ఆంధ్ర ప్రదేశ్
COVID in TS: తెలంగాణలో పెరుగుతున్న కేసులు, సెలబ్రేషన్స్ జాగ్రత్తగా జరుపుకోకుంటే అంతే ఇక, కొత్తగా 280 కరోనా కేసులు, 24 గంటల్లో మరో 5 ఒమిక్రాన్ కేసులు
Hazarath Reddyతెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండగా ఇదే సమయంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో మరో 5 ఒమిక్రాన్ కొత్త కేసులు (5 New Omicrons cases ) నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 67కి చేరింది. మరోవైపు గత 24 గంటల్లో తెలంగాణలో 280 కరోనా కేసులు (Telangana logs 280 Covid Cases) నమోదయ్యాయి.
Omicron in AP: ఏపీలో నేడు అర్థరాత్రి వరకు మద్యం షాపులు, అనుమతించిన ఎక్సైజ్ శాఖ, న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌పై ఆంక్షలు విధించిన ఏపీ పోలీసులు
Hazarath Reddyఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీలోని ప్రధాన నగరాల్లో కూడా కొవిడ్‌ నిబంధనల మధ్యే కొత్త సంవత్సర వేడుకలు జరగనున్నాయి. విశాఖ, విజయవాడల్లో న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌పై పోలీసులు ఆంక్షలు (Andhra Pradesh prohibits public New Year festivities) విధించారు. ఇవాళ రాత్రి విజయవాడలో వేడుకలకు అనుమతి లేదని కమిషనర్ క్రాంతి రాణా స్పష్టం చేశారు.
Goreti Venkanna Bags Sahitya Akademi Award: గోరటి వెంకన్నకు సీఎం వైఎస్‌ జగన్‌ అభినందనలు, ఆయన ప్రజల హృదయాలు గెలిచారంటూ ట్వీట్
Hazarath Reddyకేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2021కు ఎంపికయిన ప్రసిద్ధ వాగ్గేయకారుడు, ప్రజాకవి, రచయిత, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు సీఎం వైఎస్‌ జగన్‌ అభినందనలు తెలియజేశారు. గోరటి వెంకన్న రచించిన ‘వల్లంకి తాళం ’ కవితా సంపుటికి ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఆయనను అభినందిస్తూ సీఎంఓ గురువారం ట్వీట్‌ చేసింది.
Corona in AP: ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 130 కరోనా కేసులు నమోదు, చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 18 మందికి కరోనా
Hazarath Reddyఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 130 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 18 మంది కరోనా బారిన పడ్డారు. ఇదే సమయంలో నెల్లూరు జిల్లాలో ఒకరు మరణించారు. గత 24 గంటల్లో 97 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
R Narayana Murthy Meets Perni Nani: ఏపీలో థియేటర్ల ఓనర్లకు ఊరట, సీజ్‌ చేసిన థియేటర్లు తిరిగి ఓపెన్‌ చేసేందుకు అనుమతి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం, మంత్రి పేర్ని నానితో నిర్మాత ఆర్‌ నారాయణమూర్తి భేటీ
Hazarath Reddyమచిలీపట్నంలో మంత్రి పేర్ని నానితో సినీ నటుడు, నిర్మాత ఆర్‌ నారాయణమూర్తి, పలువురు సినిమా థియేటర్స్‌ ఓనర్లు భేటీ (R Narayana Murthy Meets Perni Nani) అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో థియేటర్ల ఓనర్లకు (Theaters Owners) ఊరటనిస్తూ మంత్రి పేర్ని నాని హామీ ఇచ్చారు.
Andhra Pradesh: సోము వీర్రాజు బీజేపీకి అధ్యక్షుడా లేక తాగుబోతులకు అధ్యక్షుడా, సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం, సీఎం జగన్ ఓ సింహం, ఎంతమంది వచ్చినా ఒంటరిగానే పోరాడతారని తెలిపిన నారాయణ స్వామి
Hazarath Reddyడిప్యూటీ సీఎం నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ, సోము వీర్రాజు బీజేపీకి అధ్యక్షుడా, తాగుబోతులకు అధ్యక్షుడా (political party or a liquor company) అర్థం కావడం లేదన్నారు. చీప్ లిక్కర్ ఇచ్చి ప్రజలను సంతోషపెడతానని చెప్పడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనమని విమర్శించారు. సీఎం జగన్ ఓ సింహం, ఎంతమంది వచ్చినా ఒంటరిగానే పోరాడతారని పేర్కొన్నారు.
COVID Guidelines in AP: కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కీలక ఉత్తర్వులు, బూస్టర్ డోసుపై గైడ్ లైన్స్ విడుదల, జనవరి 1 నుంచి వాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ
Hazarath Reddyటీనేజర్లకి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బూస్టర్ డోసు,15-18 ఏళ్ల వయసు గల వారికి వాక్సినేషన్ ప్రక్రియపై గైడ్ లైన్స్ (COVID Guidelines in AP) విడుదల చేసింది. 15-18 ఏళ్లు దాటిన వారికి జనవరి ఒకటి నుంచి వాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ( vaccination process) ప్రారంభం కానుంది.
Corona in AP: ఏపీలో కొత్తగా 162 మందికి కరోనా పాజిటివ్, అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 30 కొత్త కేసులు, తూర్పు గోదావరి జిల్లాలో 22 కేసులు
Hazarath Reddyఏపీలో గడచిన 24 గంటల్లో 31,743 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 162 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 30 కొత్త కేసుల్ని గుర్తించారు. తూర్పు గోదావరి జిల్లాలో 22, చిత్తూరు జిల్లాలో 19, గుంటూరు జిల్లాలో 17, విశాఖ జిల్లాలో 17 కేసులు నమోదయ్యాయి.
Jagananna Palavelluva: కృష్ణాజిల్లాలో జగనన్న పాలవెల్లువ, పాల బిల్లు పది రోజుల్లోనే రైతుల ఖాతాల్లో జమ, అమూల్‌‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
Hazarath Reddyఏపీ సీఎం జగన్ కృష్ణా జిల్లాలో 'జగనన్న పాలవెల్లువ' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి సీఎం జగన్‌ పాలవెల్లువ పథకాన్ని(Jagananna Palavelluva) ప్రారంభించారు.
Sajjala Rama Krishna Reddy: ఏపీలో బీజేపీని చూస్తే జాలేస్తోంది, మళ్లీ సీఎం అవుతానన్న భ్రమలో చంద్రబాబు ఉన్నారు, సీఎం వైఎస్‌ జగన్‌ టార్గెట్‌గా రాజకీయాలు చేస్తున్నారని మండిపడిన వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
Hazarath Reddyటీడీపీ అధినేత చంద్రబాబు అజెండానే బీజేపీ నేతల అజెండా అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Rama Krishna Reddy) విమర్శించారు. టీడీపీ అనుబంధ విభాగం మాదిరి బీజేపీ సభ జరిగిందని ఆయన ఎద్దేవా చేశారు.
Omicron in AP: ఏపీలో ఒక్కసారిగా పెరిగిన ఒమిక్రాన్ కేసులు, ఒక్కరోజే అత్యధికంగా 10 కేసులు నమోదు, రాష్ట్రంలో 16కు చేరుకున్న కొత్త వేరియంట్ సంఖ్య
Hazarath Reddyఏపీలో ఒక్కసారిగా ఒమిక్రాన్ కేసులు పెరిగాయి. తాజాగా బుధవారం ఒక్కరోజే అత్యధికంగా 10 కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో కేసుల సంఖ్య 16కు చేరుకుంది.
TS Minister KTR: సోము వీర్రాజు క్వార్టర్ సీసా రూ.50 వ్యాఖ్యలు, ఎంత సిగ్గుమాలిన హామీ అంటూ ట్విట్టర్లో సెటైర్ వేసిన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
Hazarath Reddyవాహ్‌.. ఎంత గొప్ప‌ పథకం.. ఎంత సిగ్గుమాలిన హామీ.. బీజేపీ ఏపీ నైతిక‌త విష‌యంలో మ‌రింత దిగ‌జారింది. చీప్ లిక్కర్‌ను రూ.50కి సరఫరా చేయాలనేదే బీజేపీ జాతీయ విధాన‌మా? లేదంటే నిరాశ అధికంగా ఉన్న‌ రాష్ట్రాలకు మాత్రమే బీజేపీ ఈ బంపర్ ఆఫర్ ఇస్తుందా?' అని ఎద్దేవా చేశారు.
APPSC Recruitment 2022: ఏపీలో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్, మొత్తం 730 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసిన ఏపీపీఎస్సీ, అర్హతలు, నియామక ప్రక్రియ వివరాలు మీకోసం
Hazarath Reddyఏపీలో కొత్తగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) మంగళవారం 730 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు కమిషన్‌ కార్యదర్శి పీఎస్సార్‌ ఆంజనేయులు ఒక ప్రకటన (APPSC Recruitment 2022) జారీచేశారు.
Andhra Pradesh: మాకు కోటి ఓట్లు వేస్తే రూ.70కే మద్యం అందిస్తాం, ఆదాయం ఉంటే మద్యం ధర రూ.50కి తగ్గిస్తాం, ప్రజాగ్రహ సభలో బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు
Hazarath Reddyభారతీయ జనతా పార్టీకి కోటి ఓట్లు వేయండి.. కేవలం రూ.70కే మద్యం అందజేస్తాం.. ఇంకా ఆదాయం మిగిలితే రూ.50కే మద్యం అందిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌్ రాష్ట్రంలో కోటి మంది ప్రజలు అధిక ధరకు మద్యాన్ని వినియోగిస్తున్నారని, చీప్ లిక్కర్ కోసం 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీకి ఓటు వేయాలని కోరారు.
Andhra Pradesh: మీరిచ్చిన ప్రతి పైసాకు లెక్క ఉంది, సిగ్గు లేకుండా బ్రాందీ బుడ్డి 75 రూపాయలకే ఇస్తామంటున్నారు, ముందు పెట్రోల్‌, డీజీల్‌ రేట్లపై మాట్లాడండి, బీజేపీ నేతల వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు మండిపాటు
Hazarath Reddyఏపీ ప్రభుత్వంపై బీజేపీ నేతలు ప్రజాగ్రహ సభ వేదికగా చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు (YSRCP Ministers) మండిపడ్డారు. ఏపీలో ఉనికి‌ కోసమే బీజేపీ విజయవాడలో బహిరంగ సభ (Prajagraha Sabha) నిర్వహిస్తోందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (State Municipal Minister Botsa Satyanarayana) ఎద్దేవా చేశారు.
Dilip Shanghvi Meets CM YS Jagan: ఏపీకి త్వరలో సన్‌ ఫార్మా యూనిట్, సీఎం వైఎస్ జగన్ ని కలిసిన కంపెనీ ఎండీ దిలీప్‌ సంఘ్వీ, సన్‌ ఫార్మా తయారీ యూనిట్‌ను నెలకొల్పడంపై ఇరువురి మధ్య చర్చలు
Hazarath Reddyఫార్మాస్యూటికల్స్‌ రంగంలో పెద్ద కంపెనీల్లో ఒకటైన సన్‌ ఫార్మా రాష్ట్రంలో తయారీ ప్లాంట్‌ను నెలకొల్పడానికి ఆసక్తిగా ఉంది. దీనిలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని క్యాంపు కార్యాయంలో కంపెనీ ఎండీ దిలీప్‌ సంఘ్వీ కలిశారు. రాష్ట్రంలో ఫార్మాస్యూటికల్‌ రంగం ప్రగతి, సన్‌ ఫార్మా తయారీ యూనిట్‌ను నెలకొల్పడంపై ఇరువురి మధ్య చర్చలు జరిగాయి
BJP Prajagraha Sabha: 2024లో ఏపీలో బీజేపీదే అధికారం, ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న నేతలు త్వరలోనే జైలుకు వెళతారు, విజయవాడ ప్రజాగ్రహ సభలో బీజేపీ నేతల సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyవిజయవాడలో నిర్వహించిన ప్రజాగ్రహ సభలో (BJP Prajagraha Sabha) ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రసంగించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ, వైసీపీలపై విమర్శలు చేశారు.
Corona in AP: ఏపీలో కొత్తగా 141 మందికి కరోనా, పశ్చిమ గోదావరి జిల్లాలో 27, చిత్తూరు జిల్లాలో 26, గుంటూరు జిల్లాలో 24 కొత్త కేసులు
Hazarath Reddyఏపీలో కరోనా పాజిటివ్ కేసులు ఇంకా వస్తూనే ఉన్నాయి. గడచిన 24 గంటల్లో 30,752 శాంపిల్స్ పరీక్షించగా, 141 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 27, చిత్తూరు జిల్లాలో 26, గుంటూరు జిల్లాలో 24 కొత్త కేసులు నమోదయ్యాయి.
Movie Ticket Prices Issue: మంత్రి పేర్నినానితో ముగిసిన సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల భేటీ, టికెట్ల విషయంలో హీరోలకు ఏం పని అంటూ నాని కౌంటర్
Hazarath Reddyసినిమా టికెట్ ధరలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా (Movie Ticket Prices Issue) మారింది. ఇందులో భాగంగా మంత్రి పేర్నినానితో సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు మంగళవారం సమావేశమయ్యారు. సినిమా టిక్కెట్ ధరలు (movie ticket prices), థియేటర్ల ఇబ్బందులపై ప్రధానంగా చర్చించారు.
Welfare Schemes in AP: అర్హులైన లబ్దిదారుల ఖాతాల్లో రూ.703 కోట్లు జమ చేసిన ఏపీ సర్కారు, కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపిన ఏపీ సీఎం జగన్
Hazarath Reddyఏపీలో ప్రస్తుతం అమలులో ఉన్న వివిధ పథకాలకు (under various welfare schemes) సంబంధించి, అర్హత ఉన్నప్పటికీ సాయం పొందలేకపోయిన 9,30,809 మంది లబ్ధిదారులకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రూ.703 కోట్లను జమ (disburse Rs. 703 crore for leftover beneficiaries) చేశారు.