ఆంధ్ర ప్రదేశ్
Andhra Pradesh Public Holidays 2024: వచ్చే ఏడాదికి సెలవులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, మొత్తం 27 సాధారణ సెలవులతో పాటు 25 ఐచ్చిక సెలవులు
Hazarath Reddy2024లో వచ్చే సెలవులకు (2024 Holidays) సంబంధించిన ప్రకటనను ఏపీ సర్కార్ (AP Government) విడుదల చేసింది. 2024 క్యాలెండర్ ఇయర్‌కు సాధారణ సెలవులను నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి
YSR Aarogyasri: ఆరోగ్యశ్రీపై సీఎం జగన్ సంచలన నిర్ణయం, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్స, ఈ నెల 18 నుంచి ప్రారంభం
Hazarath Reddyవైఎస్సార్ ఆరోగ్యశ్రీపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్ బుధవారం సమీక్ష నిర్వహించారు. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద రూ. 25 లక్షల వరకూ ఉచిత చికిత్స అందించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 18న సీఎం ప్రారంభించనున్నారు.
Komatireddy on AP Special Status: వీడియో ఇదిగో, ఆంధ్రప్రదేశ్‌‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyతెలంగాణ రోడ్డు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మంత్రి కోమటిరెడ్డిని ప్రత్యేక హోదా పోరాట సమితి ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలో మీడియాలో మాట్లాడుతూ.. ఏపీ ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశంపై అమలు కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని అన్నారు.
AP Fibernet case: ఏపీ ఫైబర్ నెట్ కేసు విచారణ జనవరి 17కు వాయిదా, కేసుపై ఎవరూ అప్పటివరకు మాట్లాడకూడదని ఇరుపక్షాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Hazarath Reddyఏపీ ఫైబర్ నెట్ కేసు విచారణను సుప్రీంకోర్టు (Supreme Court) జనవరి 17కు వాయిదా వేసింది. ఫైబర్‌నెట్ కేసులో (Fiber Net Case) ముందస్తు బెయిల్ కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.
Weather Forecast in Andhra Pradesh: బంగాళాఖాతంలో మరో తుఫాను వార్తలన్నీ అబద్దం, ఇప్పట్లో ఎటువంటి సైక్లోన్ హెచ్చరికలు లేవని వాతావరణ శాఖ క్లారిటీ
Hazarath Reddyబంగాళాఖాతంలో మళ్ళీ ఇంకో తుపాన్ రానుందని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. తుపాను గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా వట్టిదేనని, ఆ వార్తల్లో నిజంలేదని చెప్పారు.
APSRTC: ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కారు, ప్రతి నెలా జీతాలతో పాటు అలవెన్సులు కలిపి చెల్లించాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు
Hazarath Reddyఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. ఉద్యోగులకు ప్రతి నెలా జీతాలతోపాటు అలవెన్సులు కూడా కలిపి చెల్లించాలని నిర్ణయించింది. ఈమేరకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. ‘పే ఇన్‌ టు’లో డ్యూటీ బేస్డ్‌ అలవెన్సులను జీతాలతో పాటు కలిపి చెల్లించనుంది.
Biryani at Rs. 2: హైదరాబాద్ బిర్యానీ ప్రియులకు శుభవార్త.. రూ.2కే పసందైన బిర్యానీ.. నాన్‌ వెజ్‌ లేదా వెజిటబుల్‌ బిర్యానీ ఏది తీసుకున్నా అంతే ధర.. అయితే, ఒకేఒక నిబంధన.. అది కూడా చాలా చిన్నది. ఏంటంటే??
Rudraహైదరాబాద్ అంటేనే బిర్యానీ సువాసనలు. మరి అలాంటి బిర్యానీ ప్రియులకు ఓ శుభవార్త. పసందైన బిర్యానీ కేవలం రూ.2కే ఆస్వాదించొచ్చు.
Ganji Chiranjeevi: గంజి చిరంజీవిని మంగళగిరి ఇంఛార్జ్‌గా ప్రకటించిన వైసీపీ అధిష్ఠానం, ఆర్కే రాజీనామా తర్వాత ఒక్కసారిగా మారిన రాజకీయాలు
Hazarath Reddyమంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రాజీనామా నేపథ్యంలో గంజి చిరంజీవిని మంగళగిరి ఇంఛార్జ్‌గా వైసీపీ అధిష్ఠానం ప్రకటించింది. ప్రస్తుతం ఆప్కో ఛైర్మన్, వైసీపీ చేనేత విభాగం అధ్యక్షుడిగా గంజి చిరంజీవి ఉన్నారు. నిన్న మంగళగిరిలో తన సొంత కార్యాలయాన్ని ప్రారంభించిన గంజి చిరంజీవి. ఈ నేపథ్యంలోని అసంతృప్తిని గురైన ప్రస్తుత ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం.
Nara Devansh in Yuvagalam Padayatra: వీడియో ఇదిగో, తండ్రితో కలిసి పాదయాత్రలో నడిచిన నారా దేవాన్ష్, ఈ నెల 18న ముగియనున్న నారా లోకేష్‌ పాదయాత్ర
Hazarath Reddyనారా లోకేశ్ యువగళం పాదయాత్రలో తనయుడు నారా దేవాన్ష్ పాల్గొన్నారు. నాన్నతో కలిసి కాలు కదిపారు. తనయుడి చేయి పట్టుకొని లోకేశ్ కాసేపు పరుగు తీశారు. దేవాన్ష్ తండ్రితో కలిసి పరుగు పెట్టడం అక్కడున్న వారికి ముచ్చటగొలిపింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ పాదయాత్రలో నారా బ్రాహ్మిణి కూడా పాల్గొన్నారు.
Chandrababu Visits KCR in Hospital: వీడియో ఇదిగో, కేసీఆర్‌ను పరామర్శించిన చంద్రబాబు, త్వరలోనే కేసీఆర్‌ మామూలుగా నడుస్తారని ఆకాంక్షించిన మాజీ సీఎం
Hazarath Reddyతెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, BRS అధినేత కేసీఆర్‌ (KCR) వీలైనంత త్వరగా కోలుకొని ప్రజా సేవకు రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఆకాంక్షించారు. సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను చంద్రబాబు పరామర్శించారు.
YSR Law Nestham: రెండోవి­డత వైఎస్సార్‌ లా నేస్తం నిధులు విడుదల చేసిన ఏపీ సీఎం జగన్, 2,807 యువ లాయర్ల అకౌంట్లలో రూ.7,98,95,000 జమ
Hazarath Reddyరాష్ట్రవ్యాప్తంగా 2,807 మంది అర్హులైన జూనియర్‌ న్యాయవాదులకు నెలకు రూ.5,000 స్టైఫండ్‌ చొప్పున ఈ ఏడాది జూలై నుంచి డిసెంబర్‌ వరకు ఆరునెలలకు ఒక్కొ­క్కరికి రూ.30 వేల వంతున మొత్తం రూ.7,98,95,000ను వారి ఖాతాల్లో జమచేశారు.
Alla Ramakrishna Reddy Resigns: మంగళగిరిలో వైసీపీకి బిగ్ షాక్, ఎమ్మెల్యే పదవికి, పార్టీకి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా, వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్టు వెల్లడి
Hazarath Reddyఏపీ రాజకీయాల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తన పదవికి రాజనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్లో ఆయన తన రాజీనామాను సమర్పించారు. శాసనసభ కార్యదర్శికి ఆయన తన రాజీనామా లేఖను స్వయంగా అందజేశారు
Andhra Pradesh: వీడియో ఇదిగో, సూర్యలంక బీచ్‌లో అలలకు కొట్టుకుపోతున్న ఇద్దరు యువకులను రక్షించిన పోలీసులు, అభినందనలు తెలిపిన డీజీపీ
Hazarath Reddyసూర్యలంక బీచ్‌కి వచ్చి అలల తాకిడికి సముద్రంలో ఇద్దరు యువకులు కొట్టుకుపోయారు. మునిగిపోతున్న ఇద్దరు యువకులను చూసిన తీరం వెంబడి గస్తీ పోలీసులు వెంటనే సముద్రంలోకి వెళ్లి వారి ప్రాణాలను కాపాడి ఒడ్డుకు చేర్చారు.యువకులను తెనాలి టౌన్‌కి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
Skill Development Case: స్కిల్ డెవలప్ మెంట్ కేసు, చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌‌పై విచారణ జనవరి 19కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
Hazarath Reddyస్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో ఏపీ సీఐడీ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఇవాళ జస్టిస్‌ బేలా ఎం త్రివేది, జస్టిస్‌ సతీష్‌ చంద్రశర్మల ధర్మాసనం పిటిషన్‌పై మరోసారి విచారణ చేపట్టింది
APPSC Group 1 Notification 2023: నిరుద్యోగులకు మరో తీపి కబురు, గ్రూప్ -1 నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఎపీపీఎస్సీ, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyనిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరో తీపికబురు చెప్పింది. గ్రూప్ -1 నోటిఫికేషన్‌ను ఎపీపీఎస్సీ విడుదల చేసింది. 81 పోస్టులతో గ్రూప్ -1 నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 17న ప్రిలిమనరీ పరీక్ష జరగనుంది. జనవరి 1 నుంచి జనవరి 21 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. డిప్యూటీ కలెక్టర్ 9, డిఎస్పీలు 26 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది.
CM Visits Flood Affected Areas: ఏ ఒక్కరికీ నష్టం జరగనివ్వం, ప్రతి ఇంటికి రూ. 2,500, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ పర్యటన
Hazarath Reddyముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేడు మిఛాంగ్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. తొలుత తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డి పాలెం వెళ్లనున్న సీఎం జగన్‌. అక్కడ స్వర్ణముఖి నది కట్ట తెగి నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించారు. గ్రామస్తులు, తుపాను బాధితులతో సీఎం జగన్‌ మాట్లాడారు.
CM Revanth Reddy Responds CM Jagan Tweet: ఏపీ సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అభివృద్ధిలో పరస్పర సహకారాన్ని ఆకాంక్షిస్తున్నామంటూ ట్వీట్ కు రిప్లై
Hazarath Reddyతెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం రేవంత్‌కు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కూడా సీఎం రేవంత్‌కు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించారు.
Pawan Kalyan Speech in Visakha: 2024లో సీఎం ఎవరనే దానిపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు, చంద్రబాబుతో కలిసి త్వరలో డిసైడ్ చేస్తామని విశాఖ జనసేన బహిరంగ సభలో వెల్లడి
Hazarath Reddyజీవితంలో ఎన్నో అపజయాలు ఎదుర్కొన్నా.. ఏం జరిగినా జనసేనను మరో పార్టీలో విలీనం చేయనని ఆపార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ (Pawan kalyan in VisakhaPatnam Meeting) స్పష్టం చేశారు. విశాఖలోని ఎస్‌.రాజా గ్రౌండ్‌లో నిర్వహించిన జనసేన బహిరంగ సభలో (Janasena Meeting in Visakha) పవన్ మాట్లాడారు.
APPSC Group-2 Notification Out: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 897 పోస్టులతో ఏపీపీఎస్సీ గ్రూప్ -2 నోటిఫికేషన్‌ విడుదల, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు జగన్ సర్కారు శుభవార్తను చెప్పింది. గ్రూప్ -2 నోటిఫికేషన్‌ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. 897 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. ఎగ్జిక్యూటివ్ పోస్టులు-331, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు- 566. ఫిబ్రవరి 25 ప్రిలిమనరీ పరీక్ష జరగనుంది.
NTR Statue Vandalised: బర్తిపూడిలో ఎన్టీఆర్ విగ్రహం కూల్చివేసిన దుండగులు, బాధ్యులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ డిమాండ్‌
Hazarath Reddyబాపట్ల జిల్లా లోని బర్తిపూడిలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. అర్ధరాత్రి వేళ విగ్రహం తల పగులగొట్టి పరారయ్యారు. దీనిపై స్థానిక టిడిపి నేత‌లు పోలీసుల‌కు ఫిర్యాదు చశారు..కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.. కాగా ఈ ఘటనను తెలుగుదేశం అధినేత చంద్రబాబు , పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఖండించారు.