ఆంధ్ర ప్రదేశ్

Additional Revenue to AP Govt: జగన్ సర్కారు కొత్త ఎత్తుగడ, ఏపీకి తాజాగా రూ.4,881 కోట్ల మేర అదనపు ఆదాయం, గ్రీన్‌కో విద్యుత్‌ ప్రాజెక్టు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం యాజమాన్యంతో మరోసారి చర్చలు

Hazarath Reddy

అప్పుల్లో కూరుకుపోయిన ఏపీ ప్రభుత్వం ఆదాయ మార్గాల కోసం కొత్త ప్రయత్నాలను చేస్తూ సత్ఫలితాలను (Additional Revenue to AP Govt) రాబట్టుకుంటోంది. ఇందులో భాగంగానే ఏపీకి తాజాగా రూ.4,881 కోట్ల మేర అదనపు ఆదాయం (additional revenue) లభించింది. గత ప్రభుత్వం కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలపై మరోసారి చర్చలు జరపడం ద్వారా ఆ ఆదాయన్ని రాబట్టింది.

COVID-19 in AP: కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి కరోనా, భర్తకు కరోనా రావడంతో కేసీలో దూకి ఆత్మహత్య చేసుకున్న మహిళ, ఏపీలో తాజాగా 10,603 పాజిటివ్‌ కేసులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 63,077 నమూనాలు పరీక్షించగా 10,603 పాజిటివ్‌ కేసులు (COVID-19 in AP) నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,24,767 కు (coronavirus positive cases) చేరింది. కొత్తగా 88 మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 3884 చేరింది. తాజా పరీక్షల్లో 33,823 ట్రూనాట్‌ పద్ధతిలో, 29,254 పద్ధతిలో చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 99,129 యాక్టివ్‌ కేసులున్నాయి. గత 24 గంటల్లో 9,067 మంది కరోనా రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,21,754. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదివారం హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది.

YS Avinash Reddy Covid 19: కడప ఎంపీ అవినాష్ రెడ్డికి కరోనా పాజిటివ్, హోం ఐసోలేషన్ ‌కు వెళ్లిన కడప ఎంపీ, సెప్టెంబర్ 1, 2వ తేదీల్లో సీఎం జగన్ కడప టూర్

Hazarath Reddy

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బంధువు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి కరోనా (YS Avinash Reddy Covid 19) సోకింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సీఎం జగన్ సెప్టెంబర్ 1, 2 తేదీల్లో ఇడుపుల పాయలో (CM Jagan's Kadapa tour) పర్యటించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే వైఎస్ కుటుంబ సన్నిహితులు, మీడియా ప్రతినిధులకు వైద్యులు కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు తేలింది. దీంతో వెంటనే వైఎస్ అవినాష్ రెడ్డి హోం ఐసోలేషన్ ‌కు వెళ్లారు. తన వెంట గత వారంరోజుల నుంచి తిరుగుతున్న వారిని కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించారు.

Chittoor Road Accident: చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం, కారును ఢీకొట్టిన లారీ, నలుగురు అక్కడికక్కడే మృతి, బెంగళూరు నుంచి నెల్లూరుకు వస్తుండగా బంగారుపాళెం వద్ద విషాద ఘటన

Hazarath Reddy

చిత్తూరు జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం (Chittoor Road Accident) చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. బంగారుపాళెం మండలం మొగలి వద్ద ఇవాళ ఉదయం ఓ లారీ అదుపు తప్పి కారును ఢీకొంది. అనంతరం ద్విచక్ర వాహనంపై దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు, బైక్‌పై వెళుతున్న వ్యక్తి మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు బెంగుళూరుకు చెందిన వారు.

Advertisement

AP Coronavirus: కరోనాపై ఊరట..ఏపీలో 3 లక్షలు దాటిన డిశ్చార్జ్ కేసుల సంఖ్య, రాష్ట్రంలో యాక్టివ్‌గా 97,681 కోవిడ్ కేసులు, తాజాగా 10,548 మందికి కోవిడ్-19, ఇప్పటివరకు కరోనాతో 3,796 మంది మృతి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో రోజు రోజుకు రికవరీ రేటు పెరుగుతోంది. కోవిడ్ (AP coronavirus) నుంచి కోలుకుని నిన్న ఒక్కరోజే 8,976 మంది డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకూ మొత్తం 3,12,687 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 82 మంది మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో 3,796 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 97,681 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ 36,03,345 మందికి కరోనా పరీక్షలు చేశారు.

Rottela Panduga 2020 Cancelled: రొట్టెల పండుగ రద్దు, 20 మందితో గంధ మహోత్సవం, నెల్లూరు బారాషహీద్ దర్గా వద్ద రొట్టెల పండుగ, కరోనావైరస్ నేపథ్యంలో రద్దు చేస్తున్నామని తెలిపిన కలెక్టర్ చక్రధర్ బాబు

Hazarath Reddy

ఏటా ఏపీలోని పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగే రొట్టెల పండుగ ఈ సారి రద్దైంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రొట్టెల పండుగను రద్దు (Rottela Panduga 2020 Cancelled) చేస్తూ నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆదేశాలు జారీ చేశారు. ఇక రొట్టెల పండుగలో కీలక ఘట్టమైన గంధ మహోత్సవంను కూడా 20 మందితో జరపాలని తెలిపారు. కాగా మొహర్రం సందర్భంగా నెల్లూరులోని బారాషహీద్ దర్గా, స్వర్ణాల చెరువు సాక్షిగా ప్రతి సంవత్సరం రొట్టెల పండుగ (Rottela Panduga) జరిగేది. ఇక్కడ రొట్టె పడితే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం.

Dalit Man Tonsured CCTV Footage: గుండు కొడుతున్న సీసీటీవీ పుటేజి విడుదల, విశాఖపట్నంలో దళిత యువకుడికి గుండు కొట్టించిన నూతన్‌ నాయుడు భార్య మధుప్రియ, వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు

Hazarath Reddy

విశాఖపట్నంలో దళిత యువకుడు శిరో ముండనం కేసులో సీసీ టీవీ పుటేజి (Dalit Man Tonsured CCTV Footage) బయటకు వచ్చింది. ఈ వీడియోలో బాధితుడిని కర్రలు, రాడ్లతో కొట్టినట్లుగా కనిపిస్తోంది. అయితే అందులో కొన్ని దృశ్యాలు తొలగించినట్లు కనిపిస్తోందని.. సీసీ టీవీ ఫుటేజ్‌ ఆధారంగా లోతుగా దర్యాప్తు చేస్తున్నామని శాఖ సీపీ మనీష్‌ కుమార్‌ సిన్హా (Visakhapatnam Police Commissioner) వెల్లడించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని విశాఖ సీపీ తెలిపారు. ఈ కేసులో నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.

Pulivendula Illegal Liquor Mafia: కారుతో ఢీకొట్టినా వదలని పులివెందుల ఎస్ఐ‌, కడప జిల్లాలో మద్యం అక్రమ రవాణాని అడ్డుకున్న ఎస్‌ఐ గోపీనాథ్‌రెడ్డి, 80 మద్యం బాటిల్స్‌ స్వాధీనం, కేసు నమోదు, హిందూపూర్‌లో రెచ్చిపోయిన మద్యం మాఫియా

Hazarath Reddy

వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందులలో మద్యం అక్రమ రవాణాను (Pulivendula Liquor Mafia) అడ్డుకునేందుకు ఓ ఎస్సై ప్రాణాలకు తెగించి సాహసం చేశారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న ఓ వాహనాన్ని పులివెందుల ఎస్‌ఐ గోపీనాథ్‌రెడ్డి (pulivendula SI gopinath reddy) చాకచక్యంగా పట్టుకున్నారు. మద్యం మాఫియా కారుతో ఆయన్ని ఢీకొట్టినా సరే పోరాడారు. వివరాల్లోకెళితే.. పులివెందులలోని రాఘవేంద్ర థియేటర్‌ సమీపంలో రోడ్డు పక్కన ఆపిఉన్న ఓ వాహనంలో అక్రమ మద్యం (Andhra Pradesh Illegal liquor) ఉన్నట్లు ఎస్ఐకి సమాచారం అందింది. దీంతో ఆయన తన సిబ్బందితో అక్కడకు చేరుకుని వాహనాన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే వాహనంలో ఉన్నవారు కారును ముందుకు, వెనక్కి నడుపుతూ వేగంగా దూసుకెళ్లే ప్రయత్నం చేశారు.

Advertisement

Dalit Youth Tonsured Case: దళిత యువకుడికి శిరోముండనం, నూతన నాయుడు భార్యతో సహా ఏడుగురిపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు

Hazarath Reddy

పరాన్నజీవి దర్శకుడు నూతన్‌ కుమార్‌ నాయుడు ఇంట్లో కర్రి శ్రీకాంత్‌ అనే దళిత యువకుడికి ఘోర అవమానం (Dalit youth Tonsured Case) జరిగింది. తమ ఇంట్లో పని మానేశాడన్న నెపంతో నూతన్‌కుమార్‌ నాయుడు (Filmmaker Nutan Naidu) భార్య మధుప్రియ.. కర్రి శ్రీకాంత్‌ అనే యువకుడికి శిరోముండనం చేయించిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. తనకు జరిగిన అవమానంపై బాధితుడు పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. వెస్ట్‌ ఏసీపీ శ్రావణ్‌కుమార్, ఎస్సీ, ఎస్టీ విభాగం ఏసీపీ త్రినాథ్‌ పెందుర్తి పీఎస్‌కు చేరుకుని బాధితుడితో మాట్లాడారు.

Woman Arrested for Cheating: డబ్బు కోసం నిత్య పెళ్లికూతురు అవతారం, నలుగురిని పెళ్లి చేసుకుని మోసం చేసిన కిలాడీ లేడీ, అరెస్ట్ చేసిన పోలీసులు, 14 రోజుల రిమాండ్‌, ప్రకాశం జిల్లాలో ఘటన

Hazarath Reddy

మ్యాట్రిమోనీ సైట్లలో పేర్లు, హోదాలు మార్చుకుని యువకులు, విద్యావంతులను మోసం చేసి పెళ్లి చేసుకుని అనంతరం డబ్బు డిమాండ్‌ చేసి రూ.లక్షలు స్వాహా చేసి చివరకు వారిపై కేసులు పెట్టి వేధించే నిత్య పెళ్లి కూతురును (woman arrested for marrying cheating 4 men) పోలీసులు శుక్రవారం కటకటాల వెనక్కి నెట్టారు. న్యాయమూర్తి ఆమెకు 14 రోజుల రిమాండ్‌ విధించినట్లు పొదిలి సీఐ వేలమూరి శ్రీరామ్‌ తెలిపారు.

Telugu Language Day 2020: తెలుగు భాషా దినోత్సవం, గిడుగు వెంకట రామమూర్తి జన్మదినోత్సవమే ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా దినోత్సవం, మహనీయుని జీవిత విశేషాలు మీకోసం

Hazarath Reddy

వ్యావహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా (Telugu Language Day 2020) జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణా వేరుపడిన తరువాత తెలంగాణా వారు కాళోజీ జన్మదినోత్సవాన్ని (Kaloji Narayana Rao) తెలంగాణ భాషా దినోత్సవంగా (Telangana Telugu Language Day) జరుపుకుంటున్నారు.

COVID in AP: ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా మూడో రోజూ 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 4 లక్షలు దాటిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, 3700 దాటిన కరోనా మరణాలు

Team Latestly

తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 4,03,616కు చేరింది. దీంతో కరోనా తీవ్రత అత్యధికంగా ఉన్న రాష్ట్రాలలో 4,03,242 పాజిటివ్ కేసులతో ప్రస్తుతం రెండో స్థానంలో తమిళనాడు రాష్ట్రాన్ని అధిగమించి ఏపీ రెండో స్థానంలోకి వచ్చింది....

Advertisement

PV Centenary Celebrations: పీవీ నరసింహారావుకు 'భారతరత్న' ప్రకటించాలి, అసెంబ్లీలో తీర్మానం చేస్తామని వెల్లడించిన సీఎం కేసీఆర్, హైదరాబాద్ నెక్లెస్ రోడ్డుకు పీవీ జ్ఞానమార్గ్‌గా పేరు పెట్టాలని నిర్ణయం

Team Latestly

వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని తీర్మానం చేయనున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడించారు. అలాగే హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ కు పీవీ జ్ఞాన మార్గ్ గా పేరు పెట్టాలని...

AP's COVID Update: ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 4 లక్షలకు చేరువైన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, 3633కు పెరిగిన కరోనా మరణాలు

Team Latestly

గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 జిల్లాల నుంచి వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒక్క తూర్పు గోదావరి జిల్లా నుంచి అత్యధికంగా 1089 కేసులు నమోదయ్యాయి. అలాగే ప్రకాశం జిల్లాలో కూడా పాజిటివ్ కేసులు వెయ్యి దాటాయి, జిల్లాలో గడిచిన ఒక్కరోజులో...

Three Capitals Row: ఏపీ హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి ఝలక్, రాజధాని అంశంపై సెప్టెంబర్ 21 వరకు స్టేటస్ కో పొడగింపు, వచ్చే నెల నుంచి రోజువారీ విచారణ చేపడతామని స్పష్టం చేసిన న్యాయస్థానం

Team Latestly

గురువారం హైకోర్టులో విచారణ ఉండటంతో ఈరోజు ఎలాంటి నిర్ణయం వెలువడుతుందోనని రాష్ట్రవ్యాప్తంగా ఒక ఉత్కంఠ నెలకొని ఉండగా, చివరకు గతంలో ఇచ్చిన స్టేటస్ కోను పొడగించేందుకే మొగ్గుచూపిన హైకోర్టు తదుపరి విచారణను సెప్టెంబర్ 21కి వాయిదా వేసింది....

COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి రికార్డ్ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 3 లక్షల 82 వేలు దాటిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, 3500 దాటిన కరోనా మరణాలు

Team Latestly

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విలయం కొనసాగుతోంది. నిన్న బుధవారం ఒక్కరోజులోనే రికార్డ్ స్థాయిలో సుమారు 11 వేలకు చేరువగా కొత్త కేసులు నమోదయ్యాయి. హెల్త్ బులెటిన్ ప్రకారం బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ....

Advertisement

Bulk Drug Park in AP: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం, బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ, కేంద్రానికి దరఖాస్తు చేసే బాధ్యతను ఏపీఐఐసీకి అప్పగింత

Hazarath Reddy

పరిపాలనలో తనదైన ముద్రను వేసుకుంటూ ముందుకు సాగుతున్న ఏపీ సీఎం వైయస్ జగన్ (AP CM YS Jagan) ప్రజల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా జగన్ సర్కారు రాష్ట్రంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు (Bulk Drug Parks in AP) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పార్క్ ఏర్పాటు కోసం కేంద్రానికి దరఖాస్తు చేసే బాధ్యతను ఏపీఐఐసీకి (APIIC) అప్పగించింది. అదే విధంగా ప్రైవేట్ పార్టనర్‌ని గుర్తించే బాధ్యతను అప్పగించడం సహా ఐఐసీటీ, సీఎస్‌ఐఆర్‌లతో నాలెడ్జ్‌ పార్టనర్‌లుగా ఎంవోయూ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

Father Deceased at Daughter Grave: కూతురుపై ఎనలేని ప్రేమ, సమాధి దగ్గరే ప్రాణాలు విడిచిన ఓ తండ్రి, మచిలీపట్నంలో గుండెను పిండేసే విషాద ఘటన

Hazarath Reddy

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో (Machilipatnam) కన్నీళ్లు పెట్టించే విషాద ఘటన జరిగింది. బిడ్డ మరణాన్ని తట్టుకోలేని ఓ తండ్రి ఆమె సమాధి దగ్గరే ప్రాణాలు (Father Deceased at Daughter Grave) విడిచాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె అనారోగ్యంతో తనువు చాలించడంతో తట్టుకోలేని తండ్రి ఆమెనే తలుచుకుంటూ ప్రాణాలు విడిచాడు.

AP DGP Sawang VC: ఒక్క పోలీస్ తప్పు చేస్తే వ్యవస్థ మొత్తానికి చెడ్డపేరు, 76 వేల మంది పోలీసు సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌లో ఏపీ డీజీపీ దామోదర్ గౌతం సవాంగ్, కలిసి పనిచేద్దామని పిలుపు

Hazarath Reddy

పోలీస్ వ్యవస్ధలో ప్రక్షాళన జ‌ర‌గాల‌ని, స‌మ‌స్య‌ల‌తో పోలీసు స్టేషనుకు వ‌చ్చే ప్రజలను గౌరవించాల‌ని ఏపీ డీజీపీ గౌత‌మ్ సవాంగ్ (AP DGP Damodar Goutam Sawang) అన్నారు. పోలీసు‌ శాఖలోని అన్ని అంతర్గత డిపార్ట్మెంట్లతో డీజీపీ బుధ‌వారం వీడియో కాన్ఫరెన్స్ (AP DGP Sawang Video Conference) నిర్వ‌హించారు. రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న 76 వేల మంది పోలీసు సిబ్బందితో నిర్వ‌హించిన ఈ కాన్ఫ‌రెన్స్‌లో ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై (Friendly Policing) అధికారులకు డీజీపీ దిశా నిర్దేశం చేశారు.

Woman Gang Raped: ఒంటరి మహిళపై గ్యాంగ్ రేప్, మరోచోట అన్నే కామాంధుడయ్యాడు, ఇంకోచోట తమ్ముడి కోసం కామాంధుడికి బలైన ఓ అక్క, బిడ్డ తలపై తుఫాకీ పెట్టి తల్లిపై అత్యాచారం

Hazarath Reddy

తెలంగాణలో నిజామాబాద్ లో అర్దరాత్రి దారుణం చోటు చేసుకుంది. ఆస్పత్రికి వెళ్లి తిరిగివస్తున్న మహిళను 12 మంది గ్యాంగ్ రేప్ (Woman Gang Raped) చేసారు. వివరాల్లోకి వెళితే ...జిల్లాలోని ఎడపల్లి మండలానికి చెందిన ఓ మహిళ సోమవారం రోడ్డు ప్రమాదంలో గాయపడింది. బాధితురాలిని ఆమె సోదరి నిజామాబాద్ (Nizamabad) లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చింది. పని నిమిత్తం సోమవారం రాత్రి నిజామాబాద్ రైల్వే స్టేషన్ ( Nizamabad railway station) సమీపంలోకి వెళ్లింది. అక్కడ ఒంటరిగా ఉన్న మహిళను విక్కీ అనే యువకుడు గమనించాడు. ఆమెతో మాట కలిపి సాయం చేస్తానని నమ్మించాడు. అక్కడ ఉన్న రెవెన్యూ భవన్ లోని ఖాళీ గదిలో మహిళ పై విక్కీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

Advertisement
Advertisement