ఆంధ్ర ప్రదేశ్

Onion Price: టమాటా తర్వాత ఇక ఉల్లివంతు.. వచ్చే నెలలో రూ. 70కి చేరుకోనున్న ధర.. ‘క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్’ నివేదిక.. సరఫరా-డిమాండ్ మధ్య తేడానే కారణం

Rudra

పెరిగిన టమాటా, ఇతర కూరగాయల ధరలతో భయపడుతున్న సామాన్యులకు మరో షాక్ తగిలేలా ఉంది. ఈ నెలాఖరుకు ఉల్లి ధర కిలో రూ. 60-70కి చేరుకునే అవకాశం ఉందని ‘క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్’ పేర్కొంది.

Ruckus in Chandrababu Punganur Tour: పథకం ప్రకారమే పోలీసులపై దాడి, పుంగనూరు ఉద్రికత్తలపై స్పందించిన చిత్తూరు ఎస్పీ రిషాంత్‌ రెడ్డి

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబు పుంగనూరు టూర్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీటీడీ, వైసీపీ శ్రేణులు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.ఈ ఘటనపై చిత్తూరు ఎస్పీ రిషాంత్‌ రెడ్డి స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. పథకం ప్రకారమే పోలీసులపై దాడి చేశారు.

Chandrababu's Punganur Tour: రణరంగంగా మారిన చంద్రబాబు పుంగనూరు పర్యటన, వైసీపీ టీడీపీ శ్రేణులు పరస్పరం రాళ్ల దాడి, మంత్రి పెద్దిరెడ్డికి చంద్రబాబు సవాల్

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబు పుంగనూరు టూర్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీటీడీ, వైసీపీ శ్రేణులు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనపై చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

APCOB Diamond Jubilee Celebrations: ఆప్కాబ్‌ వజ్రోత్సవ వేడుకల్లో సీఎం జగన్, ఆప్కాబ్‌తోనే రైతులకు బ్యాంకింగ్‌ వ్యవస్థ చేరువైందని తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడ నగరంలోని ‘ఏ’ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఆంధ్రప్రదేశ్‌ సహకార బ్యాంక్‌(ఆప్కాబ్‌) వజ్రోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. బ్యాంకు నూతన లోగో, పోస్టల్ స్టాంపును సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘‘ఆప్కాబ్‌ నిలబడిన పరిస్థితి చూస్తే గర్వంగా ఉందన్నారు.

Advertisement

Yuva Galam Padayatra: పాదయాత్రలో కాలు జారి పడిపోయిన నారా లోకేష్, తృటిలో తప్పిన పెను ప్రమాదం, వీడియో ఇదిగో..

Hazarath Reddy

నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం పల్నాడు జిల్లాలో లోకేష్ పాదయాత్ర జరుగుతోంది. అయితే పాదయాత్రలో పొలం దగ్గర కిందకు దిగుతుండగా నారా లోకేష్ కాలు జారి పడిపోయారు. వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ అతన్ని గట్టిగా పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది.

MLA Topudurthi Prakash Reddy: చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే నేను గుండు కొట్టించుకుంటా, వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య సవాళ్లు మీద సవాళ్లు జరుగుతున్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే నేను గుండు కొట్టించుకుంటానని అన్నారు. వీడియో ఇదిగో..

MLA Kona Raghupathi's Birthday: వీడియో ఇదిగో, బాపట్లలో పట్టపగలే రికార్డింగ్ డ్యాన్సులు, ఎమ్మెల్యే కోన రఘుపతి జన్మదిన వేడుకల్లో యువతులతో డ్యాన్సులు

Hazarath Reddy

వైసీపీ (YSRCP) ఎమ్మెల్యే కోన రఘుపతి జన్మదిన వేడుకల పేరుతో బాపట్లలో ఆ పార్టీ నేతలు బరితెగించారు. నడిరోడ్డుపై వేదిక నిర్మించి రికార్డింగ్ డ్యాన్స్‌లు ఏర్పాటు చేశారు. యువతులతో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు డ్యాన్స్‌లు చేయించారు.

Visakha Constable Murder Case: కానిస్టేబుల్‌ భర్తకి మద్యం తాగించి ప్రియుడితో కలిసి చంపేసిన భార్య, విశాఖ హత్య కేసులు వీడిన మిస్టరీ

Hazarath Reddy

విశాఖలో సంచలనం సృష్టించిన వన్‌టౌన్‌ కానిస్టేబుల్‌ రమేష్‌ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కానిస్టేబుల్ రమేష్‌ను తన భార్య శివజ్యోతి హత్య చేయించినట్లు పోలీసులు తేల్చారు. ఈ మేరకు ఈ కేసుకు సంబంధించిన వివరాలను విశాఖ సీపీ త్రివిక్రమవర్మ మీడియాకు వెల్లడించారు.

Advertisement

Posani on Chandrababu: నేను కమ్మ కులంలో పుట్టినందుకు సిగ్గు పడుతున్నా, అదే కులంలో చంద్రబాబు పుట్టినందుకు సిగ్గుపడుతున్నా, పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

నేను కమ్మ కులంలో పుట్టినందుకు సిగ్గు పడుతున్నా.. అదే కులంలో చంద్రబాబు పుట్టినందుకు సిగ్గుపడుతున్నా అంటూ పోసాని కృష్ణ మురళి, AP FDC ఛైర్మన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి రైతులతో ముఖ్యమంత్రి జగన్ ను తిట్టిస్తున్నాడని విమర్శించారు.

Andhra Pradesh Shocker: భార్యా పిల్లలను చంపి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సూసైడ్, బెంగుళూరులో ఆంధ్రప్రదేశ్ టెకీ దారుణం

Hazarath Reddy

31 ఏళ్ల సాఫ్ట్‌వేర్ నిపుణుడు తన భార్య, ఇద్దరు కూతుళ్లను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో గురువారం వెలుగు చూసింది. మృతి చెందిన టెక్కీ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వీరార్జున విజయ్‌గా గుర్తించారు.

AP Shocker: ఒంటిమిట్ట రాములోరి గుడిలో యువకుడి దారుణం.. స్నానం చేస్తున్న మహిళా భక్తుల న్యూడ్ వీడియోల రికార్డింగ్.. బాత్రూం వెంటిలేటర్ నుంచి సెల్‌ ఫోన్‌ లో రికార్డింగ్.. కేకలు వేయడంతో పరార్

Rudra

ఏపీలో దారుణం జరిగింది. వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట ఆలయంలో ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. అక్కడి తాత్కాలిక బాత్రూంలలో స్నానం చేస్తున్న మహిళలను వెంటిలేటర్ నుంచి మొబైల్ ఫోన్లో చిత్రీకరించాడు.

HC Stay on Construction of House Amravati: ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ, అమరావతిలో ఆర్‌-5 జోన్‌ ఇళ్ల నిర్మాణంపై స్టే విధించిన హైకోర్టు

Hazarath Reddy

రాజధానిలో సామాన్యులకు ఇళ్లను నిర్మించాలనే జగన్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాజధాని అమరావతిలో ఆర్‌-5 జోన్‌ ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. ఇళ్ల నిర్మాణాలు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

Advertisement

Andhra Pradesh: ఏపీలో ఫేక్ సర్టిఫికెట్స్ తయారు చేసిన సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ అరెస్ట్

Hazarath Reddy

ప్రభుత్వ పథకాలను పొందడానికి ఫేక్ సర్టిఫికెట్స్ తయారు చేయడంతో ముగ్గురు సచివాలయ ఉద్యోగులు, ఓ వాలంటీరును పోలీసులు అరెస్టు చేశారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దిబ్బపాలెం సెజ్ కాలనీ సచివాలయంలో పనిచేస్తున్న డిజిటల్ సహాయకుడు సుధీర్ పెళ్లి కాకపోయినా డిజిటల్ కీ ఉపయోగించి ఫేక్ మ్యారేజ్ సర్టిఫికేట్ సృష్టించుకున్నాడు.

AP Elections Gazette: ఏపీలో ఎన్నికల కోలాహలం షురూ, రిటర్నింగ్ అధికారులను నియమిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్ విడుదల, 175 నియోజకవర్గాలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు వీళ్లే!

VNS

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు తొలి అంకం ప్రారంభం అయింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులను (RO's) నియమిస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్ మీనా గెజిట్ నోటిఫికేషన్‌ను బుధ‌వారం విడుదల చేశారు

Fire Accident in Chandrababu Road Show: చంద్రబాబు రోడ్ షోలో అగ్ని ప్రమాదం, బాబు ప్రసంగిస్తుండగా పక్కన బండికి ఒక్కసారిగా అంటుకున్న మంటలు

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) జమ్మలమడుగులో ప్రసంగిస్తుండగా.. సమీపంలో స్వల్ప అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జమ్మలమడుగు పట్టణంలో జరిగిన రోడ్‌షోలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగిస్తుండగా రోడ్డు పక్కన నిలిపి ఉంచిన టిఫిన్ బండి మంటల్లో చిక్కుకుంది.

Weather Forecast: ఈశాన్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా బలపడిన వాయుగుండం, ఏపీలో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ నుంచి వర్షాలు

Hazarath Reddy

ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం మంగళవారం మధ్యాహ్ననికి తీవ్ర వాయుగుండంగా బలపడింది. అనంతరం అది పశ్చిమ వాయవ్య దిశగా పయనించి సాయంత్రం 3.30–4.30 గంటల మధ్య బంగ్లాదేశ్‌లోని ఖేపుపరా వద్ద తీరాన్ని దాటింది.

Advertisement

Video: వీడియో ఇదిగో, విశాఖలో మద్యం మత్తులో మహిళా డాక్టర్ బీభత్సం, వీఐపీ రోడ్డులో తాగి డ్రైవ్ చేసి డివైడర్ పైనున్న చెట్టును ఢీకొట్టి నుజ్జయిన కారు

Hazarath Reddy

రామాపురం నుంచి సిరిపురం వైపు వెళ్తున్న కారు వీఐపీ రోడ్డులో ప్యారడైజ్ హోటల్ సమీపంలో అదుపుతప్పి పార్కింగ్ చేసి ఉన్న ఏడు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. సోమా పబ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

Ambati Rambabu on Pawan Kalyan: పవన్ కొత్త సినిమాల పేర్లు లిస్టు ఇదిగో, ఇంకా అనేక పేర్లు పరిశీలనలో ఉన్నాయని సెటైర్లు పేల్చిన మంత్రి అంబటి రాంబాబు

Hazarath Reddy

పవన్ కల్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం 'బ్రో'పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఘాటుగా స్పందించారు. ఈ సినిమాలో తనను అవమానించేలా శ్యాంబాబు క్యారెక్టర్ పెట్టారని ఆరోపించారు. పవన్ వ్యక్తిగత తీరుపై తాము కూడా ఓ సినిమా చేసే ఉద్దేశంతో కథను సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ సినిమాకు అనేక పేర్లు పరిశీలనలో ఉన్నాయన్నారు.

Jagan's Knife Attack Case: కోడికత్తి కేసు విశాఖ కోర్టుకు బదిలీ, కేసు విచారణను ఆగస్ట్ 8న నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిన విజయవాడ ఎన్ఐఏ కోర్టు

Hazarath Reddy

ఏపీ సీఎం వైఎస్ జగన్‌‌పై 2018లో జరిగిన కోడికత్తి కేసు విశాఖకు బదిలీ అయింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు విజయవాడ ఎన్ఐఏ కోర్టులో విచారణ సాగగా, ఇక ముందు విశాఖ ఎన్ఐఏ కోర్టులో జరుగుతుందని ఈరోజు కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా న్యాయమూర్తి తెలిపారు.

CM Jagan Visakha Tour: విశాఖలో ఒక ఆణిముత్యంగా నిలిచిపోయే ప్రాజెక్టు ఇనార్బిట్‌ మాల్‌, అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన సీఎం జగన్

Hazarath Reddy

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖ పర్యటనలో ఉన్న సంగతి విదితమే. కైలాసపురం వద్ద ఇనార్బిట్‌ మాల్‌కు ముఖ్యమంత్రి భూమి పూజ చేశారు. రూ. 600 కోట్లతో 15 ఎకరాల స్థలంలో ఈ మాల్‌ను నిర్మిస్తున్నారు. జీవీఎంసీ చేపట్టిన రూ. 136 కోట్ల అభివృద్ధి పనులకు నేడు సీఎం జగన్ భూమిపూజ చేశారు.

Advertisement
Advertisement