ఆంధ్ర ప్రదేశ్

AP Road Accident Video: సాగర్ కాల్వలో పడిన ఆర్టీసీ బస్సు వీడియో ఇదిగో, వివాహ రిసెప్షన్‌కు వెళ్తూ 7 మంది తిరిగిరాని లోకాలకు

Hazarath Reddy

ప్రకాశం జిల్లాలో మంగళవారం తెల్లవారు జామున దర్శి సమీపంలో పెళ్లి బస్సు సాగర్ కాల్వలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. 20 మందికిపైగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 40 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు.

Accident in Prakasam: ప్రకాశంలో ఘోర ప్రమాదం.. సాగర్ కాలువలోకి దూసుకుపోయిన పెళ్లి బస్సు.. ఏడుగురు మృతి.. 15 మందికి తీవ్ర గాయాలు.. అతివేగమే ప్రమాదానికి కారణమని వెల్లడి

Rudra

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అర్ధరాత్రి పెళ్లి వారితో వెళుతున్న ఓ బస్సు సాగర్ కాలువలోకి దూసుకుపోయింది. పొదిలి నుంచి కాకినాడకు వెళ్తుండగా దర్శికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు.

Video: షాకింగ్ వీడియో ఇదిగో, పాల వ్యాపారిని అతివేగంగా ఢీకొట్టిన కారు, దెబ్బకి ఎగిరిపడి మృతి చెందిన పాల వ్యాపారి

Hazarath Reddy

ఏలూరు - జోగన్నపాలెం అడ్డరోడ్డు దగ్గర పాల వ్యాపారిని అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో పాల వ్యాపారి అక్కడికక్కడే మృతి చెందాడు.కాగా మద్యం సేవించి డ్రైవర్ కారు నడిపినట్లు తెలుస్తోంది.

Perni Nani on Pawan Kalyan: సిగ్గుందా పవన్, చంద్రబాబు ఏది మాట్లాడమంటే అది మాట్లాడేస్తావా, జనసేనానిపై విరుచుకుపడిన పేర్ని నాని

Hazarath Reddy

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వాలంటీర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్‌ వెంటనే క్షమాపణలు చెప్పాలని వాలంటీర్లు డిమాండ్‌ చేస్తున్నారు. పవన్‌ వ్యాఖ్యలపై పేర్నినాని సీరియస్‌ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంపై పవన్‌ విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు

Advertisement

Pawan Kalyan vs Volunteers: పవన్‌ కల్యాణ్‌పై ఉరవకొండ పోలీస్ స్టేషన్‌లో వాలంటీర్ల ఫిర్యాదు, ఏపీలో దుమారం రేపుతున్న జనసేన అధినేత వివాదాస్పద వ్యాఖ్యలు

Hazarath Reddy

ఏపీలో వాలంటీర్‌ వ్యవస్థపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబీకింది. ఒంటరి మహిళలు, వితంతువుల వివరాలు సేకరించి సంఘ విద్రోహ శక్తులకు వాలంటీర్లు సమాచారం ఇస్తున్నారన్న పవన్ ఆరోపణలపై నిరసనలు వెల్లు వెల్లువెత్తుతున్నాయి

Dada Oxygen Park: మహారాష్ట్రలో సీఎం జగన్ మీద వెలువెత్తిన అభిమానం, లక్షా 11వేల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిన దాదాశ్రీ ఫౌండేషన్‌ వీఈటీ

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పేరిట దాదాశ్రీ ఫౌండేషన్‌ వీఈటీ తరపున మహారాష్ట్ర షోలాపూర్‌ జిల్లాలోని 11 తాలూకాలోని అన్ని గ్రామాల్లో, పాఠశాలల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (దాదాశ్రీ) ఆక్సిజన్ పార్క్ ప్రచారం ద్వారా మొక్కలు నాటుతున్నారు

Volunteers Protest: ఆ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాల్సిందే,  దిష్టిబొమ్మ దహనం చేసిన వాలంటీర్లు

Hazarath Reddy

పవన్‌ కల్యాణ్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఏపీ వాలంటీర్ల భగ్గుమంటున్నారు. పవన్‌ కల్యాణ్‌ వివాదాస్పద వ్యాఖ్యలపై వాలంటీర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒంటరి మహిళలు, వితంతువుల వివరాలు సేకరించి సంఘ విద్రోహ శక్తులకు వాలంటీర్లు సమాచారం ఇస్తున్నారన్న పవన్ ఆరోపణలపై నిరసనలు వెల్లు వెల్లువెత్తుతున్నాయి.

Pawan Kalyan Comments Row: వాలంటీర్లపై పవన్‌ విషం, సీరియస్ అయిన ఏపీ మహిళా కమిషన్‌, సమన్లు జారీ

Hazarath Reddy

ఏపీ వాలంటీర్ల పట్ల పవన్‌ కల్యాణ్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్‌ సీరియస్‌ అయ్యింది. ఈ మేరకు పవన్‌కు కమిషన్‌ సమన్లు జారీ చేయనుంది. మహిళలను ఉద్ధేశించి చేసిన పవన్‌ వ్యాఖ్యలపై భారీగా ఫిర్యాదులు వస్తున్నాయని మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు

Advertisement

CM Jagan in Kadapa: కడపలో రూ.871.77 కోట్లతో అభివృద్ధి ప‌నులకు శంకుస్థాపనలు చేసిన సీఎం జగన్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

కడప నగరంలో రూ.871.77 కోట్లతో అభివృద్ధి ప‌నులకు శంకుస్థాపనలు చేసిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌. అందులో భాగంగా రూ.1.37 కోట్లతో పూర్తయిన రాజీవ్‌ పార్కు, రూ. 5.61 కోట్లతో పూర్తయిన రాజీవ్‌ మార్గ్‌ అభివృద్ధి పనులను ప్రారంభించిన‌ సీఎం వైయ‌స్ జగన్.

Andhra Pradesh: వాగు దాటాలంటే బైక్ ఎత్తుకు వెళ్లాల్సిందే, ఏపీలో 36 గ్రామాల పరిస్థితి ఇది, బ్రిడ్జి మార్గం ఏర్పాటు చేయాలని కోరుతున్న గ్రామస్థులు

Hazarath Reddy

వర్షాలకి వాగు పొంగిపొర్లడంతో అటుగా వెళ్లాల్సిన గ్రామ గిరిజన గ్రామస్తులు వాగు దాటేందుకు బైకు భుజాలపై ఎత్తుకొని వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరుగలేదు.

TDP Workers Fight in Tana Videos: వీడియోలు ఇవిగో, తెలుగు తమ్ముళ్ల తన్నులాటతో రచ్చ రచ్చగా మారిన తానా సభలు, టీడీపీ ఎన్నారై అధ్యక్షుడి ముందే ఫైటింగ్

Hazarath Reddy

అమెరికాలో ‘తానా’(ఉత్తర అమెరికా తెలుగు సంఘం) సభల సందర్భంగా జూనియర్‌ ఎన్టీఆర్, లోకేశ్‌ వర్గాలు పరస్పరం తన్నుకున్నాయి. రెండుగా చీలిపోయిన టీడీపీ ఎన్నారై సభ్యులు పిడిగుద్దులు గుద్దుకున్నారు. తరని పరుచూరి, సతీష్‌ వేమన వర్గాలు పరస్పరం చొక్కాలు పట్టుకుని మరీ దాడులకు దిగాయి.

Pawan Kalyan: వీడియో ఇదిగో, ఏపీలో 30 వేల మంది అమ్మాయిలు మిస్సింగ్, దీనిపై జగన్ ప్రభుత్వం రివ్యూ ఎందుకు పెట్టడం లేదు, పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

ప్రతి గ్రామంలో ఎవరు ఎవరి మనిషి. ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు. ఆడపిల్లలు ఎవరినైనా ప్రేమిస్తున్నారా. వారిలో వితంతువులు ఉన్నారా. ఇలా వాలంటీర్లు సమాచారం సేకరించి.. సంఘవిద్రోహ శక్తులకు చేరవేయడంతో ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు.

Advertisement

Tirumala Update: తిరుమలలో నేడు కూడా కొనసాగుతున్న భక్తుల రద్దీ.. స్వామివారి సర్వదర్శనానికి 20 గంటల సమయం.. నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్

Rudra

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న క్యూ లైన్లలో ప్రవేశించినవారు ఈ ఉదయానికి కూడా దర్శనం కోసం వేచిచూస్తున్నారు. స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.

Hyderabad Horror: హైదరాబాద్ లో ఘోరం.. మతిస్థిమితం కోల్పోయి.. మర్మాంగం కోసుకుని గాంధీ మెడికల్ కాలేజీకి చెందిన వైద్య విద్యార్థి ఆత్మహత్య

Rudra

మానసిక స్థితి సరిగా లేని ఓ వైద్య విద్యార్థి బ్లేడ్‌ తో పురుషాంగాన్ని కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌ జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం జరిగింది.

Trains Cancelled: విజయవాడ డివిజన్‌ లో భద్రతాపరమైన పనులు.. నేటి నుంచి 16వ తేదీ వరకు కొన్ని రైళ్లు పూర్తిగా రద్దు.. మరికొన్ని రైళ్లు నిడదవోలు, భీమవరం టౌన్ మీదుగా మళ్లింపు

Rudra

దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజన్‌ లో భద్రతాపరమైన ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు మరికొన్నింటిని దారి మళ్లించినట్టు అధికారులు తెలిపారు. నేటి నుంచి 16వ తేదీ వరకు కొన్ని రైళ్లను రద్దు చేశారు. వీటితోపాటు మరికొన్ని రైళ్లను నిడదవోలు, భీమవరం టౌన్ మీదుగా దారి మళ్లించారు.

AP Minister Amarnath: పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరో అయ్యుండొచ్చు, రాజకీయాల్లో మాత్రం అతను సైడ్ క్యారెక్టర్, మంత్రి అమర్ నాథ్ సంచలన వ్యాఖ్యలు..

kanha

పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరో అయ్యుండొచ్చు, రాజకీయాల్లో మాత్రం అతను సైడ్ క్యారెక్టర్

Advertisement

Tana Meeting In USA: తానా సభల్లో తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు, టీడీపీ ఎన్ఆర్ఐ అధ్యక్షుడు కోమటి జయరాం సమక్షంలోనే కొట్లాట

kanha

తానా సభల్లో తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు చొక్కాలు పట్టుకుని కొట్టుకున్న తరణి పరుచూరి, సతీష్ వేమన వర్గాలు టీడీపీ ఎన్ఆర్ఐ అధ్యక్షుడు కోమటి జయరాం సమక్షంలోనే కొట్లాట

AP CM Jagan In Kadapa: కడప జిల్లాలో రెండో రోజు సీఎం జగన్‌ పర్యటన, గండికోటలో ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకి శంకుస్థాపన, పులివెందులలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ హాజరు..

kanha

కడప జిల్లాలో రెండో రోజు సీఎం జగన్‌ పర్యటన. పులివెందులలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. ఏపీలో ఒబెరాయ్‌ గ్రూప్‌ పెట్టుబడులు పెట్టడం సంతోషం. ఒబెరాయ్‌ గ్రూప్‌ ఇక్కడ సెవెన్‌ స్టార్‌ హోటల్‌ కడుతోంది. ఒబెరాయ్‌ సంస్థ రావడం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. - సీఎం జగన్‌

Fire Accident in Secunderabad: సికింద్రాబాద్‌ పాలికాబజార్‌ లో భారీ అగ్నిప్రమాదం.. బట్టల దుకాణంలో ఒక్కసారిగా మంటలు..

Rudra

సికింద్రాబాద్‌లో (Secunderabad) భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. ఆదివారం తెల్లవారుజామున పాలికాబజార్‌ లోని (Palika bazar) ఓ బట్టల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Swarnalatha Suspension: విశాఖ నోట్ల మార్పిడి కేసు.. ఏఆర్ ఇన్‌స్పెక్టర్ స్వర్ణలతపై సస్పెన్షన్ వేటు.. కానిస్టేబుల్‌ హేమసుందర్‌పైనా వేటు.. నిందితులు నలుగురికీ ఈ నెల 21 వరకు రిమాండ్

Rudra

లెక్కకు మించిన ట్విస్ట్ లతో ఓ మిస్టరీ థ్రిల్లర్ ను తలపించేలా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విశాఖ నోట్ల మార్పిడి వ్యవహారంలో ఏ4 నిందితురాలైన ఏఆర్ ఇన్‌స్పెక్టర్ స్వర్ణలత, కానిస్టేబుల్ హేమసుందర్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

Advertisement
Advertisement