapatnam: మృతదేహంతో గంగవరం పోర్టు వద్ద గ్రామస్తులు నిరసన, మృతుని కుటుంబానికి యాజమాన్యం ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్

Hazarath Reddy

కడుపునొప్పితో మృతి చెందినట్లు ఆరోపిస్తూ ఓ కార్మికుని గ్రామస్తులు, బంధువులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతుడి మృతదేహంతో గంగవరం పోర్టు గేటు ఎదుట ఆందోళనకు దిగారు. మృతుడు అప్పారావుగా గుర్తించారు. ఓరియన్‌ ఓర్‌, బొగ్గు రేవు కాలుష్యంతో గంగవరం గ్రామం రోజురోజుకూ కలుషితమవుతోందని, దీంతో గ్రామస్తులు అనారోగ్యం పాలవుతున్నారని మృతుని బంధువులు ఆరోపించారు.

Advertisement

Andhra Pradesh DSC 2024: నేటి నుంచి డీఎస్సీ దరఖాస్తులు స్వీకరణ, ఈ నెల 22 వరకు గడువు, పూర్తి వివరాలు ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం..నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరణ ప్రారంభించింది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 12 నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

Marriage Season: నేటి నుంచి మాఘమాసం ప్రారంభం.. ఇక తెలుగు రాష్ట్రాల్లో పెండ్లి బాజాలే

Rudra

నేటి నుంచి మాఘమాసం ప్రారంభం కానుండటంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి నెలకొంది. పట్నం, పల్లె అని తేడాలేకుండా అంతటా సన్నాయి మేళాలు మోగనున్నాయి.

Road Accident in Nellore: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. అర్ధరాత్రి లారీ, బస్సును ఢీకొట్టిన మరో లారీ.. ఏడుగురి దుర్మరణం.. మరో 15మందికి తీవ్ర గాయాలు..

Rudra

నెల్లూరు జిల్లాలో గత అర్ధరాత్రి దాటాక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.కావలి ముసునూరు టోల్‌ ప్లాజా వద్ద తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఆగి వున్న లారీని వెనక నుంచి మరో లారీ బలంగా ఢీకొట్టింది.

Amaravati Inner Ring Road Case: అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో ప్రధాన ముద్దాయిలుగా చంద్రబాబు, నారాయణ, ఛార్జ్ షీట్ దాఖలు చేసి ఏపీ సీఐడీ

Hazarath Reddy

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌, మాస్టర్‌ ప్లాన్‌ అలైన్‌మెంట్‌కు సంబంధించిన కేసులో మాజీ ముఖ్యమంత్రి ఎన్‌. చంద్రబాబు నాయుడు తదితరులపై ఆంధ్రప్రదేశ్‌ క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ (AP CID) ఫిబ్రవరి 8న ట్రయల్‌ కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేసింది.

Advertisement

CM Jagan Meets PM Modi: ప్రత్యేక హోదాతో సహా ఇతర హామీలు అమలు చేయండి, ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం జగన్ చర్చించిన అంశాలు ఇవే, ముగిసిన ఏపీ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన

Hazarath Reddy

సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం జగన్‌ సమావేశం అయ్యారు. పార్లమెంటులోని ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం భేటీ (CM Jagan Meets PM Modi) అయ్యారు.

CM Jagan Meets PM Modi: ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్ భేటీ, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిల పై గంటకు పైగా చర్చలు

Hazarath Reddy

ఢిల్లీ పర్యటలో ఉన్న సీఎం జగన్ ప్రధాని మోదీతో భేటీ ముగిసింది. ప్రధాని నరేంద్ర మోదీతో గంటకు పైగా సీఎం వైఎస్ జగన్‌ సమావేశం కొనసాగింది. పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో సమావేశం అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు పెండింగ్ బకాయిలపై చర్చలు జరిపారు

CM Jagan Meets PM Modi: ప్రధాని మోదీతో గంటకు పైగా భేటీ అయిన సీఎం జగన్‌, ఏపీకి రావాల్సిన నిధులు, అభివృద్ధిపై చర్చ, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఢిల్లీ పర్యటలో ఉన్న సీఎం జగన్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీతో గంటకు పైగా సీఎం వైఎస్ జగన్‌ సమావేశం కొనసాగింది. పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో సమావేశం అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు పెండింగ్ బకాయిలపై చర్చలు జరిపారు.

CM Jagan- Narendra Modi: ఈ ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీతో భేటీ కానున్న సీఎం జగన్.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు అభివృద్ధి అంశాలపై చర్చించనున్న సీఎం

Rudra

ప్రధాని మోదీతో (PM Modi) ఏపీ ముఖ్యమంత్రి జగన్ (AP CM Jagan) కాసేపట్లో భేటీ కానున్నారు. ఈ ఉదయం 11 గంటలకు మోదీతో జగన్ సమావేశమవుతారు.

Advertisement

Nagoba Jatara Begins from Today: మేడారం తర్వాత అతిపెద్ద గిరిజన ఉత్సవం.. నేటి నుంచే నాగోబా జాతర.. తరలి రానున్న మెస్రం వంశీయులు

Rudra

ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన ఉత్సవాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన నాగోబా జాతర శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌ లో మూడు రోజులపాటు జరగనున్న ఈ జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

Hyderabad Book Fair: నేటి నుంచి హైదరాబాద్‌ లో 36వ జాతీయ పుస్తక ప్రదర్శన.. ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు.. ఈ నెల 19 వరకూ జరగనున్న బుక్‌ ఫెయిర్

Rudra

పుస్తక ప్రియులకు గుడ్ న్యూస్. మీరందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శుభ తరుణం రానే వచ్చింది. హైదరాబాద్‌ లోని తెలంగాణ కళాభారతిలో (ఎన్టీఆర్ స్టేడియం) నేటి నుంచి ఈ నెల 19 వరకూ.. 36వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన జరగనుంది.

Andhra Pradesh Elections 2024: ఆసక్తికరంగా మారిన కందుకూరు రాజకీయాలు, వైసీపీలో చేరిన డాక్టర్ వంకి పెంచలయ్య, ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి దారెటు..

Hazarath Reddy

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో కందుకూరుకు చెందిన డా.వి.పెంచలయ్య (Doctr Penchalaiah) బుధవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో డా.పెంచలయ్యకు సీఎం జగన్ స్వయంగా పార్టీ కండువా కప్పి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు.

Rooster Knife Attack Case: కోడి కత్తి కేసులో నిందితుడికి షరతులతో కూడిన బెయిల్, ప్రతి ఆదివారం ముమ్మిడివరం పీఎస్‌లో హాజరుకావాలని హైకోర్టు ఆదేశాలు

Hazarath Reddy

కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాస్‌కు 5 ఏళ్ల తరువాత బెయిల్‌ లభించింది. నిందితడుకి ఏపీ హైకోర్టు (AP Highcourt) షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. రూ.25వేల పూచీకత్తుతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని.. ప్రతి ఆదివారం ముమ్మిడివరం పీఎస్‌లో హాజరుకావాలని ధర్మాసనం స్పష్టం చేసింది

Advertisement

CM Jagan To Visit Delhi: రేపు ప్రధాని మోదీతో భేటీ కానున్న సీఎం జగన్, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించే అవకాశం, నేడు ఢిల్లీకి ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి న్యూఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ రాత్రి జన్‌పథ్ నివాసంలో ముఖ్యమంత్రి జగన్ బస చేస్తారు. అపాయింట్‌మెంట్‌ షెడ్యూల్‌ ప్రకారం రేపు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశం కానున్నారు

Andhra Pradesh: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన జగన్ సర్కారు, వైవీ సుబ్బారెడ్డి, గొల్లా బాబురావు, మేడా రఘునాథ రెడ్డి పేర్లు ఖరారు చేసిన వైసీపీ అధిష్ఠానం

Hazarath Reddy

రాజ్యసభ బరిలో నిలిచే ముగ్గురు అభ్యర్థుల పేర్లను వైఎస్సార్‌సీపీ తాజాగా ప్రకటించింది. రాజ్యసభ బరిలో వైవీ సుబ్బారెడ్డి, గొల్లా బాబురావు, మేడా రఘునాథ రెడ్డి పేర్లను ఖరారు చేశారు.వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథ రెడ్డి ఎన్నికల్లో పోటీలో ఉండనున్నారు.

Janasena Glass Symbol Row: హైకోర్టుకు చేరిన జనసేన గాజు గ్లాసు గుర్తు పంచాయితీ, ఆ గుర్తు కోసం ముందుగా నేను దరఖాస్తు చేసుకున్నానని పిటిషన్ దాఖలు చేసిన శ్రీనివాస్

Hazarath Reddy

జనసేకు గాజు గ్లాసును కేటాయించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. తమ పార్టీ దరఖాస్తును పట్టించుకోకుండా ఎన్నికల కమిషన్‌(ఈసీ) గాజు గ్లాసు గుర్తును జనసేనకు కేటాయించిందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ (సెక్యూలర్‌) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాజమహేంద్రవరానికి చెందిన ఎం శ్రీనివాస్‌ బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Krishna Devarayalu Lavu Meet CBN: టీడీపీలో చేరేందుకు సిద్ధమయిన వైసీపీ ఎంపీ, చంద్రబాబుతో నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు భేటీ, పల్నాడులో వెలిసిన ఫ్లెక్సీలు

VNS

పొత్తుల అంశంపై చర్చించేందుకు ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబుతో లావు శ్రీకృష్ణదేవరాయలు సమావేశం అయ్యారు. గంటన్నరపాటు ఈ సమావేశం సాగింది. అనంతరం మీడియాతో మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు లావు శ్రీకృష్ణదేవరాయలు. మరోవైపు పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఫ్లెక్సీలు వెలిశాయి

Advertisement
Advertisement